APTEACHERS
16.2K subscribers
1.81K photos
37 videos
1.02K files
5.67K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
Forwarded from The Localhub
♻️NCERT Recruitment 2023 Non-Academic 347 Posts Notification and Online Form

👉Posts: Various Posts
👉Vacancies: 347
👉Last Date: 19.05.23

👉 Complete Recruitment Details, Notification, Eligibility, Online Apply Link👇

https://www.thelocalhub.in/2023/05/ncert-recruitment-2023-non-academic-347.html
Forwarded from The Localhub
💥కేంద్ర ప్రభుత్వం 8,9,10 తరగతుల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు పీఎం యశస్వి స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది

👉9, 10వ తరగతులకు ఏటా రూ.75 వేలు
👉ఇంటర్మీడియట్ లేదా 11,12 తరగతులకు ఏటా రూ.1.25 లక్షలు
👉అర్హత
👉దరఖాస్తు
👉పరీక్ష విధానం
👉పూర్తి వివరాలు👇🏻

https://www.thelocalhub.in/2023/05/pm-yasasvi-scholarships-2023-apply-now.html
*♻️Flash.. AP Employees Transfers Guidelines GO 71 Released*

👉Min Ser 2 Years as on 30th Apr
👉Max Ser 5 Years
👉Process complete before 31st May 2023
*Complete Guidelines*
https://www.apteachers.in/2023/05/ap-employees-transfers-guidelines-2023.html

Note: Not applicable for Teachers
విద్యాశాఖ మంత్రి & అధికారులతో... ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమావేశం

Meeting Highlights:

▪️ 350 - Grade 2 HMs... (SA to Grade 2 HMs Promotions) ఫలితం గా ఖాళీ అయిన 350 SA పోస్టులకు ప్రమోషన్స్.
▪️+2 స్థాయి ఒక ఇంక్రిమెంట్ తో (1752 - Except Tel,Hindi) 1493 SA పోస్ట్ ల భర్తీ .
▪️వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో SA post లు 4976 ....
▪️TOTAL SAs Promotions: 4626+350+1493 =6269

👉 ఈరోజు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు,కమీషనర్ సురేష్ కుమార్,జె.డి సర్వీసెస్ మువ్వా రామలింగం గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది

ప్రమోషన్ల అంశం పూర్తి అయినది. వివరాలు కింది విధంగా ఉన్నాయి. బదిలీల గురించి సమావేశంలో ప్రకటించిన తరువాత పంపగలము

👉 ఎం.ఇ.ఓ 2పోస్డులకు సంబంధించిన కోర్టు కేసులు విత్ డ్రా అయినందున 679 ఎం.ఇ.ఓ2 పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు
👉 హైస్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ కు బోధించడానికి అంగీకరించిన ఎస్.ఎ.లకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ను ప్రోత్సాహం గా ఇస్తాము.ఇది ప్రమోషన్ కాదని కమీషనర్ గారు తెలియజేశారు.ఈ పోస్టులు 1752 ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యను బట్టి 1746 పోస్టులను భర్తీ చేస్తారు
👉 350 గ్రేడ్-ll హెచ్.ఎం పదోన్నతులు ఇవ్వబడుతాయి
👉 6269స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు
👉 2500/-విల్లింగ్ ఇచ్చిన వారితో పాటు ,మే1నాటికి అర్హత ఉన్నవారందరికీ హైస్కూల్ ప్లస్ కు అవకాశం ఇస్తారు
ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులతో జరిగిన సమావేశంలో చర్చించిన*

*ఉపాధ్యాయ బదిలీల హైలెట్స్*

👉🏾 *గ్రేడ్ 2 HM కు 5 సంవత్సరాలు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ గా వర్తింపుకు నిర్ణయం*

👉🏾 *రీ అపోర్షమేంట్ వలన బదిలీకి గురి అయ్యే ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు మరియు ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరి పాయింట్ లు ఇస్తారు*

👉🏾 *అంతర్ జిల్లా ఎయిడెడ్ నుండి వచ్చిన వారికి పాత సర్వీస్ పాయింట్లు రావు*

👉🏾 *DEO పూల్ లో ఉన్నవారికి వారి జీతం పొందే పాఠశాల నుండి పాయింట్స్ ఇస్తారు*

👉🏾 *KGBV లలో పనిచేసే ఉపాధ్యాయుల స్పౌజ్ లకు పాయింట్లు కేటాయిస్తారు*

👉🏾 *NCC, స్కౌట్ వారికి కౌన్సిలింగ్ మాన్యువల్ చేసే ఆలోచన*

👉🏾 *Against PET గా పనిచేస్తున్న వారికి 8 సంవత్సరాల నిండితేనే వారు పనిచేస్తున్న పాఠశాల లోని పోస్టును ఖాళీగా చూపుతారు*

👉🏾 *ఒకే పాఠశాలలో అన్ని క్యాడర్లో కలిపి పనిచేసిన కాలాన్ని లాంగ్ స్టాండింగ్ గా చూస్తారు*

👉🏾 *OH/VI/HI స్పెషల్ కేటగిరి వారికి 70% పైబడి ఉంటేనే వారికి బదిలీ నుండి మినహాయింపు లేదా బదిలీకి ప్రాధాన్యత కేటగిరి ఇస్తారు.*
More Details Soon
Forwarded from The Localhub
♻️Shasastra Seema Bal (SSB) Recruitment 2023 for Head Constable, Tradesman, SI and ASI 1656 Posts

👉Posts: Various Posts
👉Vacancies: 1656
👉Qualification: SSC/12th/Diploma/Degree
👉Last Date : 24-06-2023

👉 Complete Recruitment Details, Notification, Eligibility, Online Apply Link👇
https://www.thelocalhub.in/2023/05/ssb-shasastra-seema-bal-recruitment.html
DOC-20230517-WA0180..pdf
103 KB
♻️Edn Minister meeting with Unions - 17th May 2023 on Transfers Promotions Highlights by UTF

ప్రమోషన్లు
బదిలీలు
స్పెషల్ పాయింట్లు
ప్రిఫరెన్షియల్ కేటగిరీ

ఇతర అంశాలు పై యుటిఎఫ్ వారి పూర్తి తాజా సమాచారం విడుదల

https://www.apteachers.in/2023/05/edn-minister-meeting-with-unions-17th.html
Forwarded from The Localhub
💥Accenture Recruitment 2023 Customer Service New Associate-Query Management

👉Job Role: Customer Service New Associate-Query Management
👉Work Location : Across India
👉Job Type: Full Time
👉Experience : 0-1 Years
👉Qualification : Any Graduation
👉Package : Up to 4 LPA

https://www.thelocalhub.in/2023/05/accenture-recruitment-2023-for-customer.html
ప్రభుత్వ ఉద్యోగులకు మే 22 నుంచి బదిలీలు✍️📚

♦️బదిలీలపై నిషేధాన్ని ఎత్తేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

♦️విద్యాశాఖకు ఈ బదిలీల నుంచి మినహాయింపు

🌻ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.మే 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 2023 ఏప్రిల్‌ 30 తేదీకి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి అభ్యర్థన బదిలీకి అవకాశం ఉంటుంది.

అభ్యర్థన, పరిపాలన కారణాలతో బదిలీలు చేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగుల బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసి, అనంతరం ఇతర ప్రాంతాలపై దృష్టిపెడతారు. ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ, వ్యవసాయ శాఖలు సైతం నిబంధనలకు అనుగుణంగానే మే 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలి. విద్యాశాఖలోని వివిధ విభాగాలకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఆర్థికశాఖ అనుమతితో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర, జిల్లా, డివిజన్‌/తాలూకా స్థాయిలోని గుర్తింపు పొందిన ఉద్యోగసంఘాల కార్యవర్గ సభ్యుల(ఆఫీస్‌ బేరర్స్‌)కు మూడు టర్మ్‌లు లేదా తొమ్మిదేళ్ల వరకు ఒకే స్థానంలో ఉండేందుకు అవకాశం కల్పించింది. ఏసీబీ, విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నవారిని బదిలీలకు అనుమతించరు. బదిలీ కోసం అభ్యర్థన ఉంటే వారిపై పెండింగ్‌ కేసుల వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. 50 ఏళ్ల లోపు ఉన్నవారు, ఎక్కువ సర్వీసు గిరిజనేతర ప్రాంతాల్లో చేసి, ఇప్పటివరకు ఐటీడీఏ ప్రాంతంలో పనిచేయని ఉద్యోగులను ఐటీడీఏ ప్రాంతానికి బదిలీ చేసేందుకు అవకాశం కల్పించింది.
హైస్కూల్ ప్లస్లో ఉత్తుత్తి పదోన్నతులు✍️📚

♦️బోధనకు ఒక ఇంక్రిమెంటుతో స్కూల్ అసిస్టెంట్ల నియామకం

♦️జిల్లాలు, కేడర్ల వారీగా బదిలీలు, పదోన్నతుల ఉత్తర్వులు

♦️ఉపాధ్యాయ సంఘాల నాయకుల చర్చల్లో విద్యాశాఖ వెల్లడి

🌻ఈనాడు, అమరావతి: ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లోని ఇంటర్‌ బోధనకు లెక్చరర్లను నియమించేందుకు ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. మొన్నటివరకు పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ)గా నియమిస్తామంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు పీజీటీ లేదు.. ఏమీ లేదు.. హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ బోధనకు స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంటే ఇస్తామని తేల్చేసింది. ఇంటర్‌కు బోధిస్తున్నా వారు స్కూల్‌ అసిస్టెంట్లుగానే ఉంటారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ బుధవారం నిర్వహించిన చర్చల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 292 హైస్కూల్‌ ప్లస్‌లలో బాలికలకు ఇంటర్మీడియట్‌ ప్రారంభించారు. వీరికి పాఠాలు చెప్పేందుకు 1,752 మంది అధ్యాపకులు అవసరమని గుర్తించారు. ఈ పోస్టులను తీసుకునేందుకు ఇప్పుడు స్కూల్‌ అసిస్టెంట్లు ముందుకు రావట్లేదు. ప్రయోజనం లేని పోస్టులు తమకెందుకని ప్రశ్నిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో కల్పించాల్సిన పదోన్నతులు పెండింగ్‌ పడినందున ఈ వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. ఇప్పటికే పదోన్నతులకు జిల్లాలవారీగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. జిల్లాపరిషత్తు ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి-2గా పదోన్నతి కల్పిస్తారు. వీరితో 679 పోస్టులు భర్తీచేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మండల విద్యాధికారి-1 పోస్టులు 254కు పదోన్నతులు ఇస్తారు. అనంతరం 350 ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 పోస్టులను పదోన్నతులతో భర్తీచేస్తారు. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి 6,269 పోస్టులు భర్తీచేస్తారు. తెలుగు, హిందీ భాష స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతులను వాయిదావేశారు.

♦️పాత జిల్లా యూనిట్‌గానే..
ఉపాధ్యాయుల బదిలీలకు తొలిసారిగా ప్రభుత్వం జిల్లాలవారీగా ఉత్తర్వులు జారీచేస్తోంది. ఏదైనా జిల్లావారు కోర్టుకు వెళ్తే ఆ జిల్లాలోనే బదిలీలు నిలిపివేస్తారు. పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం కారణంగా వేరే పాఠశాలకు వెళ్లాల్సి వచ్చిన ఉపాధ్యాయులకు పాత పాఠశాల పాయింట్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్పౌజ్‌ కోటాలోనూ దీన్ని అమలు చేయనున్నారు.

* ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఎనిమిది విద్యాసంవత్సరాలు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు పనిచేస్తే తప్పనిసరి బదిలీ ఉంటుంది.

* మే 31ని ప్రామాణికంగా తీసుకుంటారు. సున్నా సర్వీసు ఉన్నవారు అభ్యర్థన బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

* 13జిల్లాల యూనిట్‌గానే బదిలీలు ఉంటాయి. ఈ ఉత్తర్వులను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.

♦️ఎస్జీటీ పోస్టుల రద్దు..
వైకాపా అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక పోస్టు ఇవ్వాలంటే ఇప్పటికే ఉన్న మరో పోస్టును రద్దుచేస్తోంది. హైస్కూల్‌ ప్లస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం 1,752 ఎస్జీటీ పోస్టులను రద్దుచేశారు. కర్నూలు జిల్లాలో 76 ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను రద్దుచేశారు.

♦️అందరూ అంగీకరించారు: మంత్రి బొత్స
ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ పదోన్నతులు, బదిలీలకు ఆమోదం తెలిపారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''ఎంఈఓ-2 పోస్టులు, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులను పదోన్నతులతో భర్తీచేస్తాం. హైస్కూల్‌ ప్లస్‌లో పీజీ అర్హత ఉన్న టీచర్లను నియమిస్తున్నాం. హేతుబద్ధీకరణతో పోస్టు కోల్పోయినవారికి బదిలీల్లో పాత స్టేషన్‌ పాయింట్లు ఇస్తాం. బదిలీల ముసాయిదాను సంఘాల నాయకులకు ఇచ్చాం. పాఠశాలలు తెరిచేలోపు పదోన్నతులు, బదిలీలు పూర్తిచేస్తాం. ఎవ్వరూ న్యాయసమస్యలు తీసుకురావొద్దని కోరుతున్నాం. బదిలీలు చేశాక పదోన్నతులు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు'' అని వెల్లడించారు.

♦️ఉత్తుత్తి పదోన్నతులతో తీవ్ర నష్టం: ఉపాధ్యాయ సంఘాలు
హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ బోధనకు ఒక ఇంక్రిమెంట్‌తో స్కూల్‌ అసిస్టెంట్ల నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న వెల్లడించారు. ప్రభుత్వం సర్వీసు నిబంధనలు బేఖాతరు చేసి, స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల పేరుతో ఉత్తుత్తి పదోన్నతులు కల్పిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులకు రూ.2,500 భత్యం ఇచ్చి, నాలుగు నెలలు వెట్టిచాకిరీ చేయించుకుని ఇప్పుడు అవన్నీ పదోన్నతులు కాదనడం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బదిలీల్లో టీచర్లకు 8 ఏళ్ల నిబంధన సౌకర్యవంతమే అయినా.. అయిదేళ్లు పెట్టే ఆలోచన చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు హృదయరాజు కోరారు.
టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రభుత్వ సత్కారం✍️📚

♦️ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ప్రోత్సాహం: మంత్రి బొత్స

♦️నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బహుమతులు

♦️మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి సత్కారం, నగదు పురస్కారం

♦️ఈ నెల 23, 27, 31వ తేదీల్లో నిర్వహణ

🌻సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్‌ ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు బొత్స ప్రకటించారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్‌లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు చెప్పారు.

విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్‌ సంకల్పమన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అధునాతన వసతులు, డిజిటల్‌ విద్యా బోధన తదితరాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తామన్నారు.

♦️ఆరోగ్యకరమైన పోటీతో ప్రోత్సహించేందుకే..
ఈ నెల 23న నియోజకవర్గ స్థాయిలో సత్కార వేడుక నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పతకం, సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని బొత్స తెలిపారు. మే 27న జిల్లా స్థాయిలో సత్కారంలో విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు నగదు అందచేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు పురస్కారాలతో సత్కరిస్తామని వెల్లడించారు.

ఈనెల 31న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్‌ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సెక్రటరీ ఆర్‌.నరసింహారావు, సమగ్ర శిక్షా ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
♻️Flash... Day-18 We Love Reading Summer Camp Activities Grade Wise May 18th

👉Class 3-5
తెలుగు నీతి కథ : మూడు వరాలు
English Story: The Ant and the Dove
Maths: Expanded form to Numbers
Measure Length Breadths
https://alerts9.blogspot.com/2023/05/day-18-class-3-5-we-love-reading-summer.html

👉Class 6-9
తెలుగు కథ : అబద్దం చెప్పరాదు & పజిల్
English Story: The Travelers and the Purse
Maths: Find Perimeters
Learning: 26 Districts &Head Quarters-2
https://alerts9.blogspot.com/2023/05/day-18-class-6-9-we-love-reading-summer.html

👉Class 1-2
తెలుగు : గుడి Work Sheets
English: This - That, Fruits
Maths: Missing Numbers
Day-18 Class 1-2: Bucket and Jug
https://alerts9.blogspot.com/2023/05/day-18-class-1-2-we-love-reading-summer.html

🤝Share to your Groups
Forwarded from The Localhub
💥Accenture Recruitment 2023 Customer Service New Associate-Query Management
👉Qualification : Any Graduation
👉Package : Up to 4 LPA
https://www.thelocalhub.in/2023/05/accenture-recruitment-2023-for-customer.html

💥Accenture Recruitment 2023 Transaction Processing New Associate-Digital Marketing
👉Qualification : Any Graduation
👉Package : Up to 4 LPA
https://www.thelocalhub.in/2023/05/accenture-recruitment-2023-for.html

💥Infosys is hiring Process Trainee!
👉Qualifications: Any Graduate
👉Salary: 4.8 LPA
👉Location: Chennai/ Mysore
📌Apply Now: 👇🏻
https://www.thelocalhub.in/2023/05/infosys-careers-recruitment-for-process.html
Forwarded from The Localhub
♻️Indian Navy Recruitment 2023 Notification: 372 Chargeman-II Vacancies, Apply Online

👉Posts: Various Posts
👉Vacancies: 372
👉Qualification: Diploma/Degree
👉Last Date : 29-05-2023

👉 Complete Recruitment Details, Notification, Eligibility, Online Apply Link👇🏻
https://www.thelocalhub.in/2023/05/indian-navy-chargeman-recruitment-2023.html
♻️Deployment of School Asst as PGTs in High School Plus Latest Complete Guidelines Rc.No.ESE02/491/2023

👉హై స్కూల్ ప్లస్ లో పీజీటీ ల నియామకం కొరకు కావలసిన అర్హతలు, ఎంపిక విధానం పై సమగ్ర ఉత్తర్వులు విడుదల

👉పీజీటీ ల నియామకం కెలవం డిప్లోయ్మెంట్ మాత్రమే అని స్పష్టత

👉 పూర్తి వివరాలు, కాపీ కింది వెబ్ పేజీ లో కలవు

https://www.apteachers.in/2023/05/deployment-of-school-asst-as-pgts-in.html
Forwarded from The Localhub
💥TS High Court Recruitment 2023 for 319 Clerical Posts

🔷️ ఇంటర్ / డిగ్రీ తో 32810 - 96890 వేతనం గల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లా కోర్టులలో 319 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉పోస్టులు: టైపిస్ట్, స్టెనో, కాపీస్ట్
👉అర్హత: ఇంటర్ / డిగ్రీ
👉అప్లై చివరి తేదీ: 15 జూన్ 2023
👉జీత శ్రేణి : 32810 - 96890

https://www.thelocalhub.in/2023/05/telangana-high-court-recruitment-2023.html
Jagananna Animutyaalu - Toppers Felicitation Program.pdf
1.5 MB
జగనన్న ఆణిముత్యాలు - ప్రభుత్వ పాఠశాలలలో టాప్ త్రీ మార్కులు సాధించిన వారికి సన్మాన పధకం
♻️JAGANANNA ANIMUTYAALU Awards Scheme: జగనన్న ఆణిముత్యాలు పధకం

ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివిన 10th, ఇంటర్ టాపర్ విద్యార్థులకు ప్రభుత్వ సత్కారం

🔷 నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో SSC లో మొదటి మూడు స్థానాల్లో, ఇంటర్ లో MPC, BIPC, HEC & CEC/MEC లలో మొదటి ర్యాంక్ వారికి సత్కారం, నగదు పురస్కారం.

👉 నియోజకవర్గం స్థాయి లో 3 టాపర్లకు మే 25:
SSC వారికి 15 వేలు, 10 వేలు, 5 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 15 వేలు

👉 జిల్లా స్థాయి 3 టాపర్లకు మే 27:
SSC వారికి 50 వేలు, 30 వేలు, 15 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 50 వేలు

👉 రాష్ట్ర స్థాయి 3 టాపర్లకు మే 31:
SSC వారికి 1 లక్ష, 75 వేలు, 50 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 1 లక్ష.

పూర్తి వివరాలు
https://www.apteachers.in/2023/05/jagananna-animutyalu-awards-for.html
విద్యార్థులను సన్మానించే కార్యక్రమానికి 'జగనన్న ఆణిముత్యాలు'గా నామకరణం✍️📚

♦️మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

🌻ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించే కార్యక్రమానికి 'జగనన్న ఆణిముత్యాలు' అనే పేరు పెట్టినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో గురువారం మంత్రి వివరాలు వెల్లడించారు. ''31న రాష్ట్రస్థాయిలో విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్‌ హాజరవుతారు. ఈ నెల 25న నియోజవర్గ స్థాయిలో పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, ఇంటర్మీడియట్‌లో గ్రూప్‌ల వారీగా ప్రతిభ చూపిన ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తాం. తరువాత 27వ తేదీన జిల్లా స్థాయిలో పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న వారికి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.15 వేలు నగదు బహుమతులు అందిస్తాం. 31వ తేదీన రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, ద్వితీయ స్థానానికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.50 వేలు ప్రోత్సాహకం ఇస్తాం. ఇంటర్మీడియట్‌లో గ్రూప్‌నకు ఒకరికి చొప్పున జిల్లా స్థాయిలో రూ.50 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.లక్ష అందిస్తాం. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుల్ని, ప్రిన్సిపాళ్లను సన్మానిస్తాం'' అని వివరించారు. ఈ నెల 24న విద్యాదీవెన ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తామని, అమ్మఒడికి సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదని వివరించారు.
ఇక బదిలీలలు ఎన్నో!✍️📚

♦️ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు గడువు

♦️సిఫార్సు లేఖలకు వరుస కట్టిన ఉద్యోగులు

♦️ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద సందడే సందడి

♦️రెవెన్యూశాఖలోనే ఎక్కువ

🌻ఈనాడు డిజిటల్‌, కడప : సాధారణ ఎన్నికల తరుణంలో ఉద్యోగుల బదిలీలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం బుధవారం ఉత్తర్వుల జారీతోనే ఉద్యోగులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణంగానే సిఫార్సులకు ప్రాధాన్యం ఉండడంతో మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్ద సందడి నెలకొంది. కీలక స్థానాలకు పోటీ తీవ్రంగా నెలకొంది. కొందరు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రెవెన్యూ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఉపాధ్యాయులు, నగర/పురపాలక సంఘాల్లో బదిలీలు అధికంగా జరగనున్నాయి. అయినవారి కోసం నేతలు, నచ్చిన స్థానాలకు ఉద్యోగులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత నాలుగేళ్లుగా రాజకీయ సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చి బదిలీలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి రెండేళ్లుగా ఒకే స్థానంలో పని చేసిన ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణ ఎన్నికల కాలంలో రెవెన్యూశాఖలో బదిలీలపైనే ప్రత్యేక దృష్టి ఉండనుంది. ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న ప్రాంతాలు, కొత్తగా రహదారుల నిర్మాణం, భూముల విలువ ఎక్కువగా ఉన్న చోట్లకు తహసీల్దార్ల పోస్టులకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల పోస్టులకు మంచి డిమాండు కనిపిస్తోంది. తాము చెప్పిన పనులు చేసి పెట్టే పక్షంలోనే సిఫార్సు లేఖలిస్తామంటూ ఎమ్మెల్యేలు షరతు పెడుతున్నారు. ఇందుకు కొందరు తలూపుతూనే సిఫార్సు లేఖలు తీసుకుంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ విభాగంలోనూ సందడి కనిపిస్తోంది. రెవెన్యూశాఖలో ఉప తహసీల్దార్లు పలువురికి తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ చేపట్టాలనే డిమాండు ఉద్యోగుల్లో ఉంది. ఉద్యోగోన్నతులు కల్పించాకే బదిలీలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. దీంతో ఖాళీగా ఉన్న తహసీల్దార్ల పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బదిలీల వ్యవహారాల్లో పలు ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

♦️పలు అంశాలపై కానరాని స్పష్టత

బదిలీల విషయమై పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదంటూ ఉద్యోగులు అందోళన చెందుతున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. బదిలీలను ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని బదిలీ చేయాలా.. లేదా ప్రస్తుత జిల్లాల మేరకు చేపడతారా.. అన్న విషయమై స్పష్టత లేదు. బదిలీ దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారానా... లేక ఆఫ్‌లైనా అన్నది ప్రస్తావించలేదు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అర్హతను ప్రభుత్వం కల్పించింది. అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో వివిధ విభాగాల్లో 68 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు జరిగితే ఉమ్బడి కడప జిల్లాలో 4,500 మంది వరకు ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.