APTEACHERS
16.1K subscribers
1.81K photos
36 videos
1.02K files
5.67K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
♻️News in Short

▪️నిర్బంధాల ఫలితాన్ని రాబోయే రోజుల్లో చూస్తారు -ఉపాధ్యాయ సంఘాలు
యూటీఎఫ్ చేపట్టిన 36 గంటల దీక్షను భగ్నం చేసేందుకు ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని ఏపీటీఎఫ్, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (అష్టా), సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఖండించాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రూ.18 వేల కోట్ల బకాయిలను చెల్లించాలనే డిమాండుతో ఆందో ళన చేస్తున్న యూటీఎఫ్పై ప్రభుత్వ నిర్బంధం తగదని హెచ్చరించాయి

▪️ట్యాబ్, ఐఎఫ్ పీలపై అవగాహన కల్పిస్తే 8 క్రెడిట్లు
ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఇంటర్న్షిప్
ప్రభుత్వ పాఠశాలల్లో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్(ఐఎఫ్పీ) వినియోగంపై అవగాహన కల్పించే ఇంజినీరింగ్ విద్యార్థులకు (ఇంటర్న్షిప్ కింద) 8 క్రెడిట్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు.

▪️ఇంజనీరింగ్ విద్యార్థులతో ఉపాధ్యాయులకు శిక్షణ
ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్ ఆన్ లైన్ ఓరియెం టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, విద్యార్థుల ట్యాబుల విని యోగంపై 3 - 4 నెలల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

▪️మునిసిపల్ ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు ఆన్లైన్ చేయండి - పాఠశాల విద్యా శాఖా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్

▪️ఏ పి విద్యార్ధులకు ఈ ఒక్క సారికి ఛాన్స్
2024-25 తో ఏ పి విద్యార్ధులకు 15 శాతం ఓపెన్ కోటా క్లోస్
ఉన్నత విద్యలో ప్రవేశాలకు యధావిధిగా అమలుకు తెలంగాణ ప్రభూతం గ్రీన్ సిగ్నల్
జూన్ 2 తో ఏ పి పునర్విభజన చట్టానికి పదేళ్ళు పూర్తి

▪️జాతీయా స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల నీట్ పీజీ పరీక్ష జూలై 7 న కు రీ షెడ్యూల్ అయ్యింది

▪️ఎస్మా ను ఖండించిన అఖిల భారత అంగన్వాడీ వొర్కర్ ల సమాఖ్య - నేటి నుండి దేశవ్యాప్త నిరసనాలకు పిలుపు
ఎదిరిస్తే ఈడ్చెయ్
*♻️సర్వర్ ఇబ్బందులు కారణంగా గ్రూప్ 2 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 17 జనవరి వరకు పొడిగింపు*
♻️చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ఏపీ మున్సిపల్‌ కార్మికులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయిన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు.

దీంతో.. రేపటి నుంచి మున్సిపల్‌ కార్మికులు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినప్పటికీ.. కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో ఇవాళ మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో.. ముగింపు పడినట్లయ్యింది.
Forwarded from The Localhub
♻️ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ అర్హత తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 3500 అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

💥Indian Airforce AgniVeer Vayu Recruitment 2024

▪️Post: IAF Airforce Agniveer Vayu
▪️Vacancies: 3500
▪️Eligibility: 10+2 / Diploma/ Degree
▪️Salary: 30-40K
▪️Online Dates: 17 Jan to 6th Feb 2024

💥Complete Info, Notification PDF, Selection Process Click Below
https://www.thelocalhub.in/2024/01/indian-airfirce-agniveer-vayu-2024.html
♻️ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె విరమణ

*మంత్రి బొత్సతో చర్చలు ఫలించినట్లు ప్రకటించిన ఐకాస*

సమగ్ర శిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగుల ఐకాస ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఐకాస చైర్మన్ కాంతారావు ప్రకటించారు. విజయవాడలో బుధవారం అర్ధరాత్రి వరకూ జరిగిన చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎస్ఎస్ఏలోని 10 విభాగాలకు జీతాలు పెంచుతా మని, హెన్ఆర్ విధానం అమలుకు కమిటీ ఏర్పాటుచేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ అమలుచేస్తామని, సమ్మెకాలానికి జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. సమ్మె సమయంలో ఇచ్చిన ఉద్యోగ తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారని, పార్టమ్ ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ సిబ్బందిని వృత్తివిద్య టీచర్లుగా మారుస్తా మన్నారని వెల్లడించారు. గతంలో తొలగించిన పీజీటీ తెలుగు, ఆంగ్లం టీచ ర్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారని, అనుభవం ఆధారంగా శ్లాబ్లు ఏర్పాటుచేసి, మినిమం టైంస్కేల్ అమలును పరిశీలించేందుకు చర్చల్లో అంగీ కరించారని తెలిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నామని వెల్లడించారు. ఈ చర్చల్లో ఐకాస గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఎస్ ఎస్ఏ ఎస్పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
*♻️న్యూస్ హెడ్ లైన్స్*

అంతర్జాతీయ వార్తలు
▪️మాల్దీవులు చైనా మధ్య 20 ఒప్పందాలు - ముయిజ్జు తో చర్చలు జరిపిన జీన్ పింగ్
▪️నేటి నుండి ఇజ్రాయెల్ యుద్ద నేరం పై అంతర్జాతీయ న్యాయస్థానం లో విచారణ -
▪️ఇమ్రాన్ ఖాన్ కు లబించని ఉపశమనం - నామినేషన్ పత్రాల తిరస్కారణకు లాహోర్ హై కోర్టు సమర్ధన
▪️నాసా ఆర్టెమిస్ మూన్ మిషన్‌లను ఏడాదికి వాయిదా వేసింది
▪️గాబ్రియేల్ అట్టల్ ఫ్రాన్స్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి అయ్యాడు
▪️2024 ట్రిప్ ఎడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో దుబాయ్ వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది
▪️శీతాకాలపు తుఫానులతో తూర్పు US మరియు కెనడా దెబ్బతింది, 500,000 గృహాలకు విద్యుత్ శక్తి సరఫరా నిలిచింది

జాతీయ వార్తలు
▪️MBBS సీట్లన్నీ కౌన్సెలింగ్ లోనే భర్తీ చేయాలి -నేరుగా ప్రవేశాలు కల్పించవద్దని ఎన్ఏంసి ఉత్తర్వులు
▪️నెట్, గెట్ అభ్యర్ధులకు నేరుగా పి ఎచ్ డి సీట్లు - ఆర్ సెట్ నుండి మినహాయింపు -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
▪️వాయువ్య భారతంలో రేపటి నుంచి చలిగాలులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది
▪️19-27 ఫిబ్రవరి 24 వరకు విశాఖపట్నంలో భారత నావికాదళం MILAN 24 విన్యాసాన్ని నిర్వహించనుంది
▪️భారత నౌకాదళం మెరుగైన సముద్ర నిఘా కోసం 'దృష్టి 10 UAV'ని ఆవిష్కరించింది

రాష్ట్ర వార్తలు
▪️రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుల కేసులలో చంద్ర బాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేసిన హై కోర్టు
▪️పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ - మంత్రులతో చర్చల అనంతరం ప్రకటించిన నేతలు
▪️ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె విరమణ - మంత్రి బొత్స తో చర్చలు ఫలించినట్టు ప్రకటించిన ఐకాస
▪️అంగన్వాడీ ల సమ్మె పై హై కోర్టు లో పిల్ - వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం
▪️ఉద్రిక్తంగా మారిన ఛలో సిఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి - ఉపాధ్యాయ నియామకాలు - డిఎస్సి చేపట్టాలని డీవైఎఫ్ ఐ ఆందోళన
▪️ఒక్క పోస్టుకు 446 మంది పోటీఈ - గ్రూప్ -2 ధరఖాస్తుల స్వీకరణ 17 జనవరి వరకు గడువు పెంపు. ఇప్పటి వరకు 4 లక్షల మంది అప్లికేషన్ల పూరింపు
▪️రిటైర్ అయ్యే ఆర్టీసీ ఉద్యోగులకు ఈ ఎచ్ ఎస్ వైద్యం - ఆర్ధిక శాఖతో భేటీలో అధికారుల నిర్ణయం
▪️ఏపి సీపీస్ ఈ ఏ నూతన అధ్యక్షుడిగా కోరుకొండ సతీష్, ప్రధాన కార్యదర్శి గా సిఎం దాస్ ఎన్నికయ్యారు. విజయవాడ లో బుధవారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు
Forwarded from The Localhub
‼️‼️‼️HURRY UP‼️‼️‼️

💥Intelligence Bureau ACIO Tech Recruitment 2023 Notification Out for 226 Grade 2 Posts
▪️Last Date :Tomorrow(12th Jan)
https://www.thelocalhub.in/2023/12/intelligence-bureau-acio-grade-ii-tech.html

💥RRC, Northern Railway Act Apprentice Recruitment 2023 – Apply Online for 3093 Posts
▪️Last Date : Today(11th Jan)
https://www.thelocalhub.in/2023/12/rrc-northern-railway-act-apprentice.html
*సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ*

*సమగ్ర శిక్ష ఉద్యోగుల చర్చల సారాంశం*

▪️హెచ్ఆర్ పాలసీకి కమిటీ కాన్స్టిట్యూట్ చేసి జిఏడి నుంచి ఫైనాన్సు నుంచి సమగ్ర శిక్ష నుంచి కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది
▪️ ఎంటీఎస్ కి సంబంధించి డేటా మొత్తం రెడీ చేసుకున్న 0 నుంచి 5 5 నుంచి 10 ,10 నుంచి 15, సంవత్సరాల సర్వీసింగ్ కన్సిడర్ చేస్తూ రిపోర్టు కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుందని ఎస్పిడి గారు తెలియజేశారు
▪️2017లో శాలరీ పెరగకుండా ఉన్నటువంటి 10 విభాగాల వారికి 23% శాలరీ అనేది పెంచడం జరిగింది
సెక్టోరియల్ ఆఫీసర్
సిస్టం అనలిస్ట్
డిపిఓ మెసెంజర్
ఐ.ఇ.ఆర్.టి
పార్ట్ టైం ఇన్స్పెక్టర్
సైట్ ఇంజనీర్
ఎం ఆర్ సి మెసెంజర్
ఒకేషనల్ టీచర్స్
కంప్యూటర్ ఇన్స్పెక్టర్
డ్రైవర్

▪️ సమగ్ర శిక్షలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులకు తదుపరి వచ్చే పిఆర్సిలో అందరికీ తారతమ్యాలు లేకుండా హెచ్చుతగ్గులు లేకుండా ఒకే శాలరీని ఇవ్వడం జరుగుతుంది
▪️ అన్ని విభాగాల వారికి ఖచ్చితమైన స్పష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వడం జరుగుతుంది
▪️ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా ఉన్న వాళ్లందరినీ అవుట్సోర్సింగ్ లో మార్చిన ఉద్యోగులందరికీ అందరిని మరల కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చుట కొరకు కమిటీకి ఫైల్ పెడతామన్నారు
▪️ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ అనేది ఇస్తామని తెలియజేశారు
▪️ సమగ్ర శిక్ష లో ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు
▪️ కేజీబీవీకి సంబంధించి ఒకేషనల్ టీచర్స్ ని అలాగే కంప్యూటర్ టీచర్స్ ని కూడా టీచరుగా కన్సిడర్ చేస్తామని తెలియజేశారు
▪️ కేజీబీవీ లో పనిచేస్తున్నటువంటి కుక్ అండ్ హెల్పర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో డైలీ వేజ్ లో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో రిక్రూట్మెంట్ తీసినప్పుడు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు
▪️ పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ ని ఒకేషనల్ టీచర్ గా మార్పు చేయుటకు నిర్ణయించారు
▪️ కారుణ్య నియామకలను జరపటకు అంగీకరించారు
▪️ ఎక్స్గ్రేషియా ఇచ్చుటకు ఆమోదించారు
▪️ సమగ్ర శిక్షలు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు స్టాఫ్ గ్యాప్ డైలీ వేజ్ ఉద్యోగులకు వేటేజ్ కల్పించడం అంగీకరించారు
▪️ ఐ ఈ ఆర్ పి పేరును ఐ ఈ ఆర్ టి పేరు మార్చుటకు అంగీకరించారు
▪️ క్లస్టర్ రిసోర్స్ మొబిలిటీ టీచర్ యొక్క పేరును క్లస్టర్ రిసోర్స్ మోనిటరింగ్ టీచర్ గా మార్పు చేయుటకు అంగీకరించారు
▪️సైట్ ఇంజనీర్స్ కి వారి యొక్క విద్యార్హతను బట్టి డెసిగ్నేషన్ చేయిటకు అంగీకరించారు
▪️ కేజీబీవీ పిజిటి తెలుగు ఇంగ్లీష్ టీచర్స్ ని మరలా పాబ్లు తీసుకొని రిక్రూట్మెంట్ తీసుకుంటామని తెలియజేశారు
▪️ కేజీబీవీ లో స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న స్కూల్లో కుక్ ల సంఖ్య అవసరాన్ని బట్టి అపాయింట్ చేయుటకు అంగీకరించారు
▪️ రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరములకు అంగీకరించలేదు
▪️ భవిత సెంటర్లో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్టులకి హొనొరోరియం పెంచుట కొరకు ఆలోచన చేసి ఆమోదం తెలుపుతామని తెలియజేశారు
▪️ సమ్మె కాలానికి శాలరీ అనేది విడుదల చేస్తామని తెలియజేశారు
▪️ సమ్మె కాలంలో ఉన్నటువంటి టెర్మినేషన్స్ అన్నిటికీ కూడా రద్దు చేస్తామని తెలియజేశారు

Forwarded as Received
*♻️ఏపీ ఎన్నికల విధుల్లోకి టీచర్లు*

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది.

ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ సమావేశంలో అధికారులు ప్రస్తావించారు.

ఈ క్రమంలో సీఈసీ ఆదేశాలతో DEOలకు ఏపీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

రేపటిలోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లను ఈసీ నియమించనుంది.
All the DEOs are informed that the position IDs have been created as per the cadre strength

Therefore all the DEOs are requested to inform all the DDOs under their control to transfer in the employee who are not transferred in due to lack of position IDs immediately.

_JD services
Forwarded from The Localhub
💥UIIC AO Recruitment 2024 for 250 Posts

డిగ్రీ అర్హత తో United India Insurance Corporation లో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్
▪️Post: AO Scale -1
▪️Vacancies: 250
▪️Qualification: Degree
▪️Salary : Rs 80,000
▪️Last Date: 23rd Jan 2024

🔹Complete Details and Online APPLY
https://www.thelocalhub.in/2024/01/uiic-ao-notification-2024-for-250.html
*♻️APSCERT FA-4 Time Table for 1-9th Classes, Pre Final for 10th Time Table Released*

▪️FA-4 for 1-9th Classes: 23 to 28 February 2024
▪️Pre-Final for class X : 23 February to 4 March 2024

*💥Detailed Day wise timetable schedule Below*
https://www.apteachers.in/2024/01/apscert-fa-4-2024-time-table-for-1-9th.html
*♻️నేటి వార్తలు (12.01.2024)*

*నేటి ప్రత్యేకత:*
▪️జాతీయ యువజన దినోత్సవం (భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం దశదిశల చాటి చెప్పిన స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవం గా భారత ప్రభుత్వం ప్రకటించింది)
జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం

*అంతర్జాతీయ వార్తలు:*
▪️ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ లు నిలిచినట్లు 2024 సంవత్సరానికి గాను "హెన్రీ పాస్పోర్ట్ సూచీ" విడుదల చేసిన జాబితా తెలియజేసింది. ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలోఉంది.
▪️ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల యొక్క దాడులను ఖండిస్తూ బుధవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది.
▪️రష్యాతో యుద్ధంలో తాము కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
▪️ఇటీవల బాంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఐదవ సారి ఎన్నికైన అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా చే ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ నిన్న ఢాకాలో ప్రమాణ స్వీకారం చేయించారు.
▪️పసిఫిక్ దేశమైన పపువా న్యూ గినియాలో జీతాల్లో కోత విధించడం పై ఆగ్రహంగా ఉన్న పోలీసులు సమ్మెకు దిగడంతో బుధవారం నాడు చెలరేగిన అల్లర్లలో 15 మంది పౌరులు మృతి చెందారు.
▪️ఇరాక్ నుంచి తుర్కియేకు ముడి చమురును తరలిస్తున్న సెయింట్ నికోలస్ అనే నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో సైనీకు దుస్తుల్లో ఉన్న సాయిధ దుండగులు నిన్న హైజాక్ చేయగా ఈయనకును తామే స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది.
▪️ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో నిన్న రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు దీని ప్రభావం భారత్, పాకిస్తాన్ లలోను కనిపించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.

*జాతీయ వార్తలు:*
▪️ఒడిస్సా లోని విశ్వ ప్రసిద్ధ పూరి శ్రీ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన పరిక్రమణ మార్గం శ్రీ జగన్నాథ్ కారిడార్ భక్తులకు నేటి నుంచి అందుబాటులోకి రానుంది.
▪️దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన “ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్" (ఎంటిహెచ్ఎల్) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు.
▪️ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషలలో వాతావరణ అంచనాలను వచ్చే వారం నుంచి గ్రామపంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలియజేసింది.
ప్రస్తుతం ఉన్న లాంఛర్ సామర్ధ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలియజేశారు.
▪️18వ లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల నేపథ్యంలో ఎన్నికల సంఘం గురు, శుక్రవారాలలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఢిల్లీలో నిర్వహిస్తున్న సదస్సులో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు.
▪️మణిపూర్ లోని ఇంఫాల్ పశ్చిమ కంగ్ పోక్సి జిల్లా లోని లీమా ఖోంగ్ పవర్ స్టేషన్ లో భారీగా ఇంధనం లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామాలలో మంటలు చెలరేగాయి.
▪️బ్రిటన్ లో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తో సమావేశమై ఆర్థిక, రక్షణ సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

*రాష్ట్ర వార్తలు:*
▪️రాబోయే సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు అర్హత ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలను నేటికంతా పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
▪️ఎన్నికల విధులకు అవసరం అయిన టీచర్ లను నియమించేందుకు ఎన్నికల కమిషన్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేసింది
▪️ఎన్ ఏం ఏం ఎస్ స్కాలర్షిప్ లకు ఎంపికైన అభ్యర్ధుల ధరఖాస్తు అప్లోడు కి చివరి తేదీ 31 వరకు పొడిగింపు
▪️కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ, ఒక రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కించుకుంది.
▪️జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు పదివేల చొప్పున మొత్తం రూ 417.94 కోట్ల వడ్డీ లేని రుణాలను, రూ 431.58 కోట్ల వడ్డీ రాయితీని ముఖ్యమంత్రి నిన్న బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేశారు.
▪️రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతుల కల్పన పనులన్నీ ఈనెల 25వ నాటికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
▪️ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న మూడు ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగించనున్నట్లు నేటి మధ్యాహ్నం గుంటూరులో కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ రైళ్లను ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది.
సప్లిమెంటరీ శాలరీ బిల్ న్యూస్
గత 3 నెలలుగా పొజిషన్ లు లేక శాలరీ లేనటువంటి ఉపాధ్యాయుల శాలరీ బిల్ ను సబ్మిట్ అవుచున్నవి కావున ఉపాధ్యాయ మిత్రులు గమనించగలరు.
విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Fake: 1st installment of DA Arrears bills from 01.01.2022 to 30.06.2023 has been generated in CFMS.

Reality:
1st Jan 2022 నుండి పెండింగ్ ఉన్న 22.75% DA ను మనకి Jul 2023 జీతాలలో చెల్లించారు

Arrears ను Sep Dec Mar లలో మూడు విడతలలో చెల్లిస్తామని చెప్పారు.

గానీ ఇప్పటి వరకు ఈ DA Arrears Online లో సబ్మిట్ చేసే ఆప్షన్ రానే లేదు.. సబ్మిట్ చేయని బిల్లులకు CFMS లో జనరేట్ అయ్యే అవకాశం లేదు

గమనిక:
Long Long Pending Old DA arrear Bills /SL /ZPPF [2018/19/20 లో పెండింగ్ ఉన్నవి] కొన్ని బిల్లులు కొంతమంది DDO ల CFMS Login లో Revalidation కోసం మళ్ళీ Regenerate అగుతున్నాయి..
వాటిని.యథా విధిగా ఎలాంటి Attachments లేకుండా DDO లు Biometric Authentication తో Submit చేయాల్సి ఉంటుంది
Forwarded from The Localhub
💥ECIL 1100 Junior Technician Posts Recruitment 2024

♻️ITI అర్హత తో ECIL లో జూనియర్ టెక్నీషియన్ గ్రేడ్ -2 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

▪️పోస్ట్: జూనియర్ టెక్నీషియన్ గ్రేడ్ -2
▪️ఖాళీలు : 1100
▪️అర్హత : ITI
▪️జీతం: Rs 22,500
▪️అప్లికేషన్ చివరి తేదీ: 16 జనవరి
▪️పూర్తి వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్, కింది లింకు లో కలవు

https://www.thelocalhub.in/2024/01/ecil-2024-recruitment-for-1100-junior.html
♻️అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

అంగన్‌వాడీలతో ఈరోజు కూడా చర్చలు సఫలం కాలేదు.

ప్రభుత్వం తరపున చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ చర్చించారు. వేతనాలు పెంపు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అంగన్‌వాడీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ ( YCP ) అనుకూల సంఘం‌ చర్చలకు రావడం‌పై‌ ఇతర సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. అయితే అధికారులు సర్ది చెప్పడంతో అధికారులు మళ్లీ చర్చలు ప్రారంభించారు. అయితే అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు‌ విఫలం అయినట్లు తెలుస్తోంది. సమ్మె కొనసాగించాలని అంగన్‌వాడీ సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అంగన్‌వాడీ సంఘాల నేతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ సంఘాల నేతలను హెచ్చరించారు.

ఏప్రిల్, మేలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది.
అయితే అదే విషయాన్ని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు పట్టుబట్టారు.
అలా చేస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు.
కానీ అందుకు ప్రభుత్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
దీంతో అంగన్వాడీల సమ్మె కొనసాగనుంది.
అన్ని జిల్లాల్లోనూ PF లోన్లు జమ అవుతున్నాయి. మిత్రులు చెక్ చేసుకోగలరు