AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం
2.26K subscribers
749 photos
15 files
624 links
This is the channel giving updates of instant government schemes information and official news of various government departments and political updates.
Download Telegram
ఇస్రో 101వ మిషన్‌కు రంగం సిద్ధం

రేపు ఉ.5.59 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV-C61

▪️ఎర్త్ అబ్జర్వేటర్‌ శాటిలైట్‌ EOS-09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో.
▪️అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌.
▪️దేశభద్రత బలోపేతం, అటవీ పర్యవేక్షణలో EOS-09 సేవలు.
▪️విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో EOS-09 సేవలు.
▪️EOS ఉపగ్రహాల సిరీస్‌లో ఇది 9వ ఉపగ్రహం
▪️EOS-09 ఉపగ్రహం బరువు 1895.24 కిలోలు
▪️ఐదేళ్లపాటు సేవలందించనున్న EOS-09 ఉపగ్రహం.
నేటి వార్తల ముఖ్యాంశాలు

▪️రానున్న వారం రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడి.
▪️ బడులు తెరిచే లోపు పిల్లలకు తల్లికి వందనం నిధులు వేస్తాం.. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం.. కర్నూలు సభలో సీఎం చంద్రబాబు ప్రకటన.
▪️రేపటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు ప్రారంభం. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ.. 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్. 3.62 లక్షల దరఖాస్తులు నమోదు. సీట్లు అన్ని ఏపి విద్యార్థులకే.. తెలంగాణకు కోటా లేదు.
▪️గ్రామ, వార్డు సచివాలయాలు హేతుబద్ధీకరణలో భాగంగా టెక్నికల్ ఫంక్షనరీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.
▪️తిరుపతిలో 500 కోట్లతో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణం.. 10 అంతస్తులు.. 98 ప్లాట్ ఫామ్ లతో ప్రస్తుత బస్టాండ్ స్థానంలో నిర్మాణం.
▪️త్వరలో మార్కెట్ లోకి కొత్తగా ముద్రించిన 20 రూ.ల నోట్లు అందుబాటులోకి వస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన.
▪️6G టెక్నాలజీ సేవలు రూపకల్పనలో భారత్ కీలకపాత్ర పోషించనుందని కేంద్ర టెలీకమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
▪️2016 లో రాష్ట్రపతికి బిల్లుల విషయంలో కేంద్ర హోంశాఖ జారీచేసిన మెమొరాండంలో మార్గదర్శకాలు ప్రకారమే తీర్పు ఇచ్చామని, ఇదే విషయం తీర్పులో కూడా స్పష్టం చేశామని సుప్రీంకోర్టు తెలిపింది.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
రేపు తిరుమల శ్రీవారి ఆగస్ట్ నెల టికెట్ల విడుదల

▪️రేపు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్.
▪️మే 21 ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం.
▪️మే 22న ఉదయం 10 గంటలకు మరిన్ని టికెట్ల విడుదల
▪️మే 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు విడుదల.
▪️మే 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల
లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం..

▪️పాకిస్తాన్ లో ఖలీద్ ను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.
▪️లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పని చేస్తున్న సైఫుల్లా ఖలీద్.
▪️ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం.
▪️2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనక ఖలీద్.
▪️2005 ఐఐఎస్సీ క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర.
▪️2001 రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడు.
▪️చాలా కాలం పాటు నేపాల్ లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.
నేటి వార్తల ముఖ్యాంశాలు

▪️ఈనెల 24నే కేరళకు నైరుతి రుతుపవనాలు..26 కి రాయలసీమకు.. నెలాఖరుకి వేసవి ముగిసినట్టే.
▪️నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 143 కేంద్రాల్లో ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం. ఈనెల 27, 28 తేదీల్లో కీ విడుదల.
▪️నేడు రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
▪️రెండు, మూడు రోజుల్లో ఐఎఎస్, ఐపీఎస్ ల బదిలీలు. 2016 బ్యాచ్ ఐఏఎస్ లకు కీలక పోస్టులు.. 2017 బ్యాచ్ ఐఏఎస్ లకు కలెక్టరులుగా చాన్స్.
▪️మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. పదోతరగతి పాసైన వారికి మెయిన్ అంగన్వాడీ కార్యకర్త హోదా ఇవ్వనున్నారు.
▪️జూన్ 12న పీఎంఏవై - 1 కింద చేపట్టిన 3 లక్షల గృహాలకు గృహ ప్రవేశాలు చేసేలా ప్రభుత్వం కసరత్తు.
▪️నింగికి చేరని PSLV-C61 రాకెట్..మూడో దశలో తలెత్తిన సాంకేతిక లోపం.
▪️పార్లమెంట్ సమావేశాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను 17 మంది ఎంపీలకు, ఆర్థిక, వ్యవసాయ స్టాండింగ్ కమిటీలకు సంసద్ రత్నా అవార్డులు ప్రకటన.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
విద్యాహక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు దరఖాస్తు ఆఖరి తేదీ నేడే!

▪️ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు ఉచితంగా 25% సీట్లు.. ఒకటవ తరగతి నుంచే ఐబీ, సిబిఎస్సి, స్టేట్ సిలబస్ లో చదువుకునే అవకాశం.

▪️ నేటితో ముగుస్తున్న ఆన్ లైన్ దరఖాస్తు గడువు.
▪️ మే 20 నుంచి 24 వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల పరిశీలన.
▪️ మే 29న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక.
▪️జూన్ 8న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న పాఠశాలకు అడ్మిషన్ల ఖరారు.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ

▪️51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి..

బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది. ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
హైకోర్టు మాజీ న్యాయమూర్తులు అందరికీ సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు తక్కువ పెన్షన్ ఇస్తుండడంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా.. హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ పూర్తిస్థాయిలో సమాన పెన్షన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర విషయాలతో సంబంధం లేకుండా మాజీ న్యాయమూర్తులకు పెన్షన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) న్యాయమూర్తులకు, అన్ని జిల్లాల న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు సమానంగా ఉండాలని స్పష్టం చేసింది. పదవీవిరమణ తర్వాత న్యాయమూర్తుల మధ్య ఎటువంటి వివక్ష చూపినా అది ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు అవుతుందని సీజేఐ పేర్కొన్నారు.
హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.15 లక్షల పెన్షన్.. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల పూర్తి పెన్షన్ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
రేపు ఏపీ కేబినెట్ సమావేశం

▪️రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం.
▪️ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.
▪️ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ.
▪️అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్న కేబినెట్.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

▪️ఇక నుండి శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం.
▪️భారత ధర్మశాల కాదు. వివిధ దేశాల శరణార్థులకు భారత్‌ ఆశ్రయం ఇవ్వలేదు.
▪️శ్రీలంక శరణార్థుల పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు.
▪️తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలి-సుప్రీంకోర్టు
ఏపి మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సేవలు ఏడాది పొడిగింపు

ఏపి మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 282 (211 PGT's & 71 TGT's) మంది సిబ్బంది సేవలు 2025 - 26 విద్యాసంవత్సరానికి (11నెలలు) పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
నేటి వార్తల ముఖ్యాంశాలు

▪️నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి.
▪️నేడు ఏపీ కేబినెట్ భేటీ. ఉ.11 గం.లకు సచివాలయం మొదటి బ్లాక్ లో సమావేశం.
▪️జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్న సీఎం చంద్రబాబు. పాలనలో పూర్తి స్థాయి సంతృప్తి రావాల్సిందేనని అధికారులకు స్పష్టం.
▪️నేడు టీటీడీ బోర్డు సమావేశం. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం.
▪️సీఎం చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ.. ప్రజలకు మేలు చేయాలనే మీ తపన, కృషి స్పూర్తిదాయకమని కొనియాడారు.
▪️ఎన్టీఆర్ వైద్యసేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు కసరత్తు.. ఏడాదికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు.
▪️వచ్చే ఏడాది డిగ్రీ కోర్సులలో సరికొత్త మార్పులు.. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సబ్జెక్టులు.. కరిక్యులం రూపొందిస్తున్న ఉన్నత విద్యా మండలి.
▪️జూనియర్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది బదిలీలకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ చర్యలు.. వివరాలు ఆన్ లైన్లో నమోదుకు ఆదేశాలు.
▪️క్రిప్టో కరెన్సీని నియంత్రించడానికి స్పష్టమైన విధానం ఎందుకు రూపొందించలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ అక్రమ వ్యాపారమని అభిప్రాయపడింది.
▪️ భారత్ ధర్మసత్రం కాదు.. శరణార్థులు ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేం.. శ్రీలంక తమిళుడు కేసులో సుప్రీం కోర్టు తీర్పు.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు
ప.గో.జిల్లా వెంకట్రామన్నగూడెం డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు: పదోతరగతిలో వచ్చిన మార్కుల పర్సంటేజీ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 528 సీట్లు కలవు.

కోర్సుల వివరాలు:
▪️డిప్లొమా ఇన్ హార్టికల్చర్
▪️డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్కేపింగ్ & నర్సరీ మేనేజ్మెంట్)

దరఖాస్తు విధానం:
దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్లో సమర్పించాలి. పూర్తి వివరాలకు https://drysrhu.ap.gov.in/ పరిశీలించండి.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
ఏపి కేబినెట్ సమావేశం నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

▪️నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
▪️సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం.
▪️హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం.
▪️విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి.
▪️అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
▪️దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ.
▪️భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం.
▪️ఏపీ లెదర్ పుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం.
▪️పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం.
▪️రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు.

మద్యం స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సూచించారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలన్నారు.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information
ఏపి ఐసెట్ 2025 ఫలితాలు విడుదల

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2025 ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి. ఐసెట్ పరీక్ష 34,131మంది విద్యార్థులు రాయగా.. 32,719మంది క్వాలిఫై అయ్యారు. ఈ పరీక్షలో 95.86శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.
టీటీడీ బోర్డు సమావేశం ముఖ్య నిర్ణయాలు

ఈరోజు అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం నిర్ణయాలు వెల్లడించిన ఈవో శ్యామలరావు.

▪️సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యం. ప్ర‌భుత్వ ఆమోదం వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం.
▪️తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యం.
▪️తిరుమ‌ల‌లోని విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పు చేయాల‌ని నిర్ణ‌యం. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.
▪️తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం.
▪️ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భ‌క్తులు విశేష సంఖ్య‌లో సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌ ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత పెంచేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యం.
▪️రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా ఉంటూ ఎంద‌రో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి ఆర్థిక స‌హాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం. స్విమ్స్ లో ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టేందుకు నిర్ణ‌యం. అదేవిధంగా 85శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భ‌వంతుల‌ను (ఆంకాల‌జీ మ‌రియు ప‌ద్మావ‌తి చిన్ని పిల్ల‌ల ఆసుప‌త్రిల‌తో క‌లిపి) త్వ‌ర‌లోనే మిగిలిన ప‌నుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణ‌యం.
▪️టీటీడీలో ప‌ని చేస్తున్న అన్య‌మ‌త‌స్తులను బ‌దిలీ చేసేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు, స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆమోదం.
▪️తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యం. దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆధికారుల‌కు ఆదేశం.
▪️ఒంటిమిట్ట‌లో భ‌క్తుల‌కు అన్న‌దానం సేవ‌ల‌ను మరింత పెంచాల‌ని నిర్ణ‌యం.
▪️తుళ్లూరు మండ‌లం అనంత‌వ‌రంలోని టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం.
▪️శ్రీ‌వారి నామావళిని రీమిక్స్ చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించిన‌ డీడీ నెక్ట్స్ లెవ‌ల్ చిత్రబృందంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం.

https://whatsapp.com/channel/0029Vb0QrLE3bbUxjzl33x2B

https://t.me/AP_Govt_information