VOLUNTEER 🤝 CONNECTION
56.1K subscribers
2.77K photos
553 videos
2.94K files
5.47K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear Sir/Madam,

We are pleased to inform you that the SASA app has been officially moved to the Google Play Store for easier access and updates.

🔗 Download the SASA Mobile App:
https://play.google.com/store/apps/details?id=com.codetree.swachhandhraapp&pcampaignid=web_share&pli=1
🔴 *AP PGCET దరఖాస్తుల గడువు పొడిగింపు.*

➼ ఏపీ పీజీసెట్-2025 దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 11వ తేదీవరకు పొడిగించినట్లు సెట్ ఛైర్మన్ ఆచార్య అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు.

➼ నిర్వ హణ బాధ్యతలను ఎస్వీయూకు కేటాయించగా మార్చి ఆఖరులో ప్రకటన విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 5వ తేదీ వరకు ఉన్న గడువును 11వ తేదీ వరకు పొడిగించామన్నారు.

➼ రూ.1000 అపరాధ రుసుంతో మే 15వ తేదీ వరకు, రూ.2,000తో మే 20వ తేదీ వరకు, రూ.4,000 అపరాధ రుసుంతో మే 24వ తేదీ వరకు, రూ.10,000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటివ రకు 22 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు.
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇

https://t.me/VolunteerConnection/16961
*ఈ నెల మొదటి వారంలో పిడుగుపాటుకు గురై మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్రేషియా విడుదల చేసింది.* ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున రూ.36 లక్షలు విడుద లకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లాలో నలుగురు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు మృతిచెందారు.
*పట్టణాల్లో వైట్ కేటగిరీ కిందకు వచ్చే పరిశ్రమల భవనాల నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రిబేటు కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.* కాలుష్య నియంత్రణ పాటిస్తున్న కొన్ని పరిశ్రమలకు మున్సిపల్ శాఖ ఇప్పటికే రిబేటు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్. కేటగిరి కింద ఉన్న పరిశ్రమలకు 25 శాతం రిబేటు అందిస్తోంది. అయితే వైట్ కేటగిరీ కిందకు వచ్చే బయోగ్యాస్ వంటి తక్కువ కాలుష్య కారక పరిశ్రమలకు కూడా గ్రీన్ కేటగిరీ తరహాలో ఫీజులో 25 శాతం రిబేటు ఇవ్వాలని కొందరు బయోప్లాంట్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది..
*జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ*

ప్రతి నెలా అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం (పిల్లలందరికీ రూ.15వేలు), అన్నదాత సుఖీభవ (మూడు విడతల్లో రూ.20వేలు) పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు ఇవ్వనుంది.
*వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి మనోహర్*

AP: రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వాట్సాప్లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయి.
Transfer Guidelines 2025 .pdf
129.6 KB
🔴 *ఉద్యోగుల బదిలీలు మరియు నియామకాలు మార్గదర్శకాలు 2025* #TransferGuidelines2025
🔔 *ఉద్యోగుల బదిలీల సమాచారం :*

➥ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

➥ మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా, ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

➥ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే స్థానంలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

➥ అదేవిధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి.

➥ అయితే, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

➥ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది 2026 మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది.

➥ దృష్టి లోపం కలిగిన ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

➥ అంతేకాకుండా, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, వారు కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది.

➥ వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వితంతువులైన ఉద్యోగినులు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం పొందుతారు.

➥ భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

🔴 *ఉద్యోగుల బదిలీలు మరియు నియామకాలు మార్గదర్శకాలు 2025* #TransferGuidelines2025
👇👇
https://t.me/VolunteerConnection/16994
🔴 *అన్నదాత సుఖీభవ ≈ పేమెంట్ స్టేటస్ లింక్*

👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
2025GWS_MS4_E.pdf
62.7 KB
Department of GSWS – Village /Ward Secretariats – Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Grouping of Secretariats - Fixing of Positions to the Specific purpose (Technical) Functionaries based on the category of Village /Ward Secretariats -Orders – Issued.
------------------------------------------------------------
DEPARTMENT OF GRAMA SACHIVALAYAMS AND WARD SACHIVALAYAMS
G.O.MS.No. 4 Dated: 17-05-2025
2025-Transfer guidelines.pdf
128.3 KB
Transfers and postings of Transfers and postings of Employees of State, Zonal & District cadre of posts
2025GWS_36643_MS4_E.pdf
3.7 MB
Annexure - I A-Grouping of Village Secretariats

Annexure - 2 A-Specific Purpose Functionaries in Village Secretariats
🔔 *NIDHI WEBSITE Reminder : DDO పరిధిలోని అందరి ఉద్యోగుల Household Mapping పూర్తయితేనే మే నెల జీతం బిల్లు ఓపెన్ అవుతుంది. లేనిచో ఓపెన్ కాదు*
🚌 *ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపిన సీఎం చంద్రబాబు* #WomenFreeBusRide
గ్రామ, వార్డు సచివాలయాల్లో జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ (టెక్ని కల్) ఫంక్షనరీల విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యగా హేతుబద్ధీకరణకు సంబం ధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్ట ర్లకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వనుంది.