అంకితభావం ప్రధానం
మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా, అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవసేవ చేసి, తరించవచ్చు. కానీ మూగజీవాలు ఎలా దైవసేవ చేస్తాయి? ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి ధూర్జటి సైతం ఇలా ప్రశ్నించి, తానే చక్కటి సమాధానమిచ్చాడు. ఆ మూగజీవాలు మోక్షం సాధించిన విధానాన్ని విశదీకరించాడు. శ్రీ అంటే సాలె పురుగు. కాళం అంటే పాము. హస్తి అంటే ఏనుగు. వీటికి మోక్షం ప్రసాదించిన కాళహస్తీశ్వరుడి మహిమలను ధూర్జటి కొనియాడాడు. భగవంతుడికి చేరువై మోక్షం సాధించడానికి సకల జంతు ప్రపంచానికి అవకాశం ఉందని తేటతెల్లం చేశాడు.
మూగజీవాలు పరమాత్ముడి పట్ల భక్తిశ్రద్ధలు చాటుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. రామాయణంలో ఉడతాభక్తి గురించి తెలియనివారుండరు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పులకించి పోయి, ఉడత ఒంటిని నిమిరాడంటే ఆ మూగజీవి ఎంత పుణ్యం చేసుకుంది! దైవ సేవ ఎంత పరిమాణంలో ఉందని కాదు, ఎంత అంకిత భావంతో జరిగిందన్నది ముఖ్యం. అలాంటి సేవ చేసిన జీవి మీద పరమాత్ముడు పరిపూర్ణమైన కరుణ జూపి మోక్షమిస్తాడు. ఇది దైవానుగ్రహ రహస్యం. ఇక జటాయువు సంగతి జగానికంతా తెలుసు. దశరథుడికి మిత్రుడైన పక్షి రాజు జటాయువు సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్తున్న రావణాసురుడి దురాగతాన్ని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ధిక్కారం సహించని రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేశాడు. అది తెలిసి శ్రీరామచంద్రుడు జటాయువును అనుగ్రహిస్తాడు. దైవసేవలో భక్తుడి శక్తి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంతోపాటు ప్రయత్నానికీ విలువ ఉంటుంది. దానికి దేవుడి నుంచి గుర్తింపు లభిస్తుంది. అనుగ్రహం దక్కుతుంది.
మనుషుల దైవసేవలు రకరకాలుగా ఉన్నట్టే జంతువుల సేవలు కూడా రకరకాలుగా ఉంటాయి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సంస్మరణం భాగవతంలోని గజేంద్రుడిలో కనిపిస్తుంది. మొసలిబారిన పడి తాను ప్రాణాంతక పరిస్థితిలో విలవిలలాడుతున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణు జొచ్చి వేడుకుంటాడు. ‘కలడందురు దీనులయెడ’ అని ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉన్న గజేంద్రుడికే ఒక దశలో ‘కలడు కలండనెడు వాడు కలడో లేడో’ అనే సంశయం కలుగుతుంది. అయినా విష్ణుమూర్తి వరదుడే. తన భక్తుణ్ని రక్షించుకోవడానికి విష్ణువు ఆగమేఘాల మీద బయలుదేరిన తీరును పోతనామాత్యుడు భాగవతంలో అమోఘంగా వర్ణిస్తాడు. భక్తికి భాషలు కూడా అవసరం లేదు. నోరూ, వాయీ లేని మూగజీవాలు కూడా ఈ పని చేయగలవు. మోక్షమూ సంపాదించగలవు.
పవిత్ర హృదయంతో పత్రం, పుష్పం, ఫలం, తోయంలలో ఏది ఇచ్చినా తీసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెబుతాడు. జగద్గురువే అలా చెప్పినప్పుడు తిరుగేముంది? వస్తురూపంలో కనిపించని తన హృదయపుష్పాన్ని మన కంటికి కనిపించని ఆ పరమాత్ముడికి అంకితమిచ్చి పూజ చేస్తే అంతకు మించిన సేవ ఏముంటుంది?
శంకర నారాయణ
మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా, అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవసేవ చేసి, తరించవచ్చు. కానీ మూగజీవాలు ఎలా దైవసేవ చేస్తాయి? ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి ధూర్జటి సైతం ఇలా ప్రశ్నించి, తానే చక్కటి సమాధానమిచ్చాడు. ఆ మూగజీవాలు మోక్షం సాధించిన విధానాన్ని విశదీకరించాడు. శ్రీ అంటే సాలె పురుగు. కాళం అంటే పాము. హస్తి అంటే ఏనుగు. వీటికి మోక్షం ప్రసాదించిన కాళహస్తీశ్వరుడి మహిమలను ధూర్జటి కొనియాడాడు. భగవంతుడికి చేరువై మోక్షం సాధించడానికి సకల జంతు ప్రపంచానికి అవకాశం ఉందని తేటతెల్లం చేశాడు.
మూగజీవాలు పరమాత్ముడి పట్ల భక్తిశ్రద్ధలు చాటుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. రామాయణంలో ఉడతాభక్తి గురించి తెలియనివారుండరు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పులకించి పోయి, ఉడత ఒంటిని నిమిరాడంటే ఆ మూగజీవి ఎంత పుణ్యం చేసుకుంది! దైవ సేవ ఎంత పరిమాణంలో ఉందని కాదు, ఎంత అంకిత భావంతో జరిగిందన్నది ముఖ్యం. అలాంటి సేవ చేసిన జీవి మీద పరమాత్ముడు పరిపూర్ణమైన కరుణ జూపి మోక్షమిస్తాడు. ఇది దైవానుగ్రహ రహస్యం. ఇక జటాయువు సంగతి జగానికంతా తెలుసు. దశరథుడికి మిత్రుడైన పక్షి రాజు జటాయువు సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్తున్న రావణాసురుడి దురాగతాన్ని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ధిక్కారం సహించని రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేశాడు. అది తెలిసి శ్రీరామచంద్రుడు జటాయువును అనుగ్రహిస్తాడు. దైవసేవలో భక్తుడి శక్తి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంతోపాటు ప్రయత్నానికీ విలువ ఉంటుంది. దానికి దేవుడి నుంచి గుర్తింపు లభిస్తుంది. అనుగ్రహం దక్కుతుంది.
మనుషుల దైవసేవలు రకరకాలుగా ఉన్నట్టే జంతువుల సేవలు కూడా రకరకాలుగా ఉంటాయి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సంస్మరణం భాగవతంలోని గజేంద్రుడిలో కనిపిస్తుంది. మొసలిబారిన పడి తాను ప్రాణాంతక పరిస్థితిలో విలవిలలాడుతున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణు జొచ్చి వేడుకుంటాడు. ‘కలడందురు దీనులయెడ’ అని ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉన్న గజేంద్రుడికే ఒక దశలో ‘కలడు కలండనెడు వాడు కలడో లేడో’ అనే సంశయం కలుగుతుంది. అయినా విష్ణుమూర్తి వరదుడే. తన భక్తుణ్ని రక్షించుకోవడానికి విష్ణువు ఆగమేఘాల మీద బయలుదేరిన తీరును పోతనామాత్యుడు భాగవతంలో అమోఘంగా వర్ణిస్తాడు. భక్తికి భాషలు కూడా అవసరం లేదు. నోరూ, వాయీ లేని మూగజీవాలు కూడా ఈ పని చేయగలవు. మోక్షమూ సంపాదించగలవు.
పవిత్ర హృదయంతో పత్రం, పుష్పం, ఫలం, తోయంలలో ఏది ఇచ్చినా తీసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెబుతాడు. జగద్గురువే అలా చెప్పినప్పుడు తిరుగేముంది? వస్తురూపంలో కనిపించని తన హృదయపుష్పాన్ని మన కంటికి కనిపించని ఆ పరమాత్ముడికి అంకితమిచ్చి పూజ చేస్తే అంతకు మించిన సేవ ఏముంటుంది?
శంకర నారాయణ
ఆలోచనల ప్రవాహం
సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు సర్వోన్నతుడు కూడా. సహనం, ధైర్యం, తేరుకునే గుణం లాంటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం. దానికి కారణం- అతడి ఆలోచనాశక్తి.
ఆలోచన, మాట, పని- ఈ మూడింటిలో ఆలోచన మహా శక్తిమంతమైంది. మిగతా రెండింటికన్నా ముందు పుడుతుంది. దానివల్ల విజయం రెండుసార్లు ప్రాప్తిస్తుంది. మనసులో ఒకసారి, వాస్తవంలో మరోసారి. ఆలోచన ఎవరి మనసులో పుట్టిందనేది ముఖ్యం కాదు. దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది. అందుకే మనం ఆవాహనకు అంత ప్రాధాన్యం ఇస్తాం. ఏదైనా సంకల్పించే ముందు దైవం ఆశీర్వాదాలు కోరుకుంటాం. సానుకూలమైన ఆలోచనలు సంక్షేమానికి, విజయానికి అవసరమైన శక్తినిస్తాయి. ఒత్తిళ్లను తగ్గిస్తాయి. మంచి హార్మోన్లను విడుదల చేసి శారీరక, మానసిక ఆరోగ్యాలకు దోహదం చేస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు అనారోగ్యంపాలు చేస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. అందుకే, గొప్పగా ఆలోచించాలి. పెద్ద పెద్ద కలలు కనాలని పిల్లలను ప్రోత్సహించాలి. ఉన్నత లక్ష్యాలను వారి మనసులో నాటాలి.
మన చర్యలు, భావాలు, ప్రవర్తన... అన్నింటినీ నియంత్రించేది మనసని చెబుతుంది గీత. కాస్త తీరిగ్గా కూర్చున్నప్పుడు చుట్టూ కనిపించే వస్తువుల గురించి, వ్యక్తుల గురించి ఆలోచిస్తాం. ఒక్కోసారి ఆ ఆలోచనలు మన లోలోపలికి కూడా వెళ్తాయి. మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా కారణమవుతాయి. కొత్త ఆలోచనలు సమాజాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తాయి, మనదైన గుర్తింపునిస్తాయి.
సంకల్పం అంటే... కోరుకున్నది సాధించే వరకూ ఆ ఆలోచనను మనసులోంచి పోనివ్వకుండా చూసుకోవడం. ఆలోచనల నాణ్యత జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు చుట్టూ ఉంటే మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారతాయి. కైకేయికి నిజానికి భరతుడికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. కానీ కాసేపు మంధర మాటలు విన్న ఫలితం- ఆమె మనసు మారిపోయింది. రాముణ్ని భరతుడికి ప్రత్యర్థిగా భావించింది. కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంది. హృదయానికి అనేక ముఖద్వారాలుంటాయి. ఏ పక్కనుంచి ఏ భావం లోనికి ప్రసరిస్తుందో కనిపెట్టుకోవాల్సిందీ మనమే. శకుని సాహచర్యం దుర్యోధనుడి పతనానికి కారణమైతే, శ్రీకృష్ణుడి స్నేహం అర్జునుణ్ని విజేతను చేసింది. మనకూ రకరకాల మనుషులు తారసపడతారు. ఎవరితో కొనసాగాలన్న నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా జీవితం సందిగ్ధంలో పడిన ప్రతిసారీ చుట్టుపక్కల ఉండాల్సినవారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మంచి మాటలతో చేయూతనిచ్చి పైకి లాగుతారా, నీరసపు మాటలు చెప్పి మరింత కిందికి నెడతారా అన్నది వారిమీదే ఆధారపడి ఉంటుంది.
ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసు ఖాళీగా ఉండటమనేది జరగదు. దాని మానాన దాన్ని వదిలేయకుండా వరద నీటిని కాలువలోకి మళ్లించినట్లు ఆలోచనల ప్రవాహాన్ని మనకు అవసరమైన విషయం మీద కేంద్రీకరించేలా మళ్లించాలి. అప్పుడే ఆలోచనలు ఆచరణాత్మకం అవుతాయి. జీవితాన్ని అర్థవంతం చేస్తాయి.
మంత్రవాది మహేశ్వర్
సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు సర్వోన్నతుడు కూడా. సహనం, ధైర్యం, తేరుకునే గుణం లాంటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం. దానికి కారణం- అతడి ఆలోచనాశక్తి.
ఆలోచన, మాట, పని- ఈ మూడింటిలో ఆలోచన మహా శక్తిమంతమైంది. మిగతా రెండింటికన్నా ముందు పుడుతుంది. దానివల్ల విజయం రెండుసార్లు ప్రాప్తిస్తుంది. మనసులో ఒకసారి, వాస్తవంలో మరోసారి. ఆలోచన ఎవరి మనసులో పుట్టిందనేది ముఖ్యం కాదు. దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది. అందుకే మనం ఆవాహనకు అంత ప్రాధాన్యం ఇస్తాం. ఏదైనా సంకల్పించే ముందు దైవం ఆశీర్వాదాలు కోరుకుంటాం. సానుకూలమైన ఆలోచనలు సంక్షేమానికి, విజయానికి అవసరమైన శక్తినిస్తాయి. ఒత్తిళ్లను తగ్గిస్తాయి. మంచి హార్మోన్లను విడుదల చేసి శారీరక, మానసిక ఆరోగ్యాలకు దోహదం చేస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు అనారోగ్యంపాలు చేస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. అందుకే, గొప్పగా ఆలోచించాలి. పెద్ద పెద్ద కలలు కనాలని పిల్లలను ప్రోత్సహించాలి. ఉన్నత లక్ష్యాలను వారి మనసులో నాటాలి.
మన చర్యలు, భావాలు, ప్రవర్తన... అన్నింటినీ నియంత్రించేది మనసని చెబుతుంది గీత. కాస్త తీరిగ్గా కూర్చున్నప్పుడు చుట్టూ కనిపించే వస్తువుల గురించి, వ్యక్తుల గురించి ఆలోచిస్తాం. ఒక్కోసారి ఆ ఆలోచనలు మన లోలోపలికి కూడా వెళ్తాయి. మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా కారణమవుతాయి. కొత్త ఆలోచనలు సమాజాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తాయి, మనదైన గుర్తింపునిస్తాయి.
సంకల్పం అంటే... కోరుకున్నది సాధించే వరకూ ఆ ఆలోచనను మనసులోంచి పోనివ్వకుండా చూసుకోవడం. ఆలోచనల నాణ్యత జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు చుట్టూ ఉంటే మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారతాయి. కైకేయికి నిజానికి భరతుడికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. కానీ కాసేపు మంధర మాటలు విన్న ఫలితం- ఆమె మనసు మారిపోయింది. రాముణ్ని భరతుడికి ప్రత్యర్థిగా భావించింది. కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంది. హృదయానికి అనేక ముఖద్వారాలుంటాయి. ఏ పక్కనుంచి ఏ భావం లోనికి ప్రసరిస్తుందో కనిపెట్టుకోవాల్సిందీ మనమే. శకుని సాహచర్యం దుర్యోధనుడి పతనానికి కారణమైతే, శ్రీకృష్ణుడి స్నేహం అర్జునుణ్ని విజేతను చేసింది. మనకూ రకరకాల మనుషులు తారసపడతారు. ఎవరితో కొనసాగాలన్న నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా జీవితం సందిగ్ధంలో పడిన ప్రతిసారీ చుట్టుపక్కల ఉండాల్సినవారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మంచి మాటలతో చేయూతనిచ్చి పైకి లాగుతారా, నీరసపు మాటలు చెప్పి మరింత కిందికి నెడతారా అన్నది వారిమీదే ఆధారపడి ఉంటుంది.
ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసు ఖాళీగా ఉండటమనేది జరగదు. దాని మానాన దాన్ని వదిలేయకుండా వరద నీటిని కాలువలోకి మళ్లించినట్లు ఆలోచనల ప్రవాహాన్ని మనకు అవసరమైన విషయం మీద కేంద్రీకరించేలా మళ్లించాలి. అప్పుడే ఆలోచనలు ఆచరణాత్మకం అవుతాయి. జీవితాన్ని అర్థవంతం చేస్తాయి.
మంత్రవాది మహేశ్వర్
పుణ్యం - నైపుణ్యం
పుణ్యం లోకమార్గాన్ని, లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది. బలిచక్రవర్తి తన ధనాన్ని, అధికారాన్ని త్యాగంచేసి పుణ్యాత్ముడిగా నిలిచాడు. ధనాన్ని సంపాదించడంలో నైపుణ్యమున్నా దాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం. నైపుణ్యానికి రుజువర్తన జతకూడితే- అది ప్రపంచానికి మేలుచేస్తుంది. పుణ్యం అనేది ధర్మపథంలో చేసిన సత్కార్యాలకు సంకేతం. నైపుణ్యం ఏమో మన శక్తిసామర్థ్యాలను మెరుగు పరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి. ఈ రెండు అంశాలు భిన్నమైనవైనా ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి. ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి. ఇవి కలిసినప్పుడే జీవితమార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘చేసే కార్యంలో నైపుణ్యమే యోగం’ అంటాడు. ఇది నైపుణ్యాన్ని ధర్మపథంలో వాడటం అనే అర్థాన్ని ఇస్తుంది. పుణ్యం మనసును పవిత్రం చేస్తే, నైపుణ్యం చేతుల్ని శక్తిమంతం చేస్తుంది. పుణ్యంతో ఉన్న దిశ, నైపుణ్యంతో ఉన్న దృష్టి కలిసినప్పుడే జీవితం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతుంది. ఈ రెండు లక్షణాల సమన్వయం యోగ్యుణ్ని తయారుచేస్తుంది.
మన ప్రవర్తన, నైపుణ్యం, ధర్మం కలిసినప్పుడే పరమార్థాన్ని సాధించగలం. మహాభారతంలో ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. నైపుణ్యం, శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్లను నియమించుకున్నాడు. సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్తవ్యనిష్ఠ, సామర్థ్యం, దయ, ధర్మం అన్నింటి సమన్వయ మూర్తి శ్రీరాముడు. పుణ్యం, నైపుణ్యం రెండూ మనిషిని దైవత్వానికి దగ్గర చేసే మార్గాలు. ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం ధ్యానం, పూజలు మాత్రమేకాదు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా పుణ్య నైపుణ్యాలను సమన్వయ పరచి జీవించడం.
నైపుణ్యం నేర్పరితనాన్ని సూచిస్తుంది. కొందరి నైపుణ్యం వారిని అందలం ఎక్కిస్తుంది. కుబేరుల్ని చేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలను సిద్ధింపజేస్తుంది. మరికొందరి నైపుణ్యం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. ఒక బోరుబావిలో పడిన బాలుణ్ని రక్షించడానికి నిపుణులు అవసరమవుతారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సామగ్రి తయారుచేయడానికి మేధావుల తోడ్పాటు కావాలి. ఇలాంటి వారి జీవితాలే ధన్యమవుతాయి.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. ధర్మాన్ని రక్షించే పుణ్య పురుషుల శక్తి దేశాన్ని రక్షిస్తుంది. శాంతి సౌభాగ్యాలతో వికసింప జేస్తుంది. పుణ్యపురుషులకు నైపుణ్యం తోడైతేనే లోకకల్యాణం సాధ్యమవుతుంది. ఈ రెండూ కలిసినప్పుడే మనిషి జీవనయానం నాణ్యతతో శోభిల్లుతుంది. పుణ్యంతో నైతికత, కరుణ, సేవాభావం పెరుగుతాయి; నైపుణ్యంతో సామర్థ్యం, విశ్వాసం, కార్యదక్షత మెరుగవుతాయి. ఇవి రెండూ కలిసి ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్నే మార్చే శక్తిగా మారతాయి. మన చేతుల్లోని నైపుణ్యాన్ని మనసులోని పుణ్యభావంతో కలిపి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది.
తల్లాప్రగడ గోపాలకృష్ణ
పుణ్యం లోకమార్గాన్ని, లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది. బలిచక్రవర్తి తన ధనాన్ని, అధికారాన్ని త్యాగంచేసి పుణ్యాత్ముడిగా నిలిచాడు. ధనాన్ని సంపాదించడంలో నైపుణ్యమున్నా దాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం. నైపుణ్యానికి రుజువర్తన జతకూడితే- అది ప్రపంచానికి మేలుచేస్తుంది. పుణ్యం అనేది ధర్మపథంలో చేసిన సత్కార్యాలకు సంకేతం. నైపుణ్యం ఏమో మన శక్తిసామర్థ్యాలను మెరుగు పరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి. ఈ రెండు అంశాలు భిన్నమైనవైనా ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి. ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి. ఇవి కలిసినప్పుడే జీవితమార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘చేసే కార్యంలో నైపుణ్యమే యోగం’ అంటాడు. ఇది నైపుణ్యాన్ని ధర్మపథంలో వాడటం అనే అర్థాన్ని ఇస్తుంది. పుణ్యం మనసును పవిత్రం చేస్తే, నైపుణ్యం చేతుల్ని శక్తిమంతం చేస్తుంది. పుణ్యంతో ఉన్న దిశ, నైపుణ్యంతో ఉన్న దృష్టి కలిసినప్పుడే జీవితం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతుంది. ఈ రెండు లక్షణాల సమన్వయం యోగ్యుణ్ని తయారుచేస్తుంది.
మన ప్రవర్తన, నైపుణ్యం, ధర్మం కలిసినప్పుడే పరమార్థాన్ని సాధించగలం. మహాభారతంలో ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. నైపుణ్యం, శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్లను నియమించుకున్నాడు. సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్తవ్యనిష్ఠ, సామర్థ్యం, దయ, ధర్మం అన్నింటి సమన్వయ మూర్తి శ్రీరాముడు. పుణ్యం, నైపుణ్యం రెండూ మనిషిని దైవత్వానికి దగ్గర చేసే మార్గాలు. ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం ధ్యానం, పూజలు మాత్రమేకాదు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా పుణ్య నైపుణ్యాలను సమన్వయ పరచి జీవించడం.
నైపుణ్యం నేర్పరితనాన్ని సూచిస్తుంది. కొందరి నైపుణ్యం వారిని అందలం ఎక్కిస్తుంది. కుబేరుల్ని చేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలను సిద్ధింపజేస్తుంది. మరికొందరి నైపుణ్యం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. ఒక బోరుబావిలో పడిన బాలుణ్ని రక్షించడానికి నిపుణులు అవసరమవుతారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సామగ్రి తయారుచేయడానికి మేధావుల తోడ్పాటు కావాలి. ఇలాంటి వారి జీవితాలే ధన్యమవుతాయి.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. ధర్మాన్ని రక్షించే పుణ్య పురుషుల శక్తి దేశాన్ని రక్షిస్తుంది. శాంతి సౌభాగ్యాలతో వికసింప జేస్తుంది. పుణ్యపురుషులకు నైపుణ్యం తోడైతేనే లోకకల్యాణం సాధ్యమవుతుంది. ఈ రెండూ కలిసినప్పుడే మనిషి జీవనయానం నాణ్యతతో శోభిల్లుతుంది. పుణ్యంతో నైతికత, కరుణ, సేవాభావం పెరుగుతాయి; నైపుణ్యంతో సామర్థ్యం, విశ్వాసం, కార్యదక్షత మెరుగవుతాయి. ఇవి రెండూ కలిసి ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్నే మార్చే శక్తిగా మారతాయి. మన చేతుల్లోని నైపుణ్యాన్ని మనసులోని పుణ్యభావంతో కలిపి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది.
తల్లాప్రగడ గోపాలకృష్ణ
మానవతే ఆధ్యాత్మికత
మానవత్వం, ఆధ్యాత్మికతల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సుకు దోహదపడతాయి. వేర్వేరుగా కనిపించినా, నాణానికి బొమ్మా బొరుసుల్లా రెండూ అవిభాజ్యాలు.
మనిషిగా పుట్టినంత మాత్రాన మానవత్వం సిద్ధించదు. సాటి మనుషుల మీద, ప్రాణుల మీద జాలి, దయ, కరుణ, సహనం, ప్రేమ చూపుతూ సాయపడటమే అసలైన మానవత్వం. తనను తాను తెలుసుకుంటూ, విశ్వంతో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా కంటికి కనిపించని సర్వాంతర్యామితో అనుసంధానం కావాలి. అంతరంగ శాంతిని పొందుతూ, సదా చైతన్య స్థితిలో ఉండటమే అసలైన ఆధ్యాత్మికత. దీనులను, రోగులను అక్కున చేర్చుకుని, వారి చివరి రోజుల్లో ప్రేమ, కరుణలను పంచి ఇచ్చి అసలైన ఆధ్యాత్మికతకు మానవతా రూపంగా నిలిచారు మదర్ థెరిసా.
మతపరమైన కర్మలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం వల్లనే ఆధ్యాత్మిక వికాసం కలగదు. అది స్వీయ అన్వేషణ, స్వయం నియంత్రణలకు సంబంధించిన అంతర్గత ప్రయాణం. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆత్మాన్వేషణ ద్వారా అంతంలేని నిరంతర చైతన్య స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మికత పరమావధి. కబీర్ దాస్ బోధనల్లో మానవత్వం, ఆధ్యాత్మికత విడదీయలేని అంశాలు. మతం, కులం, అంతస్తు వంటి భేదాలను పక్కనపెట్టి, మానవత్వానికీ అంతర్గత ఆధ్యాత్మికతకు ప్రాచుర్యం కల్పించిన సాధువు ఆయన. సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ని తలచుకునే వారికి దుఃఖం ఎందుకు వస్తుంది..? అని ప్రశ్నించి తన ఆధ్యాత్మిక మానవతా దృక్పథాన్ని ప్రకటించాడు.
మానవత్వం... ఆధ్యాత్మిక మార్గానికి ముఖద్వారం వంటిది. ఆ మార్గంలో పయనించాలంటే స్వార్థం, అహం, ఆశ, కోరిక, క్రోధం వంటి మాలిన్యాలను తొలగించుకోవాలి. ప్రతిఫలాపేక్ష రహితంగా అందరికీ చేయూతనివ్వాలి. ఆధ్యాత్మికత లక్ష్యం కేవలం మోక్షానికి, ప్రశాంత జీవనానికి మాత్రమే పరిమితం కాదు. నిస్సహాయుల బాధలను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవత్వం లేని ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత లేని మానవత్వం అసంపూర్ణం. ఆ సంగతిని అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక వాది సమాజసేవకు ముందుంటాడు. తద్వారా అసలైన ఆనందాన్నీ ఆత్మతృప్తినీ అనుభవిస్తాడు. సమూహ సంక్షేమాన్ని కోరుకుంటాడు. నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, విద్య, వైద్య సేవలు అందిస్తాడు. విపత్తు సమయాల్లో అసహాయులను ఆదుకుంటాడు. అహింసను బోధిస్తూ శాంతి స్థాపనకు కృషి చేస్తాడు.
ఆధ్యాత్మికత సర్వం సమానమేనన్న భావనను ప్రోత్సహిస్తుంది. ప్రతి జీవీ దైవ స్వరూపమేననే దృక్పథం కలిగిస్తుంది. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. సహనాన్ని అలవరుస్తుంది. అందరినీ సమానంగా ప్రేమించడం నేర్పుతుంది. మానవత్వం ఆధ్యాత్మికతకు ఒక ఆచరణాత్మక రూపం. మానవతా విలువలను నిలబెట్టుకోవడం ద్వారానే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం.
ఎం వెంకటేశ్వర రావు
మానవత్వం, ఆధ్యాత్మికతల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సుకు దోహదపడతాయి. వేర్వేరుగా కనిపించినా, నాణానికి బొమ్మా బొరుసుల్లా రెండూ అవిభాజ్యాలు.
మనిషిగా పుట్టినంత మాత్రాన మానవత్వం సిద్ధించదు. సాటి మనుషుల మీద, ప్రాణుల మీద జాలి, దయ, కరుణ, సహనం, ప్రేమ చూపుతూ సాయపడటమే అసలైన మానవత్వం. తనను తాను తెలుసుకుంటూ, విశ్వంతో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా కంటికి కనిపించని సర్వాంతర్యామితో అనుసంధానం కావాలి. అంతరంగ శాంతిని పొందుతూ, సదా చైతన్య స్థితిలో ఉండటమే అసలైన ఆధ్యాత్మికత. దీనులను, రోగులను అక్కున చేర్చుకుని, వారి చివరి రోజుల్లో ప్రేమ, కరుణలను పంచి ఇచ్చి అసలైన ఆధ్యాత్మికతకు మానవతా రూపంగా నిలిచారు మదర్ థెరిసా.
మతపరమైన కర్మలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం వల్లనే ఆధ్యాత్మిక వికాసం కలగదు. అది స్వీయ అన్వేషణ, స్వయం నియంత్రణలకు సంబంధించిన అంతర్గత ప్రయాణం. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆత్మాన్వేషణ ద్వారా అంతంలేని నిరంతర చైతన్య స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మికత పరమావధి. కబీర్ దాస్ బోధనల్లో మానవత్వం, ఆధ్యాత్మికత విడదీయలేని అంశాలు. మతం, కులం, అంతస్తు వంటి భేదాలను పక్కనపెట్టి, మానవత్వానికీ అంతర్గత ఆధ్యాత్మికతకు ప్రాచుర్యం కల్పించిన సాధువు ఆయన. సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ని తలచుకునే వారికి దుఃఖం ఎందుకు వస్తుంది..? అని ప్రశ్నించి తన ఆధ్యాత్మిక మానవతా దృక్పథాన్ని ప్రకటించాడు.
మానవత్వం... ఆధ్యాత్మిక మార్గానికి ముఖద్వారం వంటిది. ఆ మార్గంలో పయనించాలంటే స్వార్థం, అహం, ఆశ, కోరిక, క్రోధం వంటి మాలిన్యాలను తొలగించుకోవాలి. ప్రతిఫలాపేక్ష రహితంగా అందరికీ చేయూతనివ్వాలి. ఆధ్యాత్మికత లక్ష్యం కేవలం మోక్షానికి, ప్రశాంత జీవనానికి మాత్రమే పరిమితం కాదు. నిస్సహాయుల బాధలను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవత్వం లేని ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత లేని మానవత్వం అసంపూర్ణం. ఆ సంగతిని అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక వాది సమాజసేవకు ముందుంటాడు. తద్వారా అసలైన ఆనందాన్నీ ఆత్మతృప్తినీ అనుభవిస్తాడు. సమూహ సంక్షేమాన్ని కోరుకుంటాడు. నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, విద్య, వైద్య సేవలు అందిస్తాడు. విపత్తు సమయాల్లో అసహాయులను ఆదుకుంటాడు. అహింసను బోధిస్తూ శాంతి స్థాపనకు కృషి చేస్తాడు.
ఆధ్యాత్మికత సర్వం సమానమేనన్న భావనను ప్రోత్సహిస్తుంది. ప్రతి జీవీ దైవ స్వరూపమేననే దృక్పథం కలిగిస్తుంది. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. సహనాన్ని అలవరుస్తుంది. అందరినీ సమానంగా ప్రేమించడం నేర్పుతుంది. మానవత్వం ఆధ్యాత్మికతకు ఒక ఆచరణాత్మక రూపం. మానవతా విలువలను నిలబెట్టుకోవడం ద్వారానే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం.
ఎం వెంకటేశ్వర రావు
నవ రూపాల చల్లని తల్లి
భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి. వాటిలో విశిష్టమైనవి, అందరూ భక్తితో ఆరాధించేవి దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఆసేతుహిమాచలం అమ్మవారి ఆరాధనలో పూనీతమవుతుంది. శరదృతువులో వచ్చేవి కనుక దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగానూ పేరొందాయి.
భూలోకంలో అసురశక్తులు విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లోక కల్యాణం కోసం దుర్గాదేవి పరాశక్తిగా అవతరించి తన లక్ష్యాలను సాధిస్తుందన్నది ఆర్షవాక్కు. దుర్గ నామంలో ‘ద’ కారం దైత్య నాశకం. ‘ఉ’ కారం విఘ్ననాశకం. ‘ర’ కారం రోగనాశకం. ‘గ’ కారం పాపనాశకం. ‘ఆ’ భయ శత్రునాశకమైన శక్తి వాచకం. అందుకే దేవికి పర్యాయపదమైన ‘దుర్గా’ శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడని బ్రహ్మ మార్కండేయ మహామునికి వివరించాడు. దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా ‘మహానారాయణోపనిషత్తు’ పేర్కొంది. విభిన్న ప్రయోజనాల కోసం పరాశక్తి అనేక పేర్లు, రూపాలు ధరిస్తుంది. రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకే ఆ దేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు.
దుర్గాదేవి తొలి నామం శైలపుత్రి. కమలం, శూలం ధరించి కోరిన కోరికలు తీర్చే తల్లి. అందుకే తొలిరోజున ఈ దేవిని కొలుస్తారు. రెండో రూపం ‘బ్రహ్మచారిణి’. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం కలిగి శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లే ఈమెను పూజిస్తే ఏకాగ్రత కలుగుతుంది. అమ్మవారి మూడో నామం చంద్రఘంట. ధనుస్సు, గద, శూలం, పాశం మొదలైన ఆయుధాలు ధరించి పది చేతులతో కనిపించే ఈ దేవిని ఆరాధిస్తే శత్రువులను జయించే శక్తినిస్తుందని విశ్వాసం. జగన్మాత నాలుగో పేరు కూష్మాండ. చక్రం, గద, బాణం ఒక వైపు; కమండలం, అమృతకలశం, జపమాల, పద్మం వంటివి మరోవైపు ధరించి ఉంటుంది. ఎనిమిది భుజాలతో దర్శనమిచ్చే ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందంటారు.
దేవి అయిదోరూపమైన స్కంధ మాతను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆరో రూపం కాత్యాయని వాహనం సింహం. ఆ తల్లిని ఆరాధించడం ద్వారా రోగాలూ కష్టాలనుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతారు. అమ్మవారి ఏడో నామం కాళరాత్రి. విరబోసుకున్న తల, నల్లని మేనిరూపు కలిగిన ఈ దేవి దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి. దేవి ఎనిమిదో రూపం మహాగౌరి. వృషభ వాహిని. శ్వేత వస్త్రధారిణి. చతుర్భుజాలు కలిగి అభయ, వరద ముద్రలతో దర్శనమిస్తుంది. అమ్మవారి తొమ్మిదో నామం సిద్ధిధాత్రి. కమలాసని అయిన ఆ దేవిని పూజిస్తే సర్వసిద్ధులను ప్రసాదిస్తుందంటారు.
నవరాత్రులన్నీ ముఖ్యమైనవే అయినా మహాష్టమి, మహార్నవమి, విజయదశమిని అత్యంత పవిత్ర దినాలుగా భావిస్తారు భక్తులు. సకల ప్రాణులను అన్ని వేళలా ఆదుకునే దుర్గాదేవిని శరన్నవరాత్రులలో ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
వి.హరిప్రియ
భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి. వాటిలో విశిష్టమైనవి, అందరూ భక్తితో ఆరాధించేవి దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఆసేతుహిమాచలం అమ్మవారి ఆరాధనలో పూనీతమవుతుంది. శరదృతువులో వచ్చేవి కనుక దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగానూ పేరొందాయి.
భూలోకంలో అసురశక్తులు విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లోక కల్యాణం కోసం దుర్గాదేవి పరాశక్తిగా అవతరించి తన లక్ష్యాలను సాధిస్తుందన్నది ఆర్షవాక్కు. దుర్గ నామంలో ‘ద’ కారం దైత్య నాశకం. ‘ఉ’ కారం విఘ్ననాశకం. ‘ర’ కారం రోగనాశకం. ‘గ’ కారం పాపనాశకం. ‘ఆ’ భయ శత్రునాశకమైన శక్తి వాచకం. అందుకే దేవికి పర్యాయపదమైన ‘దుర్గా’ శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడని బ్రహ్మ మార్కండేయ మహామునికి వివరించాడు. దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా ‘మహానారాయణోపనిషత్తు’ పేర్కొంది. విభిన్న ప్రయోజనాల కోసం పరాశక్తి అనేక పేర్లు, రూపాలు ధరిస్తుంది. రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకే ఆ దేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు.
దుర్గాదేవి తొలి నామం శైలపుత్రి. కమలం, శూలం ధరించి కోరిన కోరికలు తీర్చే తల్లి. అందుకే తొలిరోజున ఈ దేవిని కొలుస్తారు. రెండో రూపం ‘బ్రహ్మచారిణి’. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం కలిగి శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లే ఈమెను పూజిస్తే ఏకాగ్రత కలుగుతుంది. అమ్మవారి మూడో నామం చంద్రఘంట. ధనుస్సు, గద, శూలం, పాశం మొదలైన ఆయుధాలు ధరించి పది చేతులతో కనిపించే ఈ దేవిని ఆరాధిస్తే శత్రువులను జయించే శక్తినిస్తుందని విశ్వాసం. జగన్మాత నాలుగో పేరు కూష్మాండ. చక్రం, గద, బాణం ఒక వైపు; కమండలం, అమృతకలశం, జపమాల, పద్మం వంటివి మరోవైపు ధరించి ఉంటుంది. ఎనిమిది భుజాలతో దర్శనమిచ్చే ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందంటారు.
దేవి అయిదోరూపమైన స్కంధ మాతను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆరో రూపం కాత్యాయని వాహనం సింహం. ఆ తల్లిని ఆరాధించడం ద్వారా రోగాలూ కష్టాలనుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతారు. అమ్మవారి ఏడో నామం కాళరాత్రి. విరబోసుకున్న తల, నల్లని మేనిరూపు కలిగిన ఈ దేవి దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి. దేవి ఎనిమిదో రూపం మహాగౌరి. వృషభ వాహిని. శ్వేత వస్త్రధారిణి. చతుర్భుజాలు కలిగి అభయ, వరద ముద్రలతో దర్శనమిస్తుంది. అమ్మవారి తొమ్మిదో నామం సిద్ధిధాత్రి. కమలాసని అయిన ఆ దేవిని పూజిస్తే సర్వసిద్ధులను ప్రసాదిస్తుందంటారు.
నవరాత్రులన్నీ ముఖ్యమైనవే అయినా మహాష్టమి, మహార్నవమి, విజయదశమిని అత్యంత పవిత్ర దినాలుగా భావిస్తారు భక్తులు. సకల ప్రాణులను అన్ని వేళలా ఆదుకునే దుర్గాదేవిని శరన్నవరాత్రులలో ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
వి.హరిప్రియ
బ్రహ్మోత్సవాలు ఎందుకంటే?
తిరుమల శ్రీవారి వేడుకలను తొలిసారి బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించాడు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. అది పురాణవచనం. ఏటా వర్ష రుతువులో వస్తాయి కనుక వార్షిక బ్రహ్మోత్సవాలన్నది పెద్దల నిర్వచనం. ‘నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అన్నాడందుకే అన్నమయ్య. ఏడాదికి నాలుగొందల యాభైకి పైగా జరిగే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు. వార్షిక బ్రహ్మోత్సవాలు మరో ఎత్తు! తిరుమలకు ‘సువ్రతులై’ రమ్మన్నాడు అన్నమయ్య- ఎందుకంటే అది విహార యాత్రాస్థలం కాదు. పుణ్యక్షేత్రం కాబట్టి!
పెద్ద పండుగ వస్తోందనగానే ఇల్లంతా బూజులు దులిపి, గడపలకు పసుపులు పులిమి, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టి సంక్రాంతి లక్ష్మిని మంగళకరంగా స్వాగతిస్తున్నామా, లేదా? అలాగే, శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందే మనలోని కల్మషాలు, కాలుష్యాల దుమ్ము దులిపి, ఎదలను భక్తితో తడిపి, గుండెల్లో దైవాన్ని నిలిపి, శ్రీ వేంకటేశ్వర దీక్షను స్వీకరించాలి. పారలౌకిక అనుభవం కోసం ఆర్తితో ఆర్ద్రతతో ఆత్రుతతో అర్రులుచాస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని మెప్పించి దర్శించి తరించాలి. అలాంటి నిశ్చయ బుద్ధితో ప్రయాణం కావడమే- ‘సువ్రతముల తోడనెవత్తురు కదిలి’ వాక్యానికి వ్యాఖ్యానం!
అలా దీక్షితులై కొండకు చేరుకునే వారి మనసు కొండంత పారవశ్యానికి లోనవుతుంది. అణువణువూ బ్రహ్మమయంగా తోస్తుంది. ప్రతి శిలా సాలగ్రామంలా కనపడుతుంది. అక్కడున్న ప్రతి అంశాన్నీ ఇన్నేళ్లుగా- అక్కడ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, మనం అనుకున్నట్లుగా మాత్రమే చూశామన్న సత్యం బోధపడుతుంది. పశ్చాత్తాపంతో గుండె మూల్గుతుంది. అవి సాదాసీదా పర్వతాలు కావని, సాక్షాత్తు వేద రాశులనీ, అందుకే అన్నమయ్య ‘వేదములే శిలలై వెలసినదీ కొండ’ అంటూ సవరించాడనీ అర్థమవుతుంది. ‘వేదాల పేరుతో శబ్ద బ్రహ్మ రూపంగా లోకాన్ని అలరించేదంతా పరమాత్మ చైతన్యమే’నంటూ తంత్ర వార్తికంలో కుమారిల భట్టు చేసిన సూచన గోవింద నామస్మరణలో ప్రతిధ్వనిస్తుంది. మన చైతన్యాలను మారుస్తుంది. రాజగోపుర ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఆ పెద్ద గడప వద్ద పారే నీరు మన కాళ్లకే కాదు, జన్మజన్మల దోషాలను కడిగేసిందని, మనల్ని ధన్యులను చేసిందని తెలుస్తుంది.
లోపలికి ప్రవేశించగానే ఇంకేముంది! ఏ అనుభూతి వైభవం అన్నమయ్య అంతరంగాన్ని ఆక్రమించి- పదమై ప్రసరించిందో.. గానమై ప్రవహించిందో.. గగనమై ప్రతిధ్వనించిందో, అదే అనుభూతి- సాలగ్రామ శిలామూర్తి రూపంలో ప్రత్యక్షమై సాక్షాత్కార దివ్యానుభవం అవుతుంది. అన్ని నేనులూ తానైన నేనులో నేనూ లీనమయ్యాననే పులకింత క్షణికమై.. శాశ్వతమై.. మనలోని మంత్ర కవాటాలను తెరుస్తుంది. దేహం మరణిస్తే- నిర్యాణమని, ‘నేను’ నశిస్తే నిర్వాణమని తెలిసొచ్చి అంతులేని ఆనందం ఉబికి వస్తుంది. ‘నిర్వాణ సోపానమధిరోహణము చేయు’ దారితోస్తుంది. బ్రహ్మానందాన్ని రుచి చూపించేందుకే బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలకు భూలోకంలో శ్రీకారం చుట్టాడనిపిస్తుంది. ఈ యాత్ర పూర్తవుతుంది. ఆ యాత్ర మొదలవుతుంది.
ఎర్రాప్రగడ రామకృష్ణ
తిరుమల శ్రీవారి వేడుకలను తొలిసారి బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించాడు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. అది పురాణవచనం. ఏటా వర్ష రుతువులో వస్తాయి కనుక వార్షిక బ్రహ్మోత్సవాలన్నది పెద్దల నిర్వచనం. ‘నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అన్నాడందుకే అన్నమయ్య. ఏడాదికి నాలుగొందల యాభైకి పైగా జరిగే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు. వార్షిక బ్రహ్మోత్సవాలు మరో ఎత్తు! తిరుమలకు ‘సువ్రతులై’ రమ్మన్నాడు అన్నమయ్య- ఎందుకంటే అది విహార యాత్రాస్థలం కాదు. పుణ్యక్షేత్రం కాబట్టి!
పెద్ద పండుగ వస్తోందనగానే ఇల్లంతా బూజులు దులిపి, గడపలకు పసుపులు పులిమి, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టి సంక్రాంతి లక్ష్మిని మంగళకరంగా స్వాగతిస్తున్నామా, లేదా? అలాగే, శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందే మనలోని కల్మషాలు, కాలుష్యాల దుమ్ము దులిపి, ఎదలను భక్తితో తడిపి, గుండెల్లో దైవాన్ని నిలిపి, శ్రీ వేంకటేశ్వర దీక్షను స్వీకరించాలి. పారలౌకిక అనుభవం కోసం ఆర్తితో ఆర్ద్రతతో ఆత్రుతతో అర్రులుచాస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని మెప్పించి దర్శించి తరించాలి. అలాంటి నిశ్చయ బుద్ధితో ప్రయాణం కావడమే- ‘సువ్రతముల తోడనెవత్తురు కదిలి’ వాక్యానికి వ్యాఖ్యానం!
అలా దీక్షితులై కొండకు చేరుకునే వారి మనసు కొండంత పారవశ్యానికి లోనవుతుంది. అణువణువూ బ్రహ్మమయంగా తోస్తుంది. ప్రతి శిలా సాలగ్రామంలా కనపడుతుంది. అక్కడున్న ప్రతి అంశాన్నీ ఇన్నేళ్లుగా- అక్కడ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, మనం అనుకున్నట్లుగా మాత్రమే చూశామన్న సత్యం బోధపడుతుంది. పశ్చాత్తాపంతో గుండె మూల్గుతుంది. అవి సాదాసీదా పర్వతాలు కావని, సాక్షాత్తు వేద రాశులనీ, అందుకే అన్నమయ్య ‘వేదములే శిలలై వెలసినదీ కొండ’ అంటూ సవరించాడనీ అర్థమవుతుంది. ‘వేదాల పేరుతో శబ్ద బ్రహ్మ రూపంగా లోకాన్ని అలరించేదంతా పరమాత్మ చైతన్యమే’నంటూ తంత్ర వార్తికంలో కుమారిల భట్టు చేసిన సూచన గోవింద నామస్మరణలో ప్రతిధ్వనిస్తుంది. మన చైతన్యాలను మారుస్తుంది. రాజగోపుర ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఆ పెద్ద గడప వద్ద పారే నీరు మన కాళ్లకే కాదు, జన్మజన్మల దోషాలను కడిగేసిందని, మనల్ని ధన్యులను చేసిందని తెలుస్తుంది.
లోపలికి ప్రవేశించగానే ఇంకేముంది! ఏ అనుభూతి వైభవం అన్నమయ్య అంతరంగాన్ని ఆక్రమించి- పదమై ప్రసరించిందో.. గానమై ప్రవహించిందో.. గగనమై ప్రతిధ్వనించిందో, అదే అనుభూతి- సాలగ్రామ శిలామూర్తి రూపంలో ప్రత్యక్షమై సాక్షాత్కార దివ్యానుభవం అవుతుంది. అన్ని నేనులూ తానైన నేనులో నేనూ లీనమయ్యాననే పులకింత క్షణికమై.. శాశ్వతమై.. మనలోని మంత్ర కవాటాలను తెరుస్తుంది. దేహం మరణిస్తే- నిర్యాణమని, ‘నేను’ నశిస్తే నిర్వాణమని తెలిసొచ్చి అంతులేని ఆనందం ఉబికి వస్తుంది. ‘నిర్వాణ సోపానమధిరోహణము చేయు’ దారితోస్తుంది. బ్రహ్మానందాన్ని రుచి చూపించేందుకే బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలకు భూలోకంలో శ్రీకారం చుట్టాడనిపిస్తుంది. ఈ యాత్ర పూర్తవుతుంది. ఆ యాత్ర మొదలవుతుంది.
ఎర్రాప్రగడ రామకృష్ణ
భక్తి - జ్ఞానం
భక్తి లేని జ్ఞానం ఎండిన విత్తనం లాంటిది, సంపద శూన్యమైన బొక్కసం లాంటిది. భక్తి మనసును శాంతింపజేస్తుంది, ఆత్మస్వరూపాన్ని వెలిగిస్తుంది. ఈ సత్యాన్ని హంసోపనిషత్తు తెలియజేస్తుంది.
అధర్వ వేదాంతర్గతమైన హంసోపనిషత్తులో లోతైన తత్త్వసారం ఉంది. ఒక సందర్భంలో గౌతముడు, సనత్కుమార మహర్షిని ఆశ్రయించి- ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు, దేహం, మనసు- వీటి మధ్య సంబంధం ఏంటి? బ్రహ్మజ్ఞానం సులభంగా ఎలా లభిస్తుంది? అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా సనత్కుమారుడు ఒక పురాణస్మృతిని వివరిస్తాడు. ఒకసారి పరమశివుణ్ని పార్వతీదేవి బ్రహ్మవిద్య గురించి ప్రశ్నించగా, ఆయన ‘హంసాసోహం’ అంటూ బ్రహ్మైక్య తత్త్వాన్ని ఉపదేశించాడు. అదే ఆ ఉపనిషత్తు సారం. ఇక్కడ ‘హంస’ అన్నది కేవలం పక్షి కాదు. ‘నేనే ఆ పరమాత్మ’ అనే అనుభూతి అది. ఉచ్ఛ్వాసలోనూ, నిశ్వాసలోనూ ఆ పరమాత్మే ఉన్నాడన్న భావన. రోజులో సుమారు 21,600 శ్వాసలతో ‘అజపా-గాయత్రి’ని మనం వల్లిస్తూనే ఉంటాం. ఈ శ్వాసనే ఈశ్వరుడికి సమర్పించడం యోగమార్గం. అదే భక్తి మార్గం. ‘నువ్వుల్లో నూనె దాగి ఉన్నట్లే, కట్టెలో అగ్ని ఉన్నట్లే, హృదయంలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు’ అని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి బయట వెతికితే ఆయన దొరకడు. ధ్యానం, ఆత్మజ్ఞానాల ద్వారా మాత్రమే దర్శించగలం.
ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే- మనిషికి జ్ఞానం మాత్రమే కాదు, భక్తి కూడా తప్పనిసరి. గురుభక్తి, దైవభక్తి లేకుండా ఆత్మసాక్షాత్కారం జరగదు. మనం ఎంత విద్య, సంపద, శక్తి సంపాదించినా, మన లోపల ఉన్న పరమాత్మను గుర్తించలేకపోతే జీవితం అసంపూర్ణమే. కాబట్టి ప్రతి శ్వాసనూ హంసాసోహం అనుభూతిగా మార్చుకోవాలి. ప్రతి పనినీ సభక్తికంగా చేయాలి. ఈ తత్త్వం ఈనాటి సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం ఎన్ని విభిన్న గుర్తింపులతో జీవిస్తున్నప్పటికీ, ‘నేనే పరమాత్మ’ అని తెలుసుకుంటే ద్వేషం, అసూయ, అహంకారం తొలగిపోతాయి. అందరూ ఒకే పరమహంస స్వరూపమని గుర్తించినప్పుడు భక్తి-జ్ఞానం సమన్వయం అవుతాయి. లోకంలో శాంతివనాలు వికసిస్తాయి.
పరమాత్మను భక్తి ద్వారానే పొందగలమని రుగ్వేదం, విశ్వమంతటా వ్యాపించిన ఆ పరమపదాన్ని భక్తితోనే చేరుకోగలమని యజుర్వేదం చెబుతున్నాయి. భక్తి ద్వారా జగత్తంతా ఒకే గృహమనిపిస్తుందని శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు. భక్తి కేవలం ఆలయపూజకే పరిమితం కాదు. సత్యనిష్ఠ, సేవ, సత్సంగం, నిష్కామకర్మలతో పాటు ధర్మనిష్ఠ రూపంలోనూ వ్యక్తమవుతుంది. అలాంటి భక్తి హృదయాన్ని శుభ్రపరుస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఏతావాతా హంసోపనిషత్తు మనకు నేర్పేది ఏంటంటే- భక్తి లేకుండా జ్ఞానం వృథా; జ్ఞానం లేకుండా భక్తి అరుదు. రెండూ కలిసినప్పుడే జీవితం పరిపూర్ణమై, అంతర్యామి సాక్షాత్కారం సాధ్యమవుతుంది.
శ్రీధర్ కక్కెర్ల
భక్తి లేని జ్ఞానం ఎండిన విత్తనం లాంటిది, సంపద శూన్యమైన బొక్కసం లాంటిది. భక్తి మనసును శాంతింపజేస్తుంది, ఆత్మస్వరూపాన్ని వెలిగిస్తుంది. ఈ సత్యాన్ని హంసోపనిషత్తు తెలియజేస్తుంది.
అధర్వ వేదాంతర్గతమైన హంసోపనిషత్తులో లోతైన తత్త్వసారం ఉంది. ఒక సందర్భంలో గౌతముడు, సనత్కుమార మహర్షిని ఆశ్రయించి- ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు, దేహం, మనసు- వీటి మధ్య సంబంధం ఏంటి? బ్రహ్మజ్ఞానం సులభంగా ఎలా లభిస్తుంది? అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా సనత్కుమారుడు ఒక పురాణస్మృతిని వివరిస్తాడు. ఒకసారి పరమశివుణ్ని పార్వతీదేవి బ్రహ్మవిద్య గురించి ప్రశ్నించగా, ఆయన ‘హంసాసోహం’ అంటూ బ్రహ్మైక్య తత్త్వాన్ని ఉపదేశించాడు. అదే ఆ ఉపనిషత్తు సారం. ఇక్కడ ‘హంస’ అన్నది కేవలం పక్షి కాదు. ‘నేనే ఆ పరమాత్మ’ అనే అనుభూతి అది. ఉచ్ఛ్వాసలోనూ, నిశ్వాసలోనూ ఆ పరమాత్మే ఉన్నాడన్న భావన. రోజులో సుమారు 21,600 శ్వాసలతో ‘అజపా-గాయత్రి’ని మనం వల్లిస్తూనే ఉంటాం. ఈ శ్వాసనే ఈశ్వరుడికి సమర్పించడం యోగమార్గం. అదే భక్తి మార్గం. ‘నువ్వుల్లో నూనె దాగి ఉన్నట్లే, కట్టెలో అగ్ని ఉన్నట్లే, హృదయంలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు’ అని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి బయట వెతికితే ఆయన దొరకడు. ధ్యానం, ఆత్మజ్ఞానాల ద్వారా మాత్రమే దర్శించగలం.
ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే- మనిషికి జ్ఞానం మాత్రమే కాదు, భక్తి కూడా తప్పనిసరి. గురుభక్తి, దైవభక్తి లేకుండా ఆత్మసాక్షాత్కారం జరగదు. మనం ఎంత విద్య, సంపద, శక్తి సంపాదించినా, మన లోపల ఉన్న పరమాత్మను గుర్తించలేకపోతే జీవితం అసంపూర్ణమే. కాబట్టి ప్రతి శ్వాసనూ హంసాసోహం అనుభూతిగా మార్చుకోవాలి. ప్రతి పనినీ సభక్తికంగా చేయాలి. ఈ తత్త్వం ఈనాటి సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం ఎన్ని విభిన్న గుర్తింపులతో జీవిస్తున్నప్పటికీ, ‘నేనే పరమాత్మ’ అని తెలుసుకుంటే ద్వేషం, అసూయ, అహంకారం తొలగిపోతాయి. అందరూ ఒకే పరమహంస స్వరూపమని గుర్తించినప్పుడు భక్తి-జ్ఞానం సమన్వయం అవుతాయి. లోకంలో శాంతివనాలు వికసిస్తాయి.
పరమాత్మను భక్తి ద్వారానే పొందగలమని రుగ్వేదం, విశ్వమంతటా వ్యాపించిన ఆ పరమపదాన్ని భక్తితోనే చేరుకోగలమని యజుర్వేదం చెబుతున్నాయి. భక్తి ద్వారా జగత్తంతా ఒకే గృహమనిపిస్తుందని శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు. భక్తి కేవలం ఆలయపూజకే పరిమితం కాదు. సత్యనిష్ఠ, సేవ, సత్సంగం, నిష్కామకర్మలతో పాటు ధర్మనిష్ఠ రూపంలోనూ వ్యక్తమవుతుంది. అలాంటి భక్తి హృదయాన్ని శుభ్రపరుస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఏతావాతా హంసోపనిషత్తు మనకు నేర్పేది ఏంటంటే- భక్తి లేకుండా జ్ఞానం వృథా; జ్ఞానం లేకుండా భక్తి అరుదు. రెండూ కలిసినప్పుడే జీవితం పరిపూర్ణమై, అంతర్యామి సాక్షాత్కారం సాధ్యమవుతుంది.
శ్రీధర్ కక్కెర్ల
ఎలా పెంచాలి?
పసి పిల్లలు దేవుడితో సమానం అంటారు. బాల్యావస్థ మైనపు ముద్దలాంటిది. పెద్దలు దాన్ని ఎలా మలిస్తే అలా రూపు దిద్దుకుంటుంది. సహజంగా పిల్లలు సృజనశీలురు. వారిలో దైవీగుణాలెన్నో ఉంటాయి. పెంపకం ప్రభావంతో పెద్దయ్యేకొద్దీ అవి మాయమూ కావచ్చు, లేదా మరింతగా రాణించనూ వచ్చు.
పిల్లల పెంపకానికి సంబంధించి మహాభారతంలోని ఓ విషయం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. తండ్రికి దూరమైన పాండవులు తల్లి కుంతీదేవి సంరక్షణలో మంచివారిగా పెరిగారు. తల్లిదండ్రులు, బంధుగణం అండగా ఉన్న కౌరవులు అహంకారం, ఈర్ష్య, అసూయలతో పెద్దవాళ్లు అయ్యారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగి అంతా మరణించిన తరవాత గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. పుత్రశోకంతో ఉన్న గాంధారి కృష్ణుడితో ‘నాకు వందమంది కొడుకులు పుట్టారు, యుద్ధంలో అందరూ మరణించారు. కనీసం ఒక్కడినైనా బతికించలేక పోయాడు భగవంతుడు’ అంది బాధగా. శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ ‘అత్తా! నీ భర్తకు చూపులేదు. అందుకే ఆయన తన సంతానాన్ని చూసుకోలేకపోయాడు. నీకు చూపు ఉంది కానీ భర్తమీద ప్రేమతో కళ్లకు గంతలు కట్టుకున్నావు. కన్నతల్లే చూడని వారిని భగవంతుడు చూడలేదని ఎలా నెపం వేస్తావు?’ అన్నాడు. కళ్లు ఉండీ చూడలేని తల్లి ఆలనా కరువైంది. అంధుడైన తండ్రి అతి మమకారంతో, మోహంతో పిల్లలను అదుపు చేయలేదు. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పర్యవసానం అనర్థదాయకమేననడానికి ఇంతకన్నా రుజువేం కావాలి?
బాల్యంలో తాము అనుభవించిన కష్టాలూ, సమస్యలు తమ పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకని పిల్లల కోరికలు తీర్చడానికి తమ తలకుమించి ప్రయత్నిస్తుంటారు. దాంతో కుటుంబ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేని పిల్లలు నేల విడిచి సాము చేస్తారు, గాలిలో మేడలు కడతారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. న్యాయం, ధర్మం అంటే తెలియక అక్రమ దారులు పడతారు. దాంతో సమాజంలో అకృత్యాలు, అరాచకాలు విజృంభిస్తాయి. గాంధారి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. పిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులే. వారికి నీతి నియమాలు, ప్రేమానుబంధాలు, మానవీయ విలువలను ఉగ్గుపాలతో నేర్పాలి. పెద్దవుతున్న కొద్దీ ఆ పాఠాల పరిధిని పెంచుతూ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సామాజిక సంబంధాల గురించి చెప్పాలి. ఉచితానుచితాలు బోధపరిచి సరైన దారిలో పెట్టాలి. పిల్లలు హోదాలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ తమను మించిన మంచివారు కావాలని ఆశించాలి. ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని విలుకాడు తన ధనుస్సును శక్తికొలది వంచుతాడు. అందులోంచి దూసుకుపోయే బాణాల్ని ప్రేమించినట్లే తన చేతిలో స్థిరంగా ఉన్న ధనుస్సునీ ఆ విలుకాడు ప్రేమిస్తాడు. ఖలీల్ గిబ్రాన్ అన్నట్లు తల్లిదండ్రులు ధనుస్సులైతే పిల్లలు దానినుంచి వెలువడే బాణాలు. ఆ విలుకాడే పరమాత్మ. ఆయన గీతోపదేశానికి తల్లిదండ్రులు ఎంతగా తలొగ్గితే పిల్లల భవిష్యత్తుకు అంత మంచిది.
రావులపాటి వెంకట రామారావు
పసి పిల్లలు దేవుడితో సమానం అంటారు. బాల్యావస్థ మైనపు ముద్దలాంటిది. పెద్దలు దాన్ని ఎలా మలిస్తే అలా రూపు దిద్దుకుంటుంది. సహజంగా పిల్లలు సృజనశీలురు. వారిలో దైవీగుణాలెన్నో ఉంటాయి. పెంపకం ప్రభావంతో పెద్దయ్యేకొద్దీ అవి మాయమూ కావచ్చు, లేదా మరింతగా రాణించనూ వచ్చు.
పిల్లల పెంపకానికి సంబంధించి మహాభారతంలోని ఓ విషయం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. తండ్రికి దూరమైన పాండవులు తల్లి కుంతీదేవి సంరక్షణలో మంచివారిగా పెరిగారు. తల్లిదండ్రులు, బంధుగణం అండగా ఉన్న కౌరవులు అహంకారం, ఈర్ష్య, అసూయలతో పెద్దవాళ్లు అయ్యారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగి అంతా మరణించిన తరవాత గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. పుత్రశోకంతో ఉన్న గాంధారి కృష్ణుడితో ‘నాకు వందమంది కొడుకులు పుట్టారు, యుద్ధంలో అందరూ మరణించారు. కనీసం ఒక్కడినైనా బతికించలేక పోయాడు భగవంతుడు’ అంది బాధగా. శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ ‘అత్తా! నీ భర్తకు చూపులేదు. అందుకే ఆయన తన సంతానాన్ని చూసుకోలేకపోయాడు. నీకు చూపు ఉంది కానీ భర్తమీద ప్రేమతో కళ్లకు గంతలు కట్టుకున్నావు. కన్నతల్లే చూడని వారిని భగవంతుడు చూడలేదని ఎలా నెపం వేస్తావు?’ అన్నాడు. కళ్లు ఉండీ చూడలేని తల్లి ఆలనా కరువైంది. అంధుడైన తండ్రి అతి మమకారంతో, మోహంతో పిల్లలను అదుపు చేయలేదు. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పర్యవసానం అనర్థదాయకమేననడానికి ఇంతకన్నా రుజువేం కావాలి?
బాల్యంలో తాము అనుభవించిన కష్టాలూ, సమస్యలు తమ పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకని పిల్లల కోరికలు తీర్చడానికి తమ తలకుమించి ప్రయత్నిస్తుంటారు. దాంతో కుటుంబ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేని పిల్లలు నేల విడిచి సాము చేస్తారు, గాలిలో మేడలు కడతారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. న్యాయం, ధర్మం అంటే తెలియక అక్రమ దారులు పడతారు. దాంతో సమాజంలో అకృత్యాలు, అరాచకాలు విజృంభిస్తాయి. గాంధారి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. పిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులే. వారికి నీతి నియమాలు, ప్రేమానుబంధాలు, మానవీయ విలువలను ఉగ్గుపాలతో నేర్పాలి. పెద్దవుతున్న కొద్దీ ఆ పాఠాల పరిధిని పెంచుతూ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సామాజిక సంబంధాల గురించి చెప్పాలి. ఉచితానుచితాలు బోధపరిచి సరైన దారిలో పెట్టాలి. పిల్లలు హోదాలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ తమను మించిన మంచివారు కావాలని ఆశించాలి. ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని విలుకాడు తన ధనుస్సును శక్తికొలది వంచుతాడు. అందులోంచి దూసుకుపోయే బాణాల్ని ప్రేమించినట్లే తన చేతిలో స్థిరంగా ఉన్న ధనుస్సునీ ఆ విలుకాడు ప్రేమిస్తాడు. ఖలీల్ గిబ్రాన్ అన్నట్లు తల్లిదండ్రులు ధనుస్సులైతే పిల్లలు దానినుంచి వెలువడే బాణాలు. ఆ విలుకాడే పరమాత్మ. ఆయన గీతోపదేశానికి తల్లిదండ్రులు ఎంతగా తలొగ్గితే పిల్లల భవిష్యత్తుకు అంత మంచిది.
రావులపాటి వెంకట రామారావు
నాలుగు యజ్ఞాలు
ప్రకృతి ప్రతి వ్యక్తికీ అపార శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. ఆ అంతరంగ శక్తిని గుర్తించి, పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వ్యక్తిగతంగా ఎదగడమే కాదు, సమాజానికీ ప్రయోజనకారులు కావచ్చు. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు.
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనేక మార్గాలను సూచించాయి శాస్త్రాలు. అలాంటి వాటిలో అందరూ సులభంగా అనుసరించగలది- నాలుగు జ్ఞాన యజ్ఞాల మార్గం. జ్ఞానాన్ని అర్థించే విద్యార్థిగా, దాన్ని పంచే గురువుగా, విజ్ఞాన సృష్టికర్త పాత్రలో, జ్ఞానార్జనకు ఇతరులను ప్రోత్సహించే బాధ్యతలో... నాలుగు యజ్ఞాలు చేయవచ్చు మనిషి.
అందరి జీవితాలూ విద్యార్థులుగానే మొదలవుతాయి. డిగ్రీ పట్టా చేతికొస్తే చదువు అయిపోయినట్లు చాలామంది భావిస్తారు. కానీ నిజానికి విద్యార్థి దశకు ఆది తప్ప అంతం లేదు. జీవితాంతం నేర్చుకుంటూ ఉన్నవారే లౌకిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మికంగానూ కూడా రాణించగలరు. జ్ఞానం ఎంత సంపాదిస్తే అంతగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిత్య విద్యార్థికి లోకం నిత్యనూతనంగా కన్పిస్తుంది. ఆసక్తి, ఉత్సాహం వారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతాయి. రెండో జ్ఞాన యజ్ఞం- గురువుగా మారడం. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరొకరికి పంచినప్పుడు లభించే తృప్తి వేరు. దానికి ఉపాధ్యాయ వృత్తే చేపట్టనక్కరలేదు. భాష, కళ, విద్య, నైపుణ్యం... ఏదైనా సరే మనకి వచ్చింది అవకాశం ఉన్న ప్రతిచోటా ఇతరులకు నేర్పవచ్చు. బోధన- నేర్పేవారినీ, నేర్చుకునేవారినీ ఇద్దరినీ శక్తిమంతుల్ని చేస్తుంది. ‘స్వాధ్యాయ: ప్రవచనే చ... నేర్చుకో - బోధించు’ అని చెబుతాయి ఉపనిషత్తులు. బోధించడమంటే సమాజానికి సేవ చేయడమే. మూడో యజ్ఞం... మనమే జ్ఞానాన్ని సృష్టించే స్థాయికి ఎదగడం. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎందరో చెప్పిన పాఠాలు వింటాం, మరెన్నో నైపుణ్యాలు నేర్చుకుంటాం. వాటన్నిటి సారాన్నీ క్రోడీకరించి కొత్త పాఠాలను మనమూ తయారు చేయవచ్చు. అది ఏ రూపంలో చేయగలం అన్నది మన సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. రచన, దృశ్య, శ్రవణ... ఏ మాధ్యమాన్ని అయినా అనుసరించవచ్చు. వ్యక్తిగా ఇది మనల్ని మరొక మెట్టు పైకి ఎక్కిస్తుంది.
నాలుగో జ్ఞాన యజ్ఞం... సమీక్షకుడి పాత్ర పోషించడం. తోటివారు జ్ఞాన సృష్టికర్తలుగా ఎదగడానికి ప్రోత్సహించడం, వారి శిక్షణలో భాగస్వాములు కావడం. సమీక్షకుడిగా, సలహాదారుగా, మార్గదర్శకుడిగా... బాధ్యత నిర్వహించాల్సి వస్తే అది మహత్తరమైన అవకాశంగా భావించాలి. తద్వారా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడమే కాక సమాజాన్నీ ప్రభావితం చేయగలగడం ఈ దశ గొప్పదనం.
నేర్చుకోవడం, పంచుకోవడం, సృష్టించడం, ప్రోత్సహించడం- అనే ఈ నాలుగు జ్ఞాన యజ్ఞాలు నేటి ప్రపంచానికి చాలా అవసరమైనవి. అన్ని రంగాల్లోనూ అవధులు దాటిన స్వార్థమే కనిపిస్తున్న ఈ రోజుల్లో నేనూ, నా... అన్న పరిధులు దాటి ‘మన’ అన్న భావన పెంపొందడానికి అవే మూలస్తంభాలు అవుతాయి. సమాజంలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పుతాయి.
నరసింహరాజు కేశిపెద్ది
ప్రకృతి ప్రతి వ్యక్తికీ అపార శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. ఆ అంతరంగ శక్తిని గుర్తించి, పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వ్యక్తిగతంగా ఎదగడమే కాదు, సమాజానికీ ప్రయోజనకారులు కావచ్చు. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు.
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనేక మార్గాలను సూచించాయి శాస్త్రాలు. అలాంటి వాటిలో అందరూ సులభంగా అనుసరించగలది- నాలుగు జ్ఞాన యజ్ఞాల మార్గం. జ్ఞానాన్ని అర్థించే విద్యార్థిగా, దాన్ని పంచే గురువుగా, విజ్ఞాన సృష్టికర్త పాత్రలో, జ్ఞానార్జనకు ఇతరులను ప్రోత్సహించే బాధ్యతలో... నాలుగు యజ్ఞాలు చేయవచ్చు మనిషి.
అందరి జీవితాలూ విద్యార్థులుగానే మొదలవుతాయి. డిగ్రీ పట్టా చేతికొస్తే చదువు అయిపోయినట్లు చాలామంది భావిస్తారు. కానీ నిజానికి విద్యార్థి దశకు ఆది తప్ప అంతం లేదు. జీవితాంతం నేర్చుకుంటూ ఉన్నవారే లౌకిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మికంగానూ కూడా రాణించగలరు. జ్ఞానం ఎంత సంపాదిస్తే అంతగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిత్య విద్యార్థికి లోకం నిత్యనూతనంగా కన్పిస్తుంది. ఆసక్తి, ఉత్సాహం వారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతాయి. రెండో జ్ఞాన యజ్ఞం- గురువుగా మారడం. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరొకరికి పంచినప్పుడు లభించే తృప్తి వేరు. దానికి ఉపాధ్యాయ వృత్తే చేపట్టనక్కరలేదు. భాష, కళ, విద్య, నైపుణ్యం... ఏదైనా సరే మనకి వచ్చింది అవకాశం ఉన్న ప్రతిచోటా ఇతరులకు నేర్పవచ్చు. బోధన- నేర్పేవారినీ, నేర్చుకునేవారినీ ఇద్దరినీ శక్తిమంతుల్ని చేస్తుంది. ‘స్వాధ్యాయ: ప్రవచనే చ... నేర్చుకో - బోధించు’ అని చెబుతాయి ఉపనిషత్తులు. బోధించడమంటే సమాజానికి సేవ చేయడమే. మూడో యజ్ఞం... మనమే జ్ఞానాన్ని సృష్టించే స్థాయికి ఎదగడం. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎందరో చెప్పిన పాఠాలు వింటాం, మరెన్నో నైపుణ్యాలు నేర్చుకుంటాం. వాటన్నిటి సారాన్నీ క్రోడీకరించి కొత్త పాఠాలను మనమూ తయారు చేయవచ్చు. అది ఏ రూపంలో చేయగలం అన్నది మన సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. రచన, దృశ్య, శ్రవణ... ఏ మాధ్యమాన్ని అయినా అనుసరించవచ్చు. వ్యక్తిగా ఇది మనల్ని మరొక మెట్టు పైకి ఎక్కిస్తుంది.
నాలుగో జ్ఞాన యజ్ఞం... సమీక్షకుడి పాత్ర పోషించడం. తోటివారు జ్ఞాన సృష్టికర్తలుగా ఎదగడానికి ప్రోత్సహించడం, వారి శిక్షణలో భాగస్వాములు కావడం. సమీక్షకుడిగా, సలహాదారుగా, మార్గదర్శకుడిగా... బాధ్యత నిర్వహించాల్సి వస్తే అది మహత్తరమైన అవకాశంగా భావించాలి. తద్వారా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడమే కాక సమాజాన్నీ ప్రభావితం చేయగలగడం ఈ దశ గొప్పదనం.
నేర్చుకోవడం, పంచుకోవడం, సృష్టించడం, ప్రోత్సహించడం- అనే ఈ నాలుగు జ్ఞాన యజ్ఞాలు నేటి ప్రపంచానికి చాలా అవసరమైనవి. అన్ని రంగాల్లోనూ అవధులు దాటిన స్వార్థమే కనిపిస్తున్న ఈ రోజుల్లో నేనూ, నా... అన్న పరిధులు దాటి ‘మన’ అన్న భావన పెంపొందడానికి అవే మూలస్తంభాలు అవుతాయి. సమాజంలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పుతాయి.
నరసింహరాజు కేశిపెద్ది
పొగరుబోతుతనం
మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలు కలవారు ఉంటారు. సాత్వికులు, మూర్ఖులు, మధ్యస్థంగా ఉండేవారు, తెలివైన వారు, కోపిష్ఠులు... వీరందరిలోనూ ప్రత్యేకంగా కనిపించే మరొక తరహా మనుషులు పొగరుబోతులు!
పొగరు అంటే ఆత్మాభిమానం అవసరానికి మించి ఉండటమే. పొగరన్న మాట విన్నప్పుడు ఓ కొండో, ఆకాశాన్ని తాకే చెట్టో గుర్తుకు రాక మానదు. ఎందుకంటే కొంతమందిలో అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించినప్పుడు ఇలాంటివారిలోనూ ఒక స్థాయిలో జ్ఞానం దాగిఉందని బోధపడుతుంది. పొగరుబోతులు సహజంగా గర్వంతో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు తమకంటూ ఏదో ప్రత్యేకమైన గొప్ప విలువుందని నమ్ముతారు. ఆత్మన్యూనతా భావం లేకుండా స్వశక్తి మీద విశ్వాసం ఉండటం ఆధ్యాత్మిక జగత్తులో ఓ గొప్ప పరిణామమే! ‘ధీరులు ఆత్మవిశ్వాసంతో భాసిస్తారు’ అని భగవానుడు గీతలో చెబుతారు. అయితే... పొగరు వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నటి గీతను గుర్తించాలి. సాధకుడు తనను తాను శక్తిమంతుడిగా నమ్మాలి. కానీ, అది తలబిరుసుతనంగా మారకూడదు. ఆత్మావలోకనం చేసుకునే సాధకుడు తన లోపలి ప్రపంచాన్ని దర్శించగలుగుతాడు. తనలో ఉన్న గొప్పతనాన్ని వినయపూర్వకంగా గ్రహించడం మాత్రమే అతడి ప్రగతికి తోడ్పడుతుంది.
పొగరును వినయంగా మార్చుకోవడంతో వ్యక్తి సాధన పరిపక్వతకు చేరుకుంటుంది. జ్ఞాని మౌనంగా ఉన్నప్పటికీ అతడి విజ్ఞత లోకానికి వెల్లడవుతుంది. అవసరమైనప్పుడు అతడు మాటల్లోనూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు. అది అతిశయం ఎంతమాత్రం కాబోదు. అంతర్లీనంగా ఉన్న అతడి వినయాన్ని లోకం అర్థం చేసుకుంటుంది.
అందరిలోనూ ‘నేను’ అనే రూపంలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. కోటానుకోట్ల ‘నేను’ల ఏకత్వాన్ని తెలుసుకున్న సాధకుడు జ్ఞానిగా వ్యక్తమవుతాడు. లోకంలో ప్రతి వ్యక్తిలోనూ కొద్దో గొప్పో అహంకారం ఉంటుంది. అహం లేకుండా మనిషి లేడు. ఆ అహం, అహంకారంగా మారకుండా చూసుకుని పరమాత్మను చేరే మార్గం సాధకుడు అన్వేషించాలి. పొగరుబోతుతనం శాశ్వతం కాదు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ అదే పొగరుబోతుతనం వినయంగా మారుతుంది. అందుకు సాధకుడి అకుంఠిత దీక్ష తోడ్పడుతుంది.
ఏ విషయం తనలో పొగరుబోతుతనానికి ప్రేరణ కల్పించిందో దాన్ని మిథ్యగా తెలుసుకుని తొలగించుకోవాలి. వినయభావనను సాధన చేయాలి. పండు సువాసనతో, మాధుర్యంతో తినేవారిని ఆకర్షిస్తుంది. అది పిందెగా ఉన్నప్పుడు వగరుగానో, చేదుగానో, పుల్లగానో ఉండవచ్చు. కాలగతిన ఆ స్థానంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. పొగరుబోతుతనం తొలుత వెగటు కలిగించినా, జ్ఞానంతో కూడిన సాధనతో అటువంటి వ్యక్తి కూడా తీయని ఫలంలాగా లోకానికి తప్పక ప్రీతి కలిగిస్తాడు. పొగరుబోతుతనం తప్పుకాదు. అదొక తెలియనితనం! అమాయకులైన పిల్లలు విద్యతో వినయాన్ని, జ్ఞానాన్ని సాధించినట్లు పొగరుబోతులు జీవితం బోధించే పాఠాలు ఒంటబట్టించుకున్నాక విలువలు నేర్చుకుని తప్పక జ్ఞానవంతులవుతారు...అవ్వాలి!
గోపాలుని రఘుపతిరావు
మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలు కలవారు ఉంటారు. సాత్వికులు, మూర్ఖులు, మధ్యస్థంగా ఉండేవారు, తెలివైన వారు, కోపిష్ఠులు... వీరందరిలోనూ ప్రత్యేకంగా కనిపించే మరొక తరహా మనుషులు పొగరుబోతులు!
పొగరు అంటే ఆత్మాభిమానం అవసరానికి మించి ఉండటమే. పొగరన్న మాట విన్నప్పుడు ఓ కొండో, ఆకాశాన్ని తాకే చెట్టో గుర్తుకు రాక మానదు. ఎందుకంటే కొంతమందిలో అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించినప్పుడు ఇలాంటివారిలోనూ ఒక స్థాయిలో జ్ఞానం దాగిఉందని బోధపడుతుంది. పొగరుబోతులు సహజంగా గర్వంతో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు తమకంటూ ఏదో ప్రత్యేకమైన గొప్ప విలువుందని నమ్ముతారు. ఆత్మన్యూనతా భావం లేకుండా స్వశక్తి మీద విశ్వాసం ఉండటం ఆధ్యాత్మిక జగత్తులో ఓ గొప్ప పరిణామమే! ‘ధీరులు ఆత్మవిశ్వాసంతో భాసిస్తారు’ అని భగవానుడు గీతలో చెబుతారు. అయితే... పొగరు వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నటి గీతను గుర్తించాలి. సాధకుడు తనను తాను శక్తిమంతుడిగా నమ్మాలి. కానీ, అది తలబిరుసుతనంగా మారకూడదు. ఆత్మావలోకనం చేసుకునే సాధకుడు తన లోపలి ప్రపంచాన్ని దర్శించగలుగుతాడు. తనలో ఉన్న గొప్పతనాన్ని వినయపూర్వకంగా గ్రహించడం మాత్రమే అతడి ప్రగతికి తోడ్పడుతుంది.
పొగరును వినయంగా మార్చుకోవడంతో వ్యక్తి సాధన పరిపక్వతకు చేరుకుంటుంది. జ్ఞాని మౌనంగా ఉన్నప్పటికీ అతడి విజ్ఞత లోకానికి వెల్లడవుతుంది. అవసరమైనప్పుడు అతడు మాటల్లోనూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు. అది అతిశయం ఎంతమాత్రం కాబోదు. అంతర్లీనంగా ఉన్న అతడి వినయాన్ని లోకం అర్థం చేసుకుంటుంది.
అందరిలోనూ ‘నేను’ అనే రూపంలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. కోటానుకోట్ల ‘నేను’ల ఏకత్వాన్ని తెలుసుకున్న సాధకుడు జ్ఞానిగా వ్యక్తమవుతాడు. లోకంలో ప్రతి వ్యక్తిలోనూ కొద్దో గొప్పో అహంకారం ఉంటుంది. అహం లేకుండా మనిషి లేడు. ఆ అహం, అహంకారంగా మారకుండా చూసుకుని పరమాత్మను చేరే మార్గం సాధకుడు అన్వేషించాలి. పొగరుబోతుతనం శాశ్వతం కాదు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ అదే పొగరుబోతుతనం వినయంగా మారుతుంది. అందుకు సాధకుడి అకుంఠిత దీక్ష తోడ్పడుతుంది.
ఏ విషయం తనలో పొగరుబోతుతనానికి ప్రేరణ కల్పించిందో దాన్ని మిథ్యగా తెలుసుకుని తొలగించుకోవాలి. వినయభావనను సాధన చేయాలి. పండు సువాసనతో, మాధుర్యంతో తినేవారిని ఆకర్షిస్తుంది. అది పిందెగా ఉన్నప్పుడు వగరుగానో, చేదుగానో, పుల్లగానో ఉండవచ్చు. కాలగతిన ఆ స్థానంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. పొగరుబోతుతనం తొలుత వెగటు కలిగించినా, జ్ఞానంతో కూడిన సాధనతో అటువంటి వ్యక్తి కూడా తీయని ఫలంలాగా లోకానికి తప్పక ప్రీతి కలిగిస్తాడు. పొగరుబోతుతనం తప్పుకాదు. అదొక తెలియనితనం! అమాయకులైన పిల్లలు విద్యతో వినయాన్ని, జ్ఞానాన్ని సాధించినట్లు పొగరుబోతులు జీవితం బోధించే పాఠాలు ఒంటబట్టించుకున్నాక విలువలు నేర్చుకుని తప్పక జ్ఞానవంతులవుతారు...అవ్వాలి!
గోపాలుని రఘుపతిరావు
ఏకాగ్రత
మనసును వానరంతో ఊరికే పోల్చలేదు పెద్దలు. కోతి కొమ్మల మీద ఎగిరినట్టు మనసు కోరికలతో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే మెడలో గొలుసు వేసి కోతిని ఎక్కడోచోట కట్టేసి ఉంచవచ్చు. కానీ మనసు పరిస్థితి అట్లా కాదు. దాన్ని కట్టేయడానికి తాళ్లు ఉంటాయా అంటే- దైవ ప్రార్థన, భజన, జపం, ధ్యానం ఇలాంటి మార్గాలను ముందు తరాల వాళ్లు చూపారు.
ధ్యానం చేయడం, మనసును ఒక విషయం మీద కేంద్రీకరించడం సాధన ద్వారా మాత్రమే వస్తుంది. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే ఫలితం ఉంటుంది. పూజ దగ్గర నుంచి, ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పోసే వరకు ఏ పనిలోనైనా నిమగ్నం కావడం ముఖ్యం. పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఆ కథలోనే లీనమవ్వాలి. వంట చేస్తున్నప్పుడు వంటింట్లో ఉండకుండా మరెక్కడో ఉంటే కూరలో ఉప్పు బదులు పంచదార పడుతుంది. వంట చెడుతుంది. పరధ్యానంతో ఏ పని చేసినా అది పనికి రాకుండా పోతుంది. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’- అని భగవద్గీతలో చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవడం అలవాటుగా మారాలి. భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామం మీదే దృష్టి ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు మనసులో పరమాత్మ మాత్రమే ఉండాలి.
ఒక పట్టణంలో పేరుపొందిన లాయరు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ పంచాక్షరీ మంత్రాన్ని జపించేవాడు. ఒకరోజు ఆయన పూజగదిలో ఉండగా, అర్జెంటు కేసు తీసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ‘అమ్మా! లాయరుగారు ఉన్నారా?’ అని అక్కడున్న కోడలిని అడిగాడు. మామగారు పూజగదికి వెళ్లేముందు ఆమెకు ఏదో చెప్పాడు. కోడలు వచ్చిన వ్యక్తితో ‘మా మామగారు చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు’ అని గట్టిగా చెప్పింది. లాయరు ఆ మాటలు విని బయటికి వచ్చాడు. ‘ఏంటమ్మా! ఏమిటా మాటలు, నేను పంచాక్షరి జపిస్తుంటే ఇంకెక్కడో ఉన్నానని చెబుతావేంటి? నీకేమైనా మతిపోయిందా?’ అని గట్టిగా అడిగాడు. ఆమె శాంతంగా ‘మామగారూ! మీరు ఎన్నిసార్లు, పంచాక్షరిని జపిస్తూ ‘అమ్మా! అతను నా చెప్పులు కుట్టి తెచ్చాడా’ అని అడగలేదు? ఒకసారైతే ‘చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజులైంది. ఇంకా తీసుకురాలేదు. రానీ, వాడి వీపు పగలగొడుతాను’ అన్నారు. మీరు నిజంగా పంచాక్షరిని జపిస్తున్నారా! మీ చెప్పులను తలచుకుంటూ ఉన్నారా? చెప్పండి’ అంది. తాను చేసిన తప్పును అతను తెలుసుకున్నాడు. కోడలి తెలివిని మెచ్చుకున్నాడు.
దైవాన్ని ప్రార్థించేటప్పుడు మనసులోకి ఎటువంటి ఆలోచనలనూ రానీయకూడదు. ధ్యాసంతా భగవంతుడి మీద ఉండాలి. అందుకు నిరవధిక అభ్యాసం అవసరం. వృత్తి జీవితంలోనూ అంతే. మనసును అదుపులో ఉంచుకోవడం ద్వారా సర్వం సమకూరుతుంది. మనం తలపెట్టిన ఏ కార్యమైనా ఫలవంతం అవుతుంది.
శ్రీకృష్ణప్రియ
మనసును వానరంతో ఊరికే పోల్చలేదు పెద్దలు. కోతి కొమ్మల మీద ఎగిరినట్టు మనసు కోరికలతో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే మెడలో గొలుసు వేసి కోతిని ఎక్కడోచోట కట్టేసి ఉంచవచ్చు. కానీ మనసు పరిస్థితి అట్లా కాదు. దాన్ని కట్టేయడానికి తాళ్లు ఉంటాయా అంటే- దైవ ప్రార్థన, భజన, జపం, ధ్యానం ఇలాంటి మార్గాలను ముందు తరాల వాళ్లు చూపారు.
ధ్యానం చేయడం, మనసును ఒక విషయం మీద కేంద్రీకరించడం సాధన ద్వారా మాత్రమే వస్తుంది. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే ఫలితం ఉంటుంది. పూజ దగ్గర నుంచి, ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పోసే వరకు ఏ పనిలోనైనా నిమగ్నం కావడం ముఖ్యం. పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఆ కథలోనే లీనమవ్వాలి. వంట చేస్తున్నప్పుడు వంటింట్లో ఉండకుండా మరెక్కడో ఉంటే కూరలో ఉప్పు బదులు పంచదార పడుతుంది. వంట చెడుతుంది. పరధ్యానంతో ఏ పని చేసినా అది పనికి రాకుండా పోతుంది. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’- అని భగవద్గీతలో చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవడం అలవాటుగా మారాలి. భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామం మీదే దృష్టి ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు మనసులో పరమాత్మ మాత్రమే ఉండాలి.
ఒక పట్టణంలో పేరుపొందిన లాయరు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ పంచాక్షరీ మంత్రాన్ని జపించేవాడు. ఒకరోజు ఆయన పూజగదిలో ఉండగా, అర్జెంటు కేసు తీసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ‘అమ్మా! లాయరుగారు ఉన్నారా?’ అని అక్కడున్న కోడలిని అడిగాడు. మామగారు పూజగదికి వెళ్లేముందు ఆమెకు ఏదో చెప్పాడు. కోడలు వచ్చిన వ్యక్తితో ‘మా మామగారు చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు’ అని గట్టిగా చెప్పింది. లాయరు ఆ మాటలు విని బయటికి వచ్చాడు. ‘ఏంటమ్మా! ఏమిటా మాటలు, నేను పంచాక్షరి జపిస్తుంటే ఇంకెక్కడో ఉన్నానని చెబుతావేంటి? నీకేమైనా మతిపోయిందా?’ అని గట్టిగా అడిగాడు. ఆమె శాంతంగా ‘మామగారూ! మీరు ఎన్నిసార్లు, పంచాక్షరిని జపిస్తూ ‘అమ్మా! అతను నా చెప్పులు కుట్టి తెచ్చాడా’ అని అడగలేదు? ఒకసారైతే ‘చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజులైంది. ఇంకా తీసుకురాలేదు. రానీ, వాడి వీపు పగలగొడుతాను’ అన్నారు. మీరు నిజంగా పంచాక్షరిని జపిస్తున్నారా! మీ చెప్పులను తలచుకుంటూ ఉన్నారా? చెప్పండి’ అంది. తాను చేసిన తప్పును అతను తెలుసుకున్నాడు. కోడలి తెలివిని మెచ్చుకున్నాడు.
దైవాన్ని ప్రార్థించేటప్పుడు మనసులోకి ఎటువంటి ఆలోచనలనూ రానీయకూడదు. ధ్యాసంతా భగవంతుడి మీద ఉండాలి. అందుకు నిరవధిక అభ్యాసం అవసరం. వృత్తి జీవితంలోనూ అంతే. మనసును అదుపులో ఉంచుకోవడం ద్వారా సర్వం సమకూరుతుంది. మనం తలపెట్టిన ఏ కార్యమైనా ఫలవంతం అవుతుంది.
శ్రీకృష్ణప్రియ
భక్త జనాబాయి
భక్తికి, ఆ దేవదేవుడి సాన్నిధ్యం పొందడానికి కులం, జాతి, మతం, పేద, గొప్ప, స్త్రీ, పురుష భేదాలు లేవని నిరూపించే సంఘటనలు, భక్తుల కోసం ఆ భగవంతుడు తానే కదిలి వచ్చిన కథనాలు చరిత్రలో ఎన్నో విన్నాం. భక్తి అంటే కర్తవ్యాన్ని మరిచి చరించడం కాదు, కర్తవ్య నిర్వహణతోనే భక్తిమార్గం ముడిపడి ఉందని నిరూపించింది పాండురంగ విఠలుడి పరమ భక్తురాలైన జనాబాయి. విఠలుడు ఆమె గుడిసెకు వచ్చి ‘జనా! ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టవా’ అని అడిగి మరీ ఆమెతో కలిసి భుజించాడన్నది ఐతిహ్యం.
జనాబాయి 13వ శతాబ్దానికి చెందిన భక్తురాలు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లా గంగాఖేడ్లో దళిత కుటుంబంలో జన్మించింది. తల్లి చిన్నతనంలోనే మరణించింది. ఏడేళ్ల వయసులో తండ్రితో కలిసి పండరీపూర్ వచ్చింది జనాబాయి. కొద్దికాలానికే తండ్రినీ కోల్పోయింది. అనాథగా మారిన ఆమెను ప్రఖ్యాత భక్త కవి నామ్దేవ్ కుటుంబం అక్కున చేర్చుకుంది. నామ్దేవ్నే ఆధ్యాత్మిక గురువుగా భావించి, విఠలుణ్ని హృదయంలో నిలుపుకొంది జనాబాయి. సరళమైన మరాఠీ భాషలో ఆమె 300కి పైగా భక్తి గీతాలు రచించినట్లు తెలుస్తోంది. ‘ఘర స్వచ్ఛ కరీన్ మి, నామ్ తుజే గాయిన్ మి’ అన్న అభంగంలో జనాబాయి నిజమైన భక్తి సాధన అంటే ఏంటో, అదెలా చెయ్యాలో చెప్పింది. మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చని చాటింది.
పాండురంగడికి భోజనం పెట్టాలని తపించి, తన స్థితికి బాధపడుతూ దూరంగా ఉండిపోయిన జనాబాయి దగ్గరికి ఆ పరమాత్మ తానే స్వయంగా వచ్చాడని చెబుతారు. జనాబాయి చేతి భోజనం తిని, ఆమెతో ముచ్చట్లాడాడట విఠలుడు. తెలతెలవారుతుండగా తన మెడలోని నగలను అక్కడే వదిలి వెళ్లిపోయాడట. దాంతో జనాబాయే దొంగతనం చేసి ఉంటుందని భావించి ఆమెను శిక్షించడానికి స్తంభానికి కట్టేశారు. అది చూసి విఠలుడు సహించలేకపోవడంతో అందరూ చూస్తుండగానే స్తంభం కరిగి నీరుగా మారిపోయిందన్నది మరో ఐతిహ్యం. అదొక్కటే కాదు, జనాబాయి చేతిలోని తిరగలి తీసుకుని తాను పిండి విసురుతూ, ఆమెతో అభంగాలు పాడించుకుని మురిసిపోయేవాడట విఠలుడు. జనాబాయి ఇంటిపనులు చేస్తున్నా విఠల నామస్మరణ ఆగేది కాదు. ఇలా చెప్పుకొంటూ పొతే విఠలుడి పట్ల ఆమెకున్న భక్తి ప్రపత్తుల్ని, వాత్సల్యాన్నీ వెల్లడించే గాథలు ఎన్నో. వందల సంవత్సరాల తరవాత కూడా ఆమె అభంగాలు, సంత్ జనాబాయిగా ఆమె పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయాయి.
జనాబాయి అభంగాలు కేవలం ఆధ్యాత్మిక కవితలు కాదు; లింగ, కుల వివక్షల పట్ల తీవ్ర విమర్శలు, స్త్రీల హక్కుల కోసం పిలుపులు ఉంటాయి వాటిలో. స్త్రీలకూ వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలు, తమదైన అస్తిత్వం ఉంటాయని భావించేది జనాబాయి. అందుకే తన అభంగ్లలో చాలావరకు విఠలుణ్ని ‘రుక్మిణి భర్త’గా ప్రస్తావించింది. తన భక్తి గేయాల ద్వారా సమానత్వాన్ని ప్రబోధించింది.
మావూరి విజయలక్ష్మి
భక్తికి, ఆ దేవదేవుడి సాన్నిధ్యం పొందడానికి కులం, జాతి, మతం, పేద, గొప్ప, స్త్రీ, పురుష భేదాలు లేవని నిరూపించే సంఘటనలు, భక్తుల కోసం ఆ భగవంతుడు తానే కదిలి వచ్చిన కథనాలు చరిత్రలో ఎన్నో విన్నాం. భక్తి అంటే కర్తవ్యాన్ని మరిచి చరించడం కాదు, కర్తవ్య నిర్వహణతోనే భక్తిమార్గం ముడిపడి ఉందని నిరూపించింది పాండురంగ విఠలుడి పరమ భక్తురాలైన జనాబాయి. విఠలుడు ఆమె గుడిసెకు వచ్చి ‘జనా! ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టవా’ అని అడిగి మరీ ఆమెతో కలిసి భుజించాడన్నది ఐతిహ్యం.
జనాబాయి 13వ శతాబ్దానికి చెందిన భక్తురాలు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లా గంగాఖేడ్లో దళిత కుటుంబంలో జన్మించింది. తల్లి చిన్నతనంలోనే మరణించింది. ఏడేళ్ల వయసులో తండ్రితో కలిసి పండరీపూర్ వచ్చింది జనాబాయి. కొద్దికాలానికే తండ్రినీ కోల్పోయింది. అనాథగా మారిన ఆమెను ప్రఖ్యాత భక్త కవి నామ్దేవ్ కుటుంబం అక్కున చేర్చుకుంది. నామ్దేవ్నే ఆధ్యాత్మిక గురువుగా భావించి, విఠలుణ్ని హృదయంలో నిలుపుకొంది జనాబాయి. సరళమైన మరాఠీ భాషలో ఆమె 300కి పైగా భక్తి గీతాలు రచించినట్లు తెలుస్తోంది. ‘ఘర స్వచ్ఛ కరీన్ మి, నామ్ తుజే గాయిన్ మి’ అన్న అభంగంలో జనాబాయి నిజమైన భక్తి సాధన అంటే ఏంటో, అదెలా చెయ్యాలో చెప్పింది. మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చని చాటింది.
పాండురంగడికి భోజనం పెట్టాలని తపించి, తన స్థితికి బాధపడుతూ దూరంగా ఉండిపోయిన జనాబాయి దగ్గరికి ఆ పరమాత్మ తానే స్వయంగా వచ్చాడని చెబుతారు. జనాబాయి చేతి భోజనం తిని, ఆమెతో ముచ్చట్లాడాడట విఠలుడు. తెలతెలవారుతుండగా తన మెడలోని నగలను అక్కడే వదిలి వెళ్లిపోయాడట. దాంతో జనాబాయే దొంగతనం చేసి ఉంటుందని భావించి ఆమెను శిక్షించడానికి స్తంభానికి కట్టేశారు. అది చూసి విఠలుడు సహించలేకపోవడంతో అందరూ చూస్తుండగానే స్తంభం కరిగి నీరుగా మారిపోయిందన్నది మరో ఐతిహ్యం. అదొక్కటే కాదు, జనాబాయి చేతిలోని తిరగలి తీసుకుని తాను పిండి విసురుతూ, ఆమెతో అభంగాలు పాడించుకుని మురిసిపోయేవాడట విఠలుడు. జనాబాయి ఇంటిపనులు చేస్తున్నా విఠల నామస్మరణ ఆగేది కాదు. ఇలా చెప్పుకొంటూ పొతే విఠలుడి పట్ల ఆమెకున్న భక్తి ప్రపత్తుల్ని, వాత్సల్యాన్నీ వెల్లడించే గాథలు ఎన్నో. వందల సంవత్సరాల తరవాత కూడా ఆమె అభంగాలు, సంత్ జనాబాయిగా ఆమె పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయాయి.
జనాబాయి అభంగాలు కేవలం ఆధ్యాత్మిక కవితలు కాదు; లింగ, కుల వివక్షల పట్ల తీవ్ర విమర్శలు, స్త్రీల హక్కుల కోసం పిలుపులు ఉంటాయి వాటిలో. స్త్రీలకూ వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలు, తమదైన అస్తిత్వం ఉంటాయని భావించేది జనాబాయి. అందుకే తన అభంగ్లలో చాలావరకు విఠలుణ్ని ‘రుక్మిణి భర్త’గా ప్రస్తావించింది. తన భక్తి గేయాల ద్వారా సమానత్వాన్ని ప్రబోధించింది.
మావూరి విజయలక్ష్మి
ఆలోచనల్లో స్పష్టత
మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది. ఏ దిశలో ఆలోచిస్తే, అటువైపే జీవితం ప్రయాణిస్తుంది. కాబట్టి ‘ఆలోచన’ అనేది అన్ని వైపులా, సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు.
శ్రీకృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి ప్రేరేపించేటప్పుడు విజయాన్ని మాత్రమే కాదు; ధర్మ పరిరక్షణ, భవిష్యత్తరాల సంక్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చాడు. అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచన వల్లే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు. బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్లినప్పుడు, అది క్షణికోత్సాహం కాదు. జీవితం, మరణం, దుఃఖం, విముక్తి- అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం. దాని వల్లే ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టివచ్చింది.
దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా, లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా; శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం శ్రీకృష్ణుడి ఆలోచన తాలూకు శ్రేష్ఠ రూపం. ఒక సమస్యపై ఎక్కువ కోణాల్లో ఆలోచించినప్పుడు మెదడులోని ప్రీఫ్రాంటల్విభాగం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిర్ణయ సామర్థ్యం, భవిష్యత్ఫలితాల అంచనా, సమస్య పరిష్కారం వంటి అంశాలను మెరుగు పరుస్తుంది. క్రమబద్ధమైన, లోతైన ఆలోచన మెదడులో న్యూరల్సంబంధాలను బలపరచి, దీర్ఘకాలికంగా మన జ్ఞానాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.
ఆలోచనకు సహనం, జ్ఞానం, ధర్మపరమైన దృష్టి అవసరం. వేగంగా స్పందించడం కన్నా, మనసును శాంతపరచుకుని, పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది. మొత్తానికి, సరైన ఆలోచన అనేది భౌతిక విజయాలకే కాదు, ఆధ్యాత్మిక వికాసానికి కూడా మార్గం చూపుతుంది. ఇది మనలో వివేకాన్ని పెంచి, శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచనా స్పష్టతను పెంపొందించుకోవాలి. ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మంచి ఆలోచనలు శుభఫలితాలను, దుష్ట ఆలోచనలు సమస్యలను తెస్తాయి. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచననూ జాగ్రత్తగా, సానుకూల దిశలో మలచుకోవాలి. ఆలోచనా శుద్ధి మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది.
మనసనే నదిలో తేలే దీపంలాంటిది ఆలోచన. అది చీకటిలో వెలుగునిచ్చి, ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలా మార్చి, దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది. లోతైన ఆలోచన కడలిలా విస్తరించి, జ్ఞాన ముత్యాలను జీవిత తీరానికి తీసుకువస్తుంది. ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధురగీతంలా సాగిపోతుంది.
ఆనందసాయి స్వామి
మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది. ఏ దిశలో ఆలోచిస్తే, అటువైపే జీవితం ప్రయాణిస్తుంది. కాబట్టి ‘ఆలోచన’ అనేది అన్ని వైపులా, సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు.
శ్రీకృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి ప్రేరేపించేటప్పుడు విజయాన్ని మాత్రమే కాదు; ధర్మ పరిరక్షణ, భవిష్యత్తరాల సంక్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చాడు. అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచన వల్లే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు. బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్లినప్పుడు, అది క్షణికోత్సాహం కాదు. జీవితం, మరణం, దుఃఖం, విముక్తి- అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం. దాని వల్లే ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టివచ్చింది.
దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా, లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా; శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం శ్రీకృష్ణుడి ఆలోచన తాలూకు శ్రేష్ఠ రూపం. ఒక సమస్యపై ఎక్కువ కోణాల్లో ఆలోచించినప్పుడు మెదడులోని ప్రీఫ్రాంటల్విభాగం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిర్ణయ సామర్థ్యం, భవిష్యత్ఫలితాల అంచనా, సమస్య పరిష్కారం వంటి అంశాలను మెరుగు పరుస్తుంది. క్రమబద్ధమైన, లోతైన ఆలోచన మెదడులో న్యూరల్సంబంధాలను బలపరచి, దీర్ఘకాలికంగా మన జ్ఞానాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.
ఆలోచనకు సహనం, జ్ఞానం, ధర్మపరమైన దృష్టి అవసరం. వేగంగా స్పందించడం కన్నా, మనసును శాంతపరచుకుని, పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది. మొత్తానికి, సరైన ఆలోచన అనేది భౌతిక విజయాలకే కాదు, ఆధ్యాత్మిక వికాసానికి కూడా మార్గం చూపుతుంది. ఇది మనలో వివేకాన్ని పెంచి, శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచనా స్పష్టతను పెంపొందించుకోవాలి. ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మంచి ఆలోచనలు శుభఫలితాలను, దుష్ట ఆలోచనలు సమస్యలను తెస్తాయి. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచననూ జాగ్రత్తగా, సానుకూల దిశలో మలచుకోవాలి. ఆలోచనా శుద్ధి మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది.
మనసనే నదిలో తేలే దీపంలాంటిది ఆలోచన. అది చీకటిలో వెలుగునిచ్చి, ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలా మార్చి, దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది. లోతైన ఆలోచన కడలిలా విస్తరించి, జ్ఞాన ముత్యాలను జీవిత తీరానికి తీసుకువస్తుంది. ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధురగీతంలా సాగిపోతుంది.
ఆనందసాయి స్వామి
మనసే మూలం
మనిషి కీర్తినీ, ఆనందాన్నీ పొందాలనుకోవడం సహజం. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికి సంతృప్తి లభించకపోతే ఇంకా ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ అన్నింటికీ మూలమైన అసలు సంగతిని మరచిపోతాడు.
సమంతుడు శ్రావస్తిలో ధనిక కుటుంబానికి చెందిన యువకుడు. గృహస్థు జీవితం అతడికి అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. భిక్షువుగా మారి ధ్యానసాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా, గౌరవంగా జీవించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక భిక్షువు దగ్గరికి వెళ్లి మనసులోని మాట చెప్పాడు. ఏదో ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు భిక్షువుగా మారాలని వచ్చి, కొంతకాలం తరవాత గృహస్థుగా జీవించడానికి వెళ్లిపోయిన వారిని ఎందర్నో ఆ భిక్షువు చూశాడు. ఆ అనుభవంతో సమంతుడికి వెంటనే దీక్ష ఇవ్వకుండా ‘నాయనా! ముందు నీ ఆస్తిని మూడు భాగాలు చేసి ఒక భాగం నీ కుటుంబం కోసం వినియోగించు, మరో భాగంతో వ్యాపారం కొనసాగించు, మిగిలిన భాగాన్ని పూర్తిగా దానాలకు ఉపయోగించు. నువ్వు కోరుకున్న గౌరవం, ఆనందం లభిస్తాయి’ అని చెప్పి పంపాడు. సమంతుడు అలాగే చేశాడు కొన్నాళ్లకు మళ్లీ వచ్చి ‘అయ్యా మీరు చెప్పినట్లే చేశాను. అయినా నాకు శాంతి కలగలేదు’ అన్నాడు. ‘సమంతా! ఈసారి నేను చెప్పే ఓ అయిదు విషయాల్ని పాటించు... జీవహింస చేయకు, అబద్ధాలు చెప్పకు, పరుల సొమ్ము ఆశించకు, వ్యభిచరించకు, మద్యపానం- మత్తుపదార్థాల జోలికి వెళ్లకు. ఈ అయిదింటినీ ‘పంచశీల’ అంటారు. వీటిని పాటించు’ అని చెప్పి పంపించాడు.
కొన్నాళ్ల తరవాత సమంతుడు మళ్లీ వచ్చాడు. భిక్షువు ఈసారి ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అనే త్రిరత్నాల్ని శరణువేడమని చెప్పి పంపాడు. అవి కూడా సమంతుడికి శాంతిని ఇవ్వలేక పోయాయి. ‘స్వామీ... మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చలేదు. నా చింత, దుఃఖం తీరలేదు.’ అని చెప్పాడు. సమంతుణ్ని సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన ఆ భిక్షువు అతణ్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్లి విషయమంతా చెప్పాడు. బుద్ధుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు.
‘సమంతా! మనిషికి మనసే మూలం. సుఖదుఃఖాలకు, కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం. చిత్తాన్ని సంస్కరించకుండా బాహ్య విషయాలపై ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. మనసు తనకు ఇష్టమైన విషయాల మీదికి వేగంగా పోయి వాలుతుంది. తెలివిగలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకుంటాడు. అప్పుడే దుఃఖాన్ని తొలగించుకుని ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు’ అన్నాడు. అప్పుడు కానీ సమంతుడికి అసలు విషయం బోధ పడలేదు. మార్పు మూలంలోనే రావాలి. అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది. అదుపు చేయాల్సింది కోరికల్ని కాదు, కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకుని ఆ దిశగా ప్రయాణం కొనసాగించాడు.
ఎన్.బి.యస్.శ్రీనివాస్పోలిశెట్టి
మనిషి కీర్తినీ, ఆనందాన్నీ పొందాలనుకోవడం సహజం. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికి సంతృప్తి లభించకపోతే ఇంకా ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ అన్నింటికీ మూలమైన అసలు సంగతిని మరచిపోతాడు.
సమంతుడు శ్రావస్తిలో ధనిక కుటుంబానికి చెందిన యువకుడు. గృహస్థు జీవితం అతడికి అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. భిక్షువుగా మారి ధ్యానసాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా, గౌరవంగా జీవించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక భిక్షువు దగ్గరికి వెళ్లి మనసులోని మాట చెప్పాడు. ఏదో ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు భిక్షువుగా మారాలని వచ్చి, కొంతకాలం తరవాత గృహస్థుగా జీవించడానికి వెళ్లిపోయిన వారిని ఎందర్నో ఆ భిక్షువు చూశాడు. ఆ అనుభవంతో సమంతుడికి వెంటనే దీక్ష ఇవ్వకుండా ‘నాయనా! ముందు నీ ఆస్తిని మూడు భాగాలు చేసి ఒక భాగం నీ కుటుంబం కోసం వినియోగించు, మరో భాగంతో వ్యాపారం కొనసాగించు, మిగిలిన భాగాన్ని పూర్తిగా దానాలకు ఉపయోగించు. నువ్వు కోరుకున్న గౌరవం, ఆనందం లభిస్తాయి’ అని చెప్పి పంపాడు. సమంతుడు అలాగే చేశాడు కొన్నాళ్లకు మళ్లీ వచ్చి ‘అయ్యా మీరు చెప్పినట్లే చేశాను. అయినా నాకు శాంతి కలగలేదు’ అన్నాడు. ‘సమంతా! ఈసారి నేను చెప్పే ఓ అయిదు విషయాల్ని పాటించు... జీవహింస చేయకు, అబద్ధాలు చెప్పకు, పరుల సొమ్ము ఆశించకు, వ్యభిచరించకు, మద్యపానం- మత్తుపదార్థాల జోలికి వెళ్లకు. ఈ అయిదింటినీ ‘పంచశీల’ అంటారు. వీటిని పాటించు’ అని చెప్పి పంపించాడు.
కొన్నాళ్ల తరవాత సమంతుడు మళ్లీ వచ్చాడు. భిక్షువు ఈసారి ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అనే త్రిరత్నాల్ని శరణువేడమని చెప్పి పంపాడు. అవి కూడా సమంతుడికి శాంతిని ఇవ్వలేక పోయాయి. ‘స్వామీ... మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చలేదు. నా చింత, దుఃఖం తీరలేదు.’ అని చెప్పాడు. సమంతుణ్ని సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన ఆ భిక్షువు అతణ్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్లి విషయమంతా చెప్పాడు. బుద్ధుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు.
‘సమంతా! మనిషికి మనసే మూలం. సుఖదుఃఖాలకు, కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం. చిత్తాన్ని సంస్కరించకుండా బాహ్య విషయాలపై ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. మనసు తనకు ఇష్టమైన విషయాల మీదికి వేగంగా పోయి వాలుతుంది. తెలివిగలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకుంటాడు. అప్పుడే దుఃఖాన్ని తొలగించుకుని ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు’ అన్నాడు. అప్పుడు కానీ సమంతుడికి అసలు విషయం బోధ పడలేదు. మార్పు మూలంలోనే రావాలి. అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది. అదుపు చేయాల్సింది కోరికల్ని కాదు, కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకుని ఆ దిశగా ప్రయాణం కొనసాగించాడు.
ఎన్.బి.యస్.శ్రీనివాస్పోలిశెట్టి
భయాన్నీ తెలుసుకుంటే
మనం భయపడాల్సింది భయానికేనంటారు రూజ్వెల్ట్. పిరికివాళ్లు తమ మరణానికి ముందే ఎన్నోసార్లు మరణిస్తారని, ధైర్యవంతులు మరణాన్ని ఒక్కసారే ఎదుర్కొంటారని షేక్స్పియర్ అంటాడు. అభద్రతా భావం భయానికి మూలకారణం. సహజంగానే పిరికివాళ్లు ప్రతి చిన్నదానికీ భయపడిపోతారు. ధైర్యశాలురు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటూ ముందుకువెళ్తారు.
ప్రాణికి జీవితం మీద ఆపేక్ష సహజం. మరణానికి భయపడని ప్రాణి ఏదీ ఉండదు. కానీ జ్ఞానిని రోగ మృత్యు భయాదులు దరిచేరలేవు. ‘పుత్రాదపి ధనభాజాం భీతిః’ అంటారు శంకరులు. డబ్బున్న వాడికి దాన్ని ఎక్కడ నాశనం చేసేస్తాడోనని కొడుకంటేనే భయమట. అధిక సంపద అందరినీ అనుమానించేట్టు చేస్తుంది. కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ‘ఉన్న ఊరివాడికి కాటి భయం- పొరుగూరి వాడికి నీళ్ల భయం’ అనో సామెత. సాధారణంగా ప్రతి ఊళ్లోనూ నీటి అవసరాలను తీర్చడానికొక చెరువు, దహన సంస్కారాలు నిర్వర్తించడానికి శ్మశానం తప్పనిసరిగా ఉంటాయి. ఊరివాడికి వల్లకాడు ఎటు ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రుళ్లు అటువైపు పోడు. పొరుగూరి నుంచి వచ్చిన వాడికి ఈ ఊళ్లో శ్మశానం ఎక్కడుందో తెలియదు కనుక ఆ భయం ఉండదు. కానీ నీరున్న ప్రాంతం చీకట్లో కనపడదు, కొత్త కాబట్టి లోతు తెలియదు. అందుకే అతడికి నీటి భయం.
జీవితంలో భయపడని వారుండరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయం మనల్ని భయపెట్టే ఉంటుంది. ధైర్యవంతుడు అంటే అసలు భయపడని వాడు కాదని, భయాన్ని జయించినవాడని అంటారు. భయాన్ని ఎదుర్కొనడంలోనే జీవితరహస్యం ఉంది. ఆధ్యాత్మిక గురువులు భయం అనేది కేవలం ఆలోచనే అంటారు. రకరకాల పరిస్థితులను ఊహించుకుని బెదిరిపోవడమే తప్ప భయాలన్నీ నిజాలు కావంటారు. రోగం వస్తుందేమోనని భయం, ప్రమాదం జరుగుతుందేమోనని భయం. అయినవాళ్లు దూరమవుతారేమోనని భయం. మన చేతిలో లేని విషయానికి భయపడీ ప్రయోజనమేంటి? పడవ నడపగలిగినవాడు తుపానుకు భయపడడు. భయాన్ని అధిగమించాలంటే ఎరుక ఉండాలి. ఎత్తైన కొండ శిఖరాన్ని చూసి ‘అమ్మో అంతెత్తు ఎక్కగలనా’ అనుకుంటే ఎవరూ ఎక్కలేరు. ఎక్కాలన్నది మీ కోరిక. పైకి ఎక్కి అక్కడి నుంచి చుట్టూరా పరచుకున్న అందాలను చూడాలని ఆశ. అది నెరవేర్చుకోబోతున్నానన్న ఆలోచనని మదినిండా నింపుకోవాలి. కొండ శిఖరాన్ని కాకుండా విశాలంగా ఉన్న కింది భాగాన్ని చూడాలి. అక్కడి నుంచి ఒక్కో అడుగూ వేయడం మొదలెడితే శిఖరం పాదాక్రాంతం కాదూ?
భయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు తెలియని దాని గురించి భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ విషయం గురించి మనసు భయపడుతోందో దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే సహజంగానే భయం తగ్గుతుంది. పెరిగే వయసూ ముంచుకొస్తున్న వృద్ధాప్యమూ కొందరిని భయపెడతాయి. కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదనీ శరీరం అనిత్యమనే జ్ఞానం తొలి వయసులోనే పొందిన వాళ్లు మలివయసులోనూ భయపడరు.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
మనం భయపడాల్సింది భయానికేనంటారు రూజ్వెల్ట్. పిరికివాళ్లు తమ మరణానికి ముందే ఎన్నోసార్లు మరణిస్తారని, ధైర్యవంతులు మరణాన్ని ఒక్కసారే ఎదుర్కొంటారని షేక్స్పియర్ అంటాడు. అభద్రతా భావం భయానికి మూలకారణం. సహజంగానే పిరికివాళ్లు ప్రతి చిన్నదానికీ భయపడిపోతారు. ధైర్యశాలురు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటూ ముందుకువెళ్తారు.
ప్రాణికి జీవితం మీద ఆపేక్ష సహజం. మరణానికి భయపడని ప్రాణి ఏదీ ఉండదు. కానీ జ్ఞానిని రోగ మృత్యు భయాదులు దరిచేరలేవు. ‘పుత్రాదపి ధనభాజాం భీతిః’ అంటారు శంకరులు. డబ్బున్న వాడికి దాన్ని ఎక్కడ నాశనం చేసేస్తాడోనని కొడుకంటేనే భయమట. అధిక సంపద అందరినీ అనుమానించేట్టు చేస్తుంది. కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ‘ఉన్న ఊరివాడికి కాటి భయం- పొరుగూరి వాడికి నీళ్ల భయం’ అనో సామెత. సాధారణంగా ప్రతి ఊళ్లోనూ నీటి అవసరాలను తీర్చడానికొక చెరువు, దహన సంస్కారాలు నిర్వర్తించడానికి శ్మశానం తప్పనిసరిగా ఉంటాయి. ఊరివాడికి వల్లకాడు ఎటు ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రుళ్లు అటువైపు పోడు. పొరుగూరి నుంచి వచ్చిన వాడికి ఈ ఊళ్లో శ్మశానం ఎక్కడుందో తెలియదు కనుక ఆ భయం ఉండదు. కానీ నీరున్న ప్రాంతం చీకట్లో కనపడదు, కొత్త కాబట్టి లోతు తెలియదు. అందుకే అతడికి నీటి భయం.
జీవితంలో భయపడని వారుండరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయం మనల్ని భయపెట్టే ఉంటుంది. ధైర్యవంతుడు అంటే అసలు భయపడని వాడు కాదని, భయాన్ని జయించినవాడని అంటారు. భయాన్ని ఎదుర్కొనడంలోనే జీవితరహస్యం ఉంది. ఆధ్యాత్మిక గురువులు భయం అనేది కేవలం ఆలోచనే అంటారు. రకరకాల పరిస్థితులను ఊహించుకుని బెదిరిపోవడమే తప్ప భయాలన్నీ నిజాలు కావంటారు. రోగం వస్తుందేమోనని భయం, ప్రమాదం జరుగుతుందేమోనని భయం. అయినవాళ్లు దూరమవుతారేమోనని భయం. మన చేతిలో లేని విషయానికి భయపడీ ప్రయోజనమేంటి? పడవ నడపగలిగినవాడు తుపానుకు భయపడడు. భయాన్ని అధిగమించాలంటే ఎరుక ఉండాలి. ఎత్తైన కొండ శిఖరాన్ని చూసి ‘అమ్మో అంతెత్తు ఎక్కగలనా’ అనుకుంటే ఎవరూ ఎక్కలేరు. ఎక్కాలన్నది మీ కోరిక. పైకి ఎక్కి అక్కడి నుంచి చుట్టూరా పరచుకున్న అందాలను చూడాలని ఆశ. అది నెరవేర్చుకోబోతున్నానన్న ఆలోచనని మదినిండా నింపుకోవాలి. కొండ శిఖరాన్ని కాకుండా విశాలంగా ఉన్న కింది భాగాన్ని చూడాలి. అక్కడి నుంచి ఒక్కో అడుగూ వేయడం మొదలెడితే శిఖరం పాదాక్రాంతం కాదూ?
భయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు తెలియని దాని గురించి భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ విషయం గురించి మనసు భయపడుతోందో దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే సహజంగానే భయం తగ్గుతుంది. పెరిగే వయసూ ముంచుకొస్తున్న వృద్ధాప్యమూ కొందరిని భయపెడతాయి. కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదనీ శరీరం అనిత్యమనే జ్ఞానం తొలి వయసులోనే పొందిన వాళ్లు మలివయసులోనూ భయపడరు.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
సహనం సజ్జన లక్షణం
సహనం మన సంస్కృతి... అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇది యుగయుగాల సత్యం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలుణ్ని వందతప్పుల వరకు క్షమించాడు. ఆ తరవాతే చర్య తీసుకున్నాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డా జీవితాంతం సహనం వహించాడు. ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు కన్నతండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్నా విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్యకశిపుణ్ని అంతమొందించాడు. సహనం దేవుడు జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠం.
సహనం బలహీనత కాదు, గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు. అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే. అది మానవత్వం మూర్తీభవించిన శక్తి. ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి కానీ మర్మదృష్టి ఉండకూడదు. సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. ‘అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు’... అన్నారు. సహనం అంటే ఓర్పు... జీవికి మంచి మార్పు. సహనం అంటే అసమర్థత కాదు. ధార్మికమైన బలాన్ని కూడగట్టుకుని సమర్థంగా పుంజుకోవడం. ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం. సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. సహనం ఉన్నవాడు అజాత శత్రువు. అంతే కాదు, అంతశ్శత్రువులనూ జయించగలడు. ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని ఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. అసహనం చేయరాని పనులను చేయించవచ్చు. కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది.
సహనం సజ్జన లక్షణం. ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది. రజో, తమో గుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు. ఉన్నట్టు బయటికి కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు. సహజమైన ఓర్పునకు, నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి, కాకి బంగారానికి మధ్య ఉన్నంత! సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ధర్మాచరణకు బాటలు పడతాయి.
నిదానం ప్రధానమంటారు పెద్దలు. నిదానం అంటే సహనంగా ఉండటమే. సహనంలో భూమాతను మించిన వారు లేరు. జీవులు తనకు ఎన్ని అపచారాలు, అపకారాలు చేసినా భరిస్తుంటుంది. ఆ సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోకకల్యాణం సాధ్యపడుతుంది. భువికి, దివికి తేడా చెరిగిపోతుంది. సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సహనాన్ని దేశాలు అలవరచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది.
శంకర నారాయణ
సహనం మన సంస్కృతి... అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇది యుగయుగాల సత్యం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలుణ్ని వందతప్పుల వరకు క్షమించాడు. ఆ తరవాతే చర్య తీసుకున్నాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డా జీవితాంతం సహనం వహించాడు. ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు కన్నతండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్నా విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్యకశిపుణ్ని అంతమొందించాడు. సహనం దేవుడు జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠం.
సహనం బలహీనత కాదు, గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు. అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే. అది మానవత్వం మూర్తీభవించిన శక్తి. ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి కానీ మర్మదృష్టి ఉండకూడదు. సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. ‘అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు’... అన్నారు. సహనం అంటే ఓర్పు... జీవికి మంచి మార్పు. సహనం అంటే అసమర్థత కాదు. ధార్మికమైన బలాన్ని కూడగట్టుకుని సమర్థంగా పుంజుకోవడం. ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం. సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. సహనం ఉన్నవాడు అజాత శత్రువు. అంతే కాదు, అంతశ్శత్రువులనూ జయించగలడు. ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని ఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. అసహనం చేయరాని పనులను చేయించవచ్చు. కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది.
సహనం సజ్జన లక్షణం. ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది. రజో, తమో గుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు. ఉన్నట్టు బయటికి కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు. సహజమైన ఓర్పునకు, నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి, కాకి బంగారానికి మధ్య ఉన్నంత! సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ధర్మాచరణకు బాటలు పడతాయి.
నిదానం ప్రధానమంటారు పెద్దలు. నిదానం అంటే సహనంగా ఉండటమే. సహనంలో భూమాతను మించిన వారు లేరు. జీవులు తనకు ఎన్ని అపచారాలు, అపకారాలు చేసినా భరిస్తుంటుంది. ఆ సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోకకల్యాణం సాధ్యపడుతుంది. భువికి, దివికి తేడా చెరిగిపోతుంది. సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సహనాన్ని దేశాలు అలవరచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది.
శంకర నారాయణ
పర్వదినాల కార్తికం
కృత్తికా నక్షత్రం పౌర్ణమినాడు ఉండే మాసం కార్తికం. ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక, అలౌకిక, జ్ఞానాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. కార్తికం పర్వదినాల మాసం. అందుకే ‘న కార్తిక సమో మాసః’ (కార్తికానికి సమానమైన నెల మరొకటి లేదు) అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించే సంప్రదాయం కార్తికానికే ప్రత్యేకం.
దీపావళి తరవాత పాడ్యమి నుంచి కార్తికం మొదలవుతుంది. దీనికి ‘కౌముది’(వెన్నెల) మాసమని పేరుంది. సంవత్సరంలో శైవ, వైష్ణవ భగవదారాధనకు మిక్కిలి అనువైన మాసమిది. కార్తికంలో తెల్లవారుతూనే స్నానం చేయడం వల్ల కాయక, వాచిక, మానసికాది దోషాలు పోతాయంటారు. పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దునంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే ‘నక్త వ్రతం’ గురించి పద్మ, స్కాంద పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో సోమవార ఉపవాస దీక్ష కూడా విశేషమైంది. ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం, ఆ చెట్టు కింద పూజ, ప్రదక్షిణలు, భోజనం... ప్రత్యేకంగా చేయదగిన పనులుగా పౌరాణికులు చెబుతారు.
యమద్వితీయగా పేరొందిన విదియ నాడు సోదరి ఇంట భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి. కార్తిక శుద్ధ చవితి నాగుల చవితి. ఆరోజు నాగవ్రతం చేయాలని, నాగులను పూజించాలని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం సూచిస్తోంది. కార్తిక శుద్ధ ఏకాదశి (ప్రబోధనైకాదశి) చాతుర్మాస దీక్షకు ముగింపు. మర్నాడు క్షీరాబ్ధి ద్వాదశి. విష్ణువు క్షీరాబ్ధి నుంచి లక్ష్మీ, బ్రహ్మ తదితరులతో కలిసి తులసి బృందావనానికి వచ్చి భక్తులతో పూజలు అందుకుంటాడు.
కార్తికం దీపాల మాసం కూడా. ఈ నెలలో చేసే దీప దానం ప్రశస్తమైంది. దానివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కార్తిక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అనీ అంటారు. ఆనాటి మునిమాపు వేళ ఈశ్వర ప్రీతి కోసం దీపాలను వెలిగిస్తారు. ఈరోజు చేసే మరొక ప్రత్యేక ఉత్సవం జ్వాలాతోరణం. దీని గురించి పలు పురాణగాథలు ఉన్నాయి. క్షీరసాగర మథనం వేళ పుట్టిన హాలాహలాన్ని శంకరుడు లోకహితార్థం తన కంఠంలో నిలిపి వేస్తాడు. దాంతో ఆందోళన చెందిన పార్వతీదేవి ఈ గండం నుంచి బయటపడితే తాను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం కింద ముమ్మారు దూరి వస్తానని మొక్కుకుందట. అప్పటినుంచి జ్వాలాతోరణ ఉత్సవం ఏర్పడిందంటారు. ఆరోజు శివాలయాలలో ఎండు గడ్డితో తోరణాన్ని కట్టి, వెలిగిస్తారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి మండుతున్న ఆ జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు తిప్పుతారు. కార్తిక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని ‘స్మృతి కౌస్తుభం’ అనే గ్రంథం చెబుతోంది. తెల్లారగట్టే స్నానాలు, ఉపవాస దీక్షలు, దీప దానాలు ఇలా ఎన్నో పుణ్యకార్యాలను ఆచరించే పవిత్ర మంగళకర మాసం కార్తికం. వనభోజనాలతో అందరికీ ఆనందోత్సాహాలను అందించే ఆహ్లాదకర సమయం కూడా ఇది!
గంటి ఉషాబాల
కృత్తికా నక్షత్రం పౌర్ణమినాడు ఉండే మాసం కార్తికం. ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక, అలౌకిక, జ్ఞానాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. కార్తికం పర్వదినాల మాసం. అందుకే ‘న కార్తిక సమో మాసః’ (కార్తికానికి సమానమైన నెల మరొకటి లేదు) అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించే సంప్రదాయం కార్తికానికే ప్రత్యేకం.
దీపావళి తరవాత పాడ్యమి నుంచి కార్తికం మొదలవుతుంది. దీనికి ‘కౌముది’(వెన్నెల) మాసమని పేరుంది. సంవత్సరంలో శైవ, వైష్ణవ భగవదారాధనకు మిక్కిలి అనువైన మాసమిది. కార్తికంలో తెల్లవారుతూనే స్నానం చేయడం వల్ల కాయక, వాచిక, మానసికాది దోషాలు పోతాయంటారు. పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దునంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే ‘నక్త వ్రతం’ గురించి పద్మ, స్కాంద పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో సోమవార ఉపవాస దీక్ష కూడా విశేషమైంది. ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం, ఆ చెట్టు కింద పూజ, ప్రదక్షిణలు, భోజనం... ప్రత్యేకంగా చేయదగిన పనులుగా పౌరాణికులు చెబుతారు.
యమద్వితీయగా పేరొందిన విదియ నాడు సోదరి ఇంట భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి. కార్తిక శుద్ధ చవితి నాగుల చవితి. ఆరోజు నాగవ్రతం చేయాలని, నాగులను పూజించాలని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం సూచిస్తోంది. కార్తిక శుద్ధ ఏకాదశి (ప్రబోధనైకాదశి) చాతుర్మాస దీక్షకు ముగింపు. మర్నాడు క్షీరాబ్ధి ద్వాదశి. విష్ణువు క్షీరాబ్ధి నుంచి లక్ష్మీ, బ్రహ్మ తదితరులతో కలిసి తులసి బృందావనానికి వచ్చి భక్తులతో పూజలు అందుకుంటాడు.
కార్తికం దీపాల మాసం కూడా. ఈ నెలలో చేసే దీప దానం ప్రశస్తమైంది. దానివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కార్తిక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అనీ అంటారు. ఆనాటి మునిమాపు వేళ ఈశ్వర ప్రీతి కోసం దీపాలను వెలిగిస్తారు. ఈరోజు చేసే మరొక ప్రత్యేక ఉత్సవం జ్వాలాతోరణం. దీని గురించి పలు పురాణగాథలు ఉన్నాయి. క్షీరసాగర మథనం వేళ పుట్టిన హాలాహలాన్ని శంకరుడు లోకహితార్థం తన కంఠంలో నిలిపి వేస్తాడు. దాంతో ఆందోళన చెందిన పార్వతీదేవి ఈ గండం నుంచి బయటపడితే తాను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం కింద ముమ్మారు దూరి వస్తానని మొక్కుకుందట. అప్పటినుంచి జ్వాలాతోరణ ఉత్సవం ఏర్పడిందంటారు. ఆరోజు శివాలయాలలో ఎండు గడ్డితో తోరణాన్ని కట్టి, వెలిగిస్తారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి మండుతున్న ఆ జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు తిప్పుతారు. కార్తిక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని ‘స్మృతి కౌస్తుభం’ అనే గ్రంథం చెబుతోంది. తెల్లారగట్టే స్నానాలు, ఉపవాస దీక్షలు, దీప దానాలు ఇలా ఎన్నో పుణ్యకార్యాలను ఆచరించే పవిత్ర మంగళకర మాసం కార్తికం. వనభోజనాలతో అందరికీ ఆనందోత్సాహాలను అందించే ఆహ్లాదకర సమయం కూడా ఇది!
గంటి ఉషాబాల
మమతనురాగల పండుగ
మనల్ని ధర్మం రక్షించినట్లే, కరుణ కూడా కాపాడుతుంది. యముడు ధర్మం అయితే, యమున కరుణ. వారి దివ్య సోదరసోదరీ బంధమే ‘భగినీ హస్త భోజనం’ రూపంలో మనకు పండుగయ్యింది.
సూర్య భగవానుడి కుమారుడైన యముడు- ధర్మం, సత్యం, సమత్వం అనే త్రిగుణాల సమ్మేళనం. ఆయన తీర్పు కర్మఫల సిద్ధాంతానికి ప్రతీక. సత్యమే యముడి శ్వాస. యముడి చెల్లెలైన యమునను పురాణాలు పాపహారిణి, పుణ్యప్రద, కాళింది, శ్రీకృష్ణుడి అర్ధాంగిగా కృష్ణప్రియ అని స్తుతిస్తాయి. అన్న ఆశీర్వాదం చెల్లికి ఐశ్వర్యాన్నిస్తుంది. ఇలాంటి అనురాగ బంధానికి యమధర్మరాజు, యమునా ప్రతీకలుగా నిలిచారు. వారిని స్మరించుకుంటూ చేసుకునే పండుగే ‘భగినీ హస్త భోజనం’. అంటే అక్కచెల్లెళ్లు ప్రేమతో సోదరులకు భోజనం వడ్డించడం. భగినీ అంటే అక్క లేదా చెల్లి. ఈ పండుగ దీపావళి తరవాత రెండో రోజు, కార్తీక శుక్ల విదియ నాడు వస్తుంది. దీన్ని దక్షిణ భారతదేశంలో యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ అని అంటారు. ఉత్తర భారతదేశంలో భాయీ దూజ్ అని, నేపాల్లో భాయీ టిక్కా, పంజాబ్లో టిక్కా అని పిలుస్తారు. రాఖీ నాడు సోదరులను సోదరి దీవిస్తే, ఈ పండుగ రోజు సోదరుడు సోదరిని ఆశీర్వదిస్తాడు.
భగినీ హస్త భోజనం వెనక పురాణ సంబంధమైన కథ ఉంది. వివాహానంతరం తన ఇంటికి రమ్మని యమున ఎన్నిసార్లు పిలిచినా రాని యముడు కార్తికమాసం విదియ రోజున అనుకోకుండా చెల్లెలింటికి వస్తాడు. అన్న రాకతో సంతోషించిన యమున అతడికి తిలకం దిద్ది, హారతి ఇచ్చి పిండివంటలతో భోజనం పెడుతుంది. ఆ ఆనందంలో యమధర్మరాజు చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. యమున, తనకు అత్యంత ఆనందాన్నిచ్చిన ఈ రోజు, ఏ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల ఇంట్లో భోజనం చేస్తారో- వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది. చెల్లెలి నిస్వార్థ కోరికకు సంతోషించిన యముడు- కార్తికమాసంలో విదియ రోజు సోదరి చేతి భోజనం చేసిన సోదరుడికి అపమృత్యు దోషం ఉండదని... ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడట. అంతేకాకుండా తన సోదరి అనుగ్రహానికి పాత్రులైనవారికి అకాల మరణదోషం ఉండదని కూడా హామీ ఇచ్చాడట. అందుకే యమునా నదిలో స్నానం చేసినవారికి ఆకస్మిక మరణభయం ఉండదని చెబుతారు.
పద్మపురాణం ప్రకారం యమునా జలాలు మనసులోని మలినాలను కడిగేస్తాయి. యముడు శిక్షిస్తే, యమున క్షమిస్తుంది. యముడు మనలోని వివేకం. యమున హృదయం. ఒకటి ధర్మానికి మార్గం చూపితే, మరొకటి ప్రేమకు ద్వారం తెరుస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. ధర్మం తోడైన కరుణే యమున. న్యాయం తోడైన ప్రేమే మానవత్వం. భగినీ హస్త భోజనం సోదర సోదరీమణుల బాంధవ్యం బలపడటానికి చేసుకునే పర్వదినం.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్
మనల్ని ధర్మం రక్షించినట్లే, కరుణ కూడా కాపాడుతుంది. యముడు ధర్మం అయితే, యమున కరుణ. వారి దివ్య సోదరసోదరీ బంధమే ‘భగినీ హస్త భోజనం’ రూపంలో మనకు పండుగయ్యింది.
సూర్య భగవానుడి కుమారుడైన యముడు- ధర్మం, సత్యం, సమత్వం అనే త్రిగుణాల సమ్మేళనం. ఆయన తీర్పు కర్మఫల సిద్ధాంతానికి ప్రతీక. సత్యమే యముడి శ్వాస. యముడి చెల్లెలైన యమునను పురాణాలు పాపహారిణి, పుణ్యప్రద, కాళింది, శ్రీకృష్ణుడి అర్ధాంగిగా కృష్ణప్రియ అని స్తుతిస్తాయి. అన్న ఆశీర్వాదం చెల్లికి ఐశ్వర్యాన్నిస్తుంది. ఇలాంటి అనురాగ బంధానికి యమధర్మరాజు, యమునా ప్రతీకలుగా నిలిచారు. వారిని స్మరించుకుంటూ చేసుకునే పండుగే ‘భగినీ హస్త భోజనం’. అంటే అక్కచెల్లెళ్లు ప్రేమతో సోదరులకు భోజనం వడ్డించడం. భగినీ అంటే అక్క లేదా చెల్లి. ఈ పండుగ దీపావళి తరవాత రెండో రోజు, కార్తీక శుక్ల విదియ నాడు వస్తుంది. దీన్ని దక్షిణ భారతదేశంలో యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ అని అంటారు. ఉత్తర భారతదేశంలో భాయీ దూజ్ అని, నేపాల్లో భాయీ టిక్కా, పంజాబ్లో టిక్కా అని పిలుస్తారు. రాఖీ నాడు సోదరులను సోదరి దీవిస్తే, ఈ పండుగ రోజు సోదరుడు సోదరిని ఆశీర్వదిస్తాడు.
భగినీ హస్త భోజనం వెనక పురాణ సంబంధమైన కథ ఉంది. వివాహానంతరం తన ఇంటికి రమ్మని యమున ఎన్నిసార్లు పిలిచినా రాని యముడు కార్తికమాసం విదియ రోజున అనుకోకుండా చెల్లెలింటికి వస్తాడు. అన్న రాకతో సంతోషించిన యమున అతడికి తిలకం దిద్ది, హారతి ఇచ్చి పిండివంటలతో భోజనం పెడుతుంది. ఆ ఆనందంలో యమధర్మరాజు చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. యమున, తనకు అత్యంత ఆనందాన్నిచ్చిన ఈ రోజు, ఏ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల ఇంట్లో భోజనం చేస్తారో- వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది. చెల్లెలి నిస్వార్థ కోరికకు సంతోషించిన యముడు- కార్తికమాసంలో విదియ రోజు సోదరి చేతి భోజనం చేసిన సోదరుడికి అపమృత్యు దోషం ఉండదని... ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడట. అంతేకాకుండా తన సోదరి అనుగ్రహానికి పాత్రులైనవారికి అకాల మరణదోషం ఉండదని కూడా హామీ ఇచ్చాడట. అందుకే యమునా నదిలో స్నానం చేసినవారికి ఆకస్మిక మరణభయం ఉండదని చెబుతారు.
పద్మపురాణం ప్రకారం యమునా జలాలు మనసులోని మలినాలను కడిగేస్తాయి. యముడు శిక్షిస్తే, యమున క్షమిస్తుంది. యముడు మనలోని వివేకం. యమున హృదయం. ఒకటి ధర్మానికి మార్గం చూపితే, మరొకటి ప్రేమకు ద్వారం తెరుస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. ధర్మం తోడైన కరుణే యమున. న్యాయం తోడైన ప్రేమే మానవత్వం. భగినీ హస్త భోజనం సోదర సోదరీమణుల బాంధవ్యం బలపడటానికి చేసుకునే పర్వదినం.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్