APTEACHERS
16.4K subscribers
1.88K photos
41 videos
1.03K files
5.8K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
*📚జేఎల్ పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ జాబితా విడుదల📚*

*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఎల్ పోస్టుల కోసం గతంలో నిర్వహించిన పరీక్షలో ప్రొవిజినల్గా ఎంపికైన అభ్యర్థుల జాబి తాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మంగళవారం ఒక ప్రకటనలో జోన్- 2 పరిధిలో హిందీ సబ్జెక్ట్ జూనియర్ లెక్చరర్ల భర్తీకి సంబం ధించిన జాబితాను కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in లో, అలాగే కార్యా లయ నోటీస్ బోర్డులో ఉంచినట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*💥 ప్రైవేట్ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థుల TC ల విషయంలో CSE తాజా ఉత్తర్వులు*
The ADs & the MEOs are requested to inform all the HMs to *conform the meals availed data* and *CCH accounts* for the month of Oct'21.. *service will be closed by 5th..of every month ..

Meals Availed డాటా confirm చేసే విధానం కోసం కింద వీడియో లో కలదు
👇
https://youtu.be/mtvu7X2UorU
*Govt declared Optional Holiday can be availed on 5th Nov after the Day of Diwali*
💥 Alert.. ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి రాబోతున్న కొత్త రూల్స్‌.. పూర్తి సమాచారం
👇
https://www.thelocalhub.in/2021/11/blog-post.html
*💥పెట్రోలు డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ ని తగ్గించిన కేంద్రం.. పెట్రోలు పై రూ 5 తగ్గింపు*
*💥Flash.. IBPS Specialist Officers XI New Notification Released*
🔹Vacancies: 1828
🔹Post: Specialist Officer (CRP SPL-XI)
🔹Age : 20-30 Yrs
🔹Qualf: Degree (Engg), LLB, Degree, PG
🔹Last Date: 23-11-2021
🔹Complete Details
👇
https://www.thelocalhub.in/2021/11/ibps-specialist-officer-xi-recruitment.html

*💥IBPS Banks PO - 4135 Probationary Officers, Management Trainee MEGA Recruitment*
*Qualf: Degree*
*Last Dt: 10-11-2021*
*Details:*
👇
https://www.thelocalhub.in/2021/10/ibps-po-mt-recruitment-2021-22-apply.html
*📚గురువులపై యాప్‌ల*
*బరువు!📚*

*మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల వరకూ పర్యవేక్షణ*

*గురువులపై ఫొటో తీయడం.. అప్‌లోడ్‌ చేయడం*

*గంటల తరబడి సమయం వృథా*

*ఇప్పుడు బయోమెట్రిక్‌ హాజరు కూడా..*

*ఇక చదువు చెప్పేందుకు సమయమేదీ?*

*పిల్లలకు నాణ్యమైన బోధనపై ప్రభావం*

🔺విద్యార్థి పాఠశాలకు రాగానే హాజరు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మధ్యాహ్న భోజనానికి ముందు పాత్రలన్నీ శుభ్రం చేసిన ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వండిన ఆహార పదార్థాలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయో, లేవో స్వయంగా చూసి ఫొటోలు తీసి, వాటినీ అప్‌లోడ్‌ చేయాలి... ఇలా ఫొటోలు తీయడం, వాటిని అప్‌లోడ్‌ చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా మారింది. బడిలో బోధనకు కేటాయించాల్సిన విలువైన సమయంలో తమపై ఈ యాప్‌ల భారమేంటని గురువులు గగ్గోలు పెడుతున్నారు.

*🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి*)

పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ‘అదనపు’ పనుల బరువుతో సతమతమవుతున్నారు. విద్యార్థి పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచీ బోధనపై దృష్టి సారించాల్సిన వీరంతా ఇప్పుడు యాప్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. చదువుకు మించి వారితో చేయిస్తోన్న అనేక ఇతర పనులతో నిత్యం నలిగిపోతున్నారు. ‘నాడు-నేడు’ పనుల పర్యవేక్షణతో పాటు మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల పరిశుభ్రత వరకూ అన్నీ టీచర్లే చూసుకోవాలి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలి. గురువులకు ఈ పనులే భారంగా మారగా, ఇప్పుడు విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవడం లాంటి పనులూ అదనంగా చేరాయి. మొత్తంగా ఈ పనులన్నీ చేసేందుకు పాఠశాలకో ఉపాధ్యాయుడిని పూర్తిగా కేటాయించాల్సి వస్తోంది. ఇద్దరు టీచర్లు చేస్తే రెండేసి గంటలు పడుతుందని అంచనా. ఆ మేరకు వీరు తరగతులు తీసుకునేందుకు అవకాశం ఉండటం లేదు.

బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఇతర పనులకు కేటాయించడంతో విద్యలో నాణ్యత తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులే ఈ పనులు చేస్తున్నారు. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఈ పనులు మరింత భారంగా మారాయి. ఈ క్రమంలోనే ఇటీవల గుడ్లు, చిక్కీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయలేదంటూ టీచర్లకు ఉన్నతాధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. వాస్తవానికి కాంట్రాక్టర్లు వాటిని సరఫరా చేయకపోవడంతో ఫొటోలు తీయలేకపోయారు.

*విద్యార్థులకే నష్టం*

ఈ పరిణామాలు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించడం మాట అటుంచి, దీనివల్ల విద్యార్థులకే ఎక్కువ నష్టమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు నాణ్యమైన బోధన చేయడం, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని అంచనా వేయడం, తల్లిదండ్రులతో పిల్లల గురించి చర్చించడం, వారు మరింత రాణించేందుకు ఏం చేయాలన్న ప్రణాళికలపై ఆలోచించే సమయం లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతారని వివరిస్తున్నారు. ఈ యాప్‌లతో ఉపాధ్యాయులకు సమయం వృథా కావడం, విద్యార్థులపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులకు విద్య నాణ్యతపై నమ్మకం పోయే పరిస్థితిని కల్పిస్తాయని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వ్యక్తిగత సామర్థ్యాలను అంచనా వేసి సరైన దిశగా నడిపిస్తేనే వారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడం సాధ్యపడుతుంది. కానీ అలాంటి వాటికి సమయం ఇవ్వకుండా, కనీసం బోధనకు కూడా అవకాశం లేకుండా టీచర్లపై యాప్‌ల భారం వేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*ఫొటోలు తీసేందుకు షరతులు*

మరోవైపు ఈ ఫొటోలు తీయడానికి కూడా అనేక నిబంధనలు విధించారు. వెలుతురు సరిగా ఉండాలి. ఫొటో స్పష్టంగా ఉండాలి. టాయ్‌లెట్‌లో ఫొటో తీస్తున్నప్పుడు నీడలు ఉండకూదు. మరుగుదొడ్లో కమోడ్‌ సాధ్యమైనంత లోపలి ప్రాంతంతో సహా పూర్తిగా కనిపించాలి. గోడలు కనిపించకూడదు, కెమెరా ఫోకస్‌ టాయ్‌లెట్‌ కమోడ్‌, ఫ్లోర్‌పైనే ఉండాలి. అస్పష్టంగా ఉంటే కుదరదు. ట్యాబ్‌, కంప్యూటర్‌ మొదలైన స్ర్కీన్ల నుంచి చిత్రాలు తీయకూడదు... అంటూ అనేక షరతులు విధించారు. చాక్‌పీసులు పట్టుకుని తరగతి గదిలో బోధన చేయాల్సిన సమయంలో... సెల్‌ఫోన్లు పట్టుకుని మరుగుదొడ్లలో రోజూ ఫొటోలు తీసే దుస్థితి వచ్చిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం📚*

*వంట కార్మికులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు ఆదేశాలు*

*🌻ఈనాడు, అమరావతి*: ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోనుంది. పేద విద్యార్థులకు ఇంతకాలం ఉచితంగా అందుతున్న పోషకాహారం ఇక లభించదు. ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు గ్రాంటు నిలిపివేయడంతో చాలావరకు ఎయిడెడ్‌ బడులు ప్రైవేటు పాఠశాలలుగా మారిపోయాయి. వీటిలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సమీపంలోని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా విద్యాధికారి ఇప్పటికే ఆదేశాలు విడుదల చేశారు. వంట కార్మికులను ఎవ్వరినీ తొలగించకుండా నిబంధనల ప్రకారం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించాలని పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులకు ఒకరు, వంద మందికి ఇద్దరు, ఆపైన ప్రతి వంద మందికి ఒకరి చొప్పున ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సర్దుబాటు చేయాలని సూచించారు.

*📗ఆ పాఠశాలల్లో కొనసాగిస్తారా?*
రాష్ట్రంలో 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కిచ్చేందుకు 1,214 విద్యాసంస్థలు సమ్మతి తెలిపాయి. సమ్మతి తెలిపిన విద్యాలయాలను ప్రైవేటుగా నిర్వహించుకోవాలంటూ జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో మొత్తం 1.97 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు వీరిలో కొంతమందిని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసినా మిగతావారు అక్కడే కొనసాగే అవకాశం ఉంది. ప్రైవేటుగా మారిన ఎయిడెడ్‌ బడిలో చదివేవారికి ఇక మధ్యాహ్న భోజనం ఉండదు. ఇప్పటికే సమ్మతి తెలిపిన కొన్ని యాజమాన్యాలు అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖకు లేఖలు రాశాయి. రాష్ట్రంలో 400 ఎయిడెడ్‌ పాఠశాలలను నిర్వహిస్తున్న ఆర్‌సీఎం యాజమాన్యాలు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఈ లేఖలు పంపాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందా? లేదా అనేదానిపైనా స్పష్టత లేదు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚ఇంటర్ ప్రైవేట్*
*అభ్యర్థుల ఫీజు గడువు 23📚*

*ఉత్తర్వులిచ్చిన ఇంటర్ బోర్డు*

*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రైవేట్గా అభ్యసించే అభ్యర్థులు(వితవుట్ కాలేజ్ స్టడీ) హాజరు మినహాయింపు కోసం ఫీజు చెల్లించాలని బోర్డు సూచించింది. ఈ మేరకు బుధవారం బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు ఉత్తర్వులు విడుదల చేశారు. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలు రాసేందుకు విద్యా ర్థులంతా రూ. 1300 హాజరు మినహాయింపు కోసం చెల్లించాలని సూచించారు. బోర్డు వెబ్సైట్ నుంచి ఈ చలాన్ ద్వారా ఈ మొత్తం చెల్లించాలన్నారు. రూ. పది చెల్లించడం ద్వారా దరఖాస్తు పొందవచ్చన్నారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 23 వరకు గడువు ఉందని, రూ.200 ఆలస్య రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. అన్ని సర్టిఫికెట్లు జత చేయని, అసంపూర్ణ దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అర్హత సూచనలతోపాటు, లాంగ్వేజ్ చేంజ్, అదనపు సబ్జెక్టు జత చేసుకోవడం వంటి వివ రాలను బోర్డు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*💥NAVAL DOCKYARD - 275 Posts Recruitment Notification*
*Vacancies: 275*
*Trades: Electrician, Fitter, Mechanical, Welder, Carpenter etc*
*Qualf: ITI in Relevant Trade*
*Job Nature: Apprentice*
*Last Date: 5th Dec 2021*
*Details
👇
https://www.thelocalhub.in/2021/11/naval-dockyard-recruitment-2022-apply.html
*💥డగ్రీ పాసైనవారికీ టీసీఎస్‌లో 35,000 ఫ్రెషర్ జాబ్స్*
*టీసీఎస్ 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్*
*Vacancies: 35000*
*Qualf: Degree*
*Last Date: 30th Nov*
*Complete Details*
👇
https://www.thelocalhub.in/2021/11/tcs-smart-hiring-program-recruitment.html
*ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన ఆండ్రాయిడ్ యాప్.*

*APT ENGLISH*
*ONLINE ENGLISH LEARNING APP*.

LKG నుండి 7వ తరగతి వరకు బోధించే ఉపాద్యాయులకు మరియు LKG నుండి 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన అప్లికేషన్.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూతన సిలబస్ ఆధారంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్ ను సులభంగా అర్థమయ్యే రీతిలో, అనేక రకాల పద్ధతులు ఉపయోగించి ఈ ఆండ్రాయిడ్ యాప్ ను రూపొందించడం జరిగింది.

*వేలాది రూపాయలు విలువ చేసే ఒక విద్యా సంవత్సరం కోర్సును కేవలం ₹150 లకే అందచేస్తున్నాము.*
*JUST* 1️⃣5️⃣0️⃣ *ONLY*

https://play.google.com/store/apps/details?id=com.win.english.winenglish

Note: Forarded ... AS received by the Teacher who made this APP
*యూరప్ దేశాలకు WHO హెచ్చరిక.*

*కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తన రూపు మర్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో తిరిగి అటాక్ చేస్తోంది. ఇటీవల కాలంలో రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.*

*దీంతో WHO యూరప్ దేశాలను హెచ్చరిస్తోంది. రానున్నవారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరుగనుందని తెలిపింది. WHO గణాంకాల ప్రకారం ఈ వారం యూరప్ దేశాల్లో 1.8 మిలియన్ల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపుగా 6 శాతం అధికం. మరోవైపు ఒక్కవారంలోనే 24 వేల మరణాలు చోటుచేసుకున్నాయి. గత వారంతో పోలిస్తే మరణాల శాతం 16కు పెరిగింది. దీంతో రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు స్పష్టంగా పెరుగుతాయని గణాంకాల ద్వారా WHO హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి నెల నాటికి యూరప్ లో కొత్తగా 5 లక్షల వరకు మరణాలు సంభవిస్తాయని అంచాన వేస్తోంది. వ్యాధి సంక్రమణ రేటు యూరప్ దేశాలలో అధికంగా ఉంది. లక్షమందికి 192 కొత్త కేసులు నమోదవుతున్నాయి. యూరప్ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు కేవలం 47 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని, కేవలం 7 దేశాలు మాత్రమే 70 శాతాని కన్నా ఎక్కువగా వ్యాక్సిన్లు వేశాయని WHO తెలిపింది.*
Rc.No.109/E3/2021-2022., dated:02-11-2021-Intermediate Course in Gen & Voc streams are here by informed that date for uploading 1st year students data in Jnanabhumi portal have been extended up to 12-11-2021.
*🛥Indian Coast Guard Civilian Posts Recruitment 2021*

*Total Posts: 19*
*Posts: Lift Operator, Civilian MT Driver, Fireman, MTS & Other*
*Qualf: Matriculation, ITI (Relevant Trade)*
*Pay: Rs 25000 Onwards*
*Last Date: 30th Nov*
*Details and APPLICATION Form*
👇
https://www.thelocalhub.in/2021/11/indian-coast-guard-civilian-posts.html
*📚వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్‌ విధానం అమలు📚*

*6 Nov, 2021 04:06 IST|Sakshi*

*పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరి బి.రాజశేఖర్*

*🌻తెనాలి టౌన్‌*: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ర్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరి బి.రాజశేఖర్‌ తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్‌ను పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరి బిరాజశేఖర్, కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో చేపట్టిన నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు.

🌻సిలబస్‌ పూర్తి చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థమయ్యేలా బోధించడం ముఖ్యమన్నారు.  జనవరి 5వ తేదీన తిరిగి పాఠశాలకు వస్తామని, అప్పటికల్లా విద్యార్థులంతా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో రాసి, చదవగలిగేలా చూడాలన్నారు. వీరి వెంట స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అడ్వయిజర్‌ మురళి, సమగ్ర శిక్షా ఎస్‌పీడీ కె.సెల్వి, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, సమగ్ర శిక్షా ఏపీసీ ఎం.వెంకటప్పయ్య, డీవైఈవె కె.నారాయణరావు ఉన్నారు.  

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚హాజరుపై గట్టి నజర్‌📚*

*Nov 6 2021 @ 01:43AM*

*ఉద్యోగులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి*

*గత నాలుగునెలల్లో మూడో మెమో* 

*🌻అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):* ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెట్టేందుకు సిద్ధమైంది.  బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేస్తూ మరో జీవో విడుదల చేసింది. కరోనా తగ్గుముఖం పట్టిన గత నాలుగు నెలల్లోనే ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం జీవో ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గ్రామ/వార్డు సచివాలయం నుంచి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ సమయానికి రావాల్సిందే. డ్యూటీ సరిగ్గా చేయాల్సిందే. అయితే పదేపదే జీవోలిస్తున్న తీరే ఉద్యోగుల్లో అనుమానాలు పెంచుతోంది. వేతనాలకు బయోమెట్రిక్‌తో ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తారేమోనని కలవరపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతున్నారోలేదో గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం విడుదల చేసిన ఆ జీవోలో సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది.
https://t.me/APTEACHERS
🌻ఉద్యోగులందరూ కార్యాలయాల్లో ఉండేలా చూసే బాధ్యత కార్యదర్శులదేనని స్పష్టం చేసింది. దీనిపై వారానికోసారి సమీక్ష చేయాలని, గైర్హాజరు కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని హెచ్‌వోడీలు, కలెక్టర్లను ఆదేశించింది. హాజరు నమోదు వివరాలను సంబంధిత శాఖల కార్యదర్శులు పరిశీలించాలని, 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్లు తెలిపింది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚ఏపీఈఏపీ సెట్‌లో*
*89వేల మంది ఆప్షన్ల నమోదు📚*

*ముగిసిన వెబ్‌ ఆప్షన్ల నమోదు, నేడు సవరణలకు అవకాశం*

*90 వేలమంది విద్యార్థుల రిజిస్ట్రేషన్‌*

*జేఈఈలో మెరిట్‌ విద్యార్థులు ముందుగానే అటువైపు వెళ్లడంతో ఇతర మెరిట్‌ విద్యార్థులకు అవకాశం*

*ప్రైవేటు వర్సిటీల్లోకి తొలిసారిగా పేదలకు ప్రవేశం*

*సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న చర్యలతో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు*

*ఆ వర్సిటీల్లో చేరిన విద్యార్థుల ఫీజులూ ప్రభుత్వమే భరిస్తుంది*

*🌻సాక్షి, అమరావతి:* రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల నమోదు శుక్రవారం రాత్రితో ముగిసింది. శనివారం ఆప్షన్లను సవరించుకోవచ్చు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కౌన్సెలింగ్‌కు 90,606 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 89,232 మంది వెబ్‌ ఆప్షన్లలో పాల్గొన్నారు. గత ఏడాదికన్నా ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 83,014 మంది ఆప్షన్లు నమోదు చేసుకోగా, ఈసారి అంతకంటే ఎక్కువే పాల్గొన్నారు. ఈసారి ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల, కౌన్సెలింగ్‌ ప్రారంభం ఆలస్యం కావడంపై కొన్ని పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఈ ఆలస్యం వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు నష్టపోతున్నారని, ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలకు వెళ్లిపోతున్నారంటూ ప్రచురించాయి. ఈ కథనాలు తప్పని నిరూపిస్తూ గత ఏడాదికంటే ఈసారి వెబ్‌ ఆప్షన్లలో ఎక్కువమంది పాల్గొనడం విశేషం.


*సీట్లు ఖాళీ కాకుండా మెరిట్‌ విద్యార్థులకు అవకాశం*
ఐఐటీ, ఎన్‌ఐటీ, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా ఉంటుందని అంచనా. వీరు ఏపీ ఈఏపీసెట్‌లోనూ మెరిట్‌లో ఉన్నారు. వీరంతా జాతీయ సంస్థల్లో చేరేందుకే ప్రాధాన్యమిస్తారు. జేఈఈ ప్రవేశాలకన్నా ముందే రాష్ట్ర కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించడం వల్ల ఈ విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందేవారు. తరువాత వారు జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అ«థారిటీ) కౌన్సెలింగ్‌లో జాతీయ సంస్థల్లో సీట్లు పొందితే రాష్ట్ర కాలేజీల్లోని సీట్లను వదులుకోవడం ద్వారా అవి ఖాళీ అయ్యేవి. దీనివల్ల ఈఏపీసెట్‌లో వారి తరువాత మెరిట్‌లో ఉండే విద్యార్థులకు మొదటి కౌన్సెలింగ్‌లో నష్టం వాటిల్లేది. ఇçప్పుడు జోసా కౌన్సెలింగ్‌ అనంతరం ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్ల వారికి తొలి కౌన్సెలింగ్‌లో మేలు జరుగుతుంది. జేఈఈలో ర్యాంకులు పొందిన వారు జాతీయ విద్యా సంస్థలకు వెళ్లిపోవడంతో వారి తర్వాత మెరిట్‌లో ఉన్న వారికి అవకాశం
కలుగుతోంది.

*ప్రైవేటు వర్సిటీల్లోనూ కన్వీనర్‌ కోటా*
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఈ ఏడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీల్లోని కోర్సుల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్‌ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వర్సిటీలతో సంప్రదింపులు జరిపి, కన్వీనర్‌ కోటా సీట్లకు ఒప్పించడంతో పాటు అది తక్షణమే కార్యాచరణలోకి వచ్చేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయించారు. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – అమరావతిలో 1,264 సీట్లు, ఎస్‌ఆర్‌ఎం– విజయవాడలో 413 సీట్లు, బెస్ట్‌ యూనివర్సిటీ– అనంతపురంలో 168 సీట్లు, సెంచూరియన్‌ యూనివర్సిటీ – టెక్కలిలో 273 సీట్లు మొత్తం 2,118 సీట్లను కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటివరకు ఈ వర్సిటీల్లో కోర్సులకు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మెరిట్‌ సాధించడంతోపాటు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు వంటి కోర్సులకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. వీటిలో చదివిన వారిలో అధికశాతం విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ చొరవ కారణంగా పేద మెరిట్‌ విద్యార్థులు తొలిసారిగా ప్రైవేటు వర్సిటీల్లో అడుగిడబోతున్నారు.

*రాష్ట్రంలో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి*
రాష్ట్రంలోని కాలేజీల్లో చేరడానికి ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణలతో ఉన్నత విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందుతోంది. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంటు, వసతి, భోజనాల ఖర్చు కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేస్తుండడంతో ప్రవేశాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

*💥– ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి*

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇