తీయని బంధం
మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలోని అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు, కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేదాలు, ఎల్లలు ఉండవు. కోపాలు, అలకలు, అసూయలు తలెత్తినా అవి అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి.
ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే, స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి, చెడు రెండింటినీ మనం స్వీకరించాలి. జీవితాన్ని ఒక పుస్తకంగా భావిస్తే, అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే. బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరమైతే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరిపారేయకూడదు!
మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుడిని కలుసుకుని అతని జన్మ రహస్యం చెబుతుంది. "నీ తమ్ముళ్ల పక్షానికి వస్తే, పాండవులకు అగ్రజుడిగా నీకే పట్టాభిషేకం చేయిస్తాను. నీ తమ్ముళ్ల ప్రాణాలు కాపాడు" అని అర్థిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి, తన స్నేహితుడి వైపే నిలబడతాడు.
అలాగే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న ఒక రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి, పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు. అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి, "కృష్ణా! నేను ఎవరో నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టే నువ్వు వారిని రక్షిస్తున్నావని కూడా నాకు తెలుసు. అధర్మాన్ని అనుసరించే కౌరవులు ఎప్పటికీ గెలవలేరని కూడా నాకు తెలుసు" అంటాడు.
"ఇంత తెలిసినవాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదు?" అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి కర్ణుడు, "నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా?" అని బదులిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలను కోల్పోయిన కర్ణుడిని మించిన మంచి మిత్రుడు ఇంకెవరుంటారు!
స్నేహితుల మధ్య ప్రేమ విడిపోయిన తర్వాత కూడా చెక్కు చెదరదని చెప్పడానికి కృష్ణ, కుచేలుల స్నేహం గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. పేదరికంతో బాధపడుతున్న తన భార్య సలహాతో సహాయం అడగడానికి వచ్చిన స్నేహితుడిని కృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు. అడగకుండానే అతని పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి పేద, గొప్ప అనే తారతమ్యాలు అడ్డురాకూడదని ప్రపంచానికి చాటిచెప్పాడు.
సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కలా జీవితాంతం సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. "నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి... నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి" అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే!
మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలోని అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు, కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేదాలు, ఎల్లలు ఉండవు. కోపాలు, అలకలు, అసూయలు తలెత్తినా అవి అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి.
ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే, స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి, చెడు రెండింటినీ మనం స్వీకరించాలి. జీవితాన్ని ఒక పుస్తకంగా భావిస్తే, అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే. బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరమైతే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరిపారేయకూడదు!
మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుడిని కలుసుకుని అతని జన్మ రహస్యం చెబుతుంది. "నీ తమ్ముళ్ల పక్షానికి వస్తే, పాండవులకు అగ్రజుడిగా నీకే పట్టాభిషేకం చేయిస్తాను. నీ తమ్ముళ్ల ప్రాణాలు కాపాడు" అని అర్థిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి, తన స్నేహితుడి వైపే నిలబడతాడు.
అలాగే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న ఒక రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి, పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు. అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి, "కృష్ణా! నేను ఎవరో నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టే నువ్వు వారిని రక్షిస్తున్నావని కూడా నాకు తెలుసు. అధర్మాన్ని అనుసరించే కౌరవులు ఎప్పటికీ గెలవలేరని కూడా నాకు తెలుసు" అంటాడు.
"ఇంత తెలిసినవాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదు?" అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి కర్ణుడు, "నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా?" అని బదులిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలను కోల్పోయిన కర్ణుడిని మించిన మంచి మిత్రుడు ఇంకెవరుంటారు!
స్నేహితుల మధ్య ప్రేమ విడిపోయిన తర్వాత కూడా చెక్కు చెదరదని చెప్పడానికి కృష్ణ, కుచేలుల స్నేహం గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. పేదరికంతో బాధపడుతున్న తన భార్య సలహాతో సహాయం అడగడానికి వచ్చిన స్నేహితుడిని కృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు. అడగకుండానే అతని పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి పేద, గొప్ప అనే తారతమ్యాలు అడ్డురాకూడదని ప్రపంచానికి చాటిచెప్పాడు.
సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కలా జీవితాంతం సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. "నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి... నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి" అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే!
తథాస్తు దేవతలు
తథాస్తు... మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మనుషులకు ఇచ్చే అపురూపమైన కానుక. కష్టనష్టాల నుండి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం.
ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకువులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే ఉత్తమం అన్న భావన కొందరిని స్థిరంగా ఉండనివ్వదు. మనిషి అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా మధ్యలో వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావు లేదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యస్థుడైన మనిషికే చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే, దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలం కూడా తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరళ కృషి మాత్రమే. పట్టు వదలని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవకపోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయని పెద్దలు అంటారు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు ప్రగతికి దారిదీపం లాంటిది. మానవుడి అంతర్యామి శుద్ధి కావాలి.
'తథాస్తు' దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశస్థులు దారిచూపే దేవతలను 'ఎగ్రిగోర్స్' అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిరాటంకంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న ఉపనిషత్తుల మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది.
ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక వాస్తవం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే, కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే మనం కూడా ప్రతిఫలం కోరకుండా పనులు చేస్తే, దేవతలు తప్పకుండా మెచ్చి 'తథాస్తు' అని దీవిస్తారు.
తథాస్తు... మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మనుషులకు ఇచ్చే అపురూపమైన కానుక. కష్టనష్టాల నుండి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం.
ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకువులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే ఉత్తమం అన్న భావన కొందరిని స్థిరంగా ఉండనివ్వదు. మనిషి అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా మధ్యలో వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావు లేదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యస్థుడైన మనిషికే చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే, దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలం కూడా తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరళ కృషి మాత్రమే. పట్టు వదలని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవకపోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయని పెద్దలు అంటారు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు ప్రగతికి దారిదీపం లాంటిది. మానవుడి అంతర్యామి శుద్ధి కావాలి.
'తథాస్తు' దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశస్థులు దారిచూపే దేవతలను 'ఎగ్రిగోర్స్' అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిరాటంకంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న ఉపనిషత్తుల మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది.
ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక వాస్తవం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే, కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే మనం కూడా ప్రతిఫలం కోరకుండా పనులు చేస్తే, దేవతలు తప్పకుండా మెచ్చి 'తథాస్తు' అని దీవిస్తారు.
క్షమాగుణం: శాంతికి, ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం
క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం. ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి. క్షమ అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను, బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించడం. ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
క్షమాగుణ విశిష్టత
ధార్మిక కోణం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు. రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించడం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు ఇచ్చాడు.
ఆధ్యాత్మిక కోణం: బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు. జైనులు ఏటా 'క్షమాపణ పర్వం' జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు. యజుర్వేదం ప్రకారం, క్షమ, తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. శివపురాణం 'క్షమయే పరమధర్మం' అని బోధించింది.
మానసిక ప్రయోజనాలు:
క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వేషం మనసులో నిప్పులాంటిది. మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
క్షమాగుణాన్ని అలవరచుకోవడం
మహాత్మా గాంధీ 'క్షమ బలహీనత కాదు, బలమైన లక్షణం' అని చెప్పారు. క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి. తప్పు చేసినవారిని శిక్షించడం కంటే, వారిని మన్నించి ప్రేమించడం ద్వారా వారి మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారని శివపురాణం వివరించింది.
క్షమ అనేది సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం. ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి. క్షమ అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను, బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించడం. ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
క్షమాగుణ విశిష్టత
ధార్మిక కోణం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు. రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించడం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు ఇచ్చాడు.
ఆధ్యాత్మిక కోణం: బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు. జైనులు ఏటా 'క్షమాపణ పర్వం' జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు. యజుర్వేదం ప్రకారం, క్షమ, తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. శివపురాణం 'క్షమయే పరమధర్మం' అని బోధించింది.
మానసిక ప్రయోజనాలు:
క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వేషం మనసులో నిప్పులాంటిది. మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
క్షమాగుణాన్ని అలవరచుకోవడం
మహాత్మా గాంధీ 'క్షమ బలహీనత కాదు, బలమైన లక్షణం' అని చెప్పారు. క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి. తప్పు చేసినవారిని శిక్షించడం కంటే, వారిని మన్నించి ప్రేమించడం ద్వారా వారి మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారని శివపురాణం వివరించింది.
క్షమ అనేది సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
సురక్ష పరిధి (కంఫర్ట్ జోన్)
మూడు పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ ఒళ్లు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు సృజనాత్మకమైన, విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా రావు. సురక్షితమైన పరిధి అంటే చాలామందికి తెలియదు. అందులోనే ఉంటారు. అక్కడే బతుకుతుంటారు. కాలు తీసి బయటపెట్టరు. ఆలోచనల్లో ఉన్న వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం. పిట్టకి గూడు సురక్షితం. అలాంటి సురక్షిత పరిధుల్లో ఉన్న మనుషులు కూడా అంతే. వాటిని వదిలి రారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యమైనంత త్వరగా కంఫర్ట్జోన్ నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. కష్టాలకు సిద్ధపడాలి. కల్లోలానికి సమాయత్తమవ్వాలి. బాధపడాలి. బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవాలి. కొలిమిలా మండాలి. కొత్త ఆలోచనలకు పుటం పెట్టాలి. మండుతున్న బంగారంలా ప్రకాశించాలి. సీతాన్వేషణకు లంకకు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి. ఒక పక్క వానాకాలం. మరో పక్క సముద్రం. సురక్షితంగా గుహలో కూర్చుని ఉండలేదు శ్రీరాముడు. నాయకులతో మంతనాలు జరిపాడు. హనుమంతుణ్ని ఎన్నుకున్నాడు. సేనను ముందుకు నడిపించాడు. విజయం సాధించాడు. సురక్షితమైన పరిధిలో జీవించడానికి మనిషి భూమ్మీదకు రాలేదు. ఇంత అభివృద్ధి సాధించామంటే ఎంతోమంది తమ తమ కంఫర్ట్ జోన్లను మరిచిపోయి పనిచేయడం వల్లనే. భద్రలోకంలో బతకడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. సంపాదించిన ఆస్తులు కరగదీయవచ్చు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉండిపోవచ్చు కూడా. మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పనిసరిగా సవాళ్లను స్వీకరించాలి. జీవితమంతా సుఖమే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. కంఫర్ట్జోన్ ఒక వలలాంటిది. దాని తాళ్లు తెంచుకుని బయటపడాలి. చాలామంది తాము అందులోనే ఉన్నామని తెలియకుండా భద్రలోకంలో బతికేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఎంత త్వరగా దాని నుంచి బయట పడతామా అనుకుంటారు.
విశ్రాంతిగా ఉండటం మంచిదే కానీ జీవితమే విశ్రాంతి అయిపోకూడదు. సురక్షితమైన పరిధిలో ఎలాంటి భయాందోళనలు లేకుండా బతకొచ్చు. అయితే అది మనిషి జీవితం కాదు. ఏ ఒక్కరూ జీవితకాలం సురక్షితమైన పరిధిలో ఉండలేరు. ఎన్నో అడ్డంకులు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తల్లి గర్భమే సురక్షితం అనుకుంటే, అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి. భూమ్మీదకు వచ్చిన తరవాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితం యుద్ధంలాంటిది. ప్రతి క్షణం లోపల, బయట పోరాటాలు సాగుతూ ఉంటాయి. భద్రమైన పరిధిని దాటి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్నవాడు పాము కుబుసాన్ని విడిచి కొత్త జీవితం మొదలెట్టినట్లు, గద్ద తన ముక్కును పగలకొట్టుకుని కొత్తగా దీర్ఘ జీవితం పొంది ఆకాశంలోకి ఎగిరినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటాడు.
మూడు పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ ఒళ్లు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు సృజనాత్మకమైన, విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా రావు. సురక్షితమైన పరిధి అంటే చాలామందికి తెలియదు. అందులోనే ఉంటారు. అక్కడే బతుకుతుంటారు. కాలు తీసి బయటపెట్టరు. ఆలోచనల్లో ఉన్న వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం. పిట్టకి గూడు సురక్షితం. అలాంటి సురక్షిత పరిధుల్లో ఉన్న మనుషులు కూడా అంతే. వాటిని వదిలి రారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యమైనంత త్వరగా కంఫర్ట్జోన్ నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. కష్టాలకు సిద్ధపడాలి. కల్లోలానికి సమాయత్తమవ్వాలి. బాధపడాలి. బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవాలి. కొలిమిలా మండాలి. కొత్త ఆలోచనలకు పుటం పెట్టాలి. మండుతున్న బంగారంలా ప్రకాశించాలి. సీతాన్వేషణకు లంకకు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి. ఒక పక్క వానాకాలం. మరో పక్క సముద్రం. సురక్షితంగా గుహలో కూర్చుని ఉండలేదు శ్రీరాముడు. నాయకులతో మంతనాలు జరిపాడు. హనుమంతుణ్ని ఎన్నుకున్నాడు. సేనను ముందుకు నడిపించాడు. విజయం సాధించాడు. సురక్షితమైన పరిధిలో జీవించడానికి మనిషి భూమ్మీదకు రాలేదు. ఇంత అభివృద్ధి సాధించామంటే ఎంతోమంది తమ తమ కంఫర్ట్ జోన్లను మరిచిపోయి పనిచేయడం వల్లనే. భద్రలోకంలో బతకడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. సంపాదించిన ఆస్తులు కరగదీయవచ్చు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉండిపోవచ్చు కూడా. మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పనిసరిగా సవాళ్లను స్వీకరించాలి. జీవితమంతా సుఖమే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. కంఫర్ట్జోన్ ఒక వలలాంటిది. దాని తాళ్లు తెంచుకుని బయటపడాలి. చాలామంది తాము అందులోనే ఉన్నామని తెలియకుండా భద్రలోకంలో బతికేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఎంత త్వరగా దాని నుంచి బయట పడతామా అనుకుంటారు.
విశ్రాంతిగా ఉండటం మంచిదే కానీ జీవితమే విశ్రాంతి అయిపోకూడదు. సురక్షితమైన పరిధిలో ఎలాంటి భయాందోళనలు లేకుండా బతకొచ్చు. అయితే అది మనిషి జీవితం కాదు. ఏ ఒక్కరూ జీవితకాలం సురక్షితమైన పరిధిలో ఉండలేరు. ఎన్నో అడ్డంకులు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తల్లి గర్భమే సురక్షితం అనుకుంటే, అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి. భూమ్మీదకు వచ్చిన తరవాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితం యుద్ధంలాంటిది. ప్రతి క్షణం లోపల, బయట పోరాటాలు సాగుతూ ఉంటాయి. భద్రమైన పరిధిని దాటి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్నవాడు పాము కుబుసాన్ని విడిచి కొత్త జీవితం మొదలెట్టినట్లు, గద్ద తన ముక్కును పగలకొట్టుకుని కొత్తగా దీర్ఘ జీవితం పొంది ఆకాశంలోకి ఎగిరినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటాడు.
సుఖశాంతుల కోసం...
అర్థం తెలుసుకుని చేసిన పని ప్రయోజనకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. వరలక్ష్మీవ్రతాన్ని చేయడానికి ఎటువంటి వివక్ష లేదు. ఇన్నేళ్లు చేయాలనే నియమాలేమీ లేవు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేస్తారు. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అని అర్థం. లక్ష్మి అంటే సంపద. మనుషులు సుఖమయమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలూ సంపదలో భాగమే. వాటన్నిటిలోనూ ఉత్తమమైన వాటిని ఇచ్చేది వరలక్ష్మి. వరలక్ష్మి అంటే ‘వరాలనిచ్చే లక్ష్మి.
వ్రతం అనే మాటకి నియమం, వర్తనం మొదలైన అర్థాలున్నాయి. అంటే ఒక వ్రతం ఆచరించినప్పుడు నడవడికలో మంచిమార్పు వస్తే ఆ నోము ఫలవంతమైనట్టు. అలాంటి వ్రత మాహాత్మ్యాన్ని నిరూపించే కథ వరలక్ష్మీదేవిది. దేవిని షోడశోపచారాలతో పూజించాలి. తొమ్మిది ముడులు ఉన్న తొమ్మిది పోగుల తోరం కట్టుకోవాలి. పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కొబ్బరికాయ నివేదనకి ప్రధానం. వీలైతే, లక్ష్మీదేవికి ఆవుపాలు, బెల్లంతో పరమాన్నం చేయొచ్చు. మగధదేశంలో కుండిన నగరంలో చారుమతి అనే గృహిణి ఉన్న దాంతో తృప్తిగా ఉండేదట. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి, వరలక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకలసౌభాగ్యాలూ ప్రసాదిస్తానని చెప్పింది. లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసి నగరంలోని స్త్రీలందరినీ పిలిచి వ్రతం చేసుకుంది చారుమతి. పూజానంతరం అందరికీ ఉత్తమ ఫలితాలే లభించాయి. దాంతో ఆ స్త్రీలు చారుమతిని, వరలక్ష్మిని కీర్తించి, ఏటా వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో తులతూగారన్నది పౌరాణిక గాథ.
వరలక్ష్మీదేవి అనుగ్రహించిన స్త్రీ చారుమతి. కథలో ఆమె పేరు మాత్రమే చెప్పారు కానీ భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు లేవు. చారుమతి అంటే మంచిబుద్ధి కలది కాబట్టే, పెద్దలను భక్తిశ్రద్ధలతో సేవించుకుంది. అందరిని తనతోపాటు వ్రతం చేసుకోవడానికి పిలిచింది. వరలక్ష్మి పూజ చేయమన్నది చారుమతిని ఒక్కదానినే. అయినా తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశ పడింది చారుమతి. అమ్మను పూజించటానికి అందరు అర్హులే. ఇది గుర్తించింది కనుక ఆమె ‘చారుమతి’ అయింది. పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు- ‘ఇస్తినమ్మ వాయనం’, ‘పుచ్చుకొంటినమ్మ వాయనం’ అంటూ చెప్పిస్తారు. ‘నా వాయనం పుచ్చుకున్న వారెవరు?’ అని అడిగితే ‘నేనే వరలక్ష్మీదేవిని’ అని సమాధానం. ఈ కార్యక్రమం వల్ల సాటి మనిషిని ఆరాధ్యదైవంగా చూడటం అలవడుతుంది.
సామూహికంగా వ్రతాలు ఆచరించడంతో సమష్టితత్వం పెరుగుతుంది. అందరికీ మంచి జరగాలనుకోవడం, ఏ విధమైన వివక్షనూ పాటించక పోవడం, పెద్దలను ఆదరించడం, ఉన్నదాంతో తృప్తి చెందడం మొదలైన చారుమతిలోని గుణాలను అందరూ పెంపొందించుకోవాలి. అప్పుడు కుటుంబం సుఖశాంతులనే శ్రేష్ఠమైన సంపదతో విలసిల్లుతుంది.
అర్థం తెలుసుకుని చేసిన పని ప్రయోజనకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. వరలక్ష్మీవ్రతాన్ని చేయడానికి ఎటువంటి వివక్ష లేదు. ఇన్నేళ్లు చేయాలనే నియమాలేమీ లేవు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేస్తారు. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అని అర్థం. లక్ష్మి అంటే సంపద. మనుషులు సుఖమయమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలూ సంపదలో భాగమే. వాటన్నిటిలోనూ ఉత్తమమైన వాటిని ఇచ్చేది వరలక్ష్మి. వరలక్ష్మి అంటే ‘వరాలనిచ్చే లక్ష్మి.
వ్రతం అనే మాటకి నియమం, వర్తనం మొదలైన అర్థాలున్నాయి. అంటే ఒక వ్రతం ఆచరించినప్పుడు నడవడికలో మంచిమార్పు వస్తే ఆ నోము ఫలవంతమైనట్టు. అలాంటి వ్రత మాహాత్మ్యాన్ని నిరూపించే కథ వరలక్ష్మీదేవిది. దేవిని షోడశోపచారాలతో పూజించాలి. తొమ్మిది ముడులు ఉన్న తొమ్మిది పోగుల తోరం కట్టుకోవాలి. పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కొబ్బరికాయ నివేదనకి ప్రధానం. వీలైతే, లక్ష్మీదేవికి ఆవుపాలు, బెల్లంతో పరమాన్నం చేయొచ్చు. మగధదేశంలో కుండిన నగరంలో చారుమతి అనే గృహిణి ఉన్న దాంతో తృప్తిగా ఉండేదట. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి, వరలక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకలసౌభాగ్యాలూ ప్రసాదిస్తానని చెప్పింది. లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసి నగరంలోని స్త్రీలందరినీ పిలిచి వ్రతం చేసుకుంది చారుమతి. పూజానంతరం అందరికీ ఉత్తమ ఫలితాలే లభించాయి. దాంతో ఆ స్త్రీలు చారుమతిని, వరలక్ష్మిని కీర్తించి, ఏటా వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో తులతూగారన్నది పౌరాణిక గాథ.
వరలక్ష్మీదేవి అనుగ్రహించిన స్త్రీ చారుమతి. కథలో ఆమె పేరు మాత్రమే చెప్పారు కానీ భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు లేవు. చారుమతి అంటే మంచిబుద్ధి కలది కాబట్టే, పెద్దలను భక్తిశ్రద్ధలతో సేవించుకుంది. అందరిని తనతోపాటు వ్రతం చేసుకోవడానికి పిలిచింది. వరలక్ష్మి పూజ చేయమన్నది చారుమతిని ఒక్కదానినే. అయినా తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశ పడింది చారుమతి. అమ్మను పూజించటానికి అందరు అర్హులే. ఇది గుర్తించింది కనుక ఆమె ‘చారుమతి’ అయింది. పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు- ‘ఇస్తినమ్మ వాయనం’, ‘పుచ్చుకొంటినమ్మ వాయనం’ అంటూ చెప్పిస్తారు. ‘నా వాయనం పుచ్చుకున్న వారెవరు?’ అని అడిగితే ‘నేనే వరలక్ష్మీదేవిని’ అని సమాధానం. ఈ కార్యక్రమం వల్ల సాటి మనిషిని ఆరాధ్యదైవంగా చూడటం అలవడుతుంది.
సామూహికంగా వ్రతాలు ఆచరించడంతో సమష్టితత్వం పెరుగుతుంది. అందరికీ మంచి జరగాలనుకోవడం, ఏ విధమైన వివక్షనూ పాటించక పోవడం, పెద్దలను ఆదరించడం, ఉన్నదాంతో తృప్తి చెందడం మొదలైన చారుమతిలోని గుణాలను అందరూ పెంపొందించుకోవాలి. అప్పుడు కుటుంబం సుఖశాంతులనే శ్రేష్ఠమైన సంపదతో విలసిల్లుతుంది.
ఆత్మీయ రక్ష
శ్రావణపౌర్ణమి పర్వదినం నాడు జరుపుకొనే రాఖీపండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది. దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపజేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది. ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తుచేస్తుంది. భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీపండుగ ప్రాశస్త్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. త్రేత, ద్వాపర యుగాల్లో అక్కాచెల్లెళ్లే కాకుండా మాతృమూర్తి, అర్ధాంగి, ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ. కాలక్రమంలో ఆ సంప్రదాయం సోదరి, సోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమైపోయింది.
రక్షాధారణలో ఆ జగద్రక్షకుడి రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ఘోషిస్తోంది. ఓ మారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతుంటాడు. అప్పుడు ఆయన అర్ధాంగి శచీదేవి శ్రీమహావిష్ణువును పూజించి, భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది. వీరతిలకం దిద్ది రక్ష కట్టి సాగనంపుతుంది. ఇంద్రాణి రక్షాకంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్విజయుడై అమరావతికి తిరిగొస్తాడు. ఈ ఉదంతాన్ని ధర్మరాజుకు గుర్తుచేస్తూ, అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలిగిపోతాయని సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే చెప్పాడన్నది పురాణ కథనం.
శ్రీకృష్ణపరమాత్మ అవతార లీలల్లోనూ అన్నాచెల్లెళ్ల అనురాగబంధం సుమగంధమై పరిమళించింది. ఒకసారి గోకులనందనుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టు కట్టింది. సోదరి స్పందనకు సంతసించిన సత్యాపతి, ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు. కౌరవుల నిండు కొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్బాంధవుడై అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు. మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధన ఆచారానికి పెద్దపీట వేశారు. మహిళలకు పూజ్యస్థానాన్నిచ్చి, వారి మనోభావాలను గౌరవించారు, మనోభీష్టాలను నెరవేర్చారు. రక్షా శబ్దమే రాఖీ అయిందని పరిశోధకుల భావన. దేవతలను ఆదుకునేందుకు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడు. ఆ విష్ణుబలమే రక్షాబంధనంలో నిక్షిప్తమై ఉందని నమ్మే భక్తులు రాఖీపౌర్ణమి శుభవేళ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడం ఆనవాయితీ.
రక్షాబంధన పండుగను జంధ్యాలపూర్ణిమ, భద్రా అని కూడా పిలుస్తారు. కన్నడిగులు నార్లీపూర్ణిమ అని, తమిళులు, మలయాళీలు పౌవతి పూర్ణిమ పేర్లతో జరుపుతారు. పురుషుడు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవరచుకోవటమే రక్షాబంధనంలోని పారమార్థిక లక్ష్యం. పున్నమినాటి చంద్రుడిలా ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్ధిల్లాలని ఆశిద్దాం!
శ్రావణపౌర్ణమి పర్వదినం నాడు జరుపుకొనే రాఖీపండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది. దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపజేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది. ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తుచేస్తుంది. భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీపండుగ ప్రాశస్త్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. త్రేత, ద్వాపర యుగాల్లో అక్కాచెల్లెళ్లే కాకుండా మాతృమూర్తి, అర్ధాంగి, ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ. కాలక్రమంలో ఆ సంప్రదాయం సోదరి, సోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమైపోయింది.
రక్షాధారణలో ఆ జగద్రక్షకుడి రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ఘోషిస్తోంది. ఓ మారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతుంటాడు. అప్పుడు ఆయన అర్ధాంగి శచీదేవి శ్రీమహావిష్ణువును పూజించి, భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది. వీరతిలకం దిద్ది రక్ష కట్టి సాగనంపుతుంది. ఇంద్రాణి రక్షాకంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్విజయుడై అమరావతికి తిరిగొస్తాడు. ఈ ఉదంతాన్ని ధర్మరాజుకు గుర్తుచేస్తూ, అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలిగిపోతాయని సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే చెప్పాడన్నది పురాణ కథనం.
శ్రీకృష్ణపరమాత్మ అవతార లీలల్లోనూ అన్నాచెల్లెళ్ల అనురాగబంధం సుమగంధమై పరిమళించింది. ఒకసారి గోకులనందనుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టు కట్టింది. సోదరి స్పందనకు సంతసించిన సత్యాపతి, ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు. కౌరవుల నిండు కొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్బాంధవుడై అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు. మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధన ఆచారానికి పెద్దపీట వేశారు. మహిళలకు పూజ్యస్థానాన్నిచ్చి, వారి మనోభావాలను గౌరవించారు, మనోభీష్టాలను నెరవేర్చారు. రక్షా శబ్దమే రాఖీ అయిందని పరిశోధకుల భావన. దేవతలను ఆదుకునేందుకు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడు. ఆ విష్ణుబలమే రక్షాబంధనంలో నిక్షిప్తమై ఉందని నమ్మే భక్తులు రాఖీపౌర్ణమి శుభవేళ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడం ఆనవాయితీ.
రక్షాబంధన పండుగను జంధ్యాలపూర్ణిమ, భద్రా అని కూడా పిలుస్తారు. కన్నడిగులు నార్లీపూర్ణిమ అని, తమిళులు, మలయాళీలు పౌవతి పూర్ణిమ పేర్లతో జరుపుతారు. పురుషుడు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవరచుకోవటమే రక్షాబంధనంలోని పారమార్థిక లక్ష్యం. పున్నమినాటి చంద్రుడిలా ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్ధిల్లాలని ఆశిద్దాం!
కన్నాయ లీలలు
భగవంతుడి లీలలు అనేకం. అవి ప్రకటితం- అంటే పైకి కనిపించేవి, అప్రకటితం- అంటే పైకి కనిపించనివి... అనుకోవచ్చు. సామాన్యులకు మొదటివే తెలుస్తాయి. జ్ఞానులకు రెండూ గోచరిస్తాయి. భాగవతంలో అలాంటి ఎన్నో సందర్భాలు కనిపిస్తాయి.
భార్య ఇచ్చిన అటుకులను, బాల్య స్నేహితుడైన కృష్ణుడికి ఆప్యాయంగా సమర్పిస్తాడు సుదాముడు. శ్రీకృష్ణుడు వాటిని ఇష్టంగా ఆరగిస్తాడు. అటుకుల రూపంలో ఉన్న అపూర్వమైన భక్తి, ప్రపత్తులను భగవంతుడు స్వీకరించాడని అంతరార్థం. ‘గోకులం’ అంటే ఆవుల మంద అని అర్థం. రేపల్లెలో పెరిగిన శ్రీకృష్ణుడు బాల్యంలో మన్ను తినడానికి కారణం... గోవులుగా పుట్టిన అనేకమంది రుషుల పాదధూళి సోకి పవిత్రమైన మన్నుతో తనలో ఇమిడి ఉన్న సమస్త జీవకోటి జవసత్వాలు అద్దుకుంటుందని; అలాగే తల్లికి సమస్త భువన భాండాలు గోచరింపచేయడానికి. పెంచిన తల్లి యశోదకు లౌకిక విషయాల మీద మోహం పోగొట్టాలనుకున్నాడు పరమాత్మ. ఒక రోజు ఆమె మజ్జిగ చిలుకుతూ పరమేశ్వరుని నామస్మరణ చేస్తుండగా, బాలకృష్ణుడు స్తన్యం కోసం ఏడుపు లంకించుకున్నాడు. తల్లి తన దగ్గరికి రాగానే అవతల పొయ్యిమీద పాలు పొంగించాడు. యశోద అటు పరుగెత్తింది. అప్పుడే ఇటు పక్కన స్వయంగా పెరుగు కుండని పగలకొట్టాడు. ఆ అల్లరికి యశోదకు పట్టలేని కోపం వచ్చింది. గర్వానికి ప్రతీక అయిన కర్ర పట్టుకుని అతని వెంటబడింది. కొడుకును తాడుతో బంధించాలని ప్రయత్నించింది. కానీ తాడు సరిగ్గా రెండు అంగుళాలు తగ్గింది. ఆ రెండు అంగుళాలే అహంకార, మమకారాలు. ఆ రెండు మనలో ఉన్నంత కాలం పరమాత్ముణ్ని చేరుకోలేం.
శకటాసుర భంజనంలో అంతరార్థం మన సంసారమనే బండికి భగవంతుణ్ని రథసారథిగా చేసుకోవాలని. అప్పుడే ఆయన మన కోరికలనే అశ్వాలను అదుపు చేసి, సన్మార్గంలో నడిపించి, మనల్ని లౌకిక బంధ విముక్తులను చేస్తాడని. భగవంతుడు, తనని ఆశ్రయించిన వారి దోషాలను హరించి వేస్తాడని పూతన వధ ఘట్టం తెలియజేస్తోంది.
శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. మజ్జిగ లాంటి మన లౌకిక సంబంధాలను వదులుకుని, వెన్నలా వేరై శరణు కోరితే అక్కున చేర్చుకుంటానన్నది ఆయన ఉపదేశం. శాపగ్రస్తులై, వృక్షరూపంలో తన పాదాలను తాకిన యక్షులకు శాపవిమోచనం కలిగించడం ద్వారా, భక్తితో తనని వేడుకుంటే లౌకిక బంధాల నుంచి తప్పిస్తానన్నాడు భగవానుడు. గోపికా వస్త్రాపహరణం సమయానికి శ్రీకృష్ణుడు బాలుడు. కామమనే ప్రశ్నే ఉదయించదు. ‘మీరు మాయ అనే తెరలను(వస్త్రాలను) తొలగించుకుని రండి. మీ మోహ తెరలు(దేహంపై అభిమానం) నేను తొలగిస్తాను’ అన్నాడు పరమాత్ముడు. జీవాత్మ, పరమాత్మ మధ్య ఉండే మోహపు తెరలు తొలగిపోతేనే భగవానుడి అనుగ్రహం పొందగలం. ఇదే గోపికా వస్త్రాపహరణంలోని అంతర్లీన రహస్యం. తరచి చూడాలే కానీ ఇలాంటి ఎన్నో విషయాలను భాగవతం మనకు బోధిస్తుంది.
భగవంతుడి లీలలు అనేకం. అవి ప్రకటితం- అంటే పైకి కనిపించేవి, అప్రకటితం- అంటే పైకి కనిపించనివి... అనుకోవచ్చు. సామాన్యులకు మొదటివే తెలుస్తాయి. జ్ఞానులకు రెండూ గోచరిస్తాయి. భాగవతంలో అలాంటి ఎన్నో సందర్భాలు కనిపిస్తాయి.
భార్య ఇచ్చిన అటుకులను, బాల్య స్నేహితుడైన కృష్ణుడికి ఆప్యాయంగా సమర్పిస్తాడు సుదాముడు. శ్రీకృష్ణుడు వాటిని ఇష్టంగా ఆరగిస్తాడు. అటుకుల రూపంలో ఉన్న అపూర్వమైన భక్తి, ప్రపత్తులను భగవంతుడు స్వీకరించాడని అంతరార్థం. ‘గోకులం’ అంటే ఆవుల మంద అని అర్థం. రేపల్లెలో పెరిగిన శ్రీకృష్ణుడు బాల్యంలో మన్ను తినడానికి కారణం... గోవులుగా పుట్టిన అనేకమంది రుషుల పాదధూళి సోకి పవిత్రమైన మన్నుతో తనలో ఇమిడి ఉన్న సమస్త జీవకోటి జవసత్వాలు అద్దుకుంటుందని; అలాగే తల్లికి సమస్త భువన భాండాలు గోచరింపచేయడానికి. పెంచిన తల్లి యశోదకు లౌకిక విషయాల మీద మోహం పోగొట్టాలనుకున్నాడు పరమాత్మ. ఒక రోజు ఆమె మజ్జిగ చిలుకుతూ పరమేశ్వరుని నామస్మరణ చేస్తుండగా, బాలకృష్ణుడు స్తన్యం కోసం ఏడుపు లంకించుకున్నాడు. తల్లి తన దగ్గరికి రాగానే అవతల పొయ్యిమీద పాలు పొంగించాడు. యశోద అటు పరుగెత్తింది. అప్పుడే ఇటు పక్కన స్వయంగా పెరుగు కుండని పగలకొట్టాడు. ఆ అల్లరికి యశోదకు పట్టలేని కోపం వచ్చింది. గర్వానికి ప్రతీక అయిన కర్ర పట్టుకుని అతని వెంటబడింది. కొడుకును తాడుతో బంధించాలని ప్రయత్నించింది. కానీ తాడు సరిగ్గా రెండు అంగుళాలు తగ్గింది. ఆ రెండు అంగుళాలే అహంకార, మమకారాలు. ఆ రెండు మనలో ఉన్నంత కాలం పరమాత్ముణ్ని చేరుకోలేం.
శకటాసుర భంజనంలో అంతరార్థం మన సంసారమనే బండికి భగవంతుణ్ని రథసారథిగా చేసుకోవాలని. అప్పుడే ఆయన మన కోరికలనే అశ్వాలను అదుపు చేసి, సన్మార్గంలో నడిపించి, మనల్ని లౌకిక బంధ విముక్తులను చేస్తాడని. భగవంతుడు, తనని ఆశ్రయించిన వారి దోషాలను హరించి వేస్తాడని పూతన వధ ఘట్టం తెలియజేస్తోంది.
శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. మజ్జిగ లాంటి మన లౌకిక సంబంధాలను వదులుకుని, వెన్నలా వేరై శరణు కోరితే అక్కున చేర్చుకుంటానన్నది ఆయన ఉపదేశం. శాపగ్రస్తులై, వృక్షరూపంలో తన పాదాలను తాకిన యక్షులకు శాపవిమోచనం కలిగించడం ద్వారా, భక్తితో తనని వేడుకుంటే లౌకిక బంధాల నుంచి తప్పిస్తానన్నాడు భగవానుడు. గోపికా వస్త్రాపహరణం సమయానికి శ్రీకృష్ణుడు బాలుడు. కామమనే ప్రశ్నే ఉదయించదు. ‘మీరు మాయ అనే తెరలను(వస్త్రాలను) తొలగించుకుని రండి. మీ మోహ తెరలు(దేహంపై అభిమానం) నేను తొలగిస్తాను’ అన్నాడు పరమాత్ముడు. జీవాత్మ, పరమాత్మ మధ్య ఉండే మోహపు తెరలు తొలగిపోతేనే భగవానుడి అనుగ్రహం పొందగలం. ఇదే గోపికా వస్త్రాపహరణంలోని అంతర్లీన రహస్యం. తరచి చూడాలే కానీ ఇలాంటి ఎన్నో విషయాలను భాగవతం మనకు బోధిస్తుంది.
ఆత్మ స్తుతి….పరనింద
కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది. దుర్యోధనుడి ప్రాణమిత్రుడు, మహా పరాక్రమవంతుడు అయిన కర్ణుడి ధాటికి పాండవ సైన్యం నిలువలేకపోతోంది. సైనికులు చాలామంది మరణిస్తున్నారు. పాండవ యోధులకు ఏమీ తోచడంలేదు. కర్ణుణ్ని ఎదుర్కొనే వీరుడెవరు అని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికే ఉందని తెలుసు. కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఇది ధర్మరాజుకు నచ్చలేదు, అందుకే అర్జునుణ్ని కర్ణుడి మీదకి ఉసిగొల్పాలని అనుకున్నాడు.
యుద్ధ ధర్మం ప్రకారం రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి. అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మర్నాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూస్తూ ‘నువ్వు గొప్ప పరాక్రమవంతుణ్ని అనుకుంటున్నావు కానీ ఒట్టి పిరికివాడివి. కర్ణుణ్ని ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు. శివుణ్ని మెప్పించి శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందావు, గాండీవధారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా లేక అది కేవలం అలంకరించుకోవడానికే పనికొచ్చేదా?’ అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలకు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు. ఎవరైనా తన పాశుపతాస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని. కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాండీవాన్ని అవమానించాడు. ఏం చేయాలో తెలియక తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ‘చిన్నవాళ్లు పెద్దవాళ్లని శిక్షించాల్సిన పరిస్థితుల్లో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది. ఎందుకంటే అది వారికి మరణంతో సమానం’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ‘మీవల్లే మాకీ పరిస్థితులు వచ్చాయి, మీరు వ్యసనానికి లోనై, రాజ్యాన్ని పోగొట్టారు, మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి ఓడిపోయారు, బానిసల్ని చేశారు, ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది’ అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజుపై నానా నిందలు మోపాడు.
అనడం అయితే అనేశాడు కానీ పెద్దవాడు, ధర్మం తప్పనివాడు అయిన అన్నని నిందిస్తూ మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్రమైన మనస్తాపంతో మళ్లీ కృష్ణుణ్నే ప్రాయశ్చిత్తం అడిగాడు. అప్పుడాయన ‘నిన్ను నువ్వు పొగుడుకో, నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో. అదే నీకు ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆత్మస్తుతి కూడా మరణంతో సమానమే’ అంటూ నవ్వుతూ చెప్పాడు. కాబట్టి ఊరికే ఎవరినీ నిందించకుండా, ఆత్మస్తుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పయనించేవారే... సంఘజీవి అనిపించుకుంటారు.
కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది. దుర్యోధనుడి ప్రాణమిత్రుడు, మహా పరాక్రమవంతుడు అయిన కర్ణుడి ధాటికి పాండవ సైన్యం నిలువలేకపోతోంది. సైనికులు చాలామంది మరణిస్తున్నారు. పాండవ యోధులకు ఏమీ తోచడంలేదు. కర్ణుణ్ని ఎదుర్కొనే వీరుడెవరు అని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికే ఉందని తెలుసు. కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఇది ధర్మరాజుకు నచ్చలేదు, అందుకే అర్జునుణ్ని కర్ణుడి మీదకి ఉసిగొల్పాలని అనుకున్నాడు.
యుద్ధ ధర్మం ప్రకారం రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి. అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మర్నాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూస్తూ ‘నువ్వు గొప్ప పరాక్రమవంతుణ్ని అనుకుంటున్నావు కానీ ఒట్టి పిరికివాడివి. కర్ణుణ్ని ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు. శివుణ్ని మెప్పించి శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందావు, గాండీవధారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా లేక అది కేవలం అలంకరించుకోవడానికే పనికొచ్చేదా?’ అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలకు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు. ఎవరైనా తన పాశుపతాస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని. కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాండీవాన్ని అవమానించాడు. ఏం చేయాలో తెలియక తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ‘చిన్నవాళ్లు పెద్దవాళ్లని శిక్షించాల్సిన పరిస్థితుల్లో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది. ఎందుకంటే అది వారికి మరణంతో సమానం’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ‘మీవల్లే మాకీ పరిస్థితులు వచ్చాయి, మీరు వ్యసనానికి లోనై, రాజ్యాన్ని పోగొట్టారు, మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి ఓడిపోయారు, బానిసల్ని చేశారు, ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది’ అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజుపై నానా నిందలు మోపాడు.
అనడం అయితే అనేశాడు కానీ పెద్దవాడు, ధర్మం తప్పనివాడు అయిన అన్నని నిందిస్తూ మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్రమైన మనస్తాపంతో మళ్లీ కృష్ణుణ్నే ప్రాయశ్చిత్తం అడిగాడు. అప్పుడాయన ‘నిన్ను నువ్వు పొగుడుకో, నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో. అదే నీకు ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆత్మస్తుతి కూడా మరణంతో సమానమే’ అంటూ నవ్వుతూ చెప్పాడు. కాబట్టి ఊరికే ఎవరినీ నిందించకుండా, ఆత్మస్తుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పయనించేవారే... సంఘజీవి అనిపించుకుంటారు.
జ్ఞానమృత భండం
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత. ఇది మానవుణ్ని మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది. భవబంధాలను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూర్చుతుంది.
సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు. అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది. ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి. మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ని భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరే ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించడం కనబడదు. అర్జునుడు శ్రీకృష్ణుడి ఇష్టసఖుడు. ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సఖుణ్ని ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింప చేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడా పరమాత్మ. కృష్ణభగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికీ జ్ఞానబోధగా భాసిల్లింది గీత. ధర్మరక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూంటాడు. ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే. సత్వగుణ సంపన్నులైనవారు జ్ఞానమార్గం, బుద్ధియోగంతో విశేష సాధనచేసి మోక్షాన్ని పొందుతున్నారు. రజో, తమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే, వారు ఆధ్యాత్మిక సాధనవైపు ఆకర్షితులు కావాలి. వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు. సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు.
మనిషి అస్థిర విషయాల వలలో చిక్కుకుని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు. అఖిల సృష్టినీ ఆవరించి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు. మనిషి దేహంలోనే ఉన్నాడు. అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు. అందుకే ‘భక్తుడివై నామీద మనసు నిలిపి పూజ చెయ్యి. నమస్కరించుకో. అప్పుడిక తప్పక నన్నే పొందుతావు’ అంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు. ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించింది లేదు. అందులోని ఏ ఒక్క శ్లోకాన్నయినా తీసుకుని సగం చదివినా, విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయని వరాహ పురాణం చెబుతోంది. స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు.
నిజానికి ఈశ్వరుడికి వారు, వీరనే భేదం ఉండదు. ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన మానసాతీతుడు. రూప రహితుడు. ఆయన ఉనికిని నిర్ధారించలేం. ‘ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి’ అని విడమరచి చెబుతోంది భగవద్గీత.
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత. ఇది మానవుణ్ని మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది. భవబంధాలను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూర్చుతుంది.
సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు. అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది. ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి. మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ని భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరే ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించడం కనబడదు. అర్జునుడు శ్రీకృష్ణుడి ఇష్టసఖుడు. ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సఖుణ్ని ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింప చేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడా పరమాత్మ. కృష్ణభగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికీ జ్ఞానబోధగా భాసిల్లింది గీత. ధర్మరక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూంటాడు. ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే. సత్వగుణ సంపన్నులైనవారు జ్ఞానమార్గం, బుద్ధియోగంతో విశేష సాధనచేసి మోక్షాన్ని పొందుతున్నారు. రజో, తమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే, వారు ఆధ్యాత్మిక సాధనవైపు ఆకర్షితులు కావాలి. వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు. సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు.
మనిషి అస్థిర విషయాల వలలో చిక్కుకుని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు. అఖిల సృష్టినీ ఆవరించి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు. మనిషి దేహంలోనే ఉన్నాడు. అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు. అందుకే ‘భక్తుడివై నామీద మనసు నిలిపి పూజ చెయ్యి. నమస్కరించుకో. అప్పుడిక తప్పక నన్నే పొందుతావు’ అంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు. ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించింది లేదు. అందులోని ఏ ఒక్క శ్లోకాన్నయినా తీసుకుని సగం చదివినా, విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయని వరాహ పురాణం చెబుతోంది. స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు.
నిజానికి ఈశ్వరుడికి వారు, వీరనే భేదం ఉండదు. ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన మానసాతీతుడు. రూప రహితుడు. ఆయన ఉనికిని నిర్ధారించలేం. ‘ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి’ అని విడమరచి చెబుతోంది భగవద్గీత.
నిజమైన తపస్సు
మాళవదేశాన్ని శిఖిధ్వజుడు ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చూడాల మహాజ్ఞాన సంపన్నురాలు. ఇద్దరూ ఆత్మజ్ఞానం పొందాలనుకున్నారు. కానీ వారి మనఃస్థితులు వేరుగా ఉన్నాయి. శిఖిధ్వజుడు భౌతిక జీవితమే ఆనందకారకం అని భావించాడు. చూడాల నిజమైన జ్ఞానం కోసం భగవత్ తత్త్వాలను అధ్యయనం చేసింది. ఆత్మ కళంకం కాకపోతే జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుందని గ్రహించింది. ధ్యానం, తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందింది. రాజు భార్యలో దైవత్వాన్ని గ్రహించి ఇంత ఆనందం ఎలా పొందుతున్నావని ప్రశ్నించాడు. సుఖదుఃఖాల వ్యత్యాసం లేని స్థితిలో, ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ స్వరూపాన్ని తాను దర్శిస్తున్నానని చెప్పింది చూడాల. అది విన్న శిఖిధ్వజుణ్ని వైరాగ్యం ఆవహించింది. సంసార జీవనం వ్యర్థమని భావించి అడవులకు వెళ్లిపోయాడు. కందమూలాలు తింటూ దేహాన్ని శుష్కింపచేస్తూ తపస్సు చేస్తున్నాడు. తన భర్త అసలు తత్వాన్ని గ్రహించలేకపోయాడని తెలుసుకున్న చూడాల ఆయనకు నిజమైన ఆధ్యాత్మికజ్ఞానం కలుగజేయాలనుకుంది. యోగబలంతో ‘కౌమారి’ అనే యోగినిగా మారి ఆయనను సమీపించింది.
ఎంత ప్రయత్నించినా తపస్సుకు ఏకాగ్రత కుదరని శిఖిధ్వజుడు ఆ యోగినీమాత ముఖంలో ప్రశాంతత, వర్ఛస్సు, ఆనందం చూసి మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగాడు. అప్పుడామె రాజుకు జ్ఞానోపదేశం చేస్తూ.. నిజమైన వైరాగ్యం అంటే శరీరాన్ని వదిలేయడం కాదు, మనసును వదిలేయడం; సంసారాన్ని వదిలేయడం కాదు, మనసులోని అహంకారాన్ని కోరికలను వదిలేయడం... అదే నిజమైన మోక్షం- అని చెప్పింది. నువ్వు రాజ్యాన్ని, భార్యను వదిలావు కానీ మనసునూ మోహాన్నీ వదలలేదు. అదే నీకు బంధనం అవుతోంది అని వివరించింది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న శిఖిధ్వజుడు యోగినికి నమస్కరించి- నిజమే, తపస్సు మనసులో ఉండాలి కానీ బయట కాదన్న నిజాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు. క్రమంగా తనకీ ఆనందానుభూతి కలగడాన్ని అతడు గ్రహించాడు. అప్పుడు చూడాల తన నిజరూపాన్ని చూపగా ఆమెను గురువుగా భావించి నమస్కరించాడు శిఖిధ్వజుడు. నిజమైన జ్ఞానంతో రాజ్యంలోకి తిరిగి వచ్చిన ఆ రాజు వాస్తవమైన ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేశాడు. అనంతరం దంపతులిద్దరూ మోక్షాన్ని పొందారు.
వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠుడు శ్రీరాముడికి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేస్తూ ఆత్మజ్ఞానం ఎలా పొందాలో ఈ కథ ద్వారా వివరించాడు. తపస్సు అంటే- మనసును మౌనం చేయడం, మనసే బంధనాలకు కారణమని గ్రహించడం. ‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ అని భగవద్గీత చెప్పినట్టు గురువు ఆశ్రయం లేకుండా జ్ఞానం రాదని చూడాలోపాఖ్యానం తెలియజేసింది.
మోక్షం అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, బ్రహ్మాన్ని గ్రహించడం. అంతేకాదు, జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని సాధించడాన్నే జీవన్ముక్తి అంటారు. అన్నీ వదిలేసినవాడు కాదు... ప్రపంచంలోనే, ప్రపంచంతోనే సంచరిస్తూ ఆకర్షణలకు లొంగక జ్ఞానంతో జీవించగలిగిన వాడే నిజమైన ముని.
మాళవదేశాన్ని శిఖిధ్వజుడు ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చూడాల మహాజ్ఞాన సంపన్నురాలు. ఇద్దరూ ఆత్మజ్ఞానం పొందాలనుకున్నారు. కానీ వారి మనఃస్థితులు వేరుగా ఉన్నాయి. శిఖిధ్వజుడు భౌతిక జీవితమే ఆనందకారకం అని భావించాడు. చూడాల నిజమైన జ్ఞానం కోసం భగవత్ తత్త్వాలను అధ్యయనం చేసింది. ఆత్మ కళంకం కాకపోతే జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుందని గ్రహించింది. ధ్యానం, తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందింది. రాజు భార్యలో దైవత్వాన్ని గ్రహించి ఇంత ఆనందం ఎలా పొందుతున్నావని ప్రశ్నించాడు. సుఖదుఃఖాల వ్యత్యాసం లేని స్థితిలో, ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ స్వరూపాన్ని తాను దర్శిస్తున్నానని చెప్పింది చూడాల. అది విన్న శిఖిధ్వజుణ్ని వైరాగ్యం ఆవహించింది. సంసార జీవనం వ్యర్థమని భావించి అడవులకు వెళ్లిపోయాడు. కందమూలాలు తింటూ దేహాన్ని శుష్కింపచేస్తూ తపస్సు చేస్తున్నాడు. తన భర్త అసలు తత్వాన్ని గ్రహించలేకపోయాడని తెలుసుకున్న చూడాల ఆయనకు నిజమైన ఆధ్యాత్మికజ్ఞానం కలుగజేయాలనుకుంది. యోగబలంతో ‘కౌమారి’ అనే యోగినిగా మారి ఆయనను సమీపించింది.
ఎంత ప్రయత్నించినా తపస్సుకు ఏకాగ్రత కుదరని శిఖిధ్వజుడు ఆ యోగినీమాత ముఖంలో ప్రశాంతత, వర్ఛస్సు, ఆనందం చూసి మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగాడు. అప్పుడామె రాజుకు జ్ఞానోపదేశం చేస్తూ.. నిజమైన వైరాగ్యం అంటే శరీరాన్ని వదిలేయడం కాదు, మనసును వదిలేయడం; సంసారాన్ని వదిలేయడం కాదు, మనసులోని అహంకారాన్ని కోరికలను వదిలేయడం... అదే నిజమైన మోక్షం- అని చెప్పింది. నువ్వు రాజ్యాన్ని, భార్యను వదిలావు కానీ మనసునూ మోహాన్నీ వదలలేదు. అదే నీకు బంధనం అవుతోంది అని వివరించింది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న శిఖిధ్వజుడు యోగినికి నమస్కరించి- నిజమే, తపస్సు మనసులో ఉండాలి కానీ బయట కాదన్న నిజాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు. క్రమంగా తనకీ ఆనందానుభూతి కలగడాన్ని అతడు గ్రహించాడు. అప్పుడు చూడాల తన నిజరూపాన్ని చూపగా ఆమెను గురువుగా భావించి నమస్కరించాడు శిఖిధ్వజుడు. నిజమైన జ్ఞానంతో రాజ్యంలోకి తిరిగి వచ్చిన ఆ రాజు వాస్తవమైన ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేశాడు. అనంతరం దంపతులిద్దరూ మోక్షాన్ని పొందారు.
వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠుడు శ్రీరాముడికి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేస్తూ ఆత్మజ్ఞానం ఎలా పొందాలో ఈ కథ ద్వారా వివరించాడు. తపస్సు అంటే- మనసును మౌనం చేయడం, మనసే బంధనాలకు కారణమని గ్రహించడం. ‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ అని భగవద్గీత చెప్పినట్టు గురువు ఆశ్రయం లేకుండా జ్ఞానం రాదని చూడాలోపాఖ్యానం తెలియజేసింది.
మోక్షం అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, బ్రహ్మాన్ని గ్రహించడం. అంతేకాదు, జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని సాధించడాన్నే జీవన్ముక్తి అంటారు. అన్నీ వదిలేసినవాడు కాదు... ప్రపంచంలోనే, ప్రపంచంతోనే సంచరిస్తూ ఆకర్షణలకు లొంగక జ్ఞానంతో జీవించగలిగిన వాడే నిజమైన ముని.
అనిశ్చితే నిశ్చితి
‘అనిశ్చితే నిశ్చితి. అభద్రతతో జీవించడంలోనే భద్రత’ ఉంటుంది అని గణితశాస్త్రజ్ఞుడు జాన్ అలెన్ పౌలస్ అంటారు. అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది. అదే స్వీకరిస్తే ఉల్లాసానికి, సృజనాత్మకతకు దారితీస్తుంది. ఉన్నదున్నట్లుగా స్వీకరించడం మనం ఎదుర్కొనే సవాలు. నిశ్చితికోసం వెతకడం అర్థరహితం. అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం. పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. శక్తికొద్దీ వాటిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు అద్భుతమైన ఫలితాలు చూస్తాం. కాని అవి మనం ఊహించినవి కాకపోవచ్చు. అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి.
ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధసూత్రాలను తు.చ.తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలికింద ఏదో నలిగినట్లు అనిపించింది. కప్పను కాలితో తొక్కి చంపేశాననుకుని చాలా బాధపడ్డాడు. నిద్ర కూడా సరిగా పట్టలేదు. పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది. తాను ఏ ప్రాణికీ హాని చేయలేదని తెలిశాకే అతడిలో అశాంతి మాయమైంది.
ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం. దుఃఖపడతాం. చెడు జరగకముందే జరిగినట్లుగా ఊహించుకుని భద్రత లేదనుకుంటాం. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. జీవితం అంటేనే అనిశ్చితి. అంతమాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే- అది ఒత్తిడికి దారితీస్తుంది. భౌతిక, మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. ఏ పనీ చేయలేం. అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి. ఏకాగ్రత పెంపొందించుకుని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన, నిరాశ కలుగుతాయి. నిస్సహాయత ఎదురవుతుంది. చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు. కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది. మనకీ సౌకర్యాలన్నీ సమకూరాయి. అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. పనిచేయడం వరకే మన కర్తవ్యం, ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది.
చాలావరకు నిత్యజీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాం. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం. ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం. అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు. అలాంటి వాళ్లు శరీరంపట్ల, మనసుపట్ల శ్రద్ధ వహించాలి. కంటినిండుగా నిద్రపోవాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. అంతా మంచే జరుగుతుందని, కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి. ఒకవేళ రాకపోతే మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ నిరుత్సాహపడకూడదు. సహనాన్ని పెంపొందించుకోవాలి. నిత్యజీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం... అభిలషణీయం, ఆరోగ్యదాయకం.
తరిగొప్పుల విఎల్లెన్
‘అనిశ్చితే నిశ్చితి. అభద్రతతో జీవించడంలోనే భద్రత’ ఉంటుంది అని గణితశాస్త్రజ్ఞుడు జాన్ అలెన్ పౌలస్ అంటారు. అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది. అదే స్వీకరిస్తే ఉల్లాసానికి, సృజనాత్మకతకు దారితీస్తుంది. ఉన్నదున్నట్లుగా స్వీకరించడం మనం ఎదుర్కొనే సవాలు. నిశ్చితికోసం వెతకడం అర్థరహితం. అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం. పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. శక్తికొద్దీ వాటిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు అద్భుతమైన ఫలితాలు చూస్తాం. కాని అవి మనం ఊహించినవి కాకపోవచ్చు. అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి.
ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధసూత్రాలను తు.చ.తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలికింద ఏదో నలిగినట్లు అనిపించింది. కప్పను కాలితో తొక్కి చంపేశాననుకుని చాలా బాధపడ్డాడు. నిద్ర కూడా సరిగా పట్టలేదు. పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది. తాను ఏ ప్రాణికీ హాని చేయలేదని తెలిశాకే అతడిలో అశాంతి మాయమైంది.
ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం. దుఃఖపడతాం. చెడు జరగకముందే జరిగినట్లుగా ఊహించుకుని భద్రత లేదనుకుంటాం. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. జీవితం అంటేనే అనిశ్చితి. అంతమాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే- అది ఒత్తిడికి దారితీస్తుంది. భౌతిక, మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. ఏ పనీ చేయలేం. అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి. ఏకాగ్రత పెంపొందించుకుని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన, నిరాశ కలుగుతాయి. నిస్సహాయత ఎదురవుతుంది. చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు. కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది. మనకీ సౌకర్యాలన్నీ సమకూరాయి. అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. పనిచేయడం వరకే మన కర్తవ్యం, ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది.
చాలావరకు నిత్యజీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాం. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం. ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం. అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు. అలాంటి వాళ్లు శరీరంపట్ల, మనసుపట్ల శ్రద్ధ వహించాలి. కంటినిండుగా నిద్రపోవాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. అంతా మంచే జరుగుతుందని, కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి. ఒకవేళ రాకపోతే మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ నిరుత్సాహపడకూడదు. సహనాన్ని పెంపొందించుకోవాలి. నిత్యజీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం... అభిలషణీయం, ఆరోగ్యదాయకం.
తరిగొప్పుల విఎల్లెన్
పూర్ణ పురుషుడు
భగవంతుడు అన్ని ప్రాణులలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. జగత్తు అంతా ఆయన మాయే. దానికి వశుడై ఉన్న జీవుడు ‘నేనే చేస్తున్నాను, అంతా నాదే, అన్నీ నాకే తెలుసు’ అనే అజ్ఞానపాశాలతో బంధితుడవుతున్నాడు. అరిషడ్వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు. అందుకే మనిషి సంపూర్ణుడు కాలేకపోతున్నాడు. అజ్ఞానాంధకారంలో చిక్కుకుని జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించలేకపోతున్నాడు.
భగవంతుడు పూర్ణ పురుషుడు. మనిషిగా జన్మించి, తనేమిటో, తన తత్త్వమేమిటో లోకానికి స్పష్టంగా విశదపరిచాడు. బ్రహ్మ సృష్టిలోని చాకచక్యం అంతా కృష్ణుడి రూపంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే అందరూ చేసే పనులు ఆపేసి మరీ చెంతకుచేరి ఆయన్నే చూస్తూ ఉండి పోయేవారు. త్రిగుణాత్మకమైన ప్రకృతికి, ముల్లోకాలకు ఆయనే అధిపతి. స్వయం ప్రకాశుడు, ఆనంద స్వరూపుడు. ఇక వినయంలో కృష్ణుడికి సాటి ఎవరూ లేరు. కంసవధ అనంతరం దేవకీ వసుదేవులకు నమస్కరించి ‘ఇన్నేళ్లుగా మీ పాదసేవా భాగ్యాన్ని పొందలేకపోయాను. క్షమించి అనుగ్రహించండి‘ అని వేడుకున్నాడు. కృష్ణుడి వల్లనే ఉగ్రసేనుడు మహారాజయ్యాడు. అయినా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడి గౌరవంగా ‘మహారాజా!’ అని మాట్లాడేవాడు. తనను చూడవచ్చిన బంధువులు, పెద్దలకు తలవంచి నమస్కరించేవాడు.
దయామయుడైన శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో తనను మట్టుపెట్టాలని వచ్చిన పూతనని కూడా అవే పుణ్యలోకాలకు పంపాడు. తన పట్ల శత్రుభావంగల రాక్షసులు కూడా తన భక్తులే అని భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణదర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కృష్ణుడు ఏకసంథాగ్రాహి. సాందీపని మహర్షి ఆశ్రమంలో వేదాన్ని అధ్యయనం చేశాడు. మరణించిన గురుపుత్రుణ్ని పంచజనుడు అనే రాక్షసుడి ఉదరం నుంచి బయటకు రప్పించి గురుదక్షిణ ఇచ్చాడు. పరమాత్మ గృహస్థ ధర్మాన్ని పాటించి అష్టదేవేరులను ఆనందపరిచాడు. సచ్చిదానందమైన జ్ఞానంతో నిష్ఠ కలవాడై ద్వారకను సమర్థంగా పాలించాడు. లోకంలో జ్ఞానమార్గాన్ని నిలబెట్టాడు. అపూర్వ గీతావాణిని అందించాడు.
కోరికలు లేకుండా, కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించాడు. కాల మృత్యుస్వరూపుడైనా శత్రువులకు భయపడి ద్వారకా ద్వీపంలో తలదాచుకున్నట్లు నాటకమాడాడు. ఒక వంక ‘జగత్తును నడిపించేది నేనే’నంటూనే మరో వంక ‘నిమిత్తమాత్రుణ్ని, నాకేమీ తెలియద’ని అనేవాడు. ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే గానీ ఆ తత్త్వం అర్థం కాదు. పరమ భక్తి కలిగినవారు నిత్యమూ భగవత్ సాన్నిధ్యాన్నే కోరుకుంటారు. వారి దృష్టి ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. పాండవులు అంతటి భక్తిపరులు కాబట్టే వారికి రాజ్యం దక్కింది. ఇలాంటి పరాభక్తిని సాధన చేస్తే దైవం తనను తానే సమర్పించుకుంటాడు. దూడ వెంట గోవులా మన వెంటే ఉంటాడు.
మాడుగుల రామకృష్ణ
భగవంతుడు అన్ని ప్రాణులలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. జగత్తు అంతా ఆయన మాయే. దానికి వశుడై ఉన్న జీవుడు ‘నేనే చేస్తున్నాను, అంతా నాదే, అన్నీ నాకే తెలుసు’ అనే అజ్ఞానపాశాలతో బంధితుడవుతున్నాడు. అరిషడ్వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు. అందుకే మనిషి సంపూర్ణుడు కాలేకపోతున్నాడు. అజ్ఞానాంధకారంలో చిక్కుకుని జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించలేకపోతున్నాడు.
భగవంతుడు పూర్ణ పురుషుడు. మనిషిగా జన్మించి, తనేమిటో, తన తత్త్వమేమిటో లోకానికి స్పష్టంగా విశదపరిచాడు. బ్రహ్మ సృష్టిలోని చాకచక్యం అంతా కృష్ణుడి రూపంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే అందరూ చేసే పనులు ఆపేసి మరీ చెంతకుచేరి ఆయన్నే చూస్తూ ఉండి పోయేవారు. త్రిగుణాత్మకమైన ప్రకృతికి, ముల్లోకాలకు ఆయనే అధిపతి. స్వయం ప్రకాశుడు, ఆనంద స్వరూపుడు. ఇక వినయంలో కృష్ణుడికి సాటి ఎవరూ లేరు. కంసవధ అనంతరం దేవకీ వసుదేవులకు నమస్కరించి ‘ఇన్నేళ్లుగా మీ పాదసేవా భాగ్యాన్ని పొందలేకపోయాను. క్షమించి అనుగ్రహించండి‘ అని వేడుకున్నాడు. కృష్ణుడి వల్లనే ఉగ్రసేనుడు మహారాజయ్యాడు. అయినా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడి గౌరవంగా ‘మహారాజా!’ అని మాట్లాడేవాడు. తనను చూడవచ్చిన బంధువులు, పెద్దలకు తలవంచి నమస్కరించేవాడు.
దయామయుడైన శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో తనను మట్టుపెట్టాలని వచ్చిన పూతనని కూడా అవే పుణ్యలోకాలకు పంపాడు. తన పట్ల శత్రుభావంగల రాక్షసులు కూడా తన భక్తులే అని భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణదర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కృష్ణుడు ఏకసంథాగ్రాహి. సాందీపని మహర్షి ఆశ్రమంలో వేదాన్ని అధ్యయనం చేశాడు. మరణించిన గురుపుత్రుణ్ని పంచజనుడు అనే రాక్షసుడి ఉదరం నుంచి బయటకు రప్పించి గురుదక్షిణ ఇచ్చాడు. పరమాత్మ గృహస్థ ధర్మాన్ని పాటించి అష్టదేవేరులను ఆనందపరిచాడు. సచ్చిదానందమైన జ్ఞానంతో నిష్ఠ కలవాడై ద్వారకను సమర్థంగా పాలించాడు. లోకంలో జ్ఞానమార్గాన్ని నిలబెట్టాడు. అపూర్వ గీతావాణిని అందించాడు.
కోరికలు లేకుండా, కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించాడు. కాల మృత్యుస్వరూపుడైనా శత్రువులకు భయపడి ద్వారకా ద్వీపంలో తలదాచుకున్నట్లు నాటకమాడాడు. ఒక వంక ‘జగత్తును నడిపించేది నేనే’నంటూనే మరో వంక ‘నిమిత్తమాత్రుణ్ని, నాకేమీ తెలియద’ని అనేవాడు. ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే గానీ ఆ తత్త్వం అర్థం కాదు. పరమ భక్తి కలిగినవారు నిత్యమూ భగవత్ సాన్నిధ్యాన్నే కోరుకుంటారు. వారి దృష్టి ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. పాండవులు అంతటి భక్తిపరులు కాబట్టే వారికి రాజ్యం దక్కింది. ఇలాంటి పరాభక్తిని సాధన చేస్తే దైవం తనను తానే సమర్పించుకుంటాడు. దూడ వెంట గోవులా మన వెంటే ఉంటాడు.
మాడుగుల రామకృష్ణ
జీవితాన్ని అంగీకరిద్దాం
పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు, కనిపించని చైతన్యశక్తి. అది ఉన్నందుకే సకల చరాచరాలు అస్తిత్వంలో ఉన్నాయి. జీవన గమనానికి ప్రకృతి దిశానిర్దేశమే ప్రామాణికం. దాని అడుగుజాడల్లో పయనించే పశు పక్ష్యాదులు ఆనందంగా ఉంటున్నాయి. కానీ, మనిషి మాత్రం భారంగా బతుకీడుస్తూ దుఃఖంతో ఉంటున్నాడు. అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకు నియమనిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడం, గాలి వీచినవైపు నడవకపోవడం, ప్రకృతిధర్మాల్ని అసలే లెక్కచెయ్యక వాటిని తుంగలో తొక్కేయడం... ఇదంతా మనిషి అజ్ఞానానికి పర్యవసానం. అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది. అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు.
పులిని ధైర్యానికి ప్రతీకగా, పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం. ఈ పోలికలు మనిషి ఆలోచనలే కానీ పులికి, పిల్లికి అవేమీ తెలియవు. అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి. సమయానుకూలంగా నడచుకుంటాయి. అంతేగానీ పౌరుషానికి పోవు, ఎవరి మెప్పూ పొందాలని అనుకోవు. ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాదుతున్నాడు. కాసేపటికి మూసిన గది తలుపులు గభాల్న తెరచుకున్నాయి. పిల్లి ఎదురుతిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగు లంకించుకున్నాడన్న మాట. సాధుజంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలా మారింది. మరోచోట... ఊళ్లోకి పులి వచ్చింది. జనం గుంపుగా కర్రలతో దాని దారికడ్డంగా నిలిచారు. అప్పుడా పులి రెండడుగులు వెనక్కి వేసి తేరిపారజూసి వచ్చిన దారిన వెళ్లిపోయింది. అంతటి పెద్దపులి తనను చూసి పిల్లిలా వెనుదిరిగిందని మనిషి బీరాలు పోతాడు. నిజానికి ఆ జంతువుకు అవేమీ పట్టవు. ప్రతి జీవి సాధ్యమైనంత వరకు తనకే ఆపదా రాకుండా జీవించి ఉండాలని కోరుకుంటుంది. పరిస్థితిపై తనది పై చేయి కాగలదనుకుంటేనూ, తప్పనిసరి అయితేనూ మాత్రమే అది ప్రతిఘటిస్తుంది. ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా అక్కడినుంచి నిష్క్రమిస్తుంది. అంతేగానీ ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోదు. వెనుకడుగు వెయ్యడాన్ని చిన్నతనమనుకోదు. అది వాటి సహజస్వభావమే కానీ రాజీపడటమో ఓటమిని అంగీకరించడమో కాదు. ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే. ఒక పెద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణంలో పెద్ద కొండ అడ్డువచ్చింది. అప్పుడా నది పరుగు వేగం తగ్గింది, కాస్త వెనక్కి మళ్లింది. కాసేపటికి కొండ పక్కనుంచి కొత్తదారి చూసుకుని ప్రయాణం కొనసాగించింది. ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగమే.
మిగిలిన రాళ్లకన్నా నాలుగు ఉలిదెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలందుకుంటుంది. పట్టాభిషిక్తుడు కావాల్సిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆచంద్రతారార్కం దేవుడై నిలిచాడు. లక్ష్యసాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురుదెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలే తప్ప పరాజయాలుగా కాదు. ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి. సందర్భానికి తగినట్లుగా స్పందించాలి.
మునిమడుగుల రాజారావు
పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు, కనిపించని చైతన్యశక్తి. అది ఉన్నందుకే సకల చరాచరాలు అస్తిత్వంలో ఉన్నాయి. జీవన గమనానికి ప్రకృతి దిశానిర్దేశమే ప్రామాణికం. దాని అడుగుజాడల్లో పయనించే పశు పక్ష్యాదులు ఆనందంగా ఉంటున్నాయి. కానీ, మనిషి మాత్రం భారంగా బతుకీడుస్తూ దుఃఖంతో ఉంటున్నాడు. అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకు నియమనిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడం, గాలి వీచినవైపు నడవకపోవడం, ప్రకృతిధర్మాల్ని అసలే లెక్కచెయ్యక వాటిని తుంగలో తొక్కేయడం... ఇదంతా మనిషి అజ్ఞానానికి పర్యవసానం. అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది. అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు.
పులిని ధైర్యానికి ప్రతీకగా, పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం. ఈ పోలికలు మనిషి ఆలోచనలే కానీ పులికి, పిల్లికి అవేమీ తెలియవు. అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి. సమయానుకూలంగా నడచుకుంటాయి. అంతేగానీ పౌరుషానికి పోవు, ఎవరి మెప్పూ పొందాలని అనుకోవు. ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాదుతున్నాడు. కాసేపటికి మూసిన గది తలుపులు గభాల్న తెరచుకున్నాయి. పిల్లి ఎదురుతిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగు లంకించుకున్నాడన్న మాట. సాధుజంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలా మారింది. మరోచోట... ఊళ్లోకి పులి వచ్చింది. జనం గుంపుగా కర్రలతో దాని దారికడ్డంగా నిలిచారు. అప్పుడా పులి రెండడుగులు వెనక్కి వేసి తేరిపారజూసి వచ్చిన దారిన వెళ్లిపోయింది. అంతటి పెద్దపులి తనను చూసి పిల్లిలా వెనుదిరిగిందని మనిషి బీరాలు పోతాడు. నిజానికి ఆ జంతువుకు అవేమీ పట్టవు. ప్రతి జీవి సాధ్యమైనంత వరకు తనకే ఆపదా రాకుండా జీవించి ఉండాలని కోరుకుంటుంది. పరిస్థితిపై తనది పై చేయి కాగలదనుకుంటేనూ, తప్పనిసరి అయితేనూ మాత్రమే అది ప్రతిఘటిస్తుంది. ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా అక్కడినుంచి నిష్క్రమిస్తుంది. అంతేగానీ ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోదు. వెనుకడుగు వెయ్యడాన్ని చిన్నతనమనుకోదు. అది వాటి సహజస్వభావమే కానీ రాజీపడటమో ఓటమిని అంగీకరించడమో కాదు. ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే. ఒక పెద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణంలో పెద్ద కొండ అడ్డువచ్చింది. అప్పుడా నది పరుగు వేగం తగ్గింది, కాస్త వెనక్కి మళ్లింది. కాసేపటికి కొండ పక్కనుంచి కొత్తదారి చూసుకుని ప్రయాణం కొనసాగించింది. ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగమే.
మిగిలిన రాళ్లకన్నా నాలుగు ఉలిదెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలందుకుంటుంది. పట్టాభిషిక్తుడు కావాల్సిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆచంద్రతారార్కం దేవుడై నిలిచాడు. లక్ష్యసాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురుదెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలే తప్ప పరాజయాలుగా కాదు. ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి. సందర్భానికి తగినట్లుగా స్పందించాలి.
మునిమడుగుల రాజారావు
పుష్ప వైభవం
సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారుండరు. పూజాద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్ర నామార్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతిచెందుతాడు.
శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాలసేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్నవారి మనసు అనే పుష్పం శ్రీవారి పాదాలచెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారి కల్యాణమండపంలో జరిగే పుష్పయాగమూ చూసి తీరాల్సింది. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృథాగా పారవేయట్లేదు. వాటితో అగరుబత్తులు, పరిమళద్రవ్యాలు తయారుచేస్తున్నారు. ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతుడికి సేవజేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి.
కమలనాభుడు విష్ణుమూర్తి. కమల సంభవుడు బ్రహ్మ. శ్రీమహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. సరస్వతీ దేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర. ‘చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా’ అని లలితా సహస్ర నామ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తాం. రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్రతామరల కొలనులో సుగంధం వ్యాపించింది. తుమ్మెదల ఝంకార ధ్వనులతో కూడిన కలువపూల దండ పట్టుకుని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జిల్లేడు, గన్నేరు, జాజి, మల్లె, పారిజాత పువ్వులతో శివుణ్ని పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివపురాణం చెబుతోంది. భగవంతుడికి ప్రీతి పాత్రమైన పుష్పాలు మనుషుల మనసులనూ మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరుగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండుగ చేసేదని కాళిదాసు వర్ణించాడు.
కనువిందు చేసే రంగులతో, మైమరపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవమాత్రులకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాలదగ్గర పువ్వులను ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే!
ఇంద్రగంటి నరసింహమూర్తి
సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారుండరు. పూజాద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్ర నామార్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతిచెందుతాడు.
శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాలసేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్నవారి మనసు అనే పుష్పం శ్రీవారి పాదాలచెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారి కల్యాణమండపంలో జరిగే పుష్పయాగమూ చూసి తీరాల్సింది. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృథాగా పారవేయట్లేదు. వాటితో అగరుబత్తులు, పరిమళద్రవ్యాలు తయారుచేస్తున్నారు. ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతుడికి సేవజేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి.
కమలనాభుడు విష్ణుమూర్తి. కమల సంభవుడు బ్రహ్మ. శ్రీమహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. సరస్వతీ దేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర. ‘చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా’ అని లలితా సహస్ర నామ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తాం. రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్రతామరల కొలనులో సుగంధం వ్యాపించింది. తుమ్మెదల ఝంకార ధ్వనులతో కూడిన కలువపూల దండ పట్టుకుని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జిల్లేడు, గన్నేరు, జాజి, మల్లె, పారిజాత పువ్వులతో శివుణ్ని పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివపురాణం చెబుతోంది. భగవంతుడికి ప్రీతి పాత్రమైన పుష్పాలు మనుషుల మనసులనూ మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరుగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండుగ చేసేదని కాళిదాసు వర్ణించాడు.
కనువిందు చేసే రంగులతో, మైమరపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవమాత్రులకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాలదగ్గర పువ్వులను ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే!
ఇంద్రగంటి నరసింహమూర్తి
నిరంతర సాధన
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ‘సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా’ అన్నారో సినీకవి. భగీరథుడి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివినుంచి భువికి దిగింది భాగీరథి. రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడైంది.
సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు, అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం. ఏ పని సిద్ధించాలన్నా సాధన అవసరం. అందుకు కావాల్సింది ఓపిక. కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది. సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది. మనోనిగ్రహం లభించాలంటే రోజుకు ఒక గంటో రెండు గంటలో మనసును నియంత్రించి, మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయడం కాదు. ప్రతిక్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలోకి తేగలం. అలా తెచ్చుకుని, మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం. గీతాచార్యుడూ అదే చెప్పాడు.
గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు. అతణ్ని పూజామందిరం శుభ్రం చేయమన్నారు. తనకు ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావుడిగా పని పూర్తిచేశాడు. గురువు మందిరానికి వెళ్లి చేత్తో తడిమితే దుమ్ము అంటుకుంది. శిష్యుణ్ని పిలిచి ‘నేను చెప్పాను, నువ్వు చేశావు. అంతేకానీ జరగాల్సిన రీతిలో పని జరగలేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ప్రవచనాలు వినడం, నియమిత సమయాలలో జపధ్యానాలు చేసుకుపోవడమే సాధన కాదు. మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి. ఒక పని ఎలా చెయ్యాలో అలా చెయ్యడమే ఉత్తమ సాధకుడి లక్షణం. పైపైన చెత్త మాత్రమే ఊడ్చావుగాని లోతుగా పనిచేయలేకపోయావు. దీన్ని చిన్న పనిగా భావించావు. సాధన మొదట చిన్నపనులతోనే ప్రారంభమవుతుంది. మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి, మనసును ఎలా శుభ్రపరచుకుంటావు? మనసు స్థితిని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదన్నమాట. హడావుడి, ఆత్రుత, అస్థిరత సాధనకు శత్రువులు. ఓపిక, పట్టుదల, నిబద్ధత సాధనకు మిత్రులు’ అని చెప్పారు. ఆయన సూక్ష్మ పరిశీలనాశక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి. ఆ సమయంలో వారు చూపే ఓపిక, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబెడతాయి. అందుకే చిన్న వయసునుంచే వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి. సాధన అనేది వ్యక్తిగతంగానూ, సమష్టిగా సమాజ ఉన్నతికీ దోహదపడేదిగా ఉండాలి. అలాంటి సాధన ఒకరోజులో చేసి ఆపేది కాదు, అది నిరంతర ప్రక్రియ.
నెయిగాపుల కృష్ణ
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ‘సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా’ అన్నారో సినీకవి. భగీరథుడి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివినుంచి భువికి దిగింది భాగీరథి. రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడైంది.
సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు, అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం. ఏ పని సిద్ధించాలన్నా సాధన అవసరం. అందుకు కావాల్సింది ఓపిక. కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది. సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది. మనోనిగ్రహం లభించాలంటే రోజుకు ఒక గంటో రెండు గంటలో మనసును నియంత్రించి, మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయడం కాదు. ప్రతిక్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలోకి తేగలం. అలా తెచ్చుకుని, మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం. గీతాచార్యుడూ అదే చెప్పాడు.
గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు. అతణ్ని పూజామందిరం శుభ్రం చేయమన్నారు. తనకు ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావుడిగా పని పూర్తిచేశాడు. గురువు మందిరానికి వెళ్లి చేత్తో తడిమితే దుమ్ము అంటుకుంది. శిష్యుణ్ని పిలిచి ‘నేను చెప్పాను, నువ్వు చేశావు. అంతేకానీ జరగాల్సిన రీతిలో పని జరగలేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ప్రవచనాలు వినడం, నియమిత సమయాలలో జపధ్యానాలు చేసుకుపోవడమే సాధన కాదు. మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి. ఒక పని ఎలా చెయ్యాలో అలా చెయ్యడమే ఉత్తమ సాధకుడి లక్షణం. పైపైన చెత్త మాత్రమే ఊడ్చావుగాని లోతుగా పనిచేయలేకపోయావు. దీన్ని చిన్న పనిగా భావించావు. సాధన మొదట చిన్నపనులతోనే ప్రారంభమవుతుంది. మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి, మనసును ఎలా శుభ్రపరచుకుంటావు? మనసు స్థితిని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదన్నమాట. హడావుడి, ఆత్రుత, అస్థిరత సాధనకు శత్రువులు. ఓపిక, పట్టుదల, నిబద్ధత సాధనకు మిత్రులు’ అని చెప్పారు. ఆయన సూక్ష్మ పరిశీలనాశక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి. ఆ సమయంలో వారు చూపే ఓపిక, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబెడతాయి. అందుకే చిన్న వయసునుంచే వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి. సాధన అనేది వ్యక్తిగతంగానూ, సమష్టిగా సమాజ ఉన్నతికీ దోహదపడేదిగా ఉండాలి. అలాంటి సాధన ఒకరోజులో చేసి ఆపేది కాదు, అది నిరంతర ప్రక్రియ.
నెయిగాపుల కృష్ణ
పతనానికి మొదటి మెట్టు
ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది; ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు.
మనిషి జీవితంలో ఉన్నతికి, లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణకాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి. ప్రశాంతతను హరిస్తాయి. చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి.
ఎన్ని దానధర్మాలు చేసినా, పూజలూ వ్రతాలూ ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్నే దహించి వేస్తుంది. ఏ దానాలు, పూజలు దానినుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా, తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ని అడవికి పంపించింది. ఇంత చేసినా భరతుణ్ని రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది.
అందుకే ‘ఈర్ష్యా వ్యాధిః శరీరస్యం, ధర్మనాశస్య కారిణీ’ అన్నారు పెద్దలు. మహాభారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్లలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు, పాండవుల వైభవాన్ని కళ్లారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యోధనుడి అసూయ అతణ్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపాలుడు తన జీవితమంతా కృష్ణుణ్ని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహించలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ని దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు. అసూయ ఎంత పెరిగితే, అది అంతటి ముప్పు తెస్తుంది.
‘అసూయా పాపస్య మూలం’ అన్నది రుషి వాక్యం. అసూయ అన్నిరకాల పాపాలకు మూలమని దానర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి. మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారినుంచి స్ఫూర్తి పొంది విజయపథంలో ముందుకు సాగాలి.
మావూరి విజయలక్ష్మి
ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది; ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు.
మనిషి జీవితంలో ఉన్నతికి, లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణకాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి. ప్రశాంతతను హరిస్తాయి. చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి.
ఎన్ని దానధర్మాలు చేసినా, పూజలూ వ్రతాలూ ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్నే దహించి వేస్తుంది. ఏ దానాలు, పూజలు దానినుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా, తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ని అడవికి పంపించింది. ఇంత చేసినా భరతుణ్ని రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది.
అందుకే ‘ఈర్ష్యా వ్యాధిః శరీరస్యం, ధర్మనాశస్య కారిణీ’ అన్నారు పెద్దలు. మహాభారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్లలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు, పాండవుల వైభవాన్ని కళ్లారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యోధనుడి అసూయ అతణ్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపాలుడు తన జీవితమంతా కృష్ణుణ్ని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహించలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ని దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు. అసూయ ఎంత పెరిగితే, అది అంతటి ముప్పు తెస్తుంది.
‘అసూయా పాపస్య మూలం’ అన్నది రుషి వాక్యం. అసూయ అన్నిరకాల పాపాలకు మూలమని దానర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి. మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారినుంచి స్ఫూర్తి పొంది విజయపథంలో ముందుకు సాగాలి.
మావూరి విజయలక్ష్మి
సత్య మార్గం
మూసిన గుప్పిట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి, లోపల ఏముందోనని! ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలా మందిది.
అలాంటివారికి ఏమీలేదని చెబితే ఒక పట్టాన నమ్మరు. తెరచి ఖాళీ చెయ్యి చూపించినా ఏదో మోసం చేశావనేవాళ్లే ఎక్కువ. ఏ కొద్దిమందో కనిపిస్తున్న దాన్ని నమ్ముతారు. తార్కికంగా ఆలోచిస్తారు. ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేదేమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. తాము ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బందిపెట్టకుండా తమ పని తాము చూసుకుంటారు. సమస్యంతా మిగిలిన వాళ్లతోనే. వీరికి సత్యం చెప్పి నమ్మించడం కన్నా అసత్యంతో మభ్యపుచ్చడం తేలిక. ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునేవారిని ఎందరినో మనం చూస్తుంటాం.
ఒక మర్రిచెట్టు దగ్గర జనాలు గుమిగూడి ఉండటం చూశాడు బ్రహ్మయ్య. వారంతా ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తొర్రలో చెయ్యి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకొంటున్నారు. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం ‘అబ్బా..’ అన్నట్లుగా ముడుచుకుంటున్నాయి. చెయ్యి తీసి ఇవతలకు రాగానే జనాలు వారిని చుట్టిముట్టి ఎలా ఉందీ అనడుగుతున్నారు. దానికి వారంతా ‘ఎంత బాగుందో... అద్భుతం’ అంటూ ముఖానికి నవ్వు పులుముకుని చెబుతున్నారు.
అదేంటో తానూ తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. తొర్రలో చెయ్యి పెట్టి ‘అబ్బా’ అని అరిచాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతణ్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగారు. బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ, ‘అద్భుతం లేదు, గిద్భుతం లేదు! గండు చీమలు కుట్టాయి...’ అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవడానికా ఇంత తోసుకుని వెళ్తున్నది... అని నవ్వుకుని కొందరు తమ సమయం వృథా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. మరికొందరు అతణ్ని కోపంగా చూస్తూ... ‘నువ్వు స్వార్థపరుడివి, కుళ్లుబోతువి... ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్ధం చెబుతున్నావు’ అని ఆక్షేపించారు. నేటి సమాజధోరణికి అద్దం పడుతుందీ కథ.
ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం, నేను మోసపోయాను కాబట్టి వాళ్లకీ అదే జరగాలనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు, అంతమాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి. ‘నిజములాడువాని నిందించు జగమెల్ల’ అని వేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం. అయినా సరే, ఉత్తములు సత్య మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలూ అవమానాలూ ఎదురైనా చివరికి విజయం వారిదే.
డాక్టర్ గోనుగుంట్ల శ్రీనివాసరావు
మూసిన గుప్పిట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి, లోపల ఏముందోనని! ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలా మందిది.
అలాంటివారికి ఏమీలేదని చెబితే ఒక పట్టాన నమ్మరు. తెరచి ఖాళీ చెయ్యి చూపించినా ఏదో మోసం చేశావనేవాళ్లే ఎక్కువ. ఏ కొద్దిమందో కనిపిస్తున్న దాన్ని నమ్ముతారు. తార్కికంగా ఆలోచిస్తారు. ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేదేమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. తాము ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బందిపెట్టకుండా తమ పని తాము చూసుకుంటారు. సమస్యంతా మిగిలిన వాళ్లతోనే. వీరికి సత్యం చెప్పి నమ్మించడం కన్నా అసత్యంతో మభ్యపుచ్చడం తేలిక. ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునేవారిని ఎందరినో మనం చూస్తుంటాం.
ఒక మర్రిచెట్టు దగ్గర జనాలు గుమిగూడి ఉండటం చూశాడు బ్రహ్మయ్య. వారంతా ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తొర్రలో చెయ్యి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకొంటున్నారు. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం ‘అబ్బా..’ అన్నట్లుగా ముడుచుకుంటున్నాయి. చెయ్యి తీసి ఇవతలకు రాగానే జనాలు వారిని చుట్టిముట్టి ఎలా ఉందీ అనడుగుతున్నారు. దానికి వారంతా ‘ఎంత బాగుందో... అద్భుతం’ అంటూ ముఖానికి నవ్వు పులుముకుని చెబుతున్నారు.
అదేంటో తానూ తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. తొర్రలో చెయ్యి పెట్టి ‘అబ్బా’ అని అరిచాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతణ్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగారు. బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ, ‘అద్భుతం లేదు, గిద్భుతం లేదు! గండు చీమలు కుట్టాయి...’ అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవడానికా ఇంత తోసుకుని వెళ్తున్నది... అని నవ్వుకుని కొందరు తమ సమయం వృథా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. మరికొందరు అతణ్ని కోపంగా చూస్తూ... ‘నువ్వు స్వార్థపరుడివి, కుళ్లుబోతువి... ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్ధం చెబుతున్నావు’ అని ఆక్షేపించారు. నేటి సమాజధోరణికి అద్దం పడుతుందీ కథ.
ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం, నేను మోసపోయాను కాబట్టి వాళ్లకీ అదే జరగాలనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు, అంతమాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి. ‘నిజములాడువాని నిందించు జగమెల్ల’ అని వేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం. అయినా సరే, ఉత్తములు సత్య మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలూ అవమానాలూ ఎదురైనా చివరికి విజయం వారిదే.
డాక్టర్ గోనుగుంట్ల శ్రీనివాసరావు
దేహభ్రాంతి
ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.
సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం. ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.
అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.
భగవాన్ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!
‘తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.
శ్రీమత్కందాళ బాలసరస్వతి
ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.
సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం. ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.
అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.
భగవాన్ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!
‘తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.
శ్రీమత్కందాళ బాలసరస్వతి
జీవిత లక్ష్యం
జీవిత లక్ష్యం ఏంటి? మానవ జీవితానికి ఏదైనా ప్రయోజనం, పరమార్థం ఉన్నాయా? ఈ మౌలిక ప్రశ్నలపై స్పష్టత వస్తే జీవితాన్ని సంఘర్షణారహితంగా, ఆనందమయంగా మలచుకోవచ్చు. జీవితాన్ని రెండు కోణాలనుంచి చూడవచ్చు. ప్రకృతిపరంగా చూస్తే మనిషి- ప్రాణికోటిలో ఓ భాగమంతే. ఇలా చూసినప్పుడు మానవ జీవితానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, ప్రయోజనం లేవనే చెప్పాలి. జీవించడమే జీవిత లక్ష్యం!
ఇక ప్రపంచపరంగా చూస్తే- మనిషి ఈ నాగరిక సమాజంలో అంతర్భాగం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఉద్యోగి, వ్యాపారి, దేశ పౌరుడు- ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికీ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నెరవేర్చడం ముఖ్యం. కానీ వాటినే జీవిత లక్ష్యాలుగా భ్రమపడతారు చాలామంది. అప్పుడు ఆ పాత్రల పరంపరే జీవితంగా తయారై ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్య. జాగ్రత్తగా గమనిస్తే- పోషించే పాత్ర, వయసు, కాలాన్ని బట్టి మనిషి ఆశలు, ఆశయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ‘లక్ష్యం’ అనుకున్నది ఒకటి పూర్తవగానే మరొకటి కనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక విషయాల్లో దేన్నీ జీవితలక్ష్యంగా, ప్రయోజనంగా పేర్కొనలేం.
ప్రకృతిపరంగా, ప్రపంచపరంగా కూడా ఏ లక్ష్యం, పరమార్థం లేకపోతే ఇక జీవించి ఉపయోగమేంటి అన్న కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న ‘అహం’ నుంచి పుడుతుంది. సంకుచితమైన మనసు నుంచి జనిస్తుంది. నిరంతరం భద్రత కోసం పాకులాడే మనసు- ఏదో ఒక పాత్ర పోషణలోనే నీ జీవిత పరమార్థం ఉందని భ్రమింపచేస్తుంది. ఇక్కడే మనిషి జీవితపు విశిష్టతను అర్థం చేసుకోవాలి. జంతువులు జంతువులుగా పుడతాయి, అలాగే మరణిస్తాయి. మేధస్సు, ఊహాశక్తి, స్వీయ ఎరుక ఉన్న మనిషి మాత్రమే సృజనాత్మకంగా ఉండగలడు. ఆధ్యాత్మికంగా ఎదగగలడు. సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు. ఈ విశ్వ రహస్యాలను శోధించగలడు. ఇంతటి మహాద్భుతమైన జీవితాన్ని పూర్తిగా జీవించడమే జీవిత లక్ష్యం. ఏ ఇతమిత్థమైన అర్థమూ, లక్ష్యమూ లేకపోవటమే జీవితానికి అందం.
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులను పక్కన పెడితే- జీవితంలో దేన్నయినా కళాత్మకంగా మార్చవచ్చు, ఏ పనిలోనైనా సృజనాత్మకతను కనబరచవచ్చు. అభిరుచి ఉన్న రంగంలో లోలోతులకు వెళ్లే స్వేచ్ఛ ఉంటేనే మనిషి తనలో దాగి ఉన్న సృజనశక్తిని వెలికి తీయగలుగుతాడు. నిజమైన విద్య ప్రయోజనం అదే. శాస్త్రవేత్త అయినా, సంగీత విద్వాంసుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా- ఎవరైనా సరే, తమ వ్యాపకంలో, తమ సృజనాత్మక సాగరంలో మునిగినప్పుడే వర్తమానాన్ని ఆస్వాదించగలరు. తమదైన ముద్రతో సృజన చేయగలరు. అదే స్వీయాన్వేషణకు నాంది, ఆధ్యాత్మికతకు పునాది. అలా అస్తిత్వం ప్రసాదించిన విషయాల్లో తనదైన స్వధర్మాన్ని జోడించి మూసకు కట్టుబడకుండా ముందుకు సాగడమే జీవిత పరమార్థం. మనిషి ఆనందానికి అదే అసలైన మార్గం.
ఈదర రవికిరణ్
జీవిత లక్ష్యం ఏంటి? మానవ జీవితానికి ఏదైనా ప్రయోజనం, పరమార్థం ఉన్నాయా? ఈ మౌలిక ప్రశ్నలపై స్పష్టత వస్తే జీవితాన్ని సంఘర్షణారహితంగా, ఆనందమయంగా మలచుకోవచ్చు. జీవితాన్ని రెండు కోణాలనుంచి చూడవచ్చు. ప్రకృతిపరంగా చూస్తే మనిషి- ప్రాణికోటిలో ఓ భాగమంతే. ఇలా చూసినప్పుడు మానవ జీవితానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, ప్రయోజనం లేవనే చెప్పాలి. జీవించడమే జీవిత లక్ష్యం!
ఇక ప్రపంచపరంగా చూస్తే- మనిషి ఈ నాగరిక సమాజంలో అంతర్భాగం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఉద్యోగి, వ్యాపారి, దేశ పౌరుడు- ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికీ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నెరవేర్చడం ముఖ్యం. కానీ వాటినే జీవిత లక్ష్యాలుగా భ్రమపడతారు చాలామంది. అప్పుడు ఆ పాత్రల పరంపరే జీవితంగా తయారై ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్య. జాగ్రత్తగా గమనిస్తే- పోషించే పాత్ర, వయసు, కాలాన్ని బట్టి మనిషి ఆశలు, ఆశయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ‘లక్ష్యం’ అనుకున్నది ఒకటి పూర్తవగానే మరొకటి కనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక విషయాల్లో దేన్నీ జీవితలక్ష్యంగా, ప్రయోజనంగా పేర్కొనలేం.
ప్రకృతిపరంగా, ప్రపంచపరంగా కూడా ఏ లక్ష్యం, పరమార్థం లేకపోతే ఇక జీవించి ఉపయోగమేంటి అన్న కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న ‘అహం’ నుంచి పుడుతుంది. సంకుచితమైన మనసు నుంచి జనిస్తుంది. నిరంతరం భద్రత కోసం పాకులాడే మనసు- ఏదో ఒక పాత్ర పోషణలోనే నీ జీవిత పరమార్థం ఉందని భ్రమింపచేస్తుంది. ఇక్కడే మనిషి జీవితపు విశిష్టతను అర్థం చేసుకోవాలి. జంతువులు జంతువులుగా పుడతాయి, అలాగే మరణిస్తాయి. మేధస్సు, ఊహాశక్తి, స్వీయ ఎరుక ఉన్న మనిషి మాత్రమే సృజనాత్మకంగా ఉండగలడు. ఆధ్యాత్మికంగా ఎదగగలడు. సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు. ఈ విశ్వ రహస్యాలను శోధించగలడు. ఇంతటి మహాద్భుతమైన జీవితాన్ని పూర్తిగా జీవించడమే జీవిత లక్ష్యం. ఏ ఇతమిత్థమైన అర్థమూ, లక్ష్యమూ లేకపోవటమే జీవితానికి అందం.
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులను పక్కన పెడితే- జీవితంలో దేన్నయినా కళాత్మకంగా మార్చవచ్చు, ఏ పనిలోనైనా సృజనాత్మకతను కనబరచవచ్చు. అభిరుచి ఉన్న రంగంలో లోలోతులకు వెళ్లే స్వేచ్ఛ ఉంటేనే మనిషి తనలో దాగి ఉన్న సృజనశక్తిని వెలికి తీయగలుగుతాడు. నిజమైన విద్య ప్రయోజనం అదే. శాస్త్రవేత్త అయినా, సంగీత విద్వాంసుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా- ఎవరైనా సరే, తమ వ్యాపకంలో, తమ సృజనాత్మక సాగరంలో మునిగినప్పుడే వర్తమానాన్ని ఆస్వాదించగలరు. తమదైన ముద్రతో సృజన చేయగలరు. అదే స్వీయాన్వేషణకు నాంది, ఆధ్యాత్మికతకు పునాది. అలా అస్తిత్వం ప్రసాదించిన విషయాల్లో తనదైన స్వధర్మాన్ని జోడించి మూసకు కట్టుబడకుండా ముందుకు సాగడమే జీవిత పరమార్థం. మనిషి ఆనందానికి అదే అసలైన మార్గం.
ఈదర రవికిరణ్
స్రీ శక్తి
సృష్టికి మూలశక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయ స్థానముంటుందో అక్కడ శుభం, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ‘శక్తి రూపాలైన సీత గౌరీ వాగీశ్వరి వంటి వారి రూపంలో గాని ఉన్నావా రామా?’ అని ‘ఏతావునరా నిలకడ నీకు?’ అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య. పౌరాణిక గ్రంథాలు, కావ్యాలు సైతం మానవజాతి భవిష్యత్ అంతా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెబుతున్నాయి.
సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసినా సురసను ఉద్దేశించి హనుమంతుడు ‘మాతా’ అని సంబోధించాడు. ‘రామకార్యం నెరవేర్చడానికి సహకరించమ’ని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు. సీత జారవిడిచిన ఆభరణాల ఉత్తరీయాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు... ‘నేను ఆమె ముఖం వైపు ఎప్పుడూ చూడలేదు. నిత్యం పాదాభివందనం చేసేవాణ్ని కనుక ఆమె పాదాలకు ధరించిన నూపురాలను మాత్రం గుర్తించగలన’ని చెప్పాడట. అదీ మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం. స్త్రీ... పురుషుడి వెనుక ఉంటే బలం. ముందుంటే కవచం. పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసే అద్భుతం. అందుకే మహాశివుడు సైతం అర్ధనారీశ్వరుడు అయ్యాడు. భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లిరూపంలో ఓర్పుగా నిలబడతాడని పెద్దల మాట. అందుకే ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని చెప్పింది. మేనమామ ఇంటినుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుఘ్నులకు తండ్రి మరణించడానికి, రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం కైకేయి అని, దానికి ప్రేరకురాలు మంధర అని తెలుస్తుంది. శత్రుఘ్నుడు పట్టలేని కోపంతో మంధర శిగను పట్టుకుని రాజ ప్రాంగణానికి ఈడ్చుకు వచ్చాడు. అప్పుడు భరతుడు రాముడిక స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి, ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు. ఇదీ మన సంస్కృతి విశిష్టత.
ఇంత గొప్పగా చెప్పుకొంటున్నా... నాణానికి రెండో వైపు అన్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందులకు గురి చేసేవారు, చెరబట్టి వినాశనాన్ని కొని తెచ్చుకునేవారూ కోకొల్లలు. ద్రౌపదిని తన అంకం మీద కూర్చోమని ఆజ్ఞాపించిన, ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో, పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు. మన చుట్టూ ఇటువంటి కీచకులూ ఉన్నారు. రామలక్ష్మణుల వంటి మర్యాదా పురుషోత్తములూ ఉన్నారు. సమాజానికి చీడవంటి నరకాసురులను దునుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయింది. మనుషుల్లోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని, ‘స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించద’ని వివేకానందుడు అన్నాడు. దాన్ని నేటితరం అర్థం చేసుకోవాలి. మహిళలను చిన్నచూపు చూడటమంటే ‘అమ్మశక్తి’ని అవమానించడమేనని తెలుసుకోవాలి.
గంటి ఉషాబాల
సృష్టికి మూలశక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయ స్థానముంటుందో అక్కడ శుభం, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ‘శక్తి రూపాలైన సీత గౌరీ వాగీశ్వరి వంటి వారి రూపంలో గాని ఉన్నావా రామా?’ అని ‘ఏతావునరా నిలకడ నీకు?’ అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య. పౌరాణిక గ్రంథాలు, కావ్యాలు సైతం మానవజాతి భవిష్యత్ అంతా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెబుతున్నాయి.
సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసినా సురసను ఉద్దేశించి హనుమంతుడు ‘మాతా’ అని సంబోధించాడు. ‘రామకార్యం నెరవేర్చడానికి సహకరించమ’ని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు. సీత జారవిడిచిన ఆభరణాల ఉత్తరీయాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు... ‘నేను ఆమె ముఖం వైపు ఎప్పుడూ చూడలేదు. నిత్యం పాదాభివందనం చేసేవాణ్ని కనుక ఆమె పాదాలకు ధరించిన నూపురాలను మాత్రం గుర్తించగలన’ని చెప్పాడట. అదీ మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం. స్త్రీ... పురుషుడి వెనుక ఉంటే బలం. ముందుంటే కవచం. పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసే అద్భుతం. అందుకే మహాశివుడు సైతం అర్ధనారీశ్వరుడు అయ్యాడు. భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లిరూపంలో ఓర్పుగా నిలబడతాడని పెద్దల మాట. అందుకే ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని చెప్పింది. మేనమామ ఇంటినుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుఘ్నులకు తండ్రి మరణించడానికి, రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం కైకేయి అని, దానికి ప్రేరకురాలు మంధర అని తెలుస్తుంది. శత్రుఘ్నుడు పట్టలేని కోపంతో మంధర శిగను పట్టుకుని రాజ ప్రాంగణానికి ఈడ్చుకు వచ్చాడు. అప్పుడు భరతుడు రాముడిక స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి, ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు. ఇదీ మన సంస్కృతి విశిష్టత.
ఇంత గొప్పగా చెప్పుకొంటున్నా... నాణానికి రెండో వైపు అన్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందులకు గురి చేసేవారు, చెరబట్టి వినాశనాన్ని కొని తెచ్చుకునేవారూ కోకొల్లలు. ద్రౌపదిని తన అంకం మీద కూర్చోమని ఆజ్ఞాపించిన, ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో, పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు. మన చుట్టూ ఇటువంటి కీచకులూ ఉన్నారు. రామలక్ష్మణుల వంటి మర్యాదా పురుషోత్తములూ ఉన్నారు. సమాజానికి చీడవంటి నరకాసురులను దునుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయింది. మనుషుల్లోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని, ‘స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించద’ని వివేకానందుడు అన్నాడు. దాన్ని నేటితరం అర్థం చేసుకోవాలి. మహిళలను చిన్నచూపు చూడటమంటే ‘అమ్మశక్తి’ని అవమానించడమేనని తెలుసుకోవాలి.
గంటి ఉషాబాల
మౌన ఫలం
మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు. వాక్కు, మనసు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం. రమణమహర్షి చెప్పినట్లు మౌనం ఒక నిశ్శబ్ద సంభాషణ, అత్యంత సమర్థవంతమైన భాష.
వాక్ మౌనం అంటే వ్యర్థమైన మాటలను నియంత్రించడం. ఇంద్రియ మౌనం అంటే పంచేంద్రియాల ద్వారా కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం. మానసిక మౌనం అంటే మనసులో కలిగే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, వాంఛలను నిరోధించడం. మనసును దైవచింతనపై ఉంచి, పరిపూర్ణ నిశ్చల స్థితికి చేరుకోవడం. నిజానికి మౌనం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి ఆరోగ్యం, ప్రశాంతత, సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం అందివస్తాయి. మౌనం ద్వారా అంతరంగ ప్రబోధంతోపాటు అంతర్ముఖ పయనం సాధ్యమై, అంతర్యామిని దర్శించే అవకాశం లభిస్తుంది. వేదాలు, పురాణాలు మొదలైన భారతీయ ధార్మిక గ్రంథాలలో మౌనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వేదకాలం నుంచి మౌనం తపస్సులో ముఖ్య భాగంగా ఉంది. ఇంద్రియ నిగ్రహానికి, చిత్తశుద్ధికి మార్గంగా గుర్తింపు పొందింది. రుషులు, మునులు సత్యదర్శనం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం... మౌనం అవసరమని గుర్తించారు. ‘వాక్కును నిరోధించడం ద్వారానే దివ్యత్వం వైపు అడుగులు వేయగలం’ అంటారు శంకరాచార్యులు. మహర్షులు భక్తి ప్రపత్తులతో దీర్ఘకాలం మౌనవ్రతాలు ఆచరించడం ద్వారా గొప్ప శక్తులను, జ్ఞానాన్ని పొందినట్లు పురాణ గాథలలో పేర్కొన్నారు. మౌనం ద్వారా దైవసాన్నిధ్యం సాధ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానబోధ చేశాడని చెబుతారు.
మౌనం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్పష్టతను, సృజనాత్మకతను పెంచుతుందని న్యూరోసైన్స్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాంఖ్య సిద్ధాంతం మనిషి మనసు, దాని శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని ప్రకటిస్తుంది. మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడానికి మౌనం సాయపడుతుందని, భగవంతుడిపై మనసును లగ్నంచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే స్వతంత్ర తత్వశాస్త్రం మౌనమని చెబుతుంది.
రామపురం చాలా అందమైన గ్రామం. కానీ, ప్రజలమధ్య నిరంతరం కొనసాగే మాటల యుద్ధం మూలంగా ఊళ్లో ప్రశాంతత ఉండేది కాదు. అక్కడికి ఒక జ్ఞాని వచ్చి పరిస్థితి తెలుసుకుని, ‘మీరంతా ఒక నెలరోజులపాటు మౌనవ్రతం పాటించండి, అత్యవసరమైతే తప్ప మాట్లాడకండి’ అన్నాడు. ఆయన సూచనలను అందరూ అంగీకరించి, ఆచరించారు. వాగ్వివాదాలు లేకపోవడంతో ఎవరి పని వారు నిశ్శబ్దంగా చేసుకోసాగారు. అలా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. మౌనం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది.
అంతర్గత ప్రయాణం, స్వీయ ఆవిష్కరణ, ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేసే త్రివిధ తపస్సులలో మౌనం శక్తిమంతమైన సాధనమని భగవద్గీత చెబుతోంది. ముఖ్యంగా మానసిక మౌనం దైవచింతనపై ఏకాగ్రత కుదరడానికి సాయపడుతుంది. ఆ స్థితిలో మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి, అంతర్గతమైన దైవిక అంశాలపై దృష్టి సారించగలుగుతుంది.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్
మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు. వాక్కు, మనసు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం. రమణమహర్షి చెప్పినట్లు మౌనం ఒక నిశ్శబ్ద సంభాషణ, అత్యంత సమర్థవంతమైన భాష.
వాక్ మౌనం అంటే వ్యర్థమైన మాటలను నియంత్రించడం. ఇంద్రియ మౌనం అంటే పంచేంద్రియాల ద్వారా కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం. మానసిక మౌనం అంటే మనసులో కలిగే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, వాంఛలను నిరోధించడం. మనసును దైవచింతనపై ఉంచి, పరిపూర్ణ నిశ్చల స్థితికి చేరుకోవడం. నిజానికి మౌనం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి ఆరోగ్యం, ప్రశాంతత, సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం అందివస్తాయి. మౌనం ద్వారా అంతరంగ ప్రబోధంతోపాటు అంతర్ముఖ పయనం సాధ్యమై, అంతర్యామిని దర్శించే అవకాశం లభిస్తుంది. వేదాలు, పురాణాలు మొదలైన భారతీయ ధార్మిక గ్రంథాలలో మౌనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వేదకాలం నుంచి మౌనం తపస్సులో ముఖ్య భాగంగా ఉంది. ఇంద్రియ నిగ్రహానికి, చిత్తశుద్ధికి మార్గంగా గుర్తింపు పొందింది. రుషులు, మునులు సత్యదర్శనం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం... మౌనం అవసరమని గుర్తించారు. ‘వాక్కును నిరోధించడం ద్వారానే దివ్యత్వం వైపు అడుగులు వేయగలం’ అంటారు శంకరాచార్యులు. మహర్షులు భక్తి ప్రపత్తులతో దీర్ఘకాలం మౌనవ్రతాలు ఆచరించడం ద్వారా గొప్ప శక్తులను, జ్ఞానాన్ని పొందినట్లు పురాణ గాథలలో పేర్కొన్నారు. మౌనం ద్వారా దైవసాన్నిధ్యం సాధ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానబోధ చేశాడని చెబుతారు.
మౌనం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్పష్టతను, సృజనాత్మకతను పెంచుతుందని న్యూరోసైన్స్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాంఖ్య సిద్ధాంతం మనిషి మనసు, దాని శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని ప్రకటిస్తుంది. మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడానికి మౌనం సాయపడుతుందని, భగవంతుడిపై మనసును లగ్నంచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే స్వతంత్ర తత్వశాస్త్రం మౌనమని చెబుతుంది.
రామపురం చాలా అందమైన గ్రామం. కానీ, ప్రజలమధ్య నిరంతరం కొనసాగే మాటల యుద్ధం మూలంగా ఊళ్లో ప్రశాంతత ఉండేది కాదు. అక్కడికి ఒక జ్ఞాని వచ్చి పరిస్థితి తెలుసుకుని, ‘మీరంతా ఒక నెలరోజులపాటు మౌనవ్రతం పాటించండి, అత్యవసరమైతే తప్ప మాట్లాడకండి’ అన్నాడు. ఆయన సూచనలను అందరూ అంగీకరించి, ఆచరించారు. వాగ్వివాదాలు లేకపోవడంతో ఎవరి పని వారు నిశ్శబ్దంగా చేసుకోసాగారు. అలా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. మౌనం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది.
అంతర్గత ప్రయాణం, స్వీయ ఆవిష్కరణ, ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేసే త్రివిధ తపస్సులలో మౌనం శక్తిమంతమైన సాధనమని భగవద్గీత చెబుతోంది. ముఖ్యంగా మానసిక మౌనం దైవచింతనపై ఏకాగ్రత కుదరడానికి సాయపడుతుంది. ఆ స్థితిలో మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి, అంతర్గతమైన దైవిక అంశాలపై దృష్టి సారించగలుగుతుంది.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్