భోగి భాగ్యాలు
సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. సంప్రదాయ వైభవానికి ఇది మనోజ్ఞ వేదిక. సస్యలక్ష్మి అనుగ్రహంతో సంపదలు దక్కిన తరవాత ఆ ధనాన్ని, ఆనందాన్ని అందరితో సమష్టిగా ఆస్వాదించాలనే ఆకాంక్ష భోగి నేపథ్యంగా వ్యక్తమవుతుంది. పంచుకోవడంతోనే సంతోషం పెంచుకోవాలనేది ఈ పండుగ పరమార్థం. సమస్త సౌభాగ్యాల సమృద్ధి- భోగి! శ్రమశక్తి, దైవకృప, ప్రకృతి అనుగ్రహాల మేలు కలయిక- భోగిపర్వం. జడత్వాన్ని ఛేదించి, నవ్యత్వం దిశగా స్ఫూర్తిమంతంగా ముందడుగు వేయాలనేదే భోగి అందించే ఆత్మీయ సందేశం.
మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని స్వీకరిస్తాడు. ఇంద్రుడు వర్షకారకుడై ప్రకృతికి పచ్చదనాన్ని అందిస్తాడు. పంటల్ని పుష్కలంగా పండిస్తాడు. అందుకు కృతజ్ఞతగా భోగి మంటల్ని ఏర్పాటుచేస్తారు. ఇంద్రుడికి సమర్పించే భోగి మంటను ఇంద్రాగ్నిగా వ్యవహరిస్తారు. భోగి అంటే విష్ణువు అనే అర్థమూ ఉంది. శ్రీహరిని భోగినాడు భోగేంద్రనాథుడిగా ఆరాధిస్తారు. లోకానికి ప్రాణశక్తిని అనుగ్రహించే సూర్యుణ్ని వైభోగిగా కీర్తిస్తారు. భోగిపళ్ల వేడుకతో సూర్యారాధనను ఆరంభించి, రథ సప్తమి వరకు నియమపూర్వకంగా కొనసాగించే సంప్రదాయం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్ధిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను 'భోగి'గా పేర్కొంటారని 'సూర్యతంత్రం' వివరించింది.
రంగనాథుణ్ని పతిగా పొందాలని గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించింది. ఆ సిరినోము పండిన శుభతరుణమే- భోగి. ఆత్మకు గోదాదేవి ప్రతీక. పరమాత్మకు రంగనాథుడు సంకేతం. ఆత్మ పరమాత్మల సమ్మేళనం మధుర భక్తితో సుసాధ్యమని ఆండాళ్ నిరూపించింది. ద్వాపర యుగంలో 'నందనందనోత్సవం'గా భోగిని నిర్వహించేవారని భాగవతం పేర్కొంది. భోగినాడే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రకృతి వైపరీత్యాల నుంచి గోకులాన్ని రక్షించాడంటారు. అందుకే భోగినాడు 'గోవర్ధనగిరి పూజ' చేస్తారు. భోగి సందర్భంగా 'గొబ్బిగౌరి వ్రతా'న్నీ చేస్తారు. ఇంటి ముంగిట అలంకరించే ముగ్గులో పెద్ద గొబ్బెమ్మను, దాని చుట్టూ చిన్న గొబ్బెమ్మలను పెడతారు. ఇవి కృష్ణుడికీ గోపికలకు ప్రతీకలు. ఈ గొబ్బిళ్లను శ్రీకృష్ణ తత్వానికే కాక, శివలింగ స్వరూపాలకూ సమన్వయం చేస్తారు. గోమయంతో చేసే శివలింగార్చననే- గొబ్బిగౌరి వ్రతంగా పేర్కొంటారు.
భోగికి ఉన్న అర్థాల్లో సర్పం ఒకటి. కాలాన్ని సర్పంతో పోల్చడం తెలిసిందే. కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారికి అంతా లాభం జరుగుతుందని భోగి ఆంతర్యం. భోగం అంటే ఉత్తమయోగం. అన్ని పరిణామాలను సాదరంగా స్వీకరిస్తూ, సానుకూలంగా మసలుకోవాలని ఈ పండుగ తెలియజేస్తోంది. గోవిందుడు, గోదాదేవి, గొబ్బెమ్మలు, గోమాత అనే నాలుగు అంశాల నేపథ్యంగా ప్రకృతిలో పూర్ణత్వాన్ని దర్శించాలని, అందుకు భోగినాటి సంప్రదాయాలు ఉపయుక్తమవుతాయని వ్రత చింతామణి ప్రకటించింది. నేటి భోగిపర్వం రేపటి సమ్యక్ క్రాంతి.. సంక్రాంతికి సంకేతం.
సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. సంప్రదాయ వైభవానికి ఇది మనోజ్ఞ వేదిక. సస్యలక్ష్మి అనుగ్రహంతో సంపదలు దక్కిన తరవాత ఆ ధనాన్ని, ఆనందాన్ని అందరితో సమష్టిగా ఆస్వాదించాలనే ఆకాంక్ష భోగి నేపథ్యంగా వ్యక్తమవుతుంది. పంచుకోవడంతోనే సంతోషం పెంచుకోవాలనేది ఈ పండుగ పరమార్థం. సమస్త సౌభాగ్యాల సమృద్ధి- భోగి! శ్రమశక్తి, దైవకృప, ప్రకృతి అనుగ్రహాల మేలు కలయిక- భోగిపర్వం. జడత్వాన్ని ఛేదించి, నవ్యత్వం దిశగా స్ఫూర్తిమంతంగా ముందడుగు వేయాలనేదే భోగి అందించే ఆత్మీయ సందేశం.
మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని స్వీకరిస్తాడు. ఇంద్రుడు వర్షకారకుడై ప్రకృతికి పచ్చదనాన్ని అందిస్తాడు. పంటల్ని పుష్కలంగా పండిస్తాడు. అందుకు కృతజ్ఞతగా భోగి మంటల్ని ఏర్పాటుచేస్తారు. ఇంద్రుడికి సమర్పించే భోగి మంటను ఇంద్రాగ్నిగా వ్యవహరిస్తారు. భోగి అంటే విష్ణువు అనే అర్థమూ ఉంది. శ్రీహరిని భోగినాడు భోగేంద్రనాథుడిగా ఆరాధిస్తారు. లోకానికి ప్రాణశక్తిని అనుగ్రహించే సూర్యుణ్ని వైభోగిగా కీర్తిస్తారు. భోగిపళ్ల వేడుకతో సూర్యారాధనను ఆరంభించి, రథ సప్తమి వరకు నియమపూర్వకంగా కొనసాగించే సంప్రదాయం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్ధిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను 'భోగి'గా పేర్కొంటారని 'సూర్యతంత్రం' వివరించింది.
రంగనాథుణ్ని పతిగా పొందాలని గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించింది. ఆ సిరినోము పండిన శుభతరుణమే- భోగి. ఆత్మకు గోదాదేవి ప్రతీక. పరమాత్మకు రంగనాథుడు సంకేతం. ఆత్మ పరమాత్మల సమ్మేళనం మధుర భక్తితో సుసాధ్యమని ఆండాళ్ నిరూపించింది. ద్వాపర యుగంలో 'నందనందనోత్సవం'గా భోగిని నిర్వహించేవారని భాగవతం పేర్కొంది. భోగినాడే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రకృతి వైపరీత్యాల నుంచి గోకులాన్ని రక్షించాడంటారు. అందుకే భోగినాడు 'గోవర్ధనగిరి పూజ' చేస్తారు. భోగి సందర్భంగా 'గొబ్బిగౌరి వ్రతా'న్నీ చేస్తారు. ఇంటి ముంగిట అలంకరించే ముగ్గులో పెద్ద గొబ్బెమ్మను, దాని చుట్టూ చిన్న గొబ్బెమ్మలను పెడతారు. ఇవి కృష్ణుడికీ గోపికలకు ప్రతీకలు. ఈ గొబ్బిళ్లను శ్రీకృష్ణ తత్వానికే కాక, శివలింగ స్వరూపాలకూ సమన్వయం చేస్తారు. గోమయంతో చేసే శివలింగార్చననే- గొబ్బిగౌరి వ్రతంగా పేర్కొంటారు.
భోగికి ఉన్న అర్థాల్లో సర్పం ఒకటి. కాలాన్ని సర్పంతో పోల్చడం తెలిసిందే. కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారికి అంతా లాభం జరుగుతుందని భోగి ఆంతర్యం. భోగం అంటే ఉత్తమయోగం. అన్ని పరిణామాలను సాదరంగా స్వీకరిస్తూ, సానుకూలంగా మసలుకోవాలని ఈ పండుగ తెలియజేస్తోంది. గోవిందుడు, గోదాదేవి, గొబ్బెమ్మలు, గోమాత అనే నాలుగు అంశాల నేపథ్యంగా ప్రకృతిలో పూర్ణత్వాన్ని దర్శించాలని, అందుకు భోగినాటి సంప్రదాయాలు ఉపయుక్తమవుతాయని వ్రత చింతామణి ప్రకటించింది. నేటి భోగిపర్వం రేపటి సమ్యక్ క్రాంతి.. సంక్రాంతికి సంకేతం.
సస్య కాంతి సంక్రాంతి
సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక 'ఉత్తర క్రాంతి' అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి పన్నెండు సంక్రాంతులొస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు.
దక్షిణాయనంలో వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది. ఉత్తరాయణం. ఆరోగ్యకారకం, ఆహారసాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మికపూరకమైన విశిష్టకాలమిది. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైంది.
ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందేలు, భోగిమంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్య రాశులు, భోగిపండ్లు- ఇలా సరదాలూ సంతోషాలూ పంచుతుంది.
మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలీ ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగిది. ఈ మూడు రోజుల విశిష్టతను తెలుసుకుంటే సంక్రాంతి శోభ అర్థమవుతుంది.
లక్ష్మీనారాయణులు దీవిస్తారు మహావిష్ణువుకు బదరీవృక్షం (రేగి) ప్రీతికరమైందని, అందుకే ఆ స్వామి బదరికా వనంలో విహరిస్తాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. భోగి రోజున రేగిపండ్లను చిన్నారుల తలపై పోస్తారు. పండ్లతో పాటు నాణేలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహమూ చేకూరుతుందని విశ్వసిస్తారు. అలా భోగి పండ్లతో లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ప్రత్యక్షంగా అందుతుంది. ఎర్రగా, గుండ్రంగా ఉండే రేగిపండ్లను సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువులతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిపిస్తారు.
గాలిపటం.. అంతరార్థం శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుణ్ణి దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. భగవదాశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా, తెలియకున్నా గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా సంక్రాంతి పర్వదినానే. భోగభాగ్యాల భోగి
భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైంది అన్నది పురాణ వచనం. ఈ రోజు ఇంద్రుణ్ణి, ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారు జామున ఇంటి ముందర, కూడళ్లలో భోగిమంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకే ఈ ఆచారం, దీని వల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. వాతావరణ కాలుష్యమూ దూరమవుతుంది. యజ్ఞ దేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగిమంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులూ వేస్తారు.
ఆపై అభ్యంగన స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్తబియ్యం, కొత్తబెల్లంతో పొంగలి వండి భగవంతునికి నివేదిస్తారు.
సంబరాల క్రాంతి
మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైంది సంక్రాంతి. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేస్తారు. ఈ రోజు స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తయిదువులకు పూలూపండ్లను వాయనంగా ఇస్తారు.
సంక్రాంతి ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడతాయి. గీతలతో, చుక్కలతో తీరు తీరుగా రూపు దిద్దుకుంటాయి. మధ్యచుక్క సూర్యుడి ప్రతిరూపంగా, చుట్టూ ఉన్నవి గ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసే స్నేహానుబంధం, ఆరోగ్య రహస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. పండుగలో గొబ్బెమ్మలదీ ముఖ్య పాత్రే. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల వల్ల నయమవుతాయి.
కనుమ.. పశువుల పండుగ
సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు.
పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి, కొంత పశువులకు తినిపించి, మిగిలినదాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా వాటిని పూజించి, గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి పూజ చేస్తారు. 'కనుమ నాడు కాకి కూడా కదలదు' అన్న నానుడి తెలిసిందే కదా! అందుకే ఆరోజు ఏ పనికీ వెళ్లరు, ప్రయాణం కూడా చేయరు.
సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక 'ఉత్తర క్రాంతి' అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి పన్నెండు సంక్రాంతులొస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు.
దక్షిణాయనంలో వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది. ఉత్తరాయణం. ఆరోగ్యకారకం, ఆహారసాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మికపూరకమైన విశిష్టకాలమిది. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైంది.
ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందేలు, భోగిమంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్య రాశులు, భోగిపండ్లు- ఇలా సరదాలూ సంతోషాలూ పంచుతుంది.
మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలీ ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగిది. ఈ మూడు రోజుల విశిష్టతను తెలుసుకుంటే సంక్రాంతి శోభ అర్థమవుతుంది.
లక్ష్మీనారాయణులు దీవిస్తారు మహావిష్ణువుకు బదరీవృక్షం (రేగి) ప్రీతికరమైందని, అందుకే ఆ స్వామి బదరికా వనంలో విహరిస్తాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. భోగి రోజున రేగిపండ్లను చిన్నారుల తలపై పోస్తారు. పండ్లతో పాటు నాణేలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహమూ చేకూరుతుందని విశ్వసిస్తారు. అలా భోగి పండ్లతో లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ప్రత్యక్షంగా అందుతుంది. ఎర్రగా, గుండ్రంగా ఉండే రేగిపండ్లను సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువులతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిపిస్తారు.
గాలిపటం.. అంతరార్థం శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుణ్ణి దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. భగవదాశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా, తెలియకున్నా గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా సంక్రాంతి పర్వదినానే. భోగభాగ్యాల భోగి
భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైంది అన్నది పురాణ వచనం. ఈ రోజు ఇంద్రుణ్ణి, ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారు జామున ఇంటి ముందర, కూడళ్లలో భోగిమంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకే ఈ ఆచారం, దీని వల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. వాతావరణ కాలుష్యమూ దూరమవుతుంది. యజ్ఞ దేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగిమంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులూ వేస్తారు.
ఆపై అభ్యంగన స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్తబియ్యం, కొత్తబెల్లంతో పొంగలి వండి భగవంతునికి నివేదిస్తారు.
సంబరాల క్రాంతి
మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైంది సంక్రాంతి. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేస్తారు. ఈ రోజు స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తయిదువులకు పూలూపండ్లను వాయనంగా ఇస్తారు.
సంక్రాంతి ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడతాయి. గీతలతో, చుక్కలతో తీరు తీరుగా రూపు దిద్దుకుంటాయి. మధ్యచుక్క సూర్యుడి ప్రతిరూపంగా, చుట్టూ ఉన్నవి గ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసే స్నేహానుబంధం, ఆరోగ్య రహస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. పండుగలో గొబ్బెమ్మలదీ ముఖ్య పాత్రే. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల వల్ల నయమవుతాయి.
కనుమ.. పశువుల పండుగ
సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు.
పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి, కొంత పశువులకు తినిపించి, మిగిలినదాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా వాటిని పూజించి, గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి పూజ చేస్తారు. 'కనుమ నాడు కాకి కూడా కదలదు' అన్న నానుడి తెలిసిందే కదా! అందుకే ఆరోజు ఏ పనికీ వెళ్లరు, ప్రయాణం కూడా చేయరు.
'కనుమ నాడు మినుము కొరకవలె' అన్న లోకోక్తి ప్రకారం గారెలు
తింటారు.
'ముక్కనుమ' కనుమ తోటిదే. ఆరోజు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు సావిత్రీ గౌరీ వ్రతం చేసి, అమ్మవారి బొమ్మలతో బొమ్మలనోము నోచుకుంటారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి, తొమ్మిది పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టిబొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు.
మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతీ
సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం.
తింటారు.
'ముక్కనుమ' కనుమ తోటిదే. ఆరోజు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు సావిత్రీ గౌరీ వ్రతం చేసి, అమ్మవారి బొమ్మలతో బొమ్మలనోము నోచుకుంటారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి, తొమ్మిది పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టిబొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు.
మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతీ
సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం.
సరస్వతీ ప్రసాదం
మధుర సంభాషణే అసలైన అలంకారం. కఠినమైన మాటతీరు అనర్థదాయకం. మన్ననగా మాట్లాడమన్నారు పెద్దలు. మధుర వాక్కులకు ఉదాహరణ హనుమ. సీతమ్మను అన్వేషిస్తూ వెళ్లిన సందర్భంలో తమతో హనుమ మాట్లాడిన తీరును రాముడు ఎంతో మెచ్చుకున్నాడు. 'ఒక్క అపశబ్దం లేకుండా, వ్యాకరణ శాస్త్ర ప్రావీణ్యం కలిగినట్లుగా వినసొంపుగా సంభాషించాడు. ఇతడి వాక్చాతుర్యాన్ని గమనిస్తే క్రూరులు సైతం శాంతించి, ఎత్తిన కత్తిని దించి తీరాల్సిందే' అన్నాడు. జీవితం సజావుగా సాగాలంటే.. మాటతీరు మన్ననగా ఉండాలి. సమయోచితంగా మాట్లాడాలి. 'మాట' సరస్వతీమాత ప్రసాదించిన వరం. 'వాగ్భూషణం భూషణం' అన్నది భర్తృహరి సుభాషితం. అంటే వాక్కే అసలైన ఆభరణం అని భావం. మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మిః
జిహ్వాగ్రే మిత్రబాంధవాః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణ ధృవం
మాట వైఖరి బాగుంటే బంధుమిత్రులు లభిస్తారు. సంపదలు ప్రాప్తిస్తాయి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. లేదంటే చిక్కుల్లో పడొచ్చు, సంపదలు కోల్పోవచ్చు, ప్రాణహాని కూడా సంభవించవచ్చు. కనుక మధురభాషణ అలవరుచుకోవాలి.
మధుర సంభాషణే అసలైన అలంకారం. కఠినమైన మాటతీరు అనర్థదాయకం. మన్ననగా మాట్లాడమన్నారు పెద్దలు. మధుర వాక్కులకు ఉదాహరణ హనుమ. సీతమ్మను అన్వేషిస్తూ వెళ్లిన సందర్భంలో తమతో హనుమ మాట్లాడిన తీరును రాముడు ఎంతో మెచ్చుకున్నాడు. 'ఒక్క అపశబ్దం లేకుండా, వ్యాకరణ శాస్త్ర ప్రావీణ్యం కలిగినట్లుగా వినసొంపుగా సంభాషించాడు. ఇతడి వాక్చాతుర్యాన్ని గమనిస్తే క్రూరులు సైతం శాంతించి, ఎత్తిన కత్తిని దించి తీరాల్సిందే' అన్నాడు. జీవితం సజావుగా సాగాలంటే.. మాటతీరు మన్ననగా ఉండాలి. సమయోచితంగా మాట్లాడాలి. 'మాట' సరస్వతీమాత ప్రసాదించిన వరం. 'వాగ్భూషణం భూషణం' అన్నది భర్తృహరి సుభాషితం. అంటే వాక్కే అసలైన ఆభరణం అని భావం. మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మిః
జిహ్వాగ్రే మిత్రబాంధవాః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణ ధృవం
మాట వైఖరి బాగుంటే బంధుమిత్రులు లభిస్తారు. సంపదలు ప్రాప్తిస్తాయి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. లేదంటే చిక్కుల్లో పడొచ్చు, సంపదలు కోల్పోవచ్చు, ప్రాణహాని కూడా సంభవించవచ్చు. కనుక మధురభాషణ అలవరుచుకోవాలి.
జ్ఞానసిద్ధి కోసం...
భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం... ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది. భగవత్తత్వ అవగాహనలో మొదటి మెట్టు విగ్రహారాధన. భక్తికి ఒక ఆలంబన అవసరమన్నది మహర్షులు చెప్పిన మాట.
ప్రతిష్ఠించిన విగ్రహం వల్ల భక్తి పుడుతుంది. లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రతకు ఓ రూపం అవసరం.
భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ఈ అయిదింటిలో అర్చామూర్తి- విగ్రహ రూపంలో ఉంటాడు.
ఇటువంటి మూర్తిలోనే భక్తుడు తన ఇష్ట దైవాన్ని కొలుచుకుంటాడు. విగ్రహం వలన భక్తులు ఉపాసన చేసుకోవడానికి వీలవుతుంది.
ఉపాసకుడి కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరుడు ఓ రూపం దాల్చాడని పెద్దలు చెబుతారు.
పరబ్రహ్మ తత్వం అర్థమైన వారు నూటికొక్కరు ఉంటారు. అటువంటివారు 'హరిమయము విశ్వమంతయు' అనుకోగలరు. కానీ, సామాన్య భక్తులు ఇంతటి అవగాహనకు రాలేరు. వారికి నిత్యజీవిత కార్యకలాపాల్లో 'దేవుడు' ఒక భాగం. సాధారణ సాధకులు 'మూర్తి'ని దైవంగా భావించి సాధన చేస్తే మనసులోనే మహేశ్వరుడు ఉన్నాడనే దైవత్వ భావన కలుగవచ్చు. మనుషులంతా ఒకే రకమైన స్థాయిలో మానసిక పరిపక్వత ఉన్నవారు కారు. అందువల్ల ఆయా స్థాయి భేదాలు కలిగిన వారికోసం... భక్తి మార్గంలో వారు తరించడం కోసం విగ్రహారాధన తోడ్పడుతుంది. 'ప్రతిమా
స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరి:' అన్నారు పెద్దలు. ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక కలిగిన స్వేచ్ఛాయుతమైన ఉపాసనా మార్గం. సాధకుడికి ప్రాథమిక దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత సాధించిన వారికి మనసే మందిరమవుతుంది.
ఒక దేవతనే ఆరాధించమని హిందూ ధర్మం చెప్పదు. 'సర్వ దేవత నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' అని సూక్ష్మంలో మోక్ష సూత్రం చూపారు రుషులు. రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్పటికం, వెండి, రాగి ఇలా ఎనిమిది రకాల వస్తువులు ప్రతిమా రూపకల్పనకు యోగ్యమైనవి. అర్చకుడి నిష్ఠాగరిష్టతలు, శ్రద్ధాభక్తుల వల్ల శిల భగవద్రూపంగా రూపాంతరం చెందుతుంది. మంత్ర శక్తి, భక్తుడి భావనల తీవ్రత వంటివి ప్రతిమలో దైవ చైతన్యాన్ని ప్రోది చేస్తాయి. విగ్రహారాధన వల్ల జ్ఞాన సిద్ధి లభిస్తుంది. విగ్రహం అనే మాటకు విశేషంగా గ్రహించేది అనే అర్థముంది. త్యాగరాజు విగ్రహాలు దొరికినప్పుడు 'కనుగొంటిని రాముని' అన్నారు గానీ... 'కనుగొంటిని రాముని విగ్రహాన్ని' అనకపోవడం జ్ఞానానికి చిహ్నం.
భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం... ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది. భగవత్తత్వ అవగాహనలో మొదటి మెట్టు విగ్రహారాధన. భక్తికి ఒక ఆలంబన అవసరమన్నది మహర్షులు చెప్పిన మాట.
ప్రతిష్ఠించిన విగ్రహం వల్ల భక్తి పుడుతుంది. లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రతకు ఓ రూపం అవసరం.
భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ఈ అయిదింటిలో అర్చామూర్తి- విగ్రహ రూపంలో ఉంటాడు.
ఇటువంటి మూర్తిలోనే భక్తుడు తన ఇష్ట దైవాన్ని కొలుచుకుంటాడు. విగ్రహం వలన భక్తులు ఉపాసన చేసుకోవడానికి వీలవుతుంది.
ఉపాసకుడి కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరుడు ఓ రూపం దాల్చాడని పెద్దలు చెబుతారు.
పరబ్రహ్మ తత్వం అర్థమైన వారు నూటికొక్కరు ఉంటారు. అటువంటివారు 'హరిమయము విశ్వమంతయు' అనుకోగలరు. కానీ, సామాన్య భక్తులు ఇంతటి అవగాహనకు రాలేరు. వారికి నిత్యజీవిత కార్యకలాపాల్లో 'దేవుడు' ఒక భాగం. సాధారణ సాధకులు 'మూర్తి'ని దైవంగా భావించి సాధన చేస్తే మనసులోనే మహేశ్వరుడు ఉన్నాడనే దైవత్వ భావన కలుగవచ్చు. మనుషులంతా ఒకే రకమైన స్థాయిలో మానసిక పరిపక్వత ఉన్నవారు కారు. అందువల్ల ఆయా స్థాయి భేదాలు కలిగిన వారికోసం... భక్తి మార్గంలో వారు తరించడం కోసం విగ్రహారాధన తోడ్పడుతుంది. 'ప్రతిమా
స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరి:' అన్నారు పెద్దలు. ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక కలిగిన స్వేచ్ఛాయుతమైన ఉపాసనా మార్గం. సాధకుడికి ప్రాథమిక దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత సాధించిన వారికి మనసే మందిరమవుతుంది.
ఒక దేవతనే ఆరాధించమని హిందూ ధర్మం చెప్పదు. 'సర్వ దేవత నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' అని సూక్ష్మంలో మోక్ష సూత్రం చూపారు రుషులు. రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్పటికం, వెండి, రాగి ఇలా ఎనిమిది రకాల వస్తువులు ప్రతిమా రూపకల్పనకు యోగ్యమైనవి. అర్చకుడి నిష్ఠాగరిష్టతలు, శ్రద్ధాభక్తుల వల్ల శిల భగవద్రూపంగా రూపాంతరం చెందుతుంది. మంత్ర శక్తి, భక్తుడి భావనల తీవ్రత వంటివి ప్రతిమలో దైవ చైతన్యాన్ని ప్రోది చేస్తాయి. విగ్రహారాధన వల్ల జ్ఞాన సిద్ధి లభిస్తుంది. విగ్రహం అనే మాటకు విశేషంగా గ్రహించేది అనే అర్థముంది. త్యాగరాజు విగ్రహాలు దొరికినప్పుడు 'కనుగొంటిని రాముని' అన్నారు గానీ... 'కనుగొంటిని రాముని విగ్రహాన్ని' అనకపోవడం జ్ఞానానికి చిహ్నం.
ఈ పూజతో పాపాలు తొలగుతాయి
అష్టమి తిథి బుధవారం నాడు వస్తే దానిని ‘బుధాష్టమి' అంటారు. ఈ జనవరి 22 నాడు అలా కలిసి వచ్చాయి. బుధగ్రహం విజ్ఞత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలకు సూచన. ఇవన్నీ మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే బుధాష్టమి రోజున..
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్
అని వీలున్నన్నిసార్లు జపించాలి. బుధాష్టమి శివుడికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజని పురాణ వచనం. కాబట్టి ఈ రోజు శివకేశవులను పూజిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది.
గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో బుధాష్టమి వ్రతం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, బుధగ్రహాన్ని పూజించి, నైవేద్యం సమర్పిస్తారు. ఈ పూజలో బుధుడి రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణేన్ని, దాని ముందు గంగాజల కలశాన్ని ఉంచి పూజ చేస్తారు. వ్రతం పూర్తయ్యాక.. ఆ నాణేన్ని దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ దోషాలుంటే.. వాటి నుంచి విముక్తి లభిస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, కైవల్యం లభిస్తుందనీ విశ్వసిస్తారు.
ఈ రోజున ఉపవాసం ఉండి, దైవారాధన చేసినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందంటారు.
అష్టమి తిథి బుధవారం నాడు వస్తే దానిని ‘బుధాష్టమి' అంటారు. ఈ జనవరి 22 నాడు అలా కలిసి వచ్చాయి. బుధగ్రహం విజ్ఞత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలకు సూచన. ఇవన్నీ మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే బుధాష్టమి రోజున..
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్
అని వీలున్నన్నిసార్లు జపించాలి. బుధాష్టమి శివుడికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజని పురాణ వచనం. కాబట్టి ఈ రోజు శివకేశవులను పూజిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది.
గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో బుధాష్టమి వ్రతం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, బుధగ్రహాన్ని పూజించి, నైవేద్యం సమర్పిస్తారు. ఈ పూజలో బుధుడి రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణేన్ని, దాని ముందు గంగాజల కలశాన్ని ఉంచి పూజ చేస్తారు. వ్రతం పూర్తయ్యాక.. ఆ నాణేన్ని దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ దోషాలుంటే.. వాటి నుంచి విముక్తి లభిస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, కైవల్యం లభిస్తుందనీ విశ్వసిస్తారు.
ఈ రోజున ఉపవాసం ఉండి, దైవారాధన చేసినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందంటారు.
షట్తిల ఏకాదశి
పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి , పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది.
షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట.
*షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు*
*ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..*
1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.
2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి .
3) తిల హోమం - ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.
4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట , నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.
5) తిలదానం - నువ్వులు కాని , నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.
6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది)
ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు , మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు.సుబ్బారెడ్డి
*సూచన:-* షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము , దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుపవలసి ఉంటుంది.
*షట్తిల ఏకాదశి యొక్క చారిత్రక పురాణ కథనం*
మత విశ్వాసాల ప్రకారం , నారద ముని విష్ణువును చూడటానికి వైకుంఠమును సందర్శించి , షట్తిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపమని అడిగినారు. నారద ముని విష్ణువును పట్టుబట్టిన తరువాత ,
పురాతన కాలంలో , ఒక బ్రాహ్మణ భార్య భూమిపై నివసించేది , ఆమె నాకు పెద్ద భక్తురాలు , తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం , భక్తితో ఆరాధించేది. ఒక సారి ఆమె నా ఆశీస్సులు పొందటానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంది. ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుండి స్వచ్ఛంగా మారింది. కానీ ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు మరియు దేవతలకు ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు. కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను , అందువల్ల నేను ఆమెను సాధు , బ్రాహ్మణుడిగా మారువేషంలో పరీక్షించాలనుకున్నాను.
ఒకానొకనాడు నేను మారువేషంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు , ఆమె మట్టి ముద్దను తెచ్చి నా చేతుల్లో ఉంచింది. నేను దాన్ని తిరిగి వైకుంఠమునకు తీసుకువచ్చాను. కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠము వచ్చినప్పుడు ఆమెకు గుడిసె , మామిడి చెట్టు అందించారు. ఖాళీ గుడిసెను చూసిన ఆమె ఆందోళన చెందింది. నేను ధర్మవంతునైనప్పుడు కూడా నాకు ఖాళీ గుడిసె ఎందుకు వచ్చింది అని అన్నది. ఇవన్నీ మీరు ఆహారం దానం చేయకపోవడం మరియు నాకు బురద ఇవ్వడం వల్లనే అని నేను ఆమెకు చెప్పాను. అప్పుడు నేను ఆమెకు చెప్పాను , మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవవద్దు దేవ కన్యలు షట్టిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెప్తారు.
దేవ కన్యలు చెప్పినట్లు ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది. ఉపవాసం యొక్క ప్రభావాలతో , ఆమె గుడిసెలో ఆహార పదార్థాలు మరియు పంటలు నిండిపోయాయి. అందువల్ల , నారద , ఈ ఏకాదశి ఉపవాసం చేసి , ఆహారం మరియు నువ్వులను దానం చేసిన వారెవరైనా ఆశీర్వాదం , సంపద మరియు మోక్షం పొందుతారు.
పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి , పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది.
షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట.
*షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు*
*ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..*
1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.
2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి .
3) తిల హోమం - ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.
4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట , నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.
5) తిలదానం - నువ్వులు కాని , నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.
6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది)
ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు , మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు.సుబ్బారెడ్డి
*సూచన:-* షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము , దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుపవలసి ఉంటుంది.
*షట్తిల ఏకాదశి యొక్క చారిత్రక పురాణ కథనం*
మత విశ్వాసాల ప్రకారం , నారద ముని విష్ణువును చూడటానికి వైకుంఠమును సందర్శించి , షట్తిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపమని అడిగినారు. నారద ముని విష్ణువును పట్టుబట్టిన తరువాత ,
పురాతన కాలంలో , ఒక బ్రాహ్మణ భార్య భూమిపై నివసించేది , ఆమె నాకు పెద్ద భక్తురాలు , తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం , భక్తితో ఆరాధించేది. ఒక సారి ఆమె నా ఆశీస్సులు పొందటానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంది. ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుండి స్వచ్ఛంగా మారింది. కానీ ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు మరియు దేవతలకు ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు. కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను , అందువల్ల నేను ఆమెను సాధు , బ్రాహ్మణుడిగా మారువేషంలో పరీక్షించాలనుకున్నాను.
ఒకానొకనాడు నేను మారువేషంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు , ఆమె మట్టి ముద్దను తెచ్చి నా చేతుల్లో ఉంచింది. నేను దాన్ని తిరిగి వైకుంఠమునకు తీసుకువచ్చాను. కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠము వచ్చినప్పుడు ఆమెకు గుడిసె , మామిడి చెట్టు అందించారు. ఖాళీ గుడిసెను చూసిన ఆమె ఆందోళన చెందింది. నేను ధర్మవంతునైనప్పుడు కూడా నాకు ఖాళీ గుడిసె ఎందుకు వచ్చింది అని అన్నది. ఇవన్నీ మీరు ఆహారం దానం చేయకపోవడం మరియు నాకు బురద ఇవ్వడం వల్లనే అని నేను ఆమెకు చెప్పాను. అప్పుడు నేను ఆమెకు చెప్పాను , మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవవద్దు దేవ కన్యలు షట్టిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెప్తారు.
దేవ కన్యలు చెప్పినట్లు ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది. ఉపవాసం యొక్క ప్రభావాలతో , ఆమె గుడిసెలో ఆహార పదార్థాలు మరియు పంటలు నిండిపోయాయి. అందువల్ల , నారద , ఈ ఏకాదశి ఉపవాసం చేసి , ఆహారం మరియు నువ్వులను దానం చేసిన వారెవరైనా ఆశీర్వాదం , సంపద మరియు మోక్షం పొందుతారు.
ఆత్మసంతృప్తి
భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వ తంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసు కోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపిం చదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు.
మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీ కులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ రాళ్లూ ఉండొచ్చు. పిల్లలు వాటికి భయపడరు. అందుకని దయ్యం పేరు చెప్పేవారు. దీన్ని అర్ధవాదం అంటారు. ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్ధవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఉంది.
మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాల స్వభావాలకు చెందుతారు. ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్లు. ఏం జరిగినా మన సంచిలోకే వేసుకుందాం అనుకునేవాళ్లు. బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు. గౌరవ మర్యా దల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోడానికి చూస్తారు. నిజంగా స్వభావమే మంచి అయితే ఫరవాలేదు. కానీ సహజ స్వభావాన్ని దాచుకుని, కనిపించని తప్పులు చేస్తూ బయటికి మంచివాళ్లుగా నటిస్తూ, ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం.
మన ఆయుష్షు స్వల్పం. పైగా అనిశ్చితం. ఈ కొద్దికాలంలో ఎదుటి వారికి ఉప యోగపడే పనులు చేయాలి. ఆ పనులు ఆత్మ సంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు. వృత్తి, ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు. కానీ సమాజా నికి ఏం చేశావనేది ముఖ్యం. చేసిన మంచి పనులు పదిమందికి తెలవొచ్చు కానీ కేవలం పదిమందికీ చెప్పుకోడానికే ఏదీ చేయకూడదు.
మరణానంతర జీవితం, బంగారు కొండపై పేరుండటం... కేవలం నమ్మకం. ఇక్కడ ఉన్నంత కాలం గొప్పగా బతకడం మాత్రమే మన చేతుల్లో, చేతల్లో ఉంటుంది. ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బతకడమే మన పేరుకు సార్థకత.
భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వ తంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసు కోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపిం చదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు.
మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీ కులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ రాళ్లూ ఉండొచ్చు. పిల్లలు వాటికి భయపడరు. అందుకని దయ్యం పేరు చెప్పేవారు. దీన్ని అర్ధవాదం అంటారు. ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్ధవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఉంది.
మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాల స్వభావాలకు చెందుతారు. ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్లు. ఏం జరిగినా మన సంచిలోకే వేసుకుందాం అనుకునేవాళ్లు. బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు. గౌరవ మర్యా దల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోడానికి చూస్తారు. నిజంగా స్వభావమే మంచి అయితే ఫరవాలేదు. కానీ సహజ స్వభావాన్ని దాచుకుని, కనిపించని తప్పులు చేస్తూ బయటికి మంచివాళ్లుగా నటిస్తూ, ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం.
మన ఆయుష్షు స్వల్పం. పైగా అనిశ్చితం. ఈ కొద్దికాలంలో ఎదుటి వారికి ఉప యోగపడే పనులు చేయాలి. ఆ పనులు ఆత్మ సంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు. వృత్తి, ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు. కానీ సమాజా నికి ఏం చేశావనేది ముఖ్యం. చేసిన మంచి పనులు పదిమందికి తెలవొచ్చు కానీ కేవలం పదిమందికీ చెప్పుకోడానికే ఏదీ చేయకూడదు.
మరణానంతర జీవితం, బంగారు కొండపై పేరుండటం... కేవలం నమ్మకం. ఇక్కడ ఉన్నంత కాలం గొప్పగా బతకడం మాత్రమే మన చేతుల్లో, చేతల్లో ఉంటుంది. ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బతకడమే మన పేరుకు సార్థకత.
అమృత స్పర్శ
బెంగపడినప్పుడు, భీతిల్లినప్పుడు బిడ్డకు అమ్మ కావాలి. తల్లి పొదివిపట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటేగానీ ఆ భయం దూరమవ్వదు. అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ, ఓదార్పు, లాలన కనిపిస్తాయి. బాల్యావస్థలో అమ్మ ఆత్మీయ స్పర్శ బిడ్డకు అనుక్షణం అవసరమే. ఆ ఒడి వెచ్చదనం సోకితే బిడ్డ అదమరచి సేదదీరుతాడు. అలాగే నాన్న చెయ్యి పట్టుకుని వేసే తప్పటడుగులు, భుజమెక్కి ఆదే ఆటలు కొండంత అండ తనకుందన్న ధీమానిస్తాయి.
శిష్యుడి శిరస్సును తాకి దీవెనలందిస్తాడు. గురువు. నిండు మనసుతో తలపై చేతిని తాకించినప్పుడు శిష్యుడికి అమోఘమైన శక్తిలభించినట్లవుతుంది. గురుస్పర్శలో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గురువు ముఖంలో వేదాలు, పాదాల్లో సర్వ తీర్థాలు, కరస్పర్శలో యోగామృతం నిండి శిష్యుడిపై దయావృష్టిని కురిపిస్తాయని చెబుతారు పెద్దలు. గురుపాద స్పర్శతో మోహదుఃఖాలు తొలగి జ్ఞానభిక్ష లభిస్తుంది. ఆవిద్య నశిస్తుంది. కేవలం గురుపాద ముద్రను తాకితే జన్మ నివృత్తి, కర్మనివృత్తి
కలుగుతాయని గురుగీత చెబుతుంది
శరీరంలోని ఎనిమిది ప్రధాన అంగాలను భూమికి తగిలిస్తూ చేసే నమస్కారమే అష్టాంగ నమస్కారం. భగవంతుడికి భక్తుణ్ని దగ్గర చేసే మార్గం ఇది. మైత్రీబంధం పాదుకొనడానికి, బలపడటానికి కరస్పర్శ ఎంతో ముఖ్యం. ఆత్మీయంగా అందించే కరచాలనం కష్టంలో సుఖంలో తోడుగా నిలిచే స్నేహబంధాన్ని పరిపుష్టం చేస్తుంది. వివాహక్రతువులో ఒకరి శిరస్సును మరొకరు తాకడం, మెడ, కంటి, హస్త, పాద స్పర్శలు ఆత్మీయతకి చిహ్నంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. కలకాలం కలసి జీవించమని ప్రేరణనిస్తూ వారి కుటుంబవృద్ధికి దోహదపడతాయి.
ప్రకృతి అందించే ప్రతి స్పర్శ జీవనానికి ఎంతో అవసరం. సున్నితంగా తాకే మలయ మారుత వీచికలు, చల్లని నదీజలాలు, ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవి చంద్రుల కిరణస్పర్శలు, నిబ్బరంగా నిలిచేందుకు భూ స్పర్శ... మనిషి మనుగడకు ప్రాణావసరాలు, ప్రేమానురాగాలు పెల్లుబికినపుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకడమో, బాహుబంధాల్లో బంధించడమో అతి సహజం. సీతాన్వేషణ అనంతరం తియ్యని కబురును అందించిన హనుమను చూసి ఆర్ద్రతతో 'నువ్వు నా మరో సోదరుడివి' అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. స్పర్శని తమ తప్పునకు శిక్షలా మలచుకున్న మహాపురుషులు సంఘటనలూ పురాణాల్లో ఉన్నాయి. కురు పాండవ యుద్ధానంతరం అవసానదశలో అంపశయ్యను ఆశ్రయించాడు. భీష్మ పితామహుడు. 'బాణాలు తీవ్రంగా బాదిస్తున్నా ఆనందంగా అనుభవించాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ప్రభుభక్తికి దాసుడై రారాజును వారించనందుకు తనకు తానే విధించుకున్న శిక్ష ఆది.
కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుటపడుతుంది. జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతా పూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చేయి పట్టి నడిపించడం కడుపున పుట్టినవారి కనీస బాధ్యత.
బెంగపడినప్పుడు, భీతిల్లినప్పుడు బిడ్డకు అమ్మ కావాలి. తల్లి పొదివిపట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటేగానీ ఆ భయం దూరమవ్వదు. అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ, ఓదార్పు, లాలన కనిపిస్తాయి. బాల్యావస్థలో అమ్మ ఆత్మీయ స్పర్శ బిడ్డకు అనుక్షణం అవసరమే. ఆ ఒడి వెచ్చదనం సోకితే బిడ్డ అదమరచి సేదదీరుతాడు. అలాగే నాన్న చెయ్యి పట్టుకుని వేసే తప్పటడుగులు, భుజమెక్కి ఆదే ఆటలు కొండంత అండ తనకుందన్న ధీమానిస్తాయి.
శిష్యుడి శిరస్సును తాకి దీవెనలందిస్తాడు. గురువు. నిండు మనసుతో తలపై చేతిని తాకించినప్పుడు శిష్యుడికి అమోఘమైన శక్తిలభించినట్లవుతుంది. గురుస్పర్శలో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గురువు ముఖంలో వేదాలు, పాదాల్లో సర్వ తీర్థాలు, కరస్పర్శలో యోగామృతం నిండి శిష్యుడిపై దయావృష్టిని కురిపిస్తాయని చెబుతారు పెద్దలు. గురుపాద స్పర్శతో మోహదుఃఖాలు తొలగి జ్ఞానభిక్ష లభిస్తుంది. ఆవిద్య నశిస్తుంది. కేవలం గురుపాద ముద్రను తాకితే జన్మ నివృత్తి, కర్మనివృత్తి
కలుగుతాయని గురుగీత చెబుతుంది
శరీరంలోని ఎనిమిది ప్రధాన అంగాలను భూమికి తగిలిస్తూ చేసే నమస్కారమే అష్టాంగ నమస్కారం. భగవంతుడికి భక్తుణ్ని దగ్గర చేసే మార్గం ఇది. మైత్రీబంధం పాదుకొనడానికి, బలపడటానికి కరస్పర్శ ఎంతో ముఖ్యం. ఆత్మీయంగా అందించే కరచాలనం కష్టంలో సుఖంలో తోడుగా నిలిచే స్నేహబంధాన్ని పరిపుష్టం చేస్తుంది. వివాహక్రతువులో ఒకరి శిరస్సును మరొకరు తాకడం, మెడ, కంటి, హస్త, పాద స్పర్శలు ఆత్మీయతకి చిహ్నంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. కలకాలం కలసి జీవించమని ప్రేరణనిస్తూ వారి కుటుంబవృద్ధికి దోహదపడతాయి.
ప్రకృతి అందించే ప్రతి స్పర్శ జీవనానికి ఎంతో అవసరం. సున్నితంగా తాకే మలయ మారుత వీచికలు, చల్లని నదీజలాలు, ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవి చంద్రుల కిరణస్పర్శలు, నిబ్బరంగా నిలిచేందుకు భూ స్పర్శ... మనిషి మనుగడకు ప్రాణావసరాలు, ప్రేమానురాగాలు పెల్లుబికినపుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకడమో, బాహుబంధాల్లో బంధించడమో అతి సహజం. సీతాన్వేషణ అనంతరం తియ్యని కబురును అందించిన హనుమను చూసి ఆర్ద్రతతో 'నువ్వు నా మరో సోదరుడివి' అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. స్పర్శని తమ తప్పునకు శిక్షలా మలచుకున్న మహాపురుషులు సంఘటనలూ పురాణాల్లో ఉన్నాయి. కురు పాండవ యుద్ధానంతరం అవసానదశలో అంపశయ్యను ఆశ్రయించాడు. భీష్మ పితామహుడు. 'బాణాలు తీవ్రంగా బాదిస్తున్నా ఆనందంగా అనుభవించాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ప్రభుభక్తికి దాసుడై రారాజును వారించనందుకు తనకు తానే విధించుకున్న శిక్ష ఆది.
కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుటపడుతుంది. జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతా పూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చేయి పట్టి నడిపించడం కడుపున పుట్టినవారి కనీస బాధ్యత.
గురు పౌర్ణమి: మన జ్ఞానశిల్పులకు అంకితం
భారతదేశం, నేపాల్, భూటాన్లలో ఘనంగా జరుపుకునే గురు పౌర్ణమి, గురువుకు, శిష్యుడికి మధ్య ఉండే శాశ్వత బంధానికి ప్రగాఢ నిదర్శనం. హిందువులు, బౌద్ధులు, జైనులు తమ గురువుల – ఆధ్యాత్మిక, విద్యా సంబంధమైన, జీవిత మార్గదర్శకుల – పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని వ్యక్తపరిచేందుకు ఈ రోజును ఒక ముఖ్యమైన సందర్భంగా భావిస్తారు. ఈ గురువులే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు వైపు నడిపిస్తారు.
కృతజ్ఞత యొక్క సారాంశం
గురు పౌర్ణమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం, వ్యక్తులను, సమాజాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషించే అమూల్యమైన పాత్రను విశ్వవ్యాప్తంగా గుర్తించడం. "గురువు" అనే పదం "గు" (చీకటి), "రు" (తొలగించేవాడు) అనే రెండు అక్షరాల నుండి ఏర్పడింది. కాబట్టి, గురువు అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక లేదా మేధోపరమైన జ్ఞానం, వివేకం, నైతిక విలువలతో కూడిన మార్గాన్ని చూపించే వ్యక్తి. ఈ రోజు, మన జీవితాలపై గురువులు చూపిన ప్రగాఢ ప్రభావాన్ని గుర్తుచేసుకుని, వారికి కృతజ్ఞతలు చెప్పే ప్రత్యేకమైన సమయం.
విభిన్న మూలాలు, ఉమ్మడి స్ఫూర్తి
కృతజ్ఞత అనే భావం అందరికీ ఉమ్మడిదైనప్పటికీ, గురు పౌర్ణమి వివిధ సంప్రదాయాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది:
హిందూ మతం: వ్యాస పౌర్ణమి వారసత్వం
హిందువులకు, గురు పౌర్ణమి ఎక్కువగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇది మహర్షి వేద వ్యాసుని జన్మదినాన్ని సూచిస్తుంది. గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా పూజింపబడే వ్యాసుడు, వేదాలను సంకలనం చేసి, మహాభారతం, అనేక పురాణాలను రచించి మహత్తరమైన కృషి చేశాడు. హిందూ మతం యొక్క ప్రాథమిక గ్రంథాలను ఆయన అందించడం ద్వారా, చాలా మందికి ఆయనే ప్రాథమిక "ఆది గురువు" అయ్యాడు. అదనంగా, కొన్ని సంప్రదాయాలు శివుడిని "ఆది గురువు" లేదా ప్రథమ గురువుగా గౌరవిస్తాయి. ఈ రోజునే శివుడు తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సప్తఋషులకు ప్రసాదించి, గురువుల ద్వారా జ్ఞానాన్ని శిష్యులకు అందించే పవిత్ర సంప్రదాయాన్ని ప్రారంభించాడని నమ్ముతారు.
బౌద్ధ మతం: ధర్మ చక్ర ప్రవర్తన దివస్
బౌద్ధులు గురు పౌర్ణమిని ఎంతో గౌరవంగా భావిస్తారు, ఎందుకంటే బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన మొదటి ఉపదేశాన్ని ఈ రోజునే ఇచ్చాడని నమ్ముతారు. బుద్ధుడు తన లోతైన అంతర్దృష్టిని మొదటిసారిగా పంచుకోవడానికి ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను ఎంచుకున్నాడు. "ధర్మచక్ర ప్రవర్తన దివస్" (ధర్మచక్రాన్ని తిప్పడం) అని పిలువబడే ఈ కీలకమైన సంఘటన, బౌద్ధ బోధనల ప్రారంభాన్ని, సంఘం (బౌద్ధ సన్యాసుల సంఘం) స్థాపనను సూచిస్తుంది.
జైన మతం: గురువు మరియు శిష్యుడు
జైనులు కూడా గురు పౌర్ణమిని పాటిస్తారు. ఈ రోజున మహావీరుడు గౌతమ స్వామిని తన మొదటి శిష్యుడిగా నియమించాడని నమ్ముతారు. ఈ చర్య మహావీరుని గురువుగా పాత్రను ధృవీకరించింది, జైన సంప్రదాయంలో గురువుల వంశాన్ని స్థాపించింది.
గౌరవం మరియు ఆత్మపరిశీలన దినం
గురు పౌర్ణమి వేడుకలు వ్యక్తిగత, సామాజిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విభిన్నంగా ఉంటాయి:
ఆశీస్సులు పొందడం: భక్తులు తమ ఆధ్యాత్మిక గురువులు, ఉపాధ్యాయులు, పెద్దల ఆశీస్సులు పొందేందుకు ప్రార్థనలు చేస్తారు.
తీర్థయాత్ర: చాలా మంది ఆశ్రమాలు, దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించి సామూహిక ప్రార్థనలు మరియు ప్రవచనాలలో పాల్గొంటారు.
ఆచారాలు మరియు సమర్పణలు: గౌరవాన్ని వ్యక్తం చేయడానికి పువ్వులు, స్వీట్లు మరియు ప్రతీకాత్మక బహుమతులతో కూడిన సాధారణ, కానీ లోతైన ఆచారాలు నిర్వహిస్తారు.
ఉపవాసం మరియు ధ్యానం: కొందరు ఉపవాసాలు పాటిస్తే, మరికొందరు తమ గురువుల బోధనలపై దృష్టి సారించి ధ్యానం మరియు ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు.
సత్సంగాలు మరియు అధ్యయనం: సత్సంగాలు (ఆధ్యాత్మిక సమావేశాలు) మరియు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని, అనుబంధాన్ని పెంచుకుంటారు.
సంక్షిప్తంగా, గురు పౌర్ణమి మతపరమైన సరిహద్దులను దాటి, జ్ఞానం, వివేకం, మరియు మానవజాతిని అజ్ఞానం నుండి జ్ఞాన వెలుగులోకి నడిపించడంలో ఉపాధ్యాయుల అనివార్యమైన పాత్రను గుర్తించే విశ్వవ్యాప్త వేడుకగా నిలుస్తుంది. ఇది నేర్చుకోవడానికి, వృద్ధి చెందడానికి, మరియు మన గురువుల దయగల మార్గదర్శకత్వంలో సత్యాన్ని శాశ్వతంగా అన్వేషించడానికి మళ్లీ కట్టుబడి ఉండే రోజు.
భారతదేశం, నేపాల్, భూటాన్లలో ఘనంగా జరుపుకునే గురు పౌర్ణమి, గురువుకు, శిష్యుడికి మధ్య ఉండే శాశ్వత బంధానికి ప్రగాఢ నిదర్శనం. హిందువులు, బౌద్ధులు, జైనులు తమ గురువుల – ఆధ్యాత్మిక, విద్యా సంబంధమైన, జీవిత మార్గదర్శకుల – పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని వ్యక్తపరిచేందుకు ఈ రోజును ఒక ముఖ్యమైన సందర్భంగా భావిస్తారు. ఈ గురువులే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు వైపు నడిపిస్తారు.
కృతజ్ఞత యొక్క సారాంశం
గురు పౌర్ణమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం, వ్యక్తులను, సమాజాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషించే అమూల్యమైన పాత్రను విశ్వవ్యాప్తంగా గుర్తించడం. "గురువు" అనే పదం "గు" (చీకటి), "రు" (తొలగించేవాడు) అనే రెండు అక్షరాల నుండి ఏర్పడింది. కాబట్టి, గురువు అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక లేదా మేధోపరమైన జ్ఞానం, వివేకం, నైతిక విలువలతో కూడిన మార్గాన్ని చూపించే వ్యక్తి. ఈ రోజు, మన జీవితాలపై గురువులు చూపిన ప్రగాఢ ప్రభావాన్ని గుర్తుచేసుకుని, వారికి కృతజ్ఞతలు చెప్పే ప్రత్యేకమైన సమయం.
విభిన్న మూలాలు, ఉమ్మడి స్ఫూర్తి
కృతజ్ఞత అనే భావం అందరికీ ఉమ్మడిదైనప్పటికీ, గురు పౌర్ణమి వివిధ సంప్రదాయాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది:
హిందూ మతం: వ్యాస పౌర్ణమి వారసత్వం
హిందువులకు, గురు పౌర్ణమి ఎక్కువగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇది మహర్షి వేద వ్యాసుని జన్మదినాన్ని సూచిస్తుంది. గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా పూజింపబడే వ్యాసుడు, వేదాలను సంకలనం చేసి, మహాభారతం, అనేక పురాణాలను రచించి మహత్తరమైన కృషి చేశాడు. హిందూ మతం యొక్క ప్రాథమిక గ్రంథాలను ఆయన అందించడం ద్వారా, చాలా మందికి ఆయనే ప్రాథమిక "ఆది గురువు" అయ్యాడు. అదనంగా, కొన్ని సంప్రదాయాలు శివుడిని "ఆది గురువు" లేదా ప్రథమ గురువుగా గౌరవిస్తాయి. ఈ రోజునే శివుడు తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సప్తఋషులకు ప్రసాదించి, గురువుల ద్వారా జ్ఞానాన్ని శిష్యులకు అందించే పవిత్ర సంప్రదాయాన్ని ప్రారంభించాడని నమ్ముతారు.
బౌద్ధ మతం: ధర్మ చక్ర ప్రవర్తన దివస్
బౌద్ధులు గురు పౌర్ణమిని ఎంతో గౌరవంగా భావిస్తారు, ఎందుకంటే బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన మొదటి ఉపదేశాన్ని ఈ రోజునే ఇచ్చాడని నమ్ముతారు. బుద్ధుడు తన లోతైన అంతర్దృష్టిని మొదటిసారిగా పంచుకోవడానికి ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను ఎంచుకున్నాడు. "ధర్మచక్ర ప్రవర్తన దివస్" (ధర్మచక్రాన్ని తిప్పడం) అని పిలువబడే ఈ కీలకమైన సంఘటన, బౌద్ధ బోధనల ప్రారంభాన్ని, సంఘం (బౌద్ధ సన్యాసుల సంఘం) స్థాపనను సూచిస్తుంది.
జైన మతం: గురువు మరియు శిష్యుడు
జైనులు కూడా గురు పౌర్ణమిని పాటిస్తారు. ఈ రోజున మహావీరుడు గౌతమ స్వామిని తన మొదటి శిష్యుడిగా నియమించాడని నమ్ముతారు. ఈ చర్య మహావీరుని గురువుగా పాత్రను ధృవీకరించింది, జైన సంప్రదాయంలో గురువుల వంశాన్ని స్థాపించింది.
గౌరవం మరియు ఆత్మపరిశీలన దినం
గురు పౌర్ణమి వేడుకలు వ్యక్తిగత, సామాజిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విభిన్నంగా ఉంటాయి:
ఆశీస్సులు పొందడం: భక్తులు తమ ఆధ్యాత్మిక గురువులు, ఉపాధ్యాయులు, పెద్దల ఆశీస్సులు పొందేందుకు ప్రార్థనలు చేస్తారు.
తీర్థయాత్ర: చాలా మంది ఆశ్రమాలు, దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించి సామూహిక ప్రార్థనలు మరియు ప్రవచనాలలో పాల్గొంటారు.
ఆచారాలు మరియు సమర్పణలు: గౌరవాన్ని వ్యక్తం చేయడానికి పువ్వులు, స్వీట్లు మరియు ప్రతీకాత్మక బహుమతులతో కూడిన సాధారణ, కానీ లోతైన ఆచారాలు నిర్వహిస్తారు.
ఉపవాసం మరియు ధ్యానం: కొందరు ఉపవాసాలు పాటిస్తే, మరికొందరు తమ గురువుల బోధనలపై దృష్టి సారించి ధ్యానం మరియు ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు.
సత్సంగాలు మరియు అధ్యయనం: సత్సంగాలు (ఆధ్యాత్మిక సమావేశాలు) మరియు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని, అనుబంధాన్ని పెంచుకుంటారు.
సంక్షిప్తంగా, గురు పౌర్ణమి మతపరమైన సరిహద్దులను దాటి, జ్ఞానం, వివేకం, మరియు మానవజాతిని అజ్ఞానం నుండి జ్ఞాన వెలుగులోకి నడిపించడంలో ఉపాధ్యాయుల అనివార్యమైన పాత్రను గుర్తించే విశ్వవ్యాప్త వేడుకగా నిలుస్తుంది. ఇది నేర్చుకోవడానికి, వృద్ధి చెందడానికి, మరియు మన గురువుల దయగల మార్గదర్శకత్వంలో సత్యాన్ని శాశ్వతంగా అన్వేషించడానికి మళ్లీ కట్టుబడి ఉండే రోజు.
ప్రకృతి దేవత
ప్రకృతి పులకింపజేస్తుంది, మైమరపింపజేస్తుంది. రుతుగీతాలతో, వసంత సోయగాలతో కనులకూ, వీనులకూ విందును కలిగించి అలరిస్తుంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు 'అందమైన ప్రకృతి జనజీవనానికి వరం'. మన పాంచభౌతిక శరీరం ప్రకృతిలో భాగమే. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆయుర్వేదం, ఇతర భారతీయ శాస్త్రాలు అన్నీ ప్రకృతికి అపార ప్రాధాన్యమిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.
ప్రకృతిని కేవలం వనరుల సమాహారంగా కాక దైవిక శక్తిగా భావించేవారు పూర్వీకులు. అందుకే వేదాలలో ప్రకృతిని అనేక రూపాల్లో దేవతగా అభివర్ణించారు. అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు, భూదేవి వీరందరూ మానవాళికి జీవనాధారమైన ప్రకృతి మూలమైన దేవతలే. చెట్లు, నీటివనరులు, ఖనిజాలు- ఇవన్నీ భూమాత ఒడిలోని సంపదలే. ప్రకృతి ద్వారానే పరమాత్మను దర్శించగలమని శివపురాణం చెబుతుంది. మార్కండేయ పురాణం శక్తిని ప్రకృతిగా పేర్కొంది. ఆయుర్వేదం ప్రకృతి ఆధారిత వైద్యం. త్రిదోష సిద్ధాంతాలైన వాత, పిత్త, కఫ- ప్రకృతి సమతుల్యతపై ఆధారపడి ఉంటాయి. భారతీయ రుషులు ప్రకృతిని శరీరంలాగా, భూమిని తల్లిలాగా, గాలి- నీటిని ప్రాణాలతో సమానంగా భావించారు. ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారానే విజ్ఞానశాస్త్ర అభివృద్ధిని సాధించగలిగాం. ప్రకృతిని కాపాడటం అంటే మన ధర్మాన్ని నిలబెట్టుకోవడమే.
కృతయుగంలో ధర్మపుర గ్రామంలో సుమతి అనే పేద రైతు ఉండేవాడు. అతడు దైవభక్తి, ప్రకృతిపట్ల అమితమైన ప్రేమ కలవాడు. ప్రతి చెట్టును, మొక్కను తన కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా దివ్యమైన వెలుగుతో వనదేవత ప్రత్యక్షమైంది. 'నువ్వు ప్రకృతి పట్ల చూపిస్తున్న నిస్వార్థ ప్రేమ నన్ను ఎంతగానో సంతోషపరిచింది' అని రైతుతో అంది. సుమతి ఆనందంతో, 'నా తోటి రైతులు కూడా సుఖంగా ఉండాలి. భూమి తల్లికి ఎలాంటి కష్టం రాకూడదు' అని వేడుకున్నాడు. వనదేవత రైతు నిస్వార్థానికి ముగ్ధురాలైంది. 'నీ కోరిక నెరవేరుతుంది. ఈ సంవత్సరం నుంచి నీ పొలంలోనే కాదు, ఈ ప్రాంతమంతటా పంటలు సమృద్ధిగా పండుతాయి. అయితే, ఒక షరతు. ప్రతి ఒక్కరూ భూమిని, ప్రకృతిని తమ తల్లిలా భావించాలి. అప్పుడే ఈ సంపద శాశ్వతంగా ఉంటుంది' అని చెప్పింది. వనదేవత వరంతో గ్రామం సుభిక్షంగా మారింది. గ్రామదేవతల పూజలన్నీ ప్రకృతి ఒడిలోనే జరగడం కనిపించే దైవాన్ని ఆరాధించడంలో భాగమే.
వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, మన పురాణాలు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని బోధించాయి. ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, మనకు అది అంతకు మించిన ప్రతిఫలాన్ని ఇస్తుంది.
కె శ్రీధర్
ప్రకృతి పులకింపజేస్తుంది, మైమరపింపజేస్తుంది. రుతుగీతాలతో, వసంత సోయగాలతో కనులకూ, వీనులకూ విందును కలిగించి అలరిస్తుంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు 'అందమైన ప్రకృతి జనజీవనానికి వరం'. మన పాంచభౌతిక శరీరం ప్రకృతిలో భాగమే. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆయుర్వేదం, ఇతర భారతీయ శాస్త్రాలు అన్నీ ప్రకృతికి అపార ప్రాధాన్యమిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.
ప్రకృతిని కేవలం వనరుల సమాహారంగా కాక దైవిక శక్తిగా భావించేవారు పూర్వీకులు. అందుకే వేదాలలో ప్రకృతిని అనేక రూపాల్లో దేవతగా అభివర్ణించారు. అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు, భూదేవి వీరందరూ మానవాళికి జీవనాధారమైన ప్రకృతి మూలమైన దేవతలే. చెట్లు, నీటివనరులు, ఖనిజాలు- ఇవన్నీ భూమాత ఒడిలోని సంపదలే. ప్రకృతి ద్వారానే పరమాత్మను దర్శించగలమని శివపురాణం చెబుతుంది. మార్కండేయ పురాణం శక్తిని ప్రకృతిగా పేర్కొంది. ఆయుర్వేదం ప్రకృతి ఆధారిత వైద్యం. త్రిదోష సిద్ధాంతాలైన వాత, పిత్త, కఫ- ప్రకృతి సమతుల్యతపై ఆధారపడి ఉంటాయి. భారతీయ రుషులు ప్రకృతిని శరీరంలాగా, భూమిని తల్లిలాగా, గాలి- నీటిని ప్రాణాలతో సమానంగా భావించారు. ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారానే విజ్ఞానశాస్త్ర అభివృద్ధిని సాధించగలిగాం. ప్రకృతిని కాపాడటం అంటే మన ధర్మాన్ని నిలబెట్టుకోవడమే.
కృతయుగంలో ధర్మపుర గ్రామంలో సుమతి అనే పేద రైతు ఉండేవాడు. అతడు దైవభక్తి, ప్రకృతిపట్ల అమితమైన ప్రేమ కలవాడు. ప్రతి చెట్టును, మొక్కను తన కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా దివ్యమైన వెలుగుతో వనదేవత ప్రత్యక్షమైంది. 'నువ్వు ప్రకృతి పట్ల చూపిస్తున్న నిస్వార్థ ప్రేమ నన్ను ఎంతగానో సంతోషపరిచింది' అని రైతుతో అంది. సుమతి ఆనందంతో, 'నా తోటి రైతులు కూడా సుఖంగా ఉండాలి. భూమి తల్లికి ఎలాంటి కష్టం రాకూడదు' అని వేడుకున్నాడు. వనదేవత రైతు నిస్వార్థానికి ముగ్ధురాలైంది. 'నీ కోరిక నెరవేరుతుంది. ఈ సంవత్సరం నుంచి నీ పొలంలోనే కాదు, ఈ ప్రాంతమంతటా పంటలు సమృద్ధిగా పండుతాయి. అయితే, ఒక షరతు. ప్రతి ఒక్కరూ భూమిని, ప్రకృతిని తమ తల్లిలా భావించాలి. అప్పుడే ఈ సంపద శాశ్వతంగా ఉంటుంది' అని చెప్పింది. వనదేవత వరంతో గ్రామం సుభిక్షంగా మారింది. గ్రామదేవతల పూజలన్నీ ప్రకృతి ఒడిలోనే జరగడం కనిపించే దైవాన్ని ఆరాధించడంలో భాగమే.
వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, మన పురాణాలు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని బోధించాయి. ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, మనకు అది అంతకు మించిన ప్రతిఫలాన్ని ఇస్తుంది.
కె శ్రీధర్
సుపర్ణతత్వం
శ్రీమహావిష్ణువుకు గరుత్మంతుడనే గొప్ప పక్షి వాహనమని పురాణాలు వర్ణించాయి, తిరుమల శ్రీవారి బంగారు వాకిలికి ఎదురుగా ఉండే గరుడ మందిరంలోని అరడుగుల శిలామూర్తిది చూడచక్కని రూపం. బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజున జరిగే గరుడోత్సవం ఎంతో ప్రధానమైనది. గరుత్మంతుడికే వైనతేయుడు, సుపర్ణుడనే పేర్లు ఉన్నాయి. కశ్యప మహర్షి ద్వారా వినతకు జన్మించాడు కాబట్టి వైనతేయుడన్నారు.
గరుత్మంతుణ్ని పురాణాలు కాలపురుషుడిగా పరిగణించాయి. ఉత్తరాయణం- దక్షిణాయనం, శుక్లపక్షం- కృష్ణపక్షం, పగలు రాత్రి.. ఇలా కాలానికి చెందిన రెండు విభాగాలను పురాణాలు ఆయన రెండు రెక్కలుగా సంకేతించాయి.
పురాణాల్లో గరుత్మంతున్నే వేదాలు సుపర్ణుడిగా చెప్పాయి. 'ఇంద్రం మిత్రం వరుణము గ్నిమాహు రధోదివ్యః ససుపర్ణోగరుత్మన్.. అంటూ వేదం వర్ణించింది. ఇంద్రాది దేవతలతో సమానంగా పెద్దపీట వేసింది. ఆయన రెండు రెక్కలను జ్యోతిర్విద్య, మోక్షవిద్యలుగా సూచించింది. శాస్త్రవిద్య, బ్రహ్మవిద్యలకు వాటిని ప్రతీకలుగా చెప్పింది. ఈ వర్ణనలతో కూడిన రుగ్వేదం మొదటి మండలంలోని 'అస్య వామస్య సూక్తానికి ప్రత్యేకంగా సుపర్ణసూక్తం'గా పేరు స్థిరపడింది. దీన్ని బట్టి వేదాల్లో సుపర్ణుడికి గల ప్రాధాన్యాన్ని గ్రహించ వచ్చు. పురాణాల్లోని గరుడ ఉపాఖ్యానానికి వేదాల్లోని సుపర్ణసూక్తానికి మధ్య ప్రతీకాత్మక సమన్వయాన్ని అర్ధం చేసు కుంటే 'సుపర్ణతత్వం' మనకు బాగా బోధ పడుతుంది. ఆగమ శాస్త్ర గ్రంథాలు సుపర్ణున్నే ఒకవైపు ప్రాణవాయు స్వరూపు డిగా మరోవైపు వేద స్వరూపుడిగా అభివ ర్థించాయి. వీటిలో మొదటి ప్రాణవాయు స్వరూపుడనేది జీవాత్మకు సంకేతం. రెండోది పరమాత్మకు ప్రతీక. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడికి వేదస్వరూపుడైన గరుత్మంతుణ్ని వాహనంగా చెప్పడంలోని విశేషం ఏమంటే- జీవాత్మను పరమాత్మ చైతన్యం ఆవహించిందని లేదా ఆక్రమించిందని అర్ధం.
గరుత్మంతుడు కూర్చుని ఉన్నప్పుడు కుడికాలి పాదాన్ని నేలపై నిలిపి ఎడమ కాలిని మడిచి నేలకు ఆనించి, చేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. లోక ప్రసిద్ధమైన ఆ భంగిమను క్రియా యోగ ముద్రగా యోగశాస్త్రం చెబుతోంది. అది జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి యోగ్యమైన ముద్ర. ఆ స్థితిలో సర్వేసర్వత్రా పరమాత్మ భావన నిండిపోతుంది. కాలాలు లోకాలు.. వంటి పరిమితులు, సరిహద్దులు చెరిగి పోతాయి. కైవల్యస్థితి సిద్ధిస్తుంది. అలా పరమాత్మ స్వరూపాన్ని భావన చేసిన అన్న మయ్య దేశకాలాదులు చెరిగిపోయిన వైనాన్ని గమనించాడు. 'ఇట గరుడుని నీవు ఎక్కి నను పటపట దిక్కులు బగ్గన పగిలి' అంటూ ఎలుగెత్తి గానం చేశాడు. కేవలస్థితిలో చేసిన గానమది. ఆ అనుభూతి పేరే కైవల్యం. గరుడ పంచమినాడు సువర్ణతత్వాన్ని ఆవాహన చేసుకుంటే- అన్నమయ్యకు సిద్ధించిన కైవల్యస్థితి భక్తులకూ దక్కుతుంది.
శ్రీమహావిష్ణువుకు గరుత్మంతుడనే గొప్ప పక్షి వాహనమని పురాణాలు వర్ణించాయి, తిరుమల శ్రీవారి బంగారు వాకిలికి ఎదురుగా ఉండే గరుడ మందిరంలోని అరడుగుల శిలామూర్తిది చూడచక్కని రూపం. బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజున జరిగే గరుడోత్సవం ఎంతో ప్రధానమైనది. గరుత్మంతుడికే వైనతేయుడు, సుపర్ణుడనే పేర్లు ఉన్నాయి. కశ్యప మహర్షి ద్వారా వినతకు జన్మించాడు కాబట్టి వైనతేయుడన్నారు.
గరుత్మంతుణ్ని పురాణాలు కాలపురుషుడిగా పరిగణించాయి. ఉత్తరాయణం- దక్షిణాయనం, శుక్లపక్షం- కృష్ణపక్షం, పగలు రాత్రి.. ఇలా కాలానికి చెందిన రెండు విభాగాలను పురాణాలు ఆయన రెండు రెక్కలుగా సంకేతించాయి.
పురాణాల్లో గరుత్మంతున్నే వేదాలు సుపర్ణుడిగా చెప్పాయి. 'ఇంద్రం మిత్రం వరుణము గ్నిమాహు రధోదివ్యః ససుపర్ణోగరుత్మన్.. అంటూ వేదం వర్ణించింది. ఇంద్రాది దేవతలతో సమానంగా పెద్దపీట వేసింది. ఆయన రెండు రెక్కలను జ్యోతిర్విద్య, మోక్షవిద్యలుగా సూచించింది. శాస్త్రవిద్య, బ్రహ్మవిద్యలకు వాటిని ప్రతీకలుగా చెప్పింది. ఈ వర్ణనలతో కూడిన రుగ్వేదం మొదటి మండలంలోని 'అస్య వామస్య సూక్తానికి ప్రత్యేకంగా సుపర్ణసూక్తం'గా పేరు స్థిరపడింది. దీన్ని బట్టి వేదాల్లో సుపర్ణుడికి గల ప్రాధాన్యాన్ని గ్రహించ వచ్చు. పురాణాల్లోని గరుడ ఉపాఖ్యానానికి వేదాల్లోని సుపర్ణసూక్తానికి మధ్య ప్రతీకాత్మక సమన్వయాన్ని అర్ధం చేసు కుంటే 'సుపర్ణతత్వం' మనకు బాగా బోధ పడుతుంది. ఆగమ శాస్త్ర గ్రంథాలు సుపర్ణున్నే ఒకవైపు ప్రాణవాయు స్వరూపు డిగా మరోవైపు వేద స్వరూపుడిగా అభివ ర్థించాయి. వీటిలో మొదటి ప్రాణవాయు స్వరూపుడనేది జీవాత్మకు సంకేతం. రెండోది పరమాత్మకు ప్రతీక. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడికి వేదస్వరూపుడైన గరుత్మంతుణ్ని వాహనంగా చెప్పడంలోని విశేషం ఏమంటే- జీవాత్మను పరమాత్మ చైతన్యం ఆవహించిందని లేదా ఆక్రమించిందని అర్ధం.
గరుత్మంతుడు కూర్చుని ఉన్నప్పుడు కుడికాలి పాదాన్ని నేలపై నిలిపి ఎడమ కాలిని మడిచి నేలకు ఆనించి, చేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. లోక ప్రసిద్ధమైన ఆ భంగిమను క్రియా యోగ ముద్రగా యోగశాస్త్రం చెబుతోంది. అది జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి యోగ్యమైన ముద్ర. ఆ స్థితిలో సర్వేసర్వత్రా పరమాత్మ భావన నిండిపోతుంది. కాలాలు లోకాలు.. వంటి పరిమితులు, సరిహద్దులు చెరిగి పోతాయి. కైవల్యస్థితి సిద్ధిస్తుంది. అలా పరమాత్మ స్వరూపాన్ని భావన చేసిన అన్న మయ్య దేశకాలాదులు చెరిగిపోయిన వైనాన్ని గమనించాడు. 'ఇట గరుడుని నీవు ఎక్కి నను పటపట దిక్కులు బగ్గన పగిలి' అంటూ ఎలుగెత్తి గానం చేశాడు. కేవలస్థితిలో చేసిన గానమది. ఆ అనుభూతి పేరే కైవల్యం. గరుడ పంచమినాడు సువర్ణతత్వాన్ని ఆవాహన చేసుకుంటే- అన్నమయ్యకు సిద్ధించిన కైవల్యస్థితి భక్తులకూ దక్కుతుంది.
మాటే అలంకారం
వాక్కు పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి. అతిగా మాట్లాడటంవల్ల అసత్యాలు దొర్లే ప్రమాదముంది. ఇతరులను నొప్పించే అవకాశముంది. సత్యవాక్కు కలిగి మితభాషులుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం.
అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు. అగ్ని ఎంత పవిత్రమో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలి. మధురమైన వాక్కు కన్నా ప్రియమైంది మరొకటి లేదు. రామాయణంలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాదు, ప్రియభాషణుడుగానూ వాసికెక్కాడు. అలాగే ఆంజనేయుడు అత్యంత మధురంగా మాట్లాడి శ్రీరాముడి మనసును ఆకట్టుకున్నాడు. భారతంలో రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడితో దుర్యోధనుడు- యుద్ధం చేయకుండా సూది మొనంత భూమి కూడా ఇవ్వనని కఠోరంగా మాట్లాడి కురుక్షేత్ర సంగ్రామానికి కారణమయ్యాడు. ఎందరో వీరులను, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని కోల్పోయాడు.
సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరుచేసేది, ఒక మెట్టు పైన ఉంచేది మాట మాత్రమే. అందుకే అది సాత్వికంగా, సత్యంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి. ఎదుటి వ్యక్తులను కించపరిచేటట్లుగా ఉండకూడదు. వాగ్భూషణం భూషణం... అంటాడు భర్తృహరి నీతి శతకంలో. ‘చంద్రకాంతిలా ప్రకాశించే రత్నాలహారాలు, స్నానలేపనాదులు, పువ్వులు, కేశాలంకరణలూ ఇవేవీ మనిషికి నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు. చక్కగా సంస్కారంతో కూడిన మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారం. మిగిలిన భూషణాలన్నీ నశించినా, చివరకు శరీరం నశించిన తరవాత కూడా వాక్కు నిలిచి ఉంటుంది’ అని ఆ నీతిశతకం బోధిస్తుంది. ఒక మంచిమాట, స్వచ్ఛమైన చిరునవ్వు ఎటువంటి మనిషిని అయినా ఆనందంగా ఉంచుతాయి. దుర్మార్గుణ్ని కూడా మనిషిగా మారుస్తాయి.
మాట ప్రళయాన్ని సృష్టించగలదు. మానవాళికి సుఖశాంతులూ అందించగలదు. ఎదుటి వ్యక్తి ఏమాట మాట్లాడితే మనకు బాధ కలుగుతుందో అలాంటి మాటలు మనమూ మాట్లాడకూడదు. హితవుగా, ప్రియంగా, మనసుకు తృప్తిగా ఉండే మాటలు మాట్లాడటం మంచిది. లేకుంటే మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో ‘మనం మాట్లాడే తీరులోనే మనకు ఎవరితోనైనా స్నేహం చిగురిస్తుంది. మాట తీరు బాగా లేకపోతే శతృత్వం ఏర్పడుతుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు మళ్లీ చిగురించి ఏపుగా పెరుగుతుంది. కానీ ఒక్క పరుషవాక్యం వల్ల విరిగిన మనసు తిరిగి అతకటం చాలా కష్టం. ఆ గాయం సలుపుతూనే ఉంటుంది. శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని ఎలాగైనా బయటికి తీయవచ్చు. కానీ మనసును నొప్పించే మాటను పలికాక వెనక్కు తీసుకోవటం అసాధ్యం’ అని బోధిస్తాడు.
మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటలవల్లే మానవ సంబంధాలు పటిష్ఠమవుతాయి. అందుకే మాటలు పరిమళభరిత పుష్పంలా, కోకిలగానంలా ఉండాలి. అప్పుడే మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం వంటి దైవీగుణాలతో మనిషి అందరికీ దగ్గరవుతాడు. సత్సంబంధాలు పెంపొందించుకోగలుగుతాడు.
వాక్కు పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి. అతిగా మాట్లాడటంవల్ల అసత్యాలు దొర్లే ప్రమాదముంది. ఇతరులను నొప్పించే అవకాశముంది. సత్యవాక్కు కలిగి మితభాషులుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం.
అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు. అగ్ని ఎంత పవిత్రమో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలి. మధురమైన వాక్కు కన్నా ప్రియమైంది మరొకటి లేదు. రామాయణంలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాదు, ప్రియభాషణుడుగానూ వాసికెక్కాడు. అలాగే ఆంజనేయుడు అత్యంత మధురంగా మాట్లాడి శ్రీరాముడి మనసును ఆకట్టుకున్నాడు. భారతంలో రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడితో దుర్యోధనుడు- యుద్ధం చేయకుండా సూది మొనంత భూమి కూడా ఇవ్వనని కఠోరంగా మాట్లాడి కురుక్షేత్ర సంగ్రామానికి కారణమయ్యాడు. ఎందరో వీరులను, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని కోల్పోయాడు.
సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరుచేసేది, ఒక మెట్టు పైన ఉంచేది మాట మాత్రమే. అందుకే అది సాత్వికంగా, సత్యంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి. ఎదుటి వ్యక్తులను కించపరిచేటట్లుగా ఉండకూడదు. వాగ్భూషణం భూషణం... అంటాడు భర్తృహరి నీతి శతకంలో. ‘చంద్రకాంతిలా ప్రకాశించే రత్నాలహారాలు, స్నానలేపనాదులు, పువ్వులు, కేశాలంకరణలూ ఇవేవీ మనిషికి నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు. చక్కగా సంస్కారంతో కూడిన మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారం. మిగిలిన భూషణాలన్నీ నశించినా, చివరకు శరీరం నశించిన తరవాత కూడా వాక్కు నిలిచి ఉంటుంది’ అని ఆ నీతిశతకం బోధిస్తుంది. ఒక మంచిమాట, స్వచ్ఛమైన చిరునవ్వు ఎటువంటి మనిషిని అయినా ఆనందంగా ఉంచుతాయి. దుర్మార్గుణ్ని కూడా మనిషిగా మారుస్తాయి.
మాట ప్రళయాన్ని సృష్టించగలదు. మానవాళికి సుఖశాంతులూ అందించగలదు. ఎదుటి వ్యక్తి ఏమాట మాట్లాడితే మనకు బాధ కలుగుతుందో అలాంటి మాటలు మనమూ మాట్లాడకూడదు. హితవుగా, ప్రియంగా, మనసుకు తృప్తిగా ఉండే మాటలు మాట్లాడటం మంచిది. లేకుంటే మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో ‘మనం మాట్లాడే తీరులోనే మనకు ఎవరితోనైనా స్నేహం చిగురిస్తుంది. మాట తీరు బాగా లేకపోతే శతృత్వం ఏర్పడుతుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు మళ్లీ చిగురించి ఏపుగా పెరుగుతుంది. కానీ ఒక్క పరుషవాక్యం వల్ల విరిగిన మనసు తిరిగి అతకటం చాలా కష్టం. ఆ గాయం సలుపుతూనే ఉంటుంది. శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని ఎలాగైనా బయటికి తీయవచ్చు. కానీ మనసును నొప్పించే మాటను పలికాక వెనక్కు తీసుకోవటం అసాధ్యం’ అని బోధిస్తాడు.
మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటలవల్లే మానవ సంబంధాలు పటిష్ఠమవుతాయి. అందుకే మాటలు పరిమళభరిత పుష్పంలా, కోకిలగానంలా ఉండాలి. అప్పుడే మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం వంటి దైవీగుణాలతో మనిషి అందరికీ దగ్గరవుతాడు. సత్సంబంధాలు పెంపొందించుకోగలుగుతాడు.
జీవన సాధన
‘జీవితం జీవించడానికే.. జీవించడమే గొప్ప సాధన!’ అన్నాడు గీతాకారుడు. ‘జీవితంలోని రహస్యం, దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన’ అని వ్యాఖ్యానించారు పరమహంస యోగానంద! నిజానికి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది జీవనసాధనే.. అయితే మనం భగవంతుడి పట్ల ఎరుకతో చేస్తే అదే అద్భుతమైన సాధన అవుతుంది.
మట్టిలో నాటిన విత్తనం మూడోరోజుకల్లా మొలకెత్తుతుంది. అదే కాలక్రమంలో చెట్టుగా ఎదిగి నీడనిస్తుంది. లోకానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతిఫలం కోరకుండానే కారుమబ్బు జలజలా చినుకులు రాలుస్తుంది. చల్లటి గాలి స్వేచ్ఛగా వీస్తూ ప్రాణికోటిని సేద తీరుస్తుంది. ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా, పరోపకారమే లక్ష్యంగా జరిగిపోతుంది. మనిషి జీవితమూ అలా సాగిపోవాలి. అడుగడుగునా మానవత్వం వెల్లివిరియాలి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో మనిషి వెలుగులు నింపాలి! అలాంటి జీవితసాధనలోనే ఆధ్యాత్మికత మమేకమవుతుంది. మనిషికి దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది!
మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులూ పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి. అందులోని తాత్వికతను గుర్తించాలి. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడి వల్లే అనేక హింసలకు గురయ్యాడు. ఎన్ని బాధలు పడ్డా ‘నారాయణ’ శబ్దాన్ని మాత్రం వీడలేదు. అందులోని మాధుర్యాన్ని, మాహాత్మ్యాన్ని ప్రహ్లాదుడు అనుభూతి చెందాడు.. పలవరించాడు! చివరికి పరమార్థాన్ని సాధించాడు. ‘ఇందుగలడు అందులేడని సందేహము వలద’ంటూ ప్రత్యక్షంగా నారాయణుణ్ని దర్శించి తరించాడు.
సాధారణ మనిషి కూడా సాధనవల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు. అందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. కోరికలు లేని స్థితిని సాధించాలి. ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి. మాట, ఆలోచన, చర్య ప్రతిదానిలోనూ మంచే ప్రతిబింబించాలి. అప్పుడు.. సమస్త జగత్తు ఏకమై దివ్యమైన ఆనందమయమైన అనుభవాలను మనకోసం పోగుచేస్తుంది. ఆ దివ్యానుభవాలే అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలవుతాయి. ఆ అలౌకిక అనుభూతి పొందడానికి మనిషి కష్టపడాలి. సంతోషంతో, ఆశతో, సాహసంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి. ఏ పని చేస్తున్నాసరే, అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి. తన ప్రజ్ఞను వదులుకోకూడదు. అన్ని విషయాల్లోనూ దృఢంగా ఆలోచించాలి. అలా వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి.
స్వామి చిదానంద ఆకాంక్షించినట్లు- తన మనసును గెలుచుకున్న చక్రవర్తిగా మనిషి ఎదగాలి. తన భవిష్యత్తుకు తానే ప్రభువవ్వాలి. ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపోకూడదు. విజయ దరహాసంతో, తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడే మనిషి జీవనసాధన ఫలిస్తుంది! ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం... ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది. అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు. ఇదంతా ఆధ్యాత్మిక జీవన సాధనవల్లే సాధ్యమవుతుంది.
‘జీవితం జీవించడానికే.. జీవించడమే గొప్ప సాధన!’ అన్నాడు గీతాకారుడు. ‘జీవితంలోని రహస్యం, దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన’ అని వ్యాఖ్యానించారు పరమహంస యోగానంద! నిజానికి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది జీవనసాధనే.. అయితే మనం భగవంతుడి పట్ల ఎరుకతో చేస్తే అదే అద్భుతమైన సాధన అవుతుంది.
మట్టిలో నాటిన విత్తనం మూడోరోజుకల్లా మొలకెత్తుతుంది. అదే కాలక్రమంలో చెట్టుగా ఎదిగి నీడనిస్తుంది. లోకానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతిఫలం కోరకుండానే కారుమబ్బు జలజలా చినుకులు రాలుస్తుంది. చల్లటి గాలి స్వేచ్ఛగా వీస్తూ ప్రాణికోటిని సేద తీరుస్తుంది. ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా, పరోపకారమే లక్ష్యంగా జరిగిపోతుంది. మనిషి జీవితమూ అలా సాగిపోవాలి. అడుగడుగునా మానవత్వం వెల్లివిరియాలి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో మనిషి వెలుగులు నింపాలి! అలాంటి జీవితసాధనలోనే ఆధ్యాత్మికత మమేకమవుతుంది. మనిషికి దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది!
మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులూ పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి. అందులోని తాత్వికతను గుర్తించాలి. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడి వల్లే అనేక హింసలకు గురయ్యాడు. ఎన్ని బాధలు పడ్డా ‘నారాయణ’ శబ్దాన్ని మాత్రం వీడలేదు. అందులోని మాధుర్యాన్ని, మాహాత్మ్యాన్ని ప్రహ్లాదుడు అనుభూతి చెందాడు.. పలవరించాడు! చివరికి పరమార్థాన్ని సాధించాడు. ‘ఇందుగలడు అందులేడని సందేహము వలద’ంటూ ప్రత్యక్షంగా నారాయణుణ్ని దర్శించి తరించాడు.
సాధారణ మనిషి కూడా సాధనవల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు. అందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. కోరికలు లేని స్థితిని సాధించాలి. ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి. మాట, ఆలోచన, చర్య ప్రతిదానిలోనూ మంచే ప్రతిబింబించాలి. అప్పుడు.. సమస్త జగత్తు ఏకమై దివ్యమైన ఆనందమయమైన అనుభవాలను మనకోసం పోగుచేస్తుంది. ఆ దివ్యానుభవాలే అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలవుతాయి. ఆ అలౌకిక అనుభూతి పొందడానికి మనిషి కష్టపడాలి. సంతోషంతో, ఆశతో, సాహసంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి. ఏ పని చేస్తున్నాసరే, అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి. తన ప్రజ్ఞను వదులుకోకూడదు. అన్ని విషయాల్లోనూ దృఢంగా ఆలోచించాలి. అలా వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి.
స్వామి చిదానంద ఆకాంక్షించినట్లు- తన మనసును గెలుచుకున్న చక్రవర్తిగా మనిషి ఎదగాలి. తన భవిష్యత్తుకు తానే ప్రభువవ్వాలి. ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపోకూడదు. విజయ దరహాసంతో, తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడే మనిషి జీవనసాధన ఫలిస్తుంది! ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం... ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది. అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు. ఇదంతా ఆధ్యాత్మిక జీవన సాధనవల్లే సాధ్యమవుతుంది.
అంతఃకరణ శుద్ధి
మనసును ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే కోరిక, పగ, ద్వేషం, భయం, అజ్ఞానం వంటి మాలిన్యాలు తొలగిపోతాయి. స్పష్టమైన అవగాహన, ఆలోచన, సత్సంకల్పం, ప్రశాంతతలతో జ్ఞానంవైపు సాగడాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. అంతఃకరణ శుద్ధి ద్వారానే నిజమైన ఆనందం, శాంతి, జ్ఞాన చింతన లభిస్తాయి. మన దైనందిన జీవితాల్లో దీన్ని అనేక విధాలుగా అభ్యసించవచ్చు. వృద్ధులకు సాయపడటం, పేదల ఆకలి తీర్చడం, అనాథాశ్రమాలలో, విపత్తు సమయాలలో స్వచ్ఛందంగా సేవ చేయడం వంటి వాటి ద్వారా అహంకారం తగ్గి మనసులో దయ, జాలి, కరుణ వృద్ధి చెందుతాయి.
ఇతరుల తప్పులను క్షమించడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండటం అలవర్చుకోవాలి. ఎవరి వల్లనైనా బాధ కలిగినప్పుడు వారిని క్షమించి ముందుకు సాగడం వలన మనసులో ప్రతికూల ప్రభావాలు తొలగి సానుకూల దృక్పథం మొదలవుతుంది. సత్యాన్నే పలకడం వల్ల ఆలోచనల్లో, మాటల్లో ప్రక్షాళన జరుగుతుంది. నిజాయతీగా జీవించడం అలవడుతుంది. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉండటం సాధన చేయాలి. అప్పుడు సకల జీవుల పట్ల దయాగుణం పెరుగుతుంది. మనకు ఉన్నదాంతో సంతృప్తిపడటం, ఇతరులను చూసి అసూయ చెందకుండా ఉండటం వల్ల ప్రశాంతత నెలకొంటుంది. ధ్యానం అంతర్గత లోపాలను తెలుసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గించుకోవాలి. అవి దుఃఖానికి హేతువులని గుర్తించినప్పుడే వాటిపై నియంత్రణ ఏర్పడుతుంది. స్వార్థంతో చేసే కర్మలు రాగద్వేషాలకు దారితీస్తాయి. అంతఃకరణ శుద్ధి ద్వారా నిస్వార్థంగా చేసే పనులు ఆధ్యాత్మికతకు బాటలు వేస్తాయి.
అంతఃకరణ శుద్ధి వల్ల మనసులో కల్లోలం సృష్టించే ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయి. తేలికైన మనసు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు బాహ్య వస్తువులు, సంఘటనలపై ఆధారపడకుండా అంతర్గత ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ, క్షమ వంటి దైవీ గుణాలు అలవర్చుకుని సమాజ హితాన్ని కాంక్షించాలి. అప్పుడే అపార్థాలు, కక్షలు, కార్పణ్యాలు తగ్గి సమాజంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మనసు కల్మషరహితం అవుతుంది. మానసిక స్పష్టత వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధం తొలగిపోతుంది.
అంతఃకరణ శుద్ధితో అనేక అనారోగ్య సమస్యలకు ఉపశమనమూ లభిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంతఃకరణ శుద్ధిని సాధన చేస్తే సమాజంలో శాంతి, సామరస్యాలు పెరుగుతాయి. నేరాలు తగ్గి మానవత్వం పరిమళిస్తుంది. అంతఃకరణ శుద్ధి ఆధ్యాత్మిక పురోగతికి ప్రధానమైనది. ఇది జ్ఞానం పొందడానికి, ఆత్మసాక్షాత్కారానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతఃకరణ శుద్ధి అనేది ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, అదొక జీవన విధానం. నిరంతర ప్రక్రియ. దాన్ని అనుసరించడం ద్వారా మరింత అర్థవంతమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపవచ్చు.
మనసును ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే కోరిక, పగ, ద్వేషం, భయం, అజ్ఞానం వంటి మాలిన్యాలు తొలగిపోతాయి. స్పష్టమైన అవగాహన, ఆలోచన, సత్సంకల్పం, ప్రశాంతతలతో జ్ఞానంవైపు సాగడాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. అంతఃకరణ శుద్ధి ద్వారానే నిజమైన ఆనందం, శాంతి, జ్ఞాన చింతన లభిస్తాయి. మన దైనందిన జీవితాల్లో దీన్ని అనేక విధాలుగా అభ్యసించవచ్చు. వృద్ధులకు సాయపడటం, పేదల ఆకలి తీర్చడం, అనాథాశ్రమాలలో, విపత్తు సమయాలలో స్వచ్ఛందంగా సేవ చేయడం వంటి వాటి ద్వారా అహంకారం తగ్గి మనసులో దయ, జాలి, కరుణ వృద్ధి చెందుతాయి.
ఇతరుల తప్పులను క్షమించడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండటం అలవర్చుకోవాలి. ఎవరి వల్లనైనా బాధ కలిగినప్పుడు వారిని క్షమించి ముందుకు సాగడం వలన మనసులో ప్రతికూల ప్రభావాలు తొలగి సానుకూల దృక్పథం మొదలవుతుంది. సత్యాన్నే పలకడం వల్ల ఆలోచనల్లో, మాటల్లో ప్రక్షాళన జరుగుతుంది. నిజాయతీగా జీవించడం అలవడుతుంది. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉండటం సాధన చేయాలి. అప్పుడు సకల జీవుల పట్ల దయాగుణం పెరుగుతుంది. మనకు ఉన్నదాంతో సంతృప్తిపడటం, ఇతరులను చూసి అసూయ చెందకుండా ఉండటం వల్ల ప్రశాంతత నెలకొంటుంది. ధ్యానం అంతర్గత లోపాలను తెలుసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గించుకోవాలి. అవి దుఃఖానికి హేతువులని గుర్తించినప్పుడే వాటిపై నియంత్రణ ఏర్పడుతుంది. స్వార్థంతో చేసే కర్మలు రాగద్వేషాలకు దారితీస్తాయి. అంతఃకరణ శుద్ధి ద్వారా నిస్వార్థంగా చేసే పనులు ఆధ్యాత్మికతకు బాటలు వేస్తాయి.
అంతఃకరణ శుద్ధి వల్ల మనసులో కల్లోలం సృష్టించే ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయి. తేలికైన మనసు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు బాహ్య వస్తువులు, సంఘటనలపై ఆధారపడకుండా అంతర్గత ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ, క్షమ వంటి దైవీ గుణాలు అలవర్చుకుని సమాజ హితాన్ని కాంక్షించాలి. అప్పుడే అపార్థాలు, కక్షలు, కార్పణ్యాలు తగ్గి సమాజంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మనసు కల్మషరహితం అవుతుంది. మానసిక స్పష్టత వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధం తొలగిపోతుంది.
అంతఃకరణ శుద్ధితో అనేక అనారోగ్య సమస్యలకు ఉపశమనమూ లభిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంతఃకరణ శుద్ధిని సాధన చేస్తే సమాజంలో శాంతి, సామరస్యాలు పెరుగుతాయి. నేరాలు తగ్గి మానవత్వం పరిమళిస్తుంది. అంతఃకరణ శుద్ధి ఆధ్యాత్మిక పురోగతికి ప్రధానమైనది. ఇది జ్ఞానం పొందడానికి, ఆత్మసాక్షాత్కారానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతఃకరణ శుద్ధి అనేది ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, అదొక జీవన విధానం. నిరంతర ప్రక్రియ. దాన్ని అనుసరించడం ద్వారా మరింత అర్థవంతమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపవచ్చు.
వ్రత సంకల్పం
వ్రతం అంటే నియమం, సంకల్ప దీక్ష. భక్తి, శ్రద్ధల సమ్మిళితం. అష్టదిక్కుల నడుమ, తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చాలి. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరం. ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మీ తత్వం. మానవ జీవితంలో సంపూర్ణత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక. అష్టకష్టాలను నివారించే వరలక్ష్మీ వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు.
వరలక్ష్మీ వ్రతాన్ని మొదటగా చారుమతీదేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని స్కాంద పురాణం వివరిస్తోంది. పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి, భర్తకు ఆయురారోగ్యాలను, కుటుంబ సౌఖ్యాన్ని పొందిందన్నది పురాణ కథనం. వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం... అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం. ఆ శక్తి కుటుంబానికి ఆయుష్షునిస్తుందని విశ్వాసం. అది సమష్టితత్వాన్ని ప్రేరేపిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని కాదు. అనేక రూపాలలో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి. అన్నిటికీ అదే మూలాధారం ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యం. ఆత్మీయత, సౌభ్రాతృత్వం, అంకిత భావం అన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి.
శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది. ఇంటి పూజామందిరంలో వెలిగే దీపం కన్నా, హృదయంలో వెలిగే జ్ఞానదీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది. లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు, ఆమె సుగుణాలను, సంతుష్టి చెందే తత్వాన్ని నిజజీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి. సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని, పంచుకోవడంలోనే సంపత్తి తత్వం ఉన్నదని ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది. గజలక్ష్మి శక్తి- శాంతి సమన్వయమే కాదు, మన లోపలి అహంకారాన్ని జయించి, స్వీయ నియంత్రణతో జీవించమన్న సందేశం ఇస్తుంది. సంతానలక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు, విలువల వారసత్వానికి ప్రతీక. వీరలక్ష్మి నిర్భీతి, న్యాయంవైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ. విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని, అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వమని సూచిస్తుంది. ఈ ఎనిమిది తత్త్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం. వ్రతం ఒక్కరోజు చేసే ఆచారంగా కాక, ఈ అష్టశక్తులను జీవితంలో ప్రతిదినం ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి. అప్పుడు లక్ష్మి అనుగ్రహం అందరి హృదయాలనూ ఆనందమయం చేస్తుంది.
శ్రావణమాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం. ప్రకృతి పునరుజ్జీవం పొందే ఈ రుతువులో, మనుషుల హృదయాలలోనూ భక్తి, శ్రద్ధ, శాంతి చివుర్లు వేస్తాయి. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గరలోని శుక్రవారం నాడు జరుపుకొనే వరలక్ష్మీవ్రతం, త్రికాలబద్ధమైన ధర్మవేదిక. ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు. కుటుంబంతో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సాంగత్యంతో బంధించగలిగే ధార్మిక, తాత్విక ఆత్మ వైభవ సంస్కారమది. మహాలక్ష్మీ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం.
వ్రతం అంటే నియమం, సంకల్ప దీక్ష. భక్తి, శ్రద్ధల సమ్మిళితం. అష్టదిక్కుల నడుమ, తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చాలి. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరం. ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మీ తత్వం. మానవ జీవితంలో సంపూర్ణత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక. అష్టకష్టాలను నివారించే వరలక్ష్మీ వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు.
వరలక్ష్మీ వ్రతాన్ని మొదటగా చారుమతీదేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని స్కాంద పురాణం వివరిస్తోంది. పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి, భర్తకు ఆయురారోగ్యాలను, కుటుంబ సౌఖ్యాన్ని పొందిందన్నది పురాణ కథనం. వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం... అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం. ఆ శక్తి కుటుంబానికి ఆయుష్షునిస్తుందని విశ్వాసం. అది సమష్టితత్వాన్ని ప్రేరేపిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని కాదు. అనేక రూపాలలో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి. అన్నిటికీ అదే మూలాధారం ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యం. ఆత్మీయత, సౌభ్రాతృత్వం, అంకిత భావం అన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి.
శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది. ఇంటి పూజామందిరంలో వెలిగే దీపం కన్నా, హృదయంలో వెలిగే జ్ఞానదీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది. లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు, ఆమె సుగుణాలను, సంతుష్టి చెందే తత్వాన్ని నిజజీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి. సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని, పంచుకోవడంలోనే సంపత్తి తత్వం ఉన్నదని ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది. గజలక్ష్మి శక్తి- శాంతి సమన్వయమే కాదు, మన లోపలి అహంకారాన్ని జయించి, స్వీయ నియంత్రణతో జీవించమన్న సందేశం ఇస్తుంది. సంతానలక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు, విలువల వారసత్వానికి ప్రతీక. వీరలక్ష్మి నిర్భీతి, న్యాయంవైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ. విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని, అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వమని సూచిస్తుంది. ఈ ఎనిమిది తత్త్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం. వ్రతం ఒక్కరోజు చేసే ఆచారంగా కాక, ఈ అష్టశక్తులను జీవితంలో ప్రతిదినం ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి. అప్పుడు లక్ష్మి అనుగ్రహం అందరి హృదయాలనూ ఆనందమయం చేస్తుంది.
శ్రావణమాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం. ప్రకృతి పునరుజ్జీవం పొందే ఈ రుతువులో, మనుషుల హృదయాలలోనూ భక్తి, శ్రద్ధ, శాంతి చివుర్లు వేస్తాయి. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గరలోని శుక్రవారం నాడు జరుపుకొనే వరలక్ష్మీవ్రతం, త్రికాలబద్ధమైన ధర్మవేదిక. ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు. కుటుంబంతో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సాంగత్యంతో బంధించగలిగే ధార్మిక, తాత్విక ఆత్మ వైభవ సంస్కారమది. మహాలక్ష్మీ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం.
మనలోనే ఉన్నాడు
పంచభూతాలతో కూడిన ఈ సృష్టి అత్యంత అద్భుతమైంది. ఈ సృష్టికర్తయైన పరమాత్మ మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, వినే ఓపిక, తీరిక మనకు ఉండవు. తమ నాభిలోని కస్తూరి కోసం గడ్డిలో వెతికే లేడిలా, మనం ఆ స్వామి కోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం. నిజానికి ఆయన మనలోనే ఉన్నాడు. 'బుద్ధి' అనే శక్తి ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాడు. మన అంతరాత్మ ప్రభోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్రమత్తంగా ఉండకపోవడం మన అవివేకం, అజ్ఞానం.
లోపలి చూపు ఉంటేనే ఆయన కనిపిస్తాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులు అంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తూ, ఆ ఫలితాన్ని ఆయనకే వదిలేసేవారు. వారినే మనం భక్తశిఖామణులు అంటాం.
భగవంతుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయన కనురెప్పలు వాల్చకుండా మనల్ని చూస్తుంటే, మనం మాత్రం దర్శనం కోసం వెళ్లి కళ్ళు మూసుకుంటాం. అజ్ఞానపు చీకట్లలో, కష్టాల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు తన శిష్యుడికి ఇలా హితబోధ చేస్తున్నాడు: "దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా!" ఒకసారి ఆ శిష్యుడు అడవిలో వెళ్తుండగా ఒక ఏనుగు ఘీంకరిస్తూ అతనికెదురైంది. భయంతో పరుగులు పెట్టి ఆశ్రమానికి చేరుకున్నాడు. గురువు దగ్గరికి వెళ్లి, "దేవుడంతటా ఉన్నాడని మీరు చెప్పారు కదా. ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది?" అని అడిగాడు. దానికి గురువు బదులిస్తూ, "నువ్వు తెలివితక్కువగా దాని ఎదురుగా వెళ్తుంటే, అది నిన్ను ఘీంకరించి హెచ్చరించింది. అది కూడా దేవుడే. అంతేకాకుండా, ఏనుగుపై ఉన్న మావటివాడు 'తప్పుకో' అని చెబుతున్నా అతడి మాట నువ్వు వినలేదు. ఆ మావటివాడు కూడా దేవుడే. నీవు అలా వినకపోవడమే నీ అజ్ఞానం," అని వివరించాడు.
హరిని తన అహంకారంతో దూషించి, కన్న కొడుకు ప్రహ్లాదుణ్ణి చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు, ఆ బాలుడి ద్వారా శ్రీహరి చెప్పించిన మాటల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలోని ప్రతి అణువు నుంచీ మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి పడమని పశుపక్ష్యాదులు చెబుతాయి. పరోపకార వ్రతం ఆచరించమని వృక్షం బోధిస్తుంది. నిశ్చలంగా ఉండమని పర్వతం చెబుతుంది. జీవన ప్రవాహం నిర్మలంగా కొనసాగమని నది సందేశమిస్తుంది. దేవస్థానం తన దగ్గరికొచ్చి నామస్మరణతో మనశ్శాంతి పొందమని పిలుస్తుంది. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమని ధ్యానం చెబుతుంది. "నేను నీ వాణ్ణే" అని సాటి మనిషి అంటాడు.
తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో ఒక సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలు, సూచనలు ఇస్తుంటారు. వీరంతా దేవుళ్ళు కారా? ప్రత్యక్షమై, అలంకారమూర్తిగా ఎదుట నిలిస్తేనే నమ్మాలా? అందుకు కావాల్సిన యోగ్యత, తపన, భక్తి ప్రపత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి వంటి లక్షణాలు మనలో ఉండాలి కదా? అటువంటి పరిణతి సాధించినవారితో పూర్వయుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకలగుణనిధి దర్శనమిస్తాడు. సంపూర్ణ విశ్వాసంతో ఆయనను స్మరించే సాధుగుణ సంపన్నులకు సర్వేశ్వర సాక్షాత్కారం ఎప్పుడూ లభిస్తుంది. ఇది సార్వకాలీన సత్యం.
పంచభూతాలతో కూడిన ఈ సృష్టి అత్యంత అద్భుతమైంది. ఈ సృష్టికర్తయైన పరమాత్మ మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, వినే ఓపిక, తీరిక మనకు ఉండవు. తమ నాభిలోని కస్తూరి కోసం గడ్డిలో వెతికే లేడిలా, మనం ఆ స్వామి కోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం. నిజానికి ఆయన మనలోనే ఉన్నాడు. 'బుద్ధి' అనే శక్తి ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాడు. మన అంతరాత్మ ప్రభోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్రమత్తంగా ఉండకపోవడం మన అవివేకం, అజ్ఞానం.
లోపలి చూపు ఉంటేనే ఆయన కనిపిస్తాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులు అంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తూ, ఆ ఫలితాన్ని ఆయనకే వదిలేసేవారు. వారినే మనం భక్తశిఖామణులు అంటాం.
భగవంతుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయన కనురెప్పలు వాల్చకుండా మనల్ని చూస్తుంటే, మనం మాత్రం దర్శనం కోసం వెళ్లి కళ్ళు మూసుకుంటాం. అజ్ఞానపు చీకట్లలో, కష్టాల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు తన శిష్యుడికి ఇలా హితబోధ చేస్తున్నాడు: "దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా!" ఒకసారి ఆ శిష్యుడు అడవిలో వెళ్తుండగా ఒక ఏనుగు ఘీంకరిస్తూ అతనికెదురైంది. భయంతో పరుగులు పెట్టి ఆశ్రమానికి చేరుకున్నాడు. గురువు దగ్గరికి వెళ్లి, "దేవుడంతటా ఉన్నాడని మీరు చెప్పారు కదా. ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది?" అని అడిగాడు. దానికి గురువు బదులిస్తూ, "నువ్వు తెలివితక్కువగా దాని ఎదురుగా వెళ్తుంటే, అది నిన్ను ఘీంకరించి హెచ్చరించింది. అది కూడా దేవుడే. అంతేకాకుండా, ఏనుగుపై ఉన్న మావటివాడు 'తప్పుకో' అని చెబుతున్నా అతడి మాట నువ్వు వినలేదు. ఆ మావటివాడు కూడా దేవుడే. నీవు అలా వినకపోవడమే నీ అజ్ఞానం," అని వివరించాడు.
హరిని తన అహంకారంతో దూషించి, కన్న కొడుకు ప్రహ్లాదుణ్ణి చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు, ఆ బాలుడి ద్వారా శ్రీహరి చెప్పించిన మాటల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలోని ప్రతి అణువు నుంచీ మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి పడమని పశుపక్ష్యాదులు చెబుతాయి. పరోపకార వ్రతం ఆచరించమని వృక్షం బోధిస్తుంది. నిశ్చలంగా ఉండమని పర్వతం చెబుతుంది. జీవన ప్రవాహం నిర్మలంగా కొనసాగమని నది సందేశమిస్తుంది. దేవస్థానం తన దగ్గరికొచ్చి నామస్మరణతో మనశ్శాంతి పొందమని పిలుస్తుంది. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమని ధ్యానం చెబుతుంది. "నేను నీ వాణ్ణే" అని సాటి మనిషి అంటాడు.
తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో ఒక సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలు, సూచనలు ఇస్తుంటారు. వీరంతా దేవుళ్ళు కారా? ప్రత్యక్షమై, అలంకారమూర్తిగా ఎదుట నిలిస్తేనే నమ్మాలా? అందుకు కావాల్సిన యోగ్యత, తపన, భక్తి ప్రపత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి వంటి లక్షణాలు మనలో ఉండాలి కదా? అటువంటి పరిణతి సాధించినవారితో పూర్వయుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకలగుణనిధి దర్శనమిస్తాడు. సంపూర్ణ విశ్వాసంతో ఆయనను స్మరించే సాధుగుణ సంపన్నులకు సర్వేశ్వర సాక్షాత్కారం ఎప్పుడూ లభిస్తుంది. ఇది సార్వకాలీన సత్యం.
తీయని బంధం
మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలోని అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు, కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేదాలు, ఎల్లలు ఉండవు. కోపాలు, అలకలు, అసూయలు తలెత్తినా అవి అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి.
ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే, స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి, చెడు రెండింటినీ మనం స్వీకరించాలి. జీవితాన్ని ఒక పుస్తకంగా భావిస్తే, అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే. బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరమైతే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరిపారేయకూడదు!
మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుడిని కలుసుకుని అతని జన్మ రహస్యం చెబుతుంది. "నీ తమ్ముళ్ల పక్షానికి వస్తే, పాండవులకు అగ్రజుడిగా నీకే పట్టాభిషేకం చేయిస్తాను. నీ తమ్ముళ్ల ప్రాణాలు కాపాడు" అని అర్థిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి, తన స్నేహితుడి వైపే నిలబడతాడు.
అలాగే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న ఒక రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి, పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు. అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి, "కృష్ణా! నేను ఎవరో నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టే నువ్వు వారిని రక్షిస్తున్నావని కూడా నాకు తెలుసు. అధర్మాన్ని అనుసరించే కౌరవులు ఎప్పటికీ గెలవలేరని కూడా నాకు తెలుసు" అంటాడు.
"ఇంత తెలిసినవాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదు?" అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి కర్ణుడు, "నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా?" అని బదులిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలను కోల్పోయిన కర్ణుడిని మించిన మంచి మిత్రుడు ఇంకెవరుంటారు!
స్నేహితుల మధ్య ప్రేమ విడిపోయిన తర్వాత కూడా చెక్కు చెదరదని చెప్పడానికి కృష్ణ, కుచేలుల స్నేహం గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. పేదరికంతో బాధపడుతున్న తన భార్య సలహాతో సహాయం అడగడానికి వచ్చిన స్నేహితుడిని కృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు. అడగకుండానే అతని పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి పేద, గొప్ప అనే తారతమ్యాలు అడ్డురాకూడదని ప్రపంచానికి చాటిచెప్పాడు.
సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కలా జీవితాంతం సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. "నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి... నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి" అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే!
మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలోని అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు, కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేదాలు, ఎల్లలు ఉండవు. కోపాలు, అలకలు, అసూయలు తలెత్తినా అవి అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి.
ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే, స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి, చెడు రెండింటినీ మనం స్వీకరించాలి. జీవితాన్ని ఒక పుస్తకంగా భావిస్తే, అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే. బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరమైతే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరిపారేయకూడదు!
మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుడిని కలుసుకుని అతని జన్మ రహస్యం చెబుతుంది. "నీ తమ్ముళ్ల పక్షానికి వస్తే, పాండవులకు అగ్రజుడిగా నీకే పట్టాభిషేకం చేయిస్తాను. నీ తమ్ముళ్ల ప్రాణాలు కాపాడు" అని అర్థిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి, తన స్నేహితుడి వైపే నిలబడతాడు.
అలాగే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న ఒక రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి, పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు. అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి, "కృష్ణా! నేను ఎవరో నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టే నువ్వు వారిని రక్షిస్తున్నావని కూడా నాకు తెలుసు. అధర్మాన్ని అనుసరించే కౌరవులు ఎప్పటికీ గెలవలేరని కూడా నాకు తెలుసు" అంటాడు.
"ఇంత తెలిసినవాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదు?" అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి కర్ణుడు, "నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా?" అని బదులిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలను కోల్పోయిన కర్ణుడిని మించిన మంచి మిత్రుడు ఇంకెవరుంటారు!
స్నేహితుల మధ్య ప్రేమ విడిపోయిన తర్వాత కూడా చెక్కు చెదరదని చెప్పడానికి కృష్ణ, కుచేలుల స్నేహం గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. పేదరికంతో బాధపడుతున్న తన భార్య సలహాతో సహాయం అడగడానికి వచ్చిన స్నేహితుడిని కృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు. అడగకుండానే అతని పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి పేద, గొప్ప అనే తారతమ్యాలు అడ్డురాకూడదని ప్రపంచానికి చాటిచెప్పాడు.
సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కలా జీవితాంతం సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. "నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి... నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి" అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే!
తథాస్తు దేవతలు
తథాస్తు... మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మనుషులకు ఇచ్చే అపురూపమైన కానుక. కష్టనష్టాల నుండి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం.
ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకువులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే ఉత్తమం అన్న భావన కొందరిని స్థిరంగా ఉండనివ్వదు. మనిషి అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా మధ్యలో వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావు లేదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యస్థుడైన మనిషికే చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే, దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలం కూడా తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరళ కృషి మాత్రమే. పట్టు వదలని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవకపోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయని పెద్దలు అంటారు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు ప్రగతికి దారిదీపం లాంటిది. మానవుడి అంతర్యామి శుద్ధి కావాలి.
'తథాస్తు' దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశస్థులు దారిచూపే దేవతలను 'ఎగ్రిగోర్స్' అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిరాటంకంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న ఉపనిషత్తుల మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది.
ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక వాస్తవం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే, కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే మనం కూడా ప్రతిఫలం కోరకుండా పనులు చేస్తే, దేవతలు తప్పకుండా మెచ్చి 'తథాస్తు' అని దీవిస్తారు.
తథాస్తు... మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మనుషులకు ఇచ్చే అపురూపమైన కానుక. కష్టనష్టాల నుండి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం.
ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకువులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే ఉత్తమం అన్న భావన కొందరిని స్థిరంగా ఉండనివ్వదు. మనిషి అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా మధ్యలో వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావు లేదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యస్థుడైన మనిషికే చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే, దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలం కూడా తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరళ కృషి మాత్రమే. పట్టు వదలని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవకపోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయని పెద్దలు అంటారు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు ప్రగతికి దారిదీపం లాంటిది. మానవుడి అంతర్యామి శుద్ధి కావాలి.
'తథాస్తు' దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశస్థులు దారిచూపే దేవతలను 'ఎగ్రిగోర్స్' అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిరాటంకంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న ఉపనిషత్తుల మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది.
ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక వాస్తవం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే, కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే మనం కూడా ప్రతిఫలం కోరకుండా పనులు చేస్తే, దేవతలు తప్పకుండా మెచ్చి 'తథాస్తు' అని దీవిస్తారు.
క్షమాగుణం: శాంతికి, ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం
క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం. ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి. క్షమ అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను, బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించడం. ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
క్షమాగుణ విశిష్టత
ధార్మిక కోణం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు. రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించడం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు ఇచ్చాడు.
ఆధ్యాత్మిక కోణం: బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు. జైనులు ఏటా 'క్షమాపణ పర్వం' జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు. యజుర్వేదం ప్రకారం, క్షమ, తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. శివపురాణం 'క్షమయే పరమధర్మం' అని బోధించింది.
మానసిక ప్రయోజనాలు:
క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వేషం మనసులో నిప్పులాంటిది. మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
క్షమాగుణాన్ని అలవరచుకోవడం
మహాత్మా గాంధీ 'క్షమ బలహీనత కాదు, బలమైన లక్షణం' అని చెప్పారు. క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి. తప్పు చేసినవారిని శిక్షించడం కంటే, వారిని మన్నించి ప్రేమించడం ద్వారా వారి మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారని శివపురాణం వివరించింది.
క్షమ అనేది సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం. ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి. క్షమ అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను, బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించడం. ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
క్షమాగుణ విశిష్టత
ధార్మిక కోణం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు. రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించడం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు ఇచ్చాడు.
ఆధ్యాత్మిక కోణం: బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు. జైనులు ఏటా 'క్షమాపణ పర్వం' జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు. యజుర్వేదం ప్రకారం, క్షమ, తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. శివపురాణం 'క్షమయే పరమధర్మం' అని బోధించింది.
మానసిక ప్రయోజనాలు:
క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వేషం మనసులో నిప్పులాంటిది. మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
క్షమాగుణాన్ని అలవరచుకోవడం
మహాత్మా గాంధీ 'క్షమ బలహీనత కాదు, బలమైన లక్షణం' అని చెప్పారు. క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి. తప్పు చేసినవారిని శిక్షించడం కంటే, వారిని మన్నించి ప్రేమించడం ద్వారా వారి మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారని శివపురాణం వివరించింది.
క్షమ అనేది సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
సురక్ష పరిధి (కంఫర్ట్ జోన్)
మూడు పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ ఒళ్లు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు సృజనాత్మకమైన, విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా రావు. సురక్షితమైన పరిధి అంటే చాలామందికి తెలియదు. అందులోనే ఉంటారు. అక్కడే బతుకుతుంటారు. కాలు తీసి బయటపెట్టరు. ఆలోచనల్లో ఉన్న వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం. పిట్టకి గూడు సురక్షితం. అలాంటి సురక్షిత పరిధుల్లో ఉన్న మనుషులు కూడా అంతే. వాటిని వదిలి రారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యమైనంత త్వరగా కంఫర్ట్జోన్ నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. కష్టాలకు సిద్ధపడాలి. కల్లోలానికి సమాయత్తమవ్వాలి. బాధపడాలి. బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవాలి. కొలిమిలా మండాలి. కొత్త ఆలోచనలకు పుటం పెట్టాలి. మండుతున్న బంగారంలా ప్రకాశించాలి. సీతాన్వేషణకు లంకకు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి. ఒక పక్క వానాకాలం. మరో పక్క సముద్రం. సురక్షితంగా గుహలో కూర్చుని ఉండలేదు శ్రీరాముడు. నాయకులతో మంతనాలు జరిపాడు. హనుమంతుణ్ని ఎన్నుకున్నాడు. సేనను ముందుకు నడిపించాడు. విజయం సాధించాడు. సురక్షితమైన పరిధిలో జీవించడానికి మనిషి భూమ్మీదకు రాలేదు. ఇంత అభివృద్ధి సాధించామంటే ఎంతోమంది తమ తమ కంఫర్ట్ జోన్లను మరిచిపోయి పనిచేయడం వల్లనే. భద్రలోకంలో బతకడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. సంపాదించిన ఆస్తులు కరగదీయవచ్చు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉండిపోవచ్చు కూడా. మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పనిసరిగా సవాళ్లను స్వీకరించాలి. జీవితమంతా సుఖమే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. కంఫర్ట్జోన్ ఒక వలలాంటిది. దాని తాళ్లు తెంచుకుని బయటపడాలి. చాలామంది తాము అందులోనే ఉన్నామని తెలియకుండా భద్రలోకంలో బతికేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఎంత త్వరగా దాని నుంచి బయట పడతామా అనుకుంటారు.
విశ్రాంతిగా ఉండటం మంచిదే కానీ జీవితమే విశ్రాంతి అయిపోకూడదు. సురక్షితమైన పరిధిలో ఎలాంటి భయాందోళనలు లేకుండా బతకొచ్చు. అయితే అది మనిషి జీవితం కాదు. ఏ ఒక్కరూ జీవితకాలం సురక్షితమైన పరిధిలో ఉండలేరు. ఎన్నో అడ్డంకులు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తల్లి గర్భమే సురక్షితం అనుకుంటే, అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి. భూమ్మీదకు వచ్చిన తరవాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితం యుద్ధంలాంటిది. ప్రతి క్షణం లోపల, బయట పోరాటాలు సాగుతూ ఉంటాయి. భద్రమైన పరిధిని దాటి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్నవాడు పాము కుబుసాన్ని విడిచి కొత్త జీవితం మొదలెట్టినట్లు, గద్ద తన ముక్కును పగలకొట్టుకుని కొత్తగా దీర్ఘ జీవితం పొంది ఆకాశంలోకి ఎగిరినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటాడు.
మూడు పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ ఒళ్లు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు సృజనాత్మకమైన, విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా రావు. సురక్షితమైన పరిధి అంటే చాలామందికి తెలియదు. అందులోనే ఉంటారు. అక్కడే బతుకుతుంటారు. కాలు తీసి బయటపెట్టరు. ఆలోచనల్లో ఉన్న వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం. పిట్టకి గూడు సురక్షితం. అలాంటి సురక్షిత పరిధుల్లో ఉన్న మనుషులు కూడా అంతే. వాటిని వదిలి రారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యమైనంత త్వరగా కంఫర్ట్జోన్ నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. కష్టాలకు సిద్ధపడాలి. కల్లోలానికి సమాయత్తమవ్వాలి. బాధపడాలి. బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవాలి. కొలిమిలా మండాలి. కొత్త ఆలోచనలకు పుటం పెట్టాలి. మండుతున్న బంగారంలా ప్రకాశించాలి. సీతాన్వేషణకు లంకకు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి. ఒక పక్క వానాకాలం. మరో పక్క సముద్రం. సురక్షితంగా గుహలో కూర్చుని ఉండలేదు శ్రీరాముడు. నాయకులతో మంతనాలు జరిపాడు. హనుమంతుణ్ని ఎన్నుకున్నాడు. సేనను ముందుకు నడిపించాడు. విజయం సాధించాడు. సురక్షితమైన పరిధిలో జీవించడానికి మనిషి భూమ్మీదకు రాలేదు. ఇంత అభివృద్ధి సాధించామంటే ఎంతోమంది తమ తమ కంఫర్ట్ జోన్లను మరిచిపోయి పనిచేయడం వల్లనే. భద్రలోకంలో బతకడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. సంపాదించిన ఆస్తులు కరగదీయవచ్చు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉండిపోవచ్చు కూడా. మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పనిసరిగా సవాళ్లను స్వీకరించాలి. జీవితమంతా సుఖమే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. కంఫర్ట్జోన్ ఒక వలలాంటిది. దాని తాళ్లు తెంచుకుని బయటపడాలి. చాలామంది తాము అందులోనే ఉన్నామని తెలియకుండా భద్రలోకంలో బతికేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఎంత త్వరగా దాని నుంచి బయట పడతామా అనుకుంటారు.
విశ్రాంతిగా ఉండటం మంచిదే కానీ జీవితమే విశ్రాంతి అయిపోకూడదు. సురక్షితమైన పరిధిలో ఎలాంటి భయాందోళనలు లేకుండా బతకొచ్చు. అయితే అది మనిషి జీవితం కాదు. ఏ ఒక్కరూ జీవితకాలం సురక్షితమైన పరిధిలో ఉండలేరు. ఎన్నో అడ్డంకులు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తల్లి గర్భమే సురక్షితం అనుకుంటే, అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి. భూమ్మీదకు వచ్చిన తరవాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితం యుద్ధంలాంటిది. ప్రతి క్షణం లోపల, బయట పోరాటాలు సాగుతూ ఉంటాయి. భద్రమైన పరిధిని దాటి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్నవాడు పాము కుబుసాన్ని విడిచి కొత్త జీవితం మొదలెట్టినట్లు, గద్ద తన ముక్కును పగలకొట్టుకుని కొత్తగా దీర్ఘ జీవితం పొంది ఆకాశంలోకి ఎగిరినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటాడు.