YANAM MIRROR🌞
18 subscribers
237 photos
103 videos
3 files
33 links
Colours of Politics
Download Telegram
తాళ్ళరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అలుపెరగని పోరాటం చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావుగారిని మండల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణా రావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అందరూ కృషి ఫలితమే రెవెన్యూ డివిజన్ లోకి తాళ్ళరేవు మండలం చేర్చడం జరిగిందని ఉధ్యమ నాయకులను ఉద్దేశించి అన్నారు ఈ కార్యక్రమంలోతాళ్ళరేవు మండలం జే. ఏ. సీ. నాయకులు కుడుపూడి శివన్నారాయణ, ఎంపిపి రాయుడు సునీత గంగాధర్ , జడ్పిటిసి దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్, కొపనాతి లలిత నాగరాజు, టేకుమూడీ ఈశ్వరరావు , వడ్డి ఏడుకొండలు, గుత్తుల మల్లేశ్వరరావు ఎడ్ల కుటుంబరావు, ఇంజరం సర్పంచ్ ముద్దన ప్రసాద్, మట్టపర్తి లోవరాజు , కమిడీ ఈశ్వరీబాయి ,పోతుల రత్నకుమారి, దడాల స్వర్ణలత , దుర్గాప్రసాద్, రాజేష్, పాలిక శ్రీనివాస్ , గోవలంక వాసు పాల్గొన్నారు.
గత పది రోజులుగా ఎండ ఉష్ణోగ్రత విపరీతంగా ఉండడంతో బయటకు వచ్చి ఇంటికి వెళ్లే లోపు ప్రజలు చాలామంది సొమ్మసిల్లి పోతున్నారూ అని #Old_Age_Home ద్వారా పలుచోట్ల చలివేంద్రాలు నిర్మించిన ఢిల్లీ అధికార ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి మా ధన్యవాదములు.
యానాం శివారు దొమ్మెటివారి పెట సమీపంలో జరుగుతున్న పేకాట క్లబ్బుల పై శనివారం ఉదయం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో వేలాది మంది సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల పాలనలో ఇటువంటి ఆ సాంఘిక కార్యక్రమాలు జరగకుండా యానం నియోజకవర్గాని కాపాడు కున్నానని అయితే ఇటీవల కాలంలో ఎన్నికైన యానాం ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే) యానం ప్రాంతాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అన్నారు పేకాట క్లబ్లు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా తో పాటు హెచ్ఆర్ స్క్వేర్ అనే సంస్థ ద్వారా యానం మున్సిపాలిటీని పందికొక్కుల్లా దోసుకుంటున్నారని ఇటువంటి అరాచకాలను జరగకుండా ఎంతటి పోరాటానికైనా మల్లాడి కృష్ణారావు సిద్ధంగా ఉన్నాను అన్నారు తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు యానం ప్రజల శ్రేయస్సుకోసం తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న పేకాట క్లబ్బులను ఆపే వరకు తన పోరాటం ఆగదని హెచ్చరించారు అధికారులు, పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి అటువంటి ఆ సాంఘిక కార్యక్రమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు నా అనుకునే వారు ఎవరు అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మొగ్గుసుపొద్దని అటువంటి పేకాటకబ్లుల వల్ల సంసార జీవితాలు నాశనం అయిపోతాయని, యువత తప్పుదారి పడుతుందని పలు కుటుంబాలు రోడ్డున పడతమే కాకుండా ఆత్మహత్యలకు కూడా వెనకాడరని అలాంటి వ్యసనాలకు యానం ప్రజలు లోనవ్వకుండా బానిసలుకాకుండా నా ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశానికి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తరలివచ్చినందుకు మల్లాడి అభిమాన సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు
పేకాట క్లబ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని మీ లీడర్స్ మా లీడర్స్ వెళ్లి 5 నిమిషాల్లో ఆ పేకాట క్లబ్ ముయించడానికి రా అని సవాల్ విసిరిన మల్లాడి.🔥
జాతీయ విపత్తు (National Calamity) సమయంలో పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కుంటి సాకులతో తప్పించుకుంటే..
మల్లాడి కృష్ణ రావు గారి అభిమానులు అన్నీ తామై,
గత 5 రోజుల నుండి ముంపు ప్రాంతాల ప్రజలకు
ఎనలేని సేవ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు!

ఉదయం పాలు, బ్రెడ్
మధ్యాహ్నం భోజనం
రాత్రికి భోజనం
అత్యవసర మందులు
ముంపుకు గురైన నివాసితులకు స్వచ్ఛంద సేవా..

ఇలా గత 5 రోజుల నుండి..
ఎడతెరిపి లేకుండా, విసుగు విరామం లేకుండా,
ఉదయం 6 గంటల నుండి రాత్రి 3 గంటల వరకూ
ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు!

ఆపద సమయంలో #మల్లాడి కృష్ణ రావు గారికి,
యానాం ప్రజానీకానికి ఆసరాగా నిలిచిన ప్రతీ అభిమానికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు! 💐💐