focus praja channel
3 subscribers
1 link
Download Telegram
Channel created
Channel photo updated
*📚✍️పకడ్బందీగా ‘పది’*
*ప్రణాళిక✍️📚*

*♦️52 రోజుల విజయస్ఫూర్తి అమలు*

*♦️డీఈవో విజయేంద్రరావు*

*🌻న్యూస్‌టుడే, చిత్తూరు విద్య*
ప్రతి ఒక్కరి జీవితంలో పదో తరగతి అనేది తొలి సవాలు. విద్యార్థి సామర్థ్యాన్ని కొలిచే మొదటి త్రాసు. ఉన్నత చదువుల ప్రారంభానికి పునాది. ప్రభుత్వ బడుల్లో నాణ్యత ప్రమణాల బోధన... సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తాం... పదో తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని డీఈవో విజయేంద్రరావు స్పష్టం చేశారు. ‘52 రోజుల విజయస్ఫూర్తి ప్రణాళిక’తో విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచి వాళ్లు మంచి మార్కులతో ఉత్తీర్ణులను చేయొచ్చని డీఈవో విజయేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. ఈ ప్రణాళిక అమలు తదితర విషయాలను డీఈవో ‘న్యూస్‌టుడే’కి వివరించారు.

♦️విద్యార్థుల్లో బాగా చదివేవారు, చదవని వారు ఉంటారు. అందుకని ఈ ప్రణాళికను మూడు రకాలుగా రూపొందించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. అందుకోసం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రాలు అదనంగా గంట చొప్పున నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఏ విధంగా చదవాలి, పరీక్షల్లో ఎక్కువగా వచ్చే ప్రశ్నలనే నిపుణుల సలహాతో కూడిన ప్రణాళిక తయారు చేశాం. విద్యార్థితో అమలు చేయడం, ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నాడో గమనించి అందులో మరింత సాధన చేసేలా తర్ఫీదు ఇస్తున్నాం. విద్యార్థి ఇంతకు ముందు చెప్పినప్పుడు తరగతులకు హాజరుకాలేకపోయినా, కొన్ని పాఠాలను సరిగా అర్థం చేసుకోలేక పోయినా ఈ ప్రత్యేక తరగతుల వల్ల వాటిని తెలుసుకోవచ్చు. పదో తరగతి కీలకం కావడంతో తల్లిదండ్రులూ తమ పిల్లల్ని ప్రత్యేక తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం.

*♦️అన్ని వసతులు కల్పిస్తాం..*

ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు జిల్లాలో 21,993 మంది (రెగ్యులర్‌గా 21,570 మంది, ప్రైవేటుగా 423మంది) రాయనున్నారు. వీరి కోసం  అన్ని వసతులతో 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలంటే భయం పోగొట్టి తమ ప్రతిభను మెరుగుపరిచి మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించడం కోసమే ఈ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం.

*♦️మారిన పరీక్ష విధానానికి అనుగుణంగా...*

ఈ సంవత్సరం పదోతరగతి విద్యార్థులు ఆరు పేపర్లే రాస్తారు. ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టుకు రెండేసి పేపర్లు ఉండేవి. అందువల్ల ఈ పద్ధతిని విద్యార్థులకు అలవాటు చేయడానికి రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రణాళిక ప్రకారం వారు ఎంత నేర్చుకుంటున్నారో కూడా అంచనా వేయవచ్చు. దీంతో విద్యార్థులు కొత్త విధానంతో ఇబ్బంది పడకుండా సులువుగా పరీక్ష రాయగలుగుతారు. తక్కువ మార్కులు వస్తున్న సబ్జెక్టుపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికతో బాగా చదివే పిల్లలు మరింత ఎక్కువ మార్కులు సాధిస్తారు. అందరినీ మొదటి తరగతిలో ఉత్తీర్ణులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.