🗞️📜AP TET - DSC - SGT 📜🗞️
414 subscribers
253 photos
1 video
126 files
71 links
https://t.me/aptetdsc9014

If you like this group, share this link to your friends & other
Download Telegram
నిరుద్యోగుల ఆశలను మొగ్గలోనే తుంచేస్తున్నారు : AP హైకోర్టు
👍1
📢 పది తర్వాత పనికే.. (నీతి ఆయోగ్ నివేదిక ముఖ్యాంశాలు)

గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ, కొన్ని అంశాల్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

✳️ ముఖ్య గణాంకాలు:
🔽 ఇంటర్మీడియట్ చేరికలు: పదో తరగతి పూర్తి చేసిన వారిలో కేవలం 76% మంది మాత్రమే ఇంటర్మీడియట్‌కు వెళ్తున్నారు. మిగిలిన 24% మంది చదువు ఆపేస్తున్నారు.
🔽 డ్రాపౌట్స్: 6-8 తరగతుల మధ్య 3.7% మంది విద్యార్థులు పాఠశాల మానేస్తున్నారు.
🔼 పురోగతి: 2014-15లో పదో తరగతి తర్వాత పైచదువులకు వెళ్లే వారి సంఖ్య కేవలం 40% ఉండగా, ఇప్పుడు అది 76% కి పెరగడం విశేషం. అయితే జాతీయ సగటు (75.1%) కంటే ఇది ఎక్కువే అయినప్పటికీ, చదువు మానేస్తున్న 24% మందిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

✳️ ఏకైక ఉపాధ్యాయుడి పాఠశాలలు (సింగిల్ టీచర్ స్కూల్స్):
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం ఉపాధ్యాయుల కొరతగా కనిపిస్తోంది.
⚠️  రాష్ట్రవ్యాప్తంగా 12,912 పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయి.
⚠️ఈ పాఠశాలల్లో సుమారు 2 లక్షల మంది** విద్యార్థులు చదువుకుంటున్నారు.

✳️ ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి:
▪️ * ప్రాథమిక స్థాయిలో: 21 మందికి ఒక టీచర్.
▪️  * ప్రాథమికోన్నత స్థాయిలో: 15 మందికి ఒక టీచర్.
▪️  * సెకండరీ స్థాయిలో: 10 మందికి ఒక టీచర్.
▪️  * హయ్యర్ సెకండరీలో: 30 మందికి ఒక టీచర్.

✳️ విద్యా ప్రమాణాలు - పురోగతి:
▪️ ట్రాన్సిషన్ రేటు (Transition Rate): ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత స్థాయికి విద్యార్థుల మార్పు రేటు 94.5% గా ఉంది.
▪️ ప్రాథమికోన్నత స్థాయి నుండి సెకండరీ స్థాయికి ఈ రేటు గతంలో 52.7% ఉండగా, ప్రస్తుతం 94.2% కి పెరిగింది.
▪️ బాలికల ప్రవేశాల నిష్పత్తి (GER): సెకండరీ స్థాయిలో బాలికల ప్రవేశాల నిష్పత్తి గతంలో 81.47% ఉండగా, ఇప్పుడు అది 102% కి చేరడం ఒక గొప్ప పరిణామం.
▪️ మౌలిక వసతులు: 2014-15లో ఉన్న సౌకర్యాలతో పోలిస్తే, ప్రస్తుతం పాఠశాలల్లో ప్రవేశాల నిష్పత్తి ప్రాథమికోన్నత స్థాయిలో 101%, సెకండరీ స్థాయిలో 89.4% కి పెరిగింది.

✳️ సవాళ్లు:
ఉచిత నిర్బంధ విద్యా చట్టం (RTE) పదో తరగతి తర్వాత అమలు కాకపోవడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది. సామాజిక కారణాలు మరియు ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు చదువు మానేసి పనులకు వెళ్తున్నారని నివేదిక విశ్లేషించింది. ఢిల్లీ, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో పదో తరగతి పూర్తి చేసిన వారు దాదాపు 100% పైచదువులకు వెళ్తుండగా, ఏపీ ఇంకా ఆ స్థాయికి చేరుకోవాల్సి ఉంది.
అనంతపురం : పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్!
CTET-September-2026-Notification_QuickSarkari.pdf
996.7 KB
CTET-September-2026-Notification_QuickSarkari.pdf
*📢తల్లిదండ్రులు...*
*ఒకసారి ఆలోచించండి*

కొన్ని వార్తలు వింటుంటే *వర్క్ ఫ్రం హోం* అనే పదాలు వినబడుతున్నాయి.

కొన్ని న్యూస్ పేపర్లు సైతం ఇవే తెలియజేస్తున్నాయి.

అధికమైన ఖర్చులను తగ్గించుకోండి అని స్వయానా ప్రభుత్వ పెద్దలైనా మన ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలియపరుస్తున్నారు.

ఒకవేళ నిజంగానే *వర్క్ ఫ్రం హోం* లాంటి విధానాలు మొదలయితే మీ పిల్లలకు అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులకు చేర్చకండి.

*ముఖ్యంగా తొందరపడి అడ్మిషన్ ఫీజులు కట్టకండి.*

ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ లో వారిని చేర్చినట్లయితే త్వరగా తీసివేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.
(అడ్మిషన్ ఫీజు కొద్దిగా నష్టపోయినప్పటికీ) దీనివల్ల మీకు వేలకు వేలు నష్టం లేకుండా ఉంటుంది.

ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలోనే ఉంచినట్లయితే....
*వర్క్ ఫ్రం హోమ్* మొదలైతే స్కూళ్లకు వెళ్ళినా వెళ్ళకపోయినా అధిక ఫీజులు వసూలు చేసుకుంటారు. మాకు ఇబ్బంది ఏమీ లేదు మేము ఆ ఫీజులను తట్టుకోగలం అని మీరు భావిస్తే..

కనీసం మీ చుట్టుపక్కల వాళ్లకైనా సలహాలు ఇవ్వండి. ఉద్యోగం లేని మీ బ్రదర్స్ తో, మీ సిస్టర్స్ తో విషయాలను డిస్కషన్ చేసి, వారి నీ ఆ ప్రమాదం నుండి కాపాడి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు వాళ్లకు సలహాలను ఇవ్వండి.

పైగా ఈ సంవత్సరం పదో తరగతి రిజల్ట్స్ ను గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

*ఆలోచించండి.. ఖర్చు లేకుండా విజయాన్ని సాధించండి*

*ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ విద్య అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.*

Pls circulates this message
2👎1
TET EDIT OPTION
టెట్ కు 2.13 లక్షల దరఖాస్తులు
Hall tickets will be issued next week
అనంతపురం: 641 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
TET Response sheet released


https://tet2dsc.apcfss.in/

Paste your URL

https://rankguruji.com/answerkey/

Directly shows your marks
📣 *AP JOB CALENDAR 2026 విడుదల*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *G.O.Ms.No.81, తేదీ: 22-08-2026 ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి* అనుమతి ఇచ్చింది.

*పూర్తి వివరాలు:

*శాఖల వారీగా మొత్తం ఖాళీలు:*
🔸Group I: 149

🔹పాఠశాల విద్యాశాఖ (School Education) – 2,991
🔹హోం శాఖ (పోలీస్, ఫైర్, జైళ్లు తదితరాలు) – 2,265
🔹ఎనర్జీ (APTRANSCO/APGENCO/DISCOMలు) – 629
🔹పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి – 384
🔹రెవెన్యూ (ప్రొహిబిషన్ & ఎక్సైజ్) – 434
🔹రెవెన్యూ (CCLA) – 211
🔹ప్లానింగ్ శాఖ – 213
🔹నీటిపారుదల (Water Resources) – 224
🔹ఫైనాన్స్ శాఖ – 157
🔹 ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు & భవనాలు – 132
🔹పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) – 164
🔹పరిశ్రమలు & వాణిజ్యం – 125
🔹రెవెన్యూ (ఎండోమెంట్స్) – 104
🔹ఇతర శాఖలు (అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, EFS&T, ఉమెన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా, అడల్ట్ ఎడ్యుకేషన్ మొదలైనవి) – మిగిలిన ఖాళీలు
మొత్తం 10,060 పోస్టులను APPSC, APSLPRB, DSC తదితర రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయనున్నారు.

*పూర్తి వివరాలు:*
http://goir.ap.gov.in
CTET REOPENED
CTET EXAM POSTPONED
#CTET Application
25-08-2026 TO 01-09-26
Postal GDS నోటిఫికేషన్ కి apply చేసుకోవాలనుకునేవారు SSC లో 9.5 to 10/10 GPA ఉంటే APPLICATION పెట్టుకోండి లేకుంటే వద్దు...

It's my personal opinion
👍2
ఎంత మోసం ఇది....!?
😢1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍1
.📢 రాష్ట్రంలో ఫిన్లాండ్ విద్యావిధానం అమలుకు విద్యాశాఖ కసరత్తు

🔹 పిల్లలకు నచ్చేలా.. సమాజం మెచ్చేలా!
🔹 విద్యార్థి కేంద్రీకృతంగా ఫిన్లాండ్ విద్యావిధానం
🔹 90% పైగా విద్యాసంస్థల్లో మాతృభాషలోనే బోధన
🔹 రాష్ట్రంలో అమలుకు విద్యాశాఖ కసరత్తు


🌐 ఫిన్లాండ్ విద్యావిధానం - ముఖ్యాంశాలు

✳️ 1. ఒత్తిడి లేని బోధనా పద్ధతి
🔹 పరీక్షలు, ర్యాంకుల గోల లేదు: 9వ తరగతి వరకు ఎటువంటి పరీక్షలు ఉండవు. పిల్లలకు చదువుపై భయం, ఒత్తిడి లేకుండా ఆటాపాటలతో పాఠాలు నేర్పుతారు.
🔹 కృత్యాల ఆధారిత అంచనా: క్లాస్‌రూమ్‌లో పిల్లల భాగస్వామ్యం, చేసే పనుల ఆధారంగానే వారి ప్రగతిని అంచనా వేస్తారు.

✳️ 2. ఉపాధ్యాయుల పాత్ర & స్వతంత్రత

🔹 పూర్తి నమ్మకం: టీచర్లపై ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఉండదు. ప్రతీ తరగతికి ఒక టీచర్, సహాయకులు మరియు ప్రత్యేక విద్యకు మరో ఉపాధ్యాయుడు ఉంటారు (ఒక్కో టీచర్‌కు గరిష్టంగా 20 మంది విద్యార్థులు).
🔹 పాఠ్యాంశాల రూపకల్పన: టీచర్లే స్వయంగా కరికులం ఆధారంగా ఆటలు, డ్యాన్స్ వంటి కృత్యాలతో పాఠాలు సిద్ధం చేసుకుంటారు. ఉపాధ్యాయుడిగా మారడానికి 5 ఏళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
🔹 ఉన్నత చదువుల మార్గదర్శకం: 9వ తరగతి తర్వాత పిల్లల ఆసక్తులను బట్టి ఉన్నత చదువులా లేదా వృత్తివిద్య (Vocational Education) వైపు వెళ్లాలో టీచర్లే సూచిస్తారు.

✳️ 3. సమానత్వం & మాతృభాష ప్రాధాన్యత
🔹 ఒకే రకమైన విద్య: మంచి స్కూల్, చెడు స్కూల్ అనే వ్యత్యాసం లేకుండా దేశంలోని అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన బోధన సాగుతుంది.
🔹 మాతృభాషలోనే బోధన: 90% కి పైగా విద్యాసంస్థల్లో బోధన మాతృభాష (ఫిన్నిష్) లోనే జరుగుతుంది. మిగిలిన చోట్ల స్వీడిష్ మాధ్యమం ఉంటుంది..

✳️ 4. విద్యార్థుల సంక్షేమం & ప్రత్యేక శ్రద్ధ
🔹 వెనుకబడిన వారికి తోడ్పాటు: చదువులో వెనుకబడిన పిల్లలకు, మాటలు సరిగ్గా రానివారికి ప్రత్యేక ఉపాధ్యాయులు బోధిస్తారు.
🔹 వయస్సు ఆధారిత శిక్షణ: 0-3, 3-5, 5-6 ఏళ్ల వయస్సుల వారిగా విభజించి బోధన అందిస్తారు. 6వ ఏట ఆరో తరగతికి/పాఠశాలకు సన్నద్ధం చేసి, 7వ ఏట 1వ తరగతిలో చేర్చుకుంటారు.
🔹 ఇతర వసతులు: పిల్లలకు మధ్యాహ్నం నిద్రపోయేందుకు ప్రత్యేక సదుపాయాలు, మ్యూజిక్, ఆర్ట్ రూమ్‌లు మరియు క్షేత్రస్థాయి పర్యటనలకు (Field trips) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

✳️ మన రాష్ట్రంలో అమలు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ నుండి ఫిన్లాండ్ వెళ్ళి అక్కడి విద్యావిధానాన్ని పరిశీలించిన 29 మంది ఉత్తమ ఉపాధ్యాయుల అధ్యయనం ఆధారంగా, ఈ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం తుర్కు విశ్వవిద్యాలయంతో (Turku University) 2 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకొని, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
పాఠశాలలను డైట్ కళాశాలలకు అనుసంధానించనుంది. స్కూళ్లను డైట్ లెక్చరర్లు సందర్శిస్తూ బోధన మెరుగుదలకు సూచనలు ఇవ్వనున్నారు.