సజ్జన సాంగత్యం
జన సమూహంలో సత్ప్రవర్తన కలిగినవారిని సజ్జనులని, దుర్మార్గంగా ప్రవర్తించేవారిని దుర్జనులని పిలవడం సాధారణం. సజ్జన సాంగత్యంలో చేరాలి, దుర్జన సహవాసం విడవాలి అనేది మహాభారతంలోని విదురనీతి. మంచి, చెడు- మనిషికి రెండు రెక్కలు. వాటితో సమాజపు వీధుల్లో విహరిస్తాడు. కొందరితో మంచిగా, మరి కొందరితో చెడుగా ప్రవర్తిస్తాడు. తిరస్కారం, పురస్కారం రెండూ మనం చేసే పనుల వల్ల కలుగుతాయి. చుట్టూ చేరినవారు మంచి సలహాలతో ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకంగా పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు.
సుయోధనుడు అని పేరుగాంచిన యువరాజు అపకీర్తి పొందడానికి కారకులు శకుని, కర్ణుడు. శకుని దుష్ట మంత్రాంగం, కర్ణుడికి తనపై తనకు మితిమీరిన నమ్మకం- దుర్యోధనుడి పతనానికి దారితీశాయి. మరోవైపు ధర్మమార్గంలో శాంతం, సహనం చూపించిన పాండవులకు శ్రీకృష్ణుడి సాంగత్యం లభించి విజయాన్ని ప్రసాదించింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం సాధ్యం.
మనిషిలో ఉండే నాలుగు అంతఃకరణాలు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అని పెద్దలు చెబుతారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. మనం చూసే చూపు, వినే మాటలు, తినే ఆహారం- మనసులో ఆలోచనలకు మూలాలు. వివేకం, విచక్షణతో మంచి చెడులను విశ్లేషించేది చిత్తం. ఇటువంటి విశ్లేషణా వడపోతను సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. మంధర పదేపదే చెప్పిన చెడు మాటలు కైక చిత్తాన్ని మార్చాయి. బుద్ధి మంచి నిర్ణయం చేసినా మనిషిలోని అహంకారం దాన్ని తొక్కిపట్టి తప్పుడు దారికి మళ్ళిస్తుంది. సరైన నిర్ణయం వెనక మంచి స్నేహితుల ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా, సామూహికంగా మేలు చేస్తుంది. అధికారం, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఛేదించి ఎవరూ లోపలికి వెళ్ళలేరు. అది కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం వంటిది.
ఒంటరిగా కన్నా పదిమందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి. త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో వేలాది గొంతులు బృందగానాన్ని ఆలపిస్తాయి. సంగీత కళాకారుల సామూహిక సాంగత్యంతో రాగాలు భగవంతుడి వైభవాన్ని చాటుతాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ కొల్లాయి కట్టి లక్షలాది భారతీయులతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఒకరితో ఒకరి సాంగత్యం బలమైన శక్తిగా మారి పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం గావించింది. బలమైన సజ్జనుల సమూహం ఏదైనా సాధించగలదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కితే మరణం తప్పదు అన్నాడు సుమతీ శతకకర్త.
అడవిలో సమూహంగా మేతమేసే పశువులను పులి ఏమీ చేయలేదు. సంఘటితంగా ఎదిరిస్తే తోక ముడిచి పారిపోక తప్పదు. పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి అహంకరించిన కౌరవులు, ఏడు అక్షౌహిణుల పాండవ సైన్యం ముందు ఓడిపోయారు. రాశి కన్న వాసి ముఖ్యం అని పెద్దలు చెబుతారు. సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది. పశు గుణాలు తొలగితే మనిషి పశుపతి కాగలడు. సద్గుణాలు, సత్ప్రవర్తన, మానవత్వం- ఇవే సజ్జనుల లక్షణాలు.
జన సమూహంలో సత్ప్రవర్తన కలిగినవారిని సజ్జనులని, దుర్మార్గంగా ప్రవర్తించేవారిని దుర్జనులని పిలవడం సాధారణం. సజ్జన సాంగత్యంలో చేరాలి, దుర్జన సహవాసం విడవాలి అనేది మహాభారతంలోని విదురనీతి. మంచి, చెడు- మనిషికి రెండు రెక్కలు. వాటితో సమాజపు వీధుల్లో విహరిస్తాడు. కొందరితో మంచిగా, మరి కొందరితో చెడుగా ప్రవర్తిస్తాడు. తిరస్కారం, పురస్కారం రెండూ మనం చేసే పనుల వల్ల కలుగుతాయి. చుట్టూ చేరినవారు మంచి సలహాలతో ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకంగా పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు.
సుయోధనుడు అని పేరుగాంచిన యువరాజు అపకీర్తి పొందడానికి కారకులు శకుని, కర్ణుడు. శకుని దుష్ట మంత్రాంగం, కర్ణుడికి తనపై తనకు మితిమీరిన నమ్మకం- దుర్యోధనుడి పతనానికి దారితీశాయి. మరోవైపు ధర్మమార్గంలో శాంతం, సహనం చూపించిన పాండవులకు శ్రీకృష్ణుడి సాంగత్యం లభించి విజయాన్ని ప్రసాదించింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం సాధ్యం.
మనిషిలో ఉండే నాలుగు అంతఃకరణాలు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అని పెద్దలు చెబుతారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. మనం చూసే చూపు, వినే మాటలు, తినే ఆహారం- మనసులో ఆలోచనలకు మూలాలు. వివేకం, విచక్షణతో మంచి చెడులను విశ్లేషించేది చిత్తం. ఇటువంటి విశ్లేషణా వడపోతను సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. మంధర పదేపదే చెప్పిన చెడు మాటలు కైక చిత్తాన్ని మార్చాయి. బుద్ధి మంచి నిర్ణయం చేసినా మనిషిలోని అహంకారం దాన్ని తొక్కిపట్టి తప్పుడు దారికి మళ్ళిస్తుంది. సరైన నిర్ణయం వెనక మంచి స్నేహితుల ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా, సామూహికంగా మేలు చేస్తుంది. అధికారం, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఛేదించి ఎవరూ లోపలికి వెళ్ళలేరు. అది కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం వంటిది.
ఒంటరిగా కన్నా పదిమందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి. త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో వేలాది గొంతులు బృందగానాన్ని ఆలపిస్తాయి. సంగీత కళాకారుల సామూహిక సాంగత్యంతో రాగాలు భగవంతుడి వైభవాన్ని చాటుతాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ కొల్లాయి కట్టి లక్షలాది భారతీయులతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఒకరితో ఒకరి సాంగత్యం బలమైన శక్తిగా మారి పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం గావించింది. బలమైన సజ్జనుల సమూహం ఏదైనా సాధించగలదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కితే మరణం తప్పదు అన్నాడు సుమతీ శతకకర్త.
అడవిలో సమూహంగా మేతమేసే పశువులను పులి ఏమీ చేయలేదు. సంఘటితంగా ఎదిరిస్తే తోక ముడిచి పారిపోక తప్పదు. పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి అహంకరించిన కౌరవులు, ఏడు అక్షౌహిణుల పాండవ సైన్యం ముందు ఓడిపోయారు. రాశి కన్న వాసి ముఖ్యం అని పెద్దలు చెబుతారు. సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది. పశు గుణాలు తొలగితే మనిషి పశుపతి కాగలడు. సద్గుణాలు, సత్ప్రవర్తన, మానవత్వం- ఇవే సజ్జనుల లక్షణాలు.
ఎన్నో విశేషాల అద్భుత పర్వం
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలాన్ని అత్యంత పుణ్యప్రదంగా సనాతన ధర్మశాస్త్రాలు అభివర్ణించాయి. ఉత్తరాయణంలో వచ్చే ఈ పుణ్యకాలాన్ని మహాపర్వంగా పరిగణించి, శ్రోత్రియులు మొదలుకొని సామాన్యులవరకు అందరూ మహోత్సాహంగా జరుపుకొంటారు. భారతదేశమంతా ఈ పండుగకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంలో నిర్వర్తిస్తారు. ఈ సంక్రమణకాలం మహిమాన్వితమని చెప్పిన ఋషుల ప్రతిపాదనను అనుసరించి, ఆ పుణ్యకాలంలో స్నాన, దాన, అర్చన, పితృతర్పణలను ఆచరించే పద్ధతులున్నాయి. ఉత్తరాదిలో గంగానదిలో, విశేషించి ప్రయాగ వద్ద స్నానానికి ప్రాము ఖ్యాన్నిస్తూ అధిక సంఖ్యలో శ్రద్ధాళువులు హాజరై, తీరంలో దేవతలను, పితృదేవతలను ఆరాధిస్తారు.
నింగిలో సూర్యుడి శక్తియే కాంతిగా, వర్షంగా, శక్తిగా భూమిపై కురిసి ప్రాణ చేతనను, పంటను కూడా జీవకోటికి ప్రసాదిస్తుంది. ఈ సంక్రమణల నుంచి చలి తగ్గుతూ, సూర్యకాంతి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
పంటలు చేతికంది భోగాన్ని
ప్రసాదిస్తాయి కనుక 'భోగి' సంబరాన్ని
జరుపుకొని, సంక్రాంతిని పవిత్రకర్మలతో
సార్ధకం చేసుకోవడం ఆనవాయితీ.
వేదశాస్త్ర ప్రకారం కొత్తపంటగా వచ్చిన బియ్యాన్ని దేవతలకు నివేదించి తరవాత తాము స్వీకరించాలని 'ఆగ్రయణం' అనే పేరుతో క్రతువు నిర్వహిస్తారు. అగ్నిహోత్రంలో హవ్యంగా ధాన్యాన్ని సమర్పించడం ఇందులో ప్రధానాంశం. ఆ అగ్నిహోత్రుడు సూర్యభగవానుడి మరో రూపం, ప్రతీక! ఇదే యజ్ఞాన్ని సామాన్యులు కూడా, సూర్యకాంతి పడేలా పాలతో బియ్యాన్ని ఉడికించి 'పొంగల్'గా భగవానుడికి నివేదించే ఆచారంగా ఏర్పరచారు.
సూర్యుడికి సంకేతంగా గాలిపటాలను ఎగురవేయడం కొన్నిచోట్ల సంప్రదాయం. 'పతంగ' అనే పేరు సూర్యుడిదే. సంక్రాంతివేళ పితృదేవతలకు తర్పణాలు వదలడాన్ని విధిగా చెబుతారు. తిలలతో(నువ్వులతో) వంటలు, ప్రసాదాలు, దానాలు; హోమాలు చేయాలని కూడా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ''తిలసంక్రాంతి' అని కొన్నిచోట్ల ఈ పండుగకు మరోపేరు ఉంది. దేవతా పూజకు తెల్లనువ్వులు, పితృదేవతలకు నల్లనువ్వులు వినియోగిస్తారు.
ఈ రవి సంక్రాంతినాడు అభ్యంగ స్నానం తప్పనిసరి అని, అది గొప్ప సత్ఫలితాలనిస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి, విష్ణు, శివ, శక్తి- వంటి దేవతలను ఆయా భక్తులు ఈ రోజున ప్రత్యేకించి పూజించి విశిష్ట ఫలాలు పొందవచ్చని ఆయా దేవతారాధన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నువ్వులనూనెతో దీపాలు, నువ్వుల వంటల నివేదనలను ముఖ్యంగా నిర్దేశించాయి. ఆవుపాలతో అభిషేకం, తెల్లనువ్వులు బియ్యం కలిపిన అక్షతలతో పూజ- శివుడికి ప్రీతి అని ధార్మికోక్తి. నేల తల్లి ఇచ్చిన పంటలకు సంతోషిస్తూ, ఆ ఫలాలను దానాలుగా, కానుకలుగా, బహుమానాలుగా, దేవతార్పణలుగా పంచుకొనే పండుగ ఇది. వ్యక్తి కృషితో పాటు సాటి వ్యక్తుల సహకారం, ప్రకృతి అనుకూలత, పశువుల తోడ్పాటు, సూర్యాది దివ్యశక్తుల అనుగ్రహం... ఇవన్నీ కలిసి లభించిన సంపదను కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించుకుంటూ సంతోషించే దివ్యపర్వమిది.
ఆధ్యాత్మిక- ధార్మిక ప్రాధాన్యంతో పాటు, సాంస్కృతికపరంగా, సామాజికంగా కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ 'పెద్దపండుగ' అందరికీ ఆనందోత్సవాలను ప్రసాదించాలని వివిధ సంప్రదాయాల ఆంతర్యం.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలాన్ని అత్యంత పుణ్యప్రదంగా సనాతన ధర్మశాస్త్రాలు అభివర్ణించాయి. ఉత్తరాయణంలో వచ్చే ఈ పుణ్యకాలాన్ని మహాపర్వంగా పరిగణించి, శ్రోత్రియులు మొదలుకొని సామాన్యులవరకు అందరూ మహోత్సాహంగా జరుపుకొంటారు. భారతదేశమంతా ఈ పండుగకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంలో నిర్వర్తిస్తారు. ఈ సంక్రమణకాలం మహిమాన్వితమని చెప్పిన ఋషుల ప్రతిపాదనను అనుసరించి, ఆ పుణ్యకాలంలో స్నాన, దాన, అర్చన, పితృతర్పణలను ఆచరించే పద్ధతులున్నాయి. ఉత్తరాదిలో గంగానదిలో, విశేషించి ప్రయాగ వద్ద స్నానానికి ప్రాము ఖ్యాన్నిస్తూ అధిక సంఖ్యలో శ్రద్ధాళువులు హాజరై, తీరంలో దేవతలను, పితృదేవతలను ఆరాధిస్తారు.
నింగిలో సూర్యుడి శక్తియే కాంతిగా, వర్షంగా, శక్తిగా భూమిపై కురిసి ప్రాణ చేతనను, పంటను కూడా జీవకోటికి ప్రసాదిస్తుంది. ఈ సంక్రమణల నుంచి చలి తగ్గుతూ, సూర్యకాంతి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
పంటలు చేతికంది భోగాన్ని
ప్రసాదిస్తాయి కనుక 'భోగి' సంబరాన్ని
జరుపుకొని, సంక్రాంతిని పవిత్రకర్మలతో
సార్ధకం చేసుకోవడం ఆనవాయితీ.
వేదశాస్త్ర ప్రకారం కొత్తపంటగా వచ్చిన బియ్యాన్ని దేవతలకు నివేదించి తరవాత తాము స్వీకరించాలని 'ఆగ్రయణం' అనే పేరుతో క్రతువు నిర్వహిస్తారు. అగ్నిహోత్రంలో హవ్యంగా ధాన్యాన్ని సమర్పించడం ఇందులో ప్రధానాంశం. ఆ అగ్నిహోత్రుడు సూర్యభగవానుడి మరో రూపం, ప్రతీక! ఇదే యజ్ఞాన్ని సామాన్యులు కూడా, సూర్యకాంతి పడేలా పాలతో బియ్యాన్ని ఉడికించి 'పొంగల్'గా భగవానుడికి నివేదించే ఆచారంగా ఏర్పరచారు.
సూర్యుడికి సంకేతంగా గాలిపటాలను ఎగురవేయడం కొన్నిచోట్ల సంప్రదాయం. 'పతంగ' అనే పేరు సూర్యుడిదే. సంక్రాంతివేళ పితృదేవతలకు తర్పణాలు వదలడాన్ని విధిగా చెబుతారు. తిలలతో(నువ్వులతో) వంటలు, ప్రసాదాలు, దానాలు; హోమాలు చేయాలని కూడా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ''తిలసంక్రాంతి' అని కొన్నిచోట్ల ఈ పండుగకు మరోపేరు ఉంది. దేవతా పూజకు తెల్లనువ్వులు, పితృదేవతలకు నల్లనువ్వులు వినియోగిస్తారు.
ఈ రవి సంక్రాంతినాడు అభ్యంగ స్నానం తప్పనిసరి అని, అది గొప్ప సత్ఫలితాలనిస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి, విష్ణు, శివ, శక్తి- వంటి దేవతలను ఆయా భక్తులు ఈ రోజున ప్రత్యేకించి పూజించి విశిష్ట ఫలాలు పొందవచ్చని ఆయా దేవతారాధన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నువ్వులనూనెతో దీపాలు, నువ్వుల వంటల నివేదనలను ముఖ్యంగా నిర్దేశించాయి. ఆవుపాలతో అభిషేకం, తెల్లనువ్వులు బియ్యం కలిపిన అక్షతలతో పూజ- శివుడికి ప్రీతి అని ధార్మికోక్తి. నేల తల్లి ఇచ్చిన పంటలకు సంతోషిస్తూ, ఆ ఫలాలను దానాలుగా, కానుకలుగా, బహుమానాలుగా, దేవతార్పణలుగా పంచుకొనే పండుగ ఇది. వ్యక్తి కృషితో పాటు సాటి వ్యక్తుల సహకారం, ప్రకృతి అనుకూలత, పశువుల తోడ్పాటు, సూర్యాది దివ్యశక్తుల అనుగ్రహం... ఇవన్నీ కలిసి లభించిన సంపదను కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించుకుంటూ సంతోషించే దివ్యపర్వమిది.
ఆధ్యాత్మిక- ధార్మిక ప్రాధాన్యంతో పాటు, సాంస్కృతికపరంగా, సామాజికంగా కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ 'పెద్దపండుగ' అందరికీ ఆనందోత్సవాలను ప్రసాదించాలని వివిధ సంప్రదాయాల ఆంతర్యం.
క్షమించే హృదయం
కంటికి కనిపించకుండా మానవ జీవితమనే మహా నాటకాన్ని ఆడించేది మనసు ఒక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌఖ్యకారకమైనది, శోకకారకమైనది మరొకటి లోకంలో లేదు. పుణ్యకార్యాలూ చేయిస్తుంది. పాపకూపంలోకి నెట్టేస్తుంది.
మనసు మూలంగానే మనిషి తప్పుచేస్తాడు. ఒప్పు చేస్తాడు. తనవల్ల తప్పు జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తాపపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటిమనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి.
మంచి మనసే మంచి శరీరానికి అలంకారం. ప్రసన్నమైన దివ్యభావాలు ఆవిర్భవించే మనసు చెడు ఆలోచనలను, దుష్కర్మలను ప్రేరేపించదు. మంచిని విన్నప్పుడు, కన్నప్పుడు మనసు దుర్మార్గాన పోదు. సత్సాంగత్యంవల్ల, సద్గురు బోధనలవల్ల హృదయం ప్రక్షాళితమవుతుంది.
ఎంతటి గొప్పవాడైనా, మేధావి, పండితుడు, శాస్త్రజ్ఞుడు అయినా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని, చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది.. అహంకారం తప్ప!
యుగయుగాల్లో మహామహుల
చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. కైక తన రెండు వరాల వల్ల జరిగిన పరిణామాలకు తరవాత ఎంతో పశ్చాత్తాపపడినట్లు హిందీ జాతీయ కవి మైథిలీ శరణ్ గుప్త తన 'సాకేత్' మహాకావ్యంలో చాలా గొప్పగా అభివర్ణించాడు.
అర్ధరాత్రివేళ అశ్వత్థామ ఉపపాండవులను పాశవికంగా వధించగా, అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపది ముందుంచుతాడు. భీముడు అతణ్ని వధించే ప్రయత్నం చేసినప్పుడు ద్రౌపది వారిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకమని, పైగా కన్నతల్లి గర్భశోకం భరింపరానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెడుతుంది. అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు పశ్చాత్తాపం చెంది విమోచనోపాయం కోరినప్పుడు భర్త గౌతమ మహర్షి శ్రీరామ పాదధూళి తగిలినప్పుడు స్వస్వరూపం పొందగలవని చెప్పాడు.
సత్రాజిత్తు తన శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించినట్లు నింద వేయడంతో పరమాత్మ అడవులకు వెళ్ళి ఎంతో కష్టపడి, మణిని సాధించి సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు వాసుదేవుణ్ని దూషించి, నిందించినందుకు క్షమాపణ కోరుకున్నాడు. విరాటరాజు కంకుభట్టుతో పాచికలాడుతూ, ఆగ్రహంతో పాచికలు విసిరేయడంతో కంకుభట్టు తలకు తగిలి గాయమై రక్తం కారసాగింది. కంకుభట్టే ధర్మరాజు అని తెలియడంతో విరాటరాజు క్షమాపణలు కోరుకున్నాడు. ఇలాంటి ఉదాహరణలు రామాయణ, భారత భాగవతాల్లో అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి.
చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లయితే క్షమించేవాడికంటే క్షమాపణ కోరినవాడే గొప్పవాడనిపించుకుంటాడు. క్షమాగుణానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే జైనులు చిత్తశుద్ధితో ఆత్మప్రక్షాళన కోసం 'దస్లక్షణ్పరే' పేరుతో పదిరోజులు పండుగ చేసుకుంటారు. దోషిని క్షమించినవాడు దైవస్వరూపుడని బాపూజీ అభివర్ణించారు.
కంటికి కనిపించకుండా మానవ జీవితమనే మహా నాటకాన్ని ఆడించేది మనసు ఒక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌఖ్యకారకమైనది, శోకకారకమైనది మరొకటి లోకంలో లేదు. పుణ్యకార్యాలూ చేయిస్తుంది. పాపకూపంలోకి నెట్టేస్తుంది.
మనసు మూలంగానే మనిషి తప్పుచేస్తాడు. ఒప్పు చేస్తాడు. తనవల్ల తప్పు జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తాపపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటిమనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి.
మంచి మనసే మంచి శరీరానికి అలంకారం. ప్రసన్నమైన దివ్యభావాలు ఆవిర్భవించే మనసు చెడు ఆలోచనలను, దుష్కర్మలను ప్రేరేపించదు. మంచిని విన్నప్పుడు, కన్నప్పుడు మనసు దుర్మార్గాన పోదు. సత్సాంగత్యంవల్ల, సద్గురు బోధనలవల్ల హృదయం ప్రక్షాళితమవుతుంది.
ఎంతటి గొప్పవాడైనా, మేధావి, పండితుడు, శాస్త్రజ్ఞుడు అయినా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని, చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది.. అహంకారం తప్ప!
యుగయుగాల్లో మహామహుల
చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. కైక తన రెండు వరాల వల్ల జరిగిన పరిణామాలకు తరవాత ఎంతో పశ్చాత్తాపపడినట్లు హిందీ జాతీయ కవి మైథిలీ శరణ్ గుప్త తన 'సాకేత్' మహాకావ్యంలో చాలా గొప్పగా అభివర్ణించాడు.
అర్ధరాత్రివేళ అశ్వత్థామ ఉపపాండవులను పాశవికంగా వధించగా, అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపది ముందుంచుతాడు. భీముడు అతణ్ని వధించే ప్రయత్నం చేసినప్పుడు ద్రౌపది వారిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకమని, పైగా కన్నతల్లి గర్భశోకం భరింపరానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెడుతుంది. అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు పశ్చాత్తాపం చెంది విమోచనోపాయం కోరినప్పుడు భర్త గౌతమ మహర్షి శ్రీరామ పాదధూళి తగిలినప్పుడు స్వస్వరూపం పొందగలవని చెప్పాడు.
సత్రాజిత్తు తన శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించినట్లు నింద వేయడంతో పరమాత్మ అడవులకు వెళ్ళి ఎంతో కష్టపడి, మణిని సాధించి సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు వాసుదేవుణ్ని దూషించి, నిందించినందుకు క్షమాపణ కోరుకున్నాడు. విరాటరాజు కంకుభట్టుతో పాచికలాడుతూ, ఆగ్రహంతో పాచికలు విసిరేయడంతో కంకుభట్టు తలకు తగిలి గాయమై రక్తం కారసాగింది. కంకుభట్టే ధర్మరాజు అని తెలియడంతో విరాటరాజు క్షమాపణలు కోరుకున్నాడు. ఇలాంటి ఉదాహరణలు రామాయణ, భారత భాగవతాల్లో అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి.
చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లయితే క్షమించేవాడికంటే క్షమాపణ కోరినవాడే గొప్పవాడనిపించుకుంటాడు. క్షమాగుణానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే జైనులు చిత్తశుద్ధితో ఆత్మప్రక్షాళన కోసం 'దస్లక్షణ్పరే' పేరుతో పదిరోజులు పండుగ చేసుకుంటారు. దోషిని క్షమించినవాడు దైవస్వరూపుడని బాపూజీ అభివర్ణించారు.
ఆనందం చిరునామా
మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖ పెట్టకూడదు అంటోంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇతరులను బాధలకు గురిచేసి మనం పొందేది ఆనందం కాదు. భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరమని ఆ ఉపనిషత్తు చెబుతోంది. పూర్వం రుషులెందరో ఆనందంకోసం ఏళ్లకు ఏళ్లు తపస్సు చేశారు. పరమాత్మ. అనుభూతిని పొంది ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందంలో హాయి ఎంత దివ్యమైందో సామాన్యులు సైతం గుర్తెరగాలని ఎన్నో గ్రంథాలు రాశారు. కపటత్వం పశుబలం వల్ల దొరికే ఆనందం తాత్కాలికమైందే కనుక శాశ్వతానందం కోసం తపోవనాలకు వెళ్లారు. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పారమార్థిక ఆనందమే నిజమైన ఆనందమని ఆస్వాదించి తెలుసుకున్నారు. సుఖం దుఃఖం ఈ భూమ్మీద విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంటాయి. వాటిలో ఒకదాన్ని కోరుకొని రెండోదాన్ని విడదీయడం ధరణిపై కుదరదు. ఇక్కడ ఆనందం పరిమితంగానే అనుభవానికి వస్తుంది. మరింత ఆనందం కావాలనుకొంటే ఇంకొకరినుంచి నయానో భయానో లాక్కోవలసిందే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే అంతులేని పారమార్థిక ఆనందాన్ని ఇతరులకు నష్టం లేకుండా సాధనతో సొంతం చేసుకొని అనుభవించడం కుదురుతుంది. ఆనందం చిరునామా ఆధ్యాత్మిక జ్ఞానమని వసిష్ఠుడు శ్రీరాముడికి చెబుతాడు. నూనె గానుగలో తిరిగే ఎద్దులాంటిదే ఈ భూమిపై ఆనందం కోసం మనిషి వెతుకులాట. గానుగలో తిరిగే ఎద్దు తన ముందు వేళ్ళాడదీసిన గడ్డి మోపును ఎప్పుడూ అందుకోలేదు. మనమూ అంతే! మనకు భూమిపై ఎన్నడూ అనుభవానికి అందని దివ్యానందాన్ని వెంటాడుతూనే ఉంటాం.
ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో తొలుత ప్రస్తుత స్థితితోనే సంతృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. భౌతికమైన వస్తువులలో ఆనందాన్ని వెతకడం తగని పని. ఇందుకోసం నైతిక జీవితాన్ని గడపడం అవసరం. మనసుకు ఆనందానికి అవినాభావ సంబంధం ఉంది. నిజానికి ఆనందాన్ని వెతుక్కోవడం కోసం మనసనే సాధనాన్ని పరమాత్మ ఇచ్చాడంటారు ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆనందం కావాలనే అంతర్బుద్ధి మనసులోనే పుడుతుంది. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మనసు శూన్యం చేసుకొని ప్రేమభావనలు కలిగి ఉంటే శ్రావ్యమైన సంగీత స్వరాలు వినిపిస్తాయని చెబుతారు. గుట్టల పైనుంచి చెట్ల కొమ్మల కదలికలోనుంచి ప్రవహించే నదుల జల తరంగాలనుంచి వినపడే రాగాలు దివ్య ఆనందానికి ప్రేరణ కలిగిస్తాయి. నిజమైన ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆ రాగాలు కల్పిస్తాయి. ఈ జీవితమే నిజం అని అనుకోవడమే మనుషులు చేస్తున్న తప్పు. అలా అనుకుని జీవిస్తే ఆనందం భౌతికమైన వస్తువులకే పరిమితం అవుతుంది.
ఆనందాన్ని నిర్వచించలేం. ఎందుకంటే, అదిక్కడ భూమ్మీదనే లభ్యమయ్యేడా కాదు. దాని కోసం వెతకాలి. మనసును సమాయత్తం చేసుకోవాలి. ప్రతి జీవి పరమావధి ఆనందమే. అందుకోసం మనం ప్రయత్నించాలనే దృష్టితోనే ఈ భూమిపై దైవం ఆనందం ఛాయలు కల్పించాడు. ఇవన్నీ శరీరానికి సంబంధించి ఆనందాలు. ఈశ్వరుడి సాన్నిధ్యంలో లభించే ఆనందమే నిజమైన అనంతమైనా అపరిమితమైన ఆనందం. ఆనందం చిరునామా అక్కడే... అదే
శాశ్వతానందం!
మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖ పెట్టకూడదు అంటోంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇతరులను బాధలకు గురిచేసి మనం పొందేది ఆనందం కాదు. భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరమని ఆ ఉపనిషత్తు చెబుతోంది. పూర్వం రుషులెందరో ఆనందంకోసం ఏళ్లకు ఏళ్లు తపస్సు చేశారు. పరమాత్మ. అనుభూతిని పొంది ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందంలో హాయి ఎంత దివ్యమైందో సామాన్యులు సైతం గుర్తెరగాలని ఎన్నో గ్రంథాలు రాశారు. కపటత్వం పశుబలం వల్ల దొరికే ఆనందం తాత్కాలికమైందే కనుక శాశ్వతానందం కోసం తపోవనాలకు వెళ్లారు. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పారమార్థిక ఆనందమే నిజమైన ఆనందమని ఆస్వాదించి తెలుసుకున్నారు. సుఖం దుఃఖం ఈ భూమ్మీద విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంటాయి. వాటిలో ఒకదాన్ని కోరుకొని రెండోదాన్ని విడదీయడం ధరణిపై కుదరదు. ఇక్కడ ఆనందం పరిమితంగానే అనుభవానికి వస్తుంది. మరింత ఆనందం కావాలనుకొంటే ఇంకొకరినుంచి నయానో భయానో లాక్కోవలసిందే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే అంతులేని పారమార్థిక ఆనందాన్ని ఇతరులకు నష్టం లేకుండా సాధనతో సొంతం చేసుకొని అనుభవించడం కుదురుతుంది. ఆనందం చిరునామా ఆధ్యాత్మిక జ్ఞానమని వసిష్ఠుడు శ్రీరాముడికి చెబుతాడు. నూనె గానుగలో తిరిగే ఎద్దులాంటిదే ఈ భూమిపై ఆనందం కోసం మనిషి వెతుకులాట. గానుగలో తిరిగే ఎద్దు తన ముందు వేళ్ళాడదీసిన గడ్డి మోపును ఎప్పుడూ అందుకోలేదు. మనమూ అంతే! మనకు భూమిపై ఎన్నడూ అనుభవానికి అందని దివ్యానందాన్ని వెంటాడుతూనే ఉంటాం.
ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో తొలుత ప్రస్తుత స్థితితోనే సంతృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. భౌతికమైన వస్తువులలో ఆనందాన్ని వెతకడం తగని పని. ఇందుకోసం నైతిక జీవితాన్ని గడపడం అవసరం. మనసుకు ఆనందానికి అవినాభావ సంబంధం ఉంది. నిజానికి ఆనందాన్ని వెతుక్కోవడం కోసం మనసనే సాధనాన్ని పరమాత్మ ఇచ్చాడంటారు ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆనందం కావాలనే అంతర్బుద్ధి మనసులోనే పుడుతుంది. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మనసు శూన్యం చేసుకొని ప్రేమభావనలు కలిగి ఉంటే శ్రావ్యమైన సంగీత స్వరాలు వినిపిస్తాయని చెబుతారు. గుట్టల పైనుంచి చెట్ల కొమ్మల కదలికలోనుంచి ప్రవహించే నదుల జల తరంగాలనుంచి వినపడే రాగాలు దివ్య ఆనందానికి ప్రేరణ కలిగిస్తాయి. నిజమైన ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆ రాగాలు కల్పిస్తాయి. ఈ జీవితమే నిజం అని అనుకోవడమే మనుషులు చేస్తున్న తప్పు. అలా అనుకుని జీవిస్తే ఆనందం భౌతికమైన వస్తువులకే పరిమితం అవుతుంది.
ఆనందాన్ని నిర్వచించలేం. ఎందుకంటే, అదిక్కడ భూమ్మీదనే లభ్యమయ్యేడా కాదు. దాని కోసం వెతకాలి. మనసును సమాయత్తం చేసుకోవాలి. ప్రతి జీవి పరమావధి ఆనందమే. అందుకోసం మనం ప్రయత్నించాలనే దృష్టితోనే ఈ భూమిపై దైవం ఆనందం ఛాయలు కల్పించాడు. ఇవన్నీ శరీరానికి సంబంధించి ఆనందాలు. ఈశ్వరుడి సాన్నిధ్యంలో లభించే ఆనందమే నిజమైన అనంతమైనా అపరిమితమైన ఆనందం. ఆనందం చిరునామా అక్కడే... అదే
శాశ్వతానందం!
కష్టమంటే...
అందరూ అతి సులభంగా పలికే మాట- కష్టం. కష్టమంటే ఏమిటో సరైన నిర్వచనం చాలామందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసేవరకు ప్రపంచంలో ప్రతి పనీ కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామనే భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి. ఒక అనుభవం. వ్యక్తి, వయసు, ఆలోచనా సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది.
ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని- మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం.. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. వయసు, స్థాయి, ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చేకొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచనల్లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలుకావడం, ఏ పనీ కలిసిరాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కాని సలహాలను ఇచ్చేవారు కాని లేకపోవడం, పేదరికం అనుభవించడం... ఇలాంటి ఎన్నింటినో కష్టాలుగా పేర్కొంటారు.
భగవంతుణ్ని ఎపుడూ స్మరించక పోవడమే మహా పాపం అని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పాడు. అంటే, భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పేమాట. పరిశీలిస్తే జీవితంలో ప్రతిపనీ కష్టంతో ముడివడి ఉన్నదే. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వస్తు- ధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్ర పరచడం ఇలా ప్రతిపనీ కష్టమే.
కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి ఉత్తు అవకాశం ఉంటుందనేది సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టేఫలీ అనే నానుడి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏదీ అందుబాటులోకి రాదు. అవసరమైనవాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా వెయ్యాలంటే సుఖసంతోషాలతో గడుపుతున్నప్పుడు కాదు. కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే.
ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందినవారికే జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి, చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు. ఎంత పని పూర్తి అయ్యిందో చెప్పు, జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తరవాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీపడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అంటాడొక కవి.
కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు. అనుభూతి చెందితేనే తెలుస్తుంది. నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తేలికగా, చులకనగా అనిపిస్తుంది. ఎదుటివారి సానుభూతి, లేదా సహాయం వస్తుందేమోననే ఆలోచనతో ఎదురు చూడటం మంచిది కాదు. దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. అలా చేసిననాడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించిన తరవాత వచ్చే ఆనందపు రుచిని అనుభవిస్తారు. ఆ రుచి వర్ణనాతీతం.
అందరూ అతి సులభంగా పలికే మాట- కష్టం. కష్టమంటే ఏమిటో సరైన నిర్వచనం చాలామందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసేవరకు ప్రపంచంలో ప్రతి పనీ కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామనే భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి. ఒక అనుభవం. వ్యక్తి, వయసు, ఆలోచనా సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది.
ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని- మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం.. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. వయసు, స్థాయి, ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చేకొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచనల్లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలుకావడం, ఏ పనీ కలిసిరాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కాని సలహాలను ఇచ్చేవారు కాని లేకపోవడం, పేదరికం అనుభవించడం... ఇలాంటి ఎన్నింటినో కష్టాలుగా పేర్కొంటారు.
భగవంతుణ్ని ఎపుడూ స్మరించక పోవడమే మహా పాపం అని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పాడు. అంటే, భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పేమాట. పరిశీలిస్తే జీవితంలో ప్రతిపనీ కష్టంతో ముడివడి ఉన్నదే. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వస్తు- ధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్ర పరచడం ఇలా ప్రతిపనీ కష్టమే.
కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి ఉత్తు అవకాశం ఉంటుందనేది సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టేఫలీ అనే నానుడి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏదీ అందుబాటులోకి రాదు. అవసరమైనవాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా వెయ్యాలంటే సుఖసంతోషాలతో గడుపుతున్నప్పుడు కాదు. కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే.
ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందినవారికే జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి, చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు. ఎంత పని పూర్తి అయ్యిందో చెప్పు, జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తరవాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీపడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అంటాడొక కవి.
కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు. అనుభూతి చెందితేనే తెలుస్తుంది. నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తేలికగా, చులకనగా అనిపిస్తుంది. ఎదుటివారి సానుభూతి, లేదా సహాయం వస్తుందేమోననే ఆలోచనతో ఎదురు చూడటం మంచిది కాదు. దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. అలా చేసిననాడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించిన తరవాత వచ్చే ఆనందపు రుచిని అనుభవిస్తారు. ఆ రుచి వర్ణనాతీతం.
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి.
నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు, నిస్సహాయుడు. పక్షిలాగా నింగిలో ఎగరలేడు. పులిలాగా వేగంగా పరిగెత్తలేడు. కాని, ఈ సృష్టిలో మనిషికున్న మానసికశక్తి అమితమైనది. అద్భుతమైనది. అలాంటి మానసికశక్తితోనే బలమైన ఏనుగును సైతం మావటివాడు లొంగదీసుకుంటున్నాడు. ఈ సృష్టిలో ఏ జీవికీ లేని గొప్ప ఆలోచనా సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు. ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆశించినవి, ఇష్టపడినవి, కోరుకున్నవి పొందేశక్తి మనుషులకు మాత్రమే ఉంది. తనకున్న పూర్తి శక్తుల్ని వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. సుడిగాలి చుట్టేంతవరకు గాలి బలం తెలీదు. ఉప్పెన పోటెత్తేవరకు నీటి బలం తెలీదు. మొలకెత్తేంతవరకు విత్తనం బలం తెలీదు. అలాగే మనమీద మనకు నమ్మకం, విశ్వాసమున్నంతవరకు మన బలం మనకు తెలీదు. కీలకమైన జీవనపోరాట సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తిమీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది.
నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీత జాడ కనిపెట్టాలి. వానరులు ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో 'నీ పరాక్రమం, ప్రతిభ గురించి రాముడికి తెలుసు. అందుకే నీకు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్రలంఘనం గావించాలి' అన్నాడు. ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీత జాడ తెలుసుకుని రామకార్యాన్ని పూర్తిచేశాడు. కష్టాలు పర్వతమంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా భీతిల్లకూడదు. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా విజయాన్నే చేకూరుస్తుంది.
మనం కోరుకున్న స్థాయికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నా, శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా ఏదో పిరికితనం, ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుంటాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు, బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాండీవం జారవిడిచాడు. 'ఈ విజయం వల్ల ఒనగూడే రాజ్యం అవసరంలేదు' అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పతనాన్ని వివరించి భగవద్గీతను బోధించి కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు. ఒక్కొక్కప్పుడు నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనసు అలజడికి లోనవుతుంది. అయినా ప్రయత్నాలు ఆపకూడదు. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి. భయాలను, మానసిక దౌర్బల్యాలను అధిగమించాలి.
జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు. దుఃఖం కలిగించే సంఘటనలూ ఎదురవుతాయి. అప్పుడు కూడా దైవంపై విశ్వాసం కోల్పోకూడదు. శ్రీకృష్ణుడి ముఖతా యుద్ధభూమిలో గీత ఆవిర్భవించింది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణుసహస్రనామాన్ని లోకానికి అందించాడు. చీకట్లను చీల్చుకునే ఉషోదయకాంతులు లోకానికి వెలుగునిస్తాయి. అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికివారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి. వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. అప్పుడే ఎలాంటివారైనా అనుకున్నది సాధిస్తారు!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి.
నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు, నిస్సహాయుడు. పక్షిలాగా నింగిలో ఎగరలేడు. పులిలాగా వేగంగా పరిగెత్తలేడు. కాని, ఈ సృష్టిలో మనిషికున్న మానసికశక్తి అమితమైనది. అద్భుతమైనది. అలాంటి మానసికశక్తితోనే బలమైన ఏనుగును సైతం మావటివాడు లొంగదీసుకుంటున్నాడు. ఈ సృష్టిలో ఏ జీవికీ లేని గొప్ప ఆలోచనా సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు. ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆశించినవి, ఇష్టపడినవి, కోరుకున్నవి పొందేశక్తి మనుషులకు మాత్రమే ఉంది. తనకున్న పూర్తి శక్తుల్ని వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. సుడిగాలి చుట్టేంతవరకు గాలి బలం తెలీదు. ఉప్పెన పోటెత్తేవరకు నీటి బలం తెలీదు. మొలకెత్తేంతవరకు విత్తనం బలం తెలీదు. అలాగే మనమీద మనకు నమ్మకం, విశ్వాసమున్నంతవరకు మన బలం మనకు తెలీదు. కీలకమైన జీవనపోరాట సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తిమీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది.
నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీత జాడ కనిపెట్టాలి. వానరులు ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో 'నీ పరాక్రమం, ప్రతిభ గురించి రాముడికి తెలుసు. అందుకే నీకు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్రలంఘనం గావించాలి' అన్నాడు. ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీత జాడ తెలుసుకుని రామకార్యాన్ని పూర్తిచేశాడు. కష్టాలు పర్వతమంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా భీతిల్లకూడదు. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా విజయాన్నే చేకూరుస్తుంది.
మనం కోరుకున్న స్థాయికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నా, శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా ఏదో పిరికితనం, ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుంటాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు, బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాండీవం జారవిడిచాడు. 'ఈ విజయం వల్ల ఒనగూడే రాజ్యం అవసరంలేదు' అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పతనాన్ని వివరించి భగవద్గీతను బోధించి కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు. ఒక్కొక్కప్పుడు నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనసు అలజడికి లోనవుతుంది. అయినా ప్రయత్నాలు ఆపకూడదు. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి. భయాలను, మానసిక దౌర్బల్యాలను అధిగమించాలి.
జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు. దుఃఖం కలిగించే సంఘటనలూ ఎదురవుతాయి. అప్పుడు కూడా దైవంపై విశ్వాసం కోల్పోకూడదు. శ్రీకృష్ణుడి ముఖతా యుద్ధభూమిలో గీత ఆవిర్భవించింది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణుసహస్రనామాన్ని లోకానికి అందించాడు. చీకట్లను చీల్చుకునే ఉషోదయకాంతులు లోకానికి వెలుగునిస్తాయి. అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికివారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి. వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. అప్పుడే ఎలాంటివారైనా అనుకున్నది సాధిస్తారు!
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చింతగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలున్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనాలున్నాయి. దేన్నీ తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి పంథా వారిది. ఎవరి మతం వారిది.
ఎవరికైనా లక్ష్యం ఒక్కటే దైవకృప కావాలి. స్వామి వాత్సల్యం కావాలి. సద్గతులు కలగాలి. కోరుకున్న కోర్కెలు నెరవేరాలి. నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి. లేదా కనీసం మనోనేత్రాలతోస్వామిని దర్శించుకోవాలి.
నదులు ఎటు, ఎన్ని మార్గాల్లో ప్రవహించినా, చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి,
జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచారమార్గం... ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన... ఇవన్నీ పరబ్రహ్మను
చేరుకోదగిన విధానాలే! 'మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది' అంటారు ఆదిశంకరులు. తల్లికోతి
ఎగురుతున్నంత సేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకుని, పట్టుకుని సురక్షితంగా ఉంటుంది. దీన్నే
మర్కటకిశోర న్యాయమంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి. దైవధ్యానాన్ని పట్టుకోవాలి.
అప్పుడు మన రక్షణ అంతా ఆయనే
చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనేలేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత... ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు
అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియనిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం- ఇవన్నీ పరంధాముణ్ని స్మరించనీయడంలేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది. 'మానవసేవే మాధవసేవ' అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణశ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం... ఇవి- వివిధ భక్తిమార్గాలు, నారద భక్తిసూత్రాలు. అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే! వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత, భాగవతాలు- ఏవైనా ప్రబోధించేది ఇదే! అన్నమయ్య 'బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నాడు. 'తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు' అని రామదాసు అన్నా... 'బ్రోచేవారెవరురా, నిను వినా రఘువరా!' అని త్యాగయ్య కీర్తించినా... 'మీ రాకే ప్రభు గిరిధర్ నాగర్ అని మీరా గాన సమీరం వీచినా... అరుణాచలం మౌనగానం వినిపించినా... బుద్దుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు. మొదలైనవారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసినా.... సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి
ఆధ్యాత్మిక నిబద్ధతే గట్టి పునాది! ఇది మరిస్తే తప్పదు అనర్థం!
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చింతగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలున్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనాలున్నాయి. దేన్నీ తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి పంథా వారిది. ఎవరి మతం వారిది.
ఎవరికైనా లక్ష్యం ఒక్కటే దైవకృప కావాలి. స్వామి వాత్సల్యం కావాలి. సద్గతులు కలగాలి. కోరుకున్న కోర్కెలు నెరవేరాలి. నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి. లేదా కనీసం మనోనేత్రాలతోస్వామిని దర్శించుకోవాలి.
నదులు ఎటు, ఎన్ని మార్గాల్లో ప్రవహించినా, చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి,
జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచారమార్గం... ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన... ఇవన్నీ పరబ్రహ్మను
చేరుకోదగిన విధానాలే! 'మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది' అంటారు ఆదిశంకరులు. తల్లికోతి
ఎగురుతున్నంత సేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకుని, పట్టుకుని సురక్షితంగా ఉంటుంది. దీన్నే
మర్కటకిశోర న్యాయమంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి. దైవధ్యానాన్ని పట్టుకోవాలి.
అప్పుడు మన రక్షణ అంతా ఆయనే
చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనేలేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత... ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు
అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియనిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం- ఇవన్నీ పరంధాముణ్ని స్మరించనీయడంలేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది. 'మానవసేవే మాధవసేవ' అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణశ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం... ఇవి- వివిధ భక్తిమార్గాలు, నారద భక్తిసూత్రాలు. అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే! వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత, భాగవతాలు- ఏవైనా ప్రబోధించేది ఇదే! అన్నమయ్య 'బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నాడు. 'తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు' అని రామదాసు అన్నా... 'బ్రోచేవారెవరురా, నిను వినా రఘువరా!' అని త్యాగయ్య కీర్తించినా... 'మీ రాకే ప్రభు గిరిధర్ నాగర్ అని మీరా గాన సమీరం వీచినా... అరుణాచలం మౌనగానం వినిపించినా... బుద్దుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు. మొదలైనవారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసినా.... సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి
ఆధ్యాత్మిక నిబద్ధతే గట్టి పునాది! ఇది మరిస్తే తప్పదు అనర్థం!
ఎవరు గురువు?
జ్ఞానసాధనకు తొలి సోపానం గురువు. పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది. విష్ణుశర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మతః వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి ఆరుగురు గురువులను పెద్దలు సూచించారు. వారెవరంటే- విద్యపట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశిత జ్ఞానం కలిగినవాడు, శిక్షణ నిచ్చేవాడు. బోధన చేసేవాడు. వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది.
గురుశిష్యులది పరమాత్మ, జీవాత్మల సంబందం. శిష్యున్ని తనంతవాడిగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు అంటాడు వేమన. తత్వజ్ఞానాన్ని బోధించే గురువుకన్నా ఏదీ అధికం కాదంటుంది విశ్వసారతంత్ర. ఒకసారి పార్వతి గురువు ప్రశస్తి గురించి శివుణ్ని ప్రశ్నిస్తుంది. విద్యాబలం, ధనబలం, సకల భోగభాగ్యాలున్నా కూడా గురు కృప లేనివారు అధోగతి పాలవుతారని చెబుతాడు. పరమేశ్వరుడు. జ్ఞానార్డిగా శిష్యుడు గురువునెలా సమీపించాలో ముండకోపనిషత్ చెబుతుంది. దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్లాలి. కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి. అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మవిద్యను బోధిస్తాడు. అజ్ఞానమనే సముద్రం నుంచి దాటిస్తాడు. గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి, ప్రశ్నించాల్సిన విధానం వివేక చూడామణి చక్కగా వివరించింది. తల్లి, తండ్రి, సద్గతి అంతా గురువే. పరమేశ్వరు డికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు. గురువుకే కోపం వస్తే ఇంకె వరు కాపాడతారని కులార్ణవ రహస్యం ప్రశ్నిస్తుంది. గురువు మనసు గుర్తించి శిష్యుడు నడచుకోవాలి. సీతా స్వయంవరానికి వెళ్లిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడటా నికి వెళ్లి చాలా సమయం గడుపుతారు. ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుణ్ని సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు.
మంత్రం, తీర్థం, దైవం, జ్యోతిషుడు, వైద్యుడు, గురువు వీరిపట్ల అపారమైన నమ్మక ముంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామకృష్ణ పరమహంసపైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు. శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చేవరకూ మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు. ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడి భుజంపై వెడ తాడు. ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తలకిందులైనట్లనిపించి బిగ్గరగా అరు స్తాడు. కొంత సేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ని అనుగ్రహిస్తాడు. ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది. గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం పొందాలి.
జ్ఞానసాధనకు తొలి సోపానం గురువు. పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది. విష్ణుశర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మతః వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి ఆరుగురు గురువులను పెద్దలు సూచించారు. వారెవరంటే- విద్యపట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశిత జ్ఞానం కలిగినవాడు, శిక్షణ నిచ్చేవాడు. బోధన చేసేవాడు. వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది.
గురుశిష్యులది పరమాత్మ, జీవాత్మల సంబందం. శిష్యున్ని తనంతవాడిగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు అంటాడు వేమన. తత్వజ్ఞానాన్ని బోధించే గురువుకన్నా ఏదీ అధికం కాదంటుంది విశ్వసారతంత్ర. ఒకసారి పార్వతి గురువు ప్రశస్తి గురించి శివుణ్ని ప్రశ్నిస్తుంది. విద్యాబలం, ధనబలం, సకల భోగభాగ్యాలున్నా కూడా గురు కృప లేనివారు అధోగతి పాలవుతారని చెబుతాడు. పరమేశ్వరుడు. జ్ఞానార్డిగా శిష్యుడు గురువునెలా సమీపించాలో ముండకోపనిషత్ చెబుతుంది. దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్లాలి. కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి. అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మవిద్యను బోధిస్తాడు. అజ్ఞానమనే సముద్రం నుంచి దాటిస్తాడు. గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి, ప్రశ్నించాల్సిన విధానం వివేక చూడామణి చక్కగా వివరించింది. తల్లి, తండ్రి, సద్గతి అంతా గురువే. పరమేశ్వరు డికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు. గురువుకే కోపం వస్తే ఇంకె వరు కాపాడతారని కులార్ణవ రహస్యం ప్రశ్నిస్తుంది. గురువు మనసు గుర్తించి శిష్యుడు నడచుకోవాలి. సీతా స్వయంవరానికి వెళ్లిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడటా నికి వెళ్లి చాలా సమయం గడుపుతారు. ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుణ్ని సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు.
మంత్రం, తీర్థం, దైవం, జ్యోతిషుడు, వైద్యుడు, గురువు వీరిపట్ల అపారమైన నమ్మక ముంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామకృష్ణ పరమహంసపైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు. శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చేవరకూ మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు. ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడి భుజంపై వెడ తాడు. ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తలకిందులైనట్లనిపించి బిగ్గరగా అరు స్తాడు. కొంత సేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ని అనుగ్రహిస్తాడు. ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది. గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం పొందాలి.
అవన్నీ తాత్కాలికమే!
రాత్రింబగళ్లు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు... కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ, పోతూంటాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే. కానీ కనబడుతూ, కనుమరుగ వుతూ ఉండటం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి. తాత్కాలికమైనవైనా, శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అవి యవ్వనం, జీవితం, ఐశ్వర్యం, మనసు, నీడ, పాలకుల ప్రేమ. ఈ ఆరూ చంచలమైనవి. అశాశ్వతమైనవి. అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది. వీటిని తాత్కాలికమైనవని గుర్తించి, జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పేమాట.
యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైంది. కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయసు. సంపాదించే సత్తా, బలిమి, బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం. కాబట్టి తమకు ఎదురు లేదని, యవ్వనమే శాశ్వ తమని భ్రమిస్తారు చాలామంది. జీవి తమూ అంతే. ఎంతో, ఎన్నో, ఏదో, ఎక్కడో... ఉన్నాయనుకుని, వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశవరకూ పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ రాశిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టినవారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగమున్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా, అలసి పోయాక తెలుసుకుంటారు. నిలకడ లేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైంది. అది ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో, ఎలా వంచిస్తుందో, ఎప్పుడు ఎవరి దగ్గరకెలా చేరుతుందో, ఏ క్షణాన ఎవరి దగ్గరనుంచి ఎలా జారుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండటమంత అవివేకం మరొకటి ఉండదు. ఇలాంటివారిని ఉద్దేశించే ఆదిశం కరాచార్యులు 'ధన, జన, యవ్వన బలాలు చూసి గర్వించవద్దు. వీటన్నింటినీ కాలం రెప్పపాటులో దూరం చేస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపిం చుకోండి' అంటూ భజగోవిందంలో హెచ్చరించారు. చిత్తం అంటే మనసు. మనిషి మనుగడను మననే నియంత్రిస్తుంది. కానీ దాన్నది నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది. అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగసూత్రాల్లో సూచించిన సాధనాలేంటంటే- ఏకాగ్రతతో ధ్యానం, భక్తి- వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక చింతన, కోరికలను త్యజించడం, ఇంద్రియ నిగ్రహం.
ఇక, పాలకుల కరుణ. పాలించేవాడికి ఆనందం కలిగినా, ఆగ్రహం కలిగినా ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే పాలకులకు దూరంగా, పాల కడవకు చేరువగా ఉండటం మంచిదని పెద్దల మాట. సేద తీర్చడం నీడ స్వభావం. కానీ దాన్ని నమ్ముకోవడమంత అవివేకం మరొకటుండదు. వెలుగు మీద ఆధారపడే, స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా, శాశ్వతు డైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్ఠం.
రాత్రింబగళ్లు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు... కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ, పోతూంటాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే. కానీ కనబడుతూ, కనుమరుగ వుతూ ఉండటం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి. తాత్కాలికమైనవైనా, శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అవి యవ్వనం, జీవితం, ఐశ్వర్యం, మనసు, నీడ, పాలకుల ప్రేమ. ఈ ఆరూ చంచలమైనవి. అశాశ్వతమైనవి. అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది. వీటిని తాత్కాలికమైనవని గుర్తించి, జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పేమాట.
యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైంది. కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయసు. సంపాదించే సత్తా, బలిమి, బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం. కాబట్టి తమకు ఎదురు లేదని, యవ్వనమే శాశ్వ తమని భ్రమిస్తారు చాలామంది. జీవి తమూ అంతే. ఎంతో, ఎన్నో, ఏదో, ఎక్కడో... ఉన్నాయనుకుని, వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశవరకూ పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ రాశిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టినవారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగమున్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా, అలసి పోయాక తెలుసుకుంటారు. నిలకడ లేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైంది. అది ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో, ఎలా వంచిస్తుందో, ఎప్పుడు ఎవరి దగ్గరకెలా చేరుతుందో, ఏ క్షణాన ఎవరి దగ్గరనుంచి ఎలా జారుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండటమంత అవివేకం మరొకటి ఉండదు. ఇలాంటివారిని ఉద్దేశించే ఆదిశం కరాచార్యులు 'ధన, జన, యవ్వన బలాలు చూసి గర్వించవద్దు. వీటన్నింటినీ కాలం రెప్పపాటులో దూరం చేస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపిం చుకోండి' అంటూ భజగోవిందంలో హెచ్చరించారు. చిత్తం అంటే మనసు. మనిషి మనుగడను మననే నియంత్రిస్తుంది. కానీ దాన్నది నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది. అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగసూత్రాల్లో సూచించిన సాధనాలేంటంటే- ఏకాగ్రతతో ధ్యానం, భక్తి- వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక చింతన, కోరికలను త్యజించడం, ఇంద్రియ నిగ్రహం.
ఇక, పాలకుల కరుణ. పాలించేవాడికి ఆనందం కలిగినా, ఆగ్రహం కలిగినా ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే పాలకులకు దూరంగా, పాల కడవకు చేరువగా ఉండటం మంచిదని పెద్దల మాట. సేద తీర్చడం నీడ స్వభావం. కానీ దాన్ని నమ్ముకోవడమంత అవివేకం మరొకటుండదు. వెలుగు మీద ఆధారపడే, స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా, శాశ్వతు డైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్ఠం.
ప్రేమను పంచిన మహర్షి
పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమ య్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్దరించాలన్న తాప త్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ధమైన చూపులు, అన్ని జీవరా శులపై కురిపించే దయ మరువలేనివి.
నిరంతరం ఆత్మానందంలో ఓలలా డుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనా తీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.
రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగు తున్నా- సదా సంతోష భరితులై, ఆత్మని ష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్త వానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరి కలు, భావాలు- ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మ విశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటు వంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మన సుకు ఆహారం. వాటిని నిలివేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.
శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.
పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమ య్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్దరించాలన్న తాప త్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ధమైన చూపులు, అన్ని జీవరా శులపై కురిపించే దయ మరువలేనివి.
నిరంతరం ఆత్మానందంలో ఓలలా డుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనా తీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.
రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగు తున్నా- సదా సంతోష భరితులై, ఆత్మని ష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్త వానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరి కలు, భావాలు- ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మ విశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటు వంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మన సుకు ఆహారం. వాటిని నిలివేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.
శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.
అగ్నిసాక్షిగా వివాహం అంటే?
వివాహ సమయంలో వరుడు- వధువుతో
సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః త్రుతీయాగ్నిష్టే పతిః తురీయస్తే మనుష్య చౌః
అంటాడు. అంటే- నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను ఏలుతాను- అని అర్థం. ఇందులోని అంతరార్థం ఏమిటంటే.. అమ్మాయి పుట్టిన వెంటనే ఆమె ఆలనాపాలనా సోముడు లేదా చంద్రుడు చూస్తాడు. చంద్రుణ్ణి ఎన్నిసార్లు చూసినా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పాపాయి కూడా అంతే. అందుకు కారణం చంద్రుని పాలన. వయసు వచ్చాక ఆమెని గంధర్వునికి ఇవ్వటంతో అతడు స్వీకరిస్తాడు. 'లావణ్యవాన్ గంధర్వః' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అందచందాలను ఇచ్చేసి 'నా పనైపోయింది, ఇక నీదే పూచీ' అని కన్యను అగ్నికి అప్పగిస్తాడు. అలా అగ్ని ఆమెనిని స్వీకరించాడు. 'అగ్నిర్వై కామ కారకః' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలో కామాగ్నిని ప్రవేశపెడతాడు. చంద్రుని ద్వారా ఆకర్షణను, గంధర్వుని ద్వారా లావణ్యాన్ని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందిన కన్య వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని- వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులను పిలిచి 'దదామీత్యగ్నిర్వదతి.. ఇక ఈ కన్యని వరునికి ఇవ్వదలచుకున్నాను' అని చెబుతాడు. అందుకు వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులు అంగీకారాన్ని తెలియజేస్తారు. వివాహానికి యోగ్యురాలైన అమ్మాయిని వేరొకరికి అప్పగించి తను వెళ్లాలి కనుక వరునికి ఇస్తాడు. అతడామెని అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందువల్లే 'అగ్నిసాక్షిగా వివాహం'
అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
వివాహ సమయంలో వరుడు- వధువుతో
సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః త్రుతీయాగ్నిష్టే పతిః తురీయస్తే మనుష్య చౌః
అంటాడు. అంటే- నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను ఏలుతాను- అని అర్థం. ఇందులోని అంతరార్థం ఏమిటంటే.. అమ్మాయి పుట్టిన వెంటనే ఆమె ఆలనాపాలనా సోముడు లేదా చంద్రుడు చూస్తాడు. చంద్రుణ్ణి ఎన్నిసార్లు చూసినా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పాపాయి కూడా అంతే. అందుకు కారణం చంద్రుని పాలన. వయసు వచ్చాక ఆమెని గంధర్వునికి ఇవ్వటంతో అతడు స్వీకరిస్తాడు. 'లావణ్యవాన్ గంధర్వః' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అందచందాలను ఇచ్చేసి 'నా పనైపోయింది, ఇక నీదే పూచీ' అని కన్యను అగ్నికి అప్పగిస్తాడు. అలా అగ్ని ఆమెనిని స్వీకరించాడు. 'అగ్నిర్వై కామ కారకః' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలో కామాగ్నిని ప్రవేశపెడతాడు. చంద్రుని ద్వారా ఆకర్షణను, గంధర్వుని ద్వారా లావణ్యాన్ని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందిన కన్య వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని- వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులను పిలిచి 'దదామీత్యగ్నిర్వదతి.. ఇక ఈ కన్యని వరునికి ఇవ్వదలచుకున్నాను' అని చెబుతాడు. అందుకు వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులు అంగీకారాన్ని తెలియజేస్తారు. వివాహానికి యోగ్యురాలైన అమ్మాయిని వేరొకరికి అప్పగించి తను వెళ్లాలి కనుక వరునికి ఇస్తాడు. అతడామెని అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందువల్లే 'అగ్నిసాక్షిగా వివాహం'
అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
రేపటి గెలుపు పిలుపు
మన ఎదురుచూపుల చివరి రోజు రానే వచ్చింది. రేపటినుంచి మరో కొత్త సంవత్సరం మొదలవుతుంది. నిత్యనూతనుడైన సూర్యుడు
కొత్త కాంతులతో వేనవేల వెలుగు రేకలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం కానీ, జీవన కాలం శాశ్వతం కాదు. ప్రతిక్షణం వేళ్ల సందులోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంటుంది. ఆ సంగతి తెలిసీ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురుచూడటమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికి శక్తినీ తేజస్సునూ ఇచ్చేది- కనిపించే సూర్యుడు.
అయితే అతడి వెనక, ఈ విశాల విశ్వం వెనక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మా రవి. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక, రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావరజంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు. రేపటికి అతడే ఆధారం. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో కొత్త కోర్కెలతో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.
ప్రహ్లాదుడి కోసం వచ్చిన నారసింహస్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి, మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై, రేపటికోసం రంగురంగుల చిత్రాలెన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనుస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడమనేది జన్మహక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని, నేటిని విత్తనాలుగా నాటి, రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే, రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల, ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణమిల్లి వేడుకుందాం.. సత్యం వైపు నడిపించమని! కాలం ఇంద్రజాలంతో మాయ చేసినా తట్టుకుని నిలబడే శక్తిని ఇమ్మనమని!!
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడుని విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. 'భూత, భవిష్యత్, వర్తమానాలు నేను' అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటోంది బైబిలు. దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్తు అంటోంది ఖురాన్.
ఈరోజు మనం నిజాయతీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటిని మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురుచూద్దాం. కొత్త సూర్యుణ్ని ఆహ్వానిద్దాం. సంతోషాలు, ఆనందాల కేరింతల్లో మునిగి నీతి, నియమాలు జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు!!
మన ఎదురుచూపుల చివరి రోజు రానే వచ్చింది. రేపటినుంచి మరో కొత్త సంవత్సరం మొదలవుతుంది. నిత్యనూతనుడైన సూర్యుడు
కొత్త కాంతులతో వేనవేల వెలుగు రేకలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం కానీ, జీవన కాలం శాశ్వతం కాదు. ప్రతిక్షణం వేళ్ల సందులోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంటుంది. ఆ సంగతి తెలిసీ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురుచూడటమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికి శక్తినీ తేజస్సునూ ఇచ్చేది- కనిపించే సూర్యుడు.
అయితే అతడి వెనక, ఈ విశాల విశ్వం వెనక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మా రవి. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక, రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావరజంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు. రేపటికి అతడే ఆధారం. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో కొత్త కోర్కెలతో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.
ప్రహ్లాదుడి కోసం వచ్చిన నారసింహస్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి, మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై, రేపటికోసం రంగురంగుల చిత్రాలెన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనుస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడమనేది జన్మహక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని, నేటిని విత్తనాలుగా నాటి, రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే, రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల, ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణమిల్లి వేడుకుందాం.. సత్యం వైపు నడిపించమని! కాలం ఇంద్రజాలంతో మాయ చేసినా తట్టుకుని నిలబడే శక్తిని ఇమ్మనమని!!
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడుని విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. 'భూత, భవిష్యత్, వర్తమానాలు నేను' అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటోంది బైబిలు. దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్తు అంటోంది ఖురాన్.
ఈరోజు మనం నిజాయతీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటిని మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురుచూద్దాం. కొత్త సూర్యుణ్ని ఆహ్వానిద్దాం. సంతోషాలు, ఆనందాల కేరింతల్లో మునిగి నీతి, నియమాలు జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు!!
శుభ సంకల్పం
సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో. ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయనుకుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు 'కాలం'. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు- అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.. లేదా అన్నది ముఖ్యం.
కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను,విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడుతుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే- మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. 'కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త' అంటారు ఒక అమెరికన్ రచయిత. అశుభం శుభం ఎప్పుడవుతుందంటే- కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు. ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే. ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.
కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడిలేదు. ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం.. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది. విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధుల్లేరు అంటారు టాల్స్టాయ్. ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదూ!
సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో. ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయనుకుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు 'కాలం'. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు- అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.. లేదా అన్నది ముఖ్యం.
కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను,విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడుతుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే- మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. 'కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త' అంటారు ఒక అమెరికన్ రచయిత. అశుభం శుభం ఎప్పుడవుతుందంటే- కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు. ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే. ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.
కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడిలేదు. ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం.. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది. విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధుల్లేరు అంటారు టాల్స్టాయ్. ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదూ!
ప్రాణస్నేహితులు
సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.
స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుత మైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టు వులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.
స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజా యతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావా లుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధార ణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణస్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.
'నీకు నేనున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహి తుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్ట వంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.
నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.
తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచు కోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.
సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.
స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుత మైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టు వులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.
స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజా యతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావా లుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధార ణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణస్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.
'నీకు నేనున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహి తుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్ట వంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.
నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.
తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచు కోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.
జ్ఞాన స్వరూపం
భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు. పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనల్ని చెరిపేసి ఆధ్యాత్మికపథం వైపు నడిపిస్తాయి. వ్యక్తి ఆలోచనా విధానాలను సమూలంగా మార్చేస్తాయి. రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాల మనస్తత్వాలు కలిగినవారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు.
విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చిందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకొనేలా బోధించేవారు.
ఒకసారి ఓ భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలెట్టారు- సంసారజీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది. భర్త వెనకాలే నడుస్తోంది భార్య. దారిలో అతడికి ఓ వజ్రం కనిపించింది. భార్య చూస్తే దానిమీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమోనని దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఇల్లాలు 'వజ్రానికీ మట్టిగడ్డకూ మీకు తేడా కనిపిస్తూంటే ఇక సన్యసించడం ఎందుకు?' అంది.
వజ్రానికి, మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండటమే వైరాగ్యం. ఉచ్ఛ, నీచ భేదభావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ఠ అని రామకృష్ణులవారు విశదంగా చెప్పారు.
ఓ నడివయస్కుడు సన్యాసం గురించి అడిగాడొకసారి. దానికి సమాధానంగా 'నాయనా! అందరూ సన్యసించలేరు. కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసం అవుతుంది. ఓ యోగి రాజును ఓ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. 'రాజా! మీరు అటు పక్కకి వెళ్లి ఏకాగ్రతతో భగవంతుణ్ని ధ్యానించండి. నేను పిలిచినప్పుడు రండి' అని చెప్పి పంపాడు. కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చి 'స్వామీ! ఏకాగ్రత నావల్ల కాదు.
రాజ్యం గురించిన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది' అని చెప్పేశాడట. వైరాగ్యం కానీ, సన్యాసం కానీ అంత సులభమైనవి కావు' అని చెప్పారు పరమహంస.
ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశ్నించిన మరో భక్తుడికి 'ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది. మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది. ఒడుదొడుకుల మానసిక స్థితికి శాంతిని చేకూరుస్తుంది. దుఃఖితుల హృదయాలను సాంత్వనపరుస్తుంది' అని చెప్పేసరికి ఆయన ముందు ముకుళిత హస్తుడై తలవంచాడు.
రామకృష్ణుల తండ్రి మరణానంతరం తల్లి విచారంతో రోజురోజుకూ చిక్కి శల్యమైపోతుండేవారు. అది గమనించి 'అమ్మా! మనిషికి చావు పుట్టుకలు తప్పవు. నిన్న నాన్న, రేపు నువ్వు, తరవాత నేను... ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్లిపోక తప్పదు. బాధపడటం మాని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మ ధన్యం చేసుకో' అంటూ తల్లిని ఓదార్చారు. ఇలా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి- రామకృష్ణ పరమహంస. ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించు కోవాలనుకునే వారికి ఆయన బోధలు దారిదీపాల వంటివి.
భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు. పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనల్ని చెరిపేసి ఆధ్యాత్మికపథం వైపు నడిపిస్తాయి. వ్యక్తి ఆలోచనా విధానాలను సమూలంగా మార్చేస్తాయి. రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాల మనస్తత్వాలు కలిగినవారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు.
విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చిందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకొనేలా బోధించేవారు.
ఒకసారి ఓ భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలెట్టారు- సంసారజీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది. భర్త వెనకాలే నడుస్తోంది భార్య. దారిలో అతడికి ఓ వజ్రం కనిపించింది. భార్య చూస్తే దానిమీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమోనని దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఇల్లాలు 'వజ్రానికీ మట్టిగడ్డకూ మీకు తేడా కనిపిస్తూంటే ఇక సన్యసించడం ఎందుకు?' అంది.
వజ్రానికి, మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండటమే వైరాగ్యం. ఉచ్ఛ, నీచ భేదభావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ఠ అని రామకృష్ణులవారు విశదంగా చెప్పారు.
ఓ నడివయస్కుడు సన్యాసం గురించి అడిగాడొకసారి. దానికి సమాధానంగా 'నాయనా! అందరూ సన్యసించలేరు. కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసం అవుతుంది. ఓ యోగి రాజును ఓ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. 'రాజా! మీరు అటు పక్కకి వెళ్లి ఏకాగ్రతతో భగవంతుణ్ని ధ్యానించండి. నేను పిలిచినప్పుడు రండి' అని చెప్పి పంపాడు. కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చి 'స్వామీ! ఏకాగ్రత నావల్ల కాదు.
రాజ్యం గురించిన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది' అని చెప్పేశాడట. వైరాగ్యం కానీ, సన్యాసం కానీ అంత సులభమైనవి కావు' అని చెప్పారు పరమహంస.
ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశ్నించిన మరో భక్తుడికి 'ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది. మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది. ఒడుదొడుకుల మానసిక స్థితికి శాంతిని చేకూరుస్తుంది. దుఃఖితుల హృదయాలను సాంత్వనపరుస్తుంది' అని చెప్పేసరికి ఆయన ముందు ముకుళిత హస్తుడై తలవంచాడు.
రామకృష్ణుల తండ్రి మరణానంతరం తల్లి విచారంతో రోజురోజుకూ చిక్కి శల్యమైపోతుండేవారు. అది గమనించి 'అమ్మా! మనిషికి చావు పుట్టుకలు తప్పవు. నిన్న నాన్న, రేపు నువ్వు, తరవాత నేను... ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్లిపోక తప్పదు. బాధపడటం మాని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మ ధన్యం చేసుకో' అంటూ తల్లిని ఓదార్చారు. ఇలా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి- రామకృష్ణ పరమహంస. ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించు కోవాలనుకునే వారికి ఆయన బోధలు దారిదీపాల వంటివి.
ఇద్దరూ ఇష్టులే!
వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న గదిలో అబూ బెన్ ఆథమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడికో కల వచ్చింది. అందులో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటుంది.
'ఏం రాస్తున్నావు?' అడిగాడు అబూ. 'దేవుణ్ని ప్రేమించే వాళ్ల పేర్లను' చెప్పింది. 'నా పేరుందా' ఆత్రంగా అడిగాడు. 'ఊహూ.. లేదు.'
'అయితే... తోటి మనుషులను ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా' అని వేడుకున్నాడు. ఆ దేవదూత అంతర్థానమైంది.
రెండో రోజు మళ్లీ కల. మళ్లీ ఆమె... 'భగవంతుడు ఎవరి ప్రేమను దీవించాడో వారి పేర్లను రాస్తున్నాను' అంటూ ఆ జాబితాను చూపింది.
అందులో మొదటి పేరు అతడిదే.
'అబూ బెన్ ఆథమ్' అన్న ఈ ఆంగ్ల కవిత రాసింది జేమ్స్ హెన్రీ లీ హంట్. ఆ కవిత ఆయన ఊహించనంత పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.
కవితలో మానవత్వానికి పెద్దపీట వేయటమేదానికి కారణం. కవితారంభంలో ఉన్న వాక్యం.. 'అబూ బెన్ ఆథమ్... అతని వంశం వర్థిల్లుగాక!' అన్నదీ ఒక కారణమే. తోటివారిని ప్రేమించేవారిని దేవుడు దీవిస్తాడని చెప్పడం... ఎంత గొప్ప భావన!
మాధవుణ్నే పూజిస్తూ ఆయనను చేరవచ్చు. అలా కాక, తోటి మానవులకు సేవ చేస్తూ కూడా ఆయనను చేరవచ్చు. మార్గమేదైనా దానిలో ప్రేమ ఉండాలి. ఇది అంతస్సూత్రం. ఆయన ప్రేమను, ఆశీస్సులను పొందాలంటే మన ప్రేమను ఇతరులకి పంచాలి. అంతే. అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు. భగవంతుణ్ని ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి అక్కడకు వెళ్లి ప్రార్థిస్తుంటారు కొందరు. దైవమంటే వారికి పూర్తి విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు.
దైవబలం కారణంగానే ఇంతటితో ప్రమాదం తప్పిందంటారు. చేసే పరోపకారం, దానం, ధర్మం అన్నీ దైవాన్ని తలచుకునే చేస్తారు. విశ్వంలోని అణువణువులో దైవాన్ని దర్శిస్తారు.
సర్వాంతర్యామికి ఒక నిర్దేశిత స్థలమా? ఈ సకల చరాచర సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయన లేనిదెక్కడ? అని భావిస్తారు మరికొందరు. వీరు తోటివారిని ప్రేమిస్తూ, వారికి కావాల్సిన సేవలు చేస్తూ దేవుణ్నే సేవిస్తున్నట్టు భావిస్తారు. పేదలకు అన్నవస్త్రాలనిచ్చి కాపాడతారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుంటారు. పరోపకారమే ఊపిరిగా జీవిస్తారు. అందులోనే ఆనందాన్ని పొందుతారు.
భగవంతుడికి ఈ రెండూ ప్రియమైనవే. ఇద్దరూ ప్రీతిపాత్రులే. పండితులు, జ్ఞానులు, మతగ్రంథాలు చెప్పే ఈ ఉదాత్త భావననే పై కవిత ఇంకొకసారి చెబుతోంది. తన ఉనికిని ప్రశ్నించే ఇటువంటి వారినీ దైవం మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీరు సాటి మనిషికి సాయపడటం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని భావిస్తారు. మొదటిది భక్తి మార్గం. రెండవది సేవా మార్గం. రెండింటి లక్ష్యం ఒకటే... సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింప జేయటం.
వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న గదిలో అబూ బెన్ ఆథమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడికో కల వచ్చింది. అందులో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటుంది.
'ఏం రాస్తున్నావు?' అడిగాడు అబూ. 'దేవుణ్ని ప్రేమించే వాళ్ల పేర్లను' చెప్పింది. 'నా పేరుందా' ఆత్రంగా అడిగాడు. 'ఊహూ.. లేదు.'
'అయితే... తోటి మనుషులను ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా' అని వేడుకున్నాడు. ఆ దేవదూత అంతర్థానమైంది.
రెండో రోజు మళ్లీ కల. మళ్లీ ఆమె... 'భగవంతుడు ఎవరి ప్రేమను దీవించాడో వారి పేర్లను రాస్తున్నాను' అంటూ ఆ జాబితాను చూపింది.
అందులో మొదటి పేరు అతడిదే.
'అబూ బెన్ ఆథమ్' అన్న ఈ ఆంగ్ల కవిత రాసింది జేమ్స్ హెన్రీ లీ హంట్. ఆ కవిత ఆయన ఊహించనంత పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.
కవితలో మానవత్వానికి పెద్దపీట వేయటమేదానికి కారణం. కవితారంభంలో ఉన్న వాక్యం.. 'అబూ బెన్ ఆథమ్... అతని వంశం వర్థిల్లుగాక!' అన్నదీ ఒక కారణమే. తోటివారిని ప్రేమించేవారిని దేవుడు దీవిస్తాడని చెప్పడం... ఎంత గొప్ప భావన!
మాధవుణ్నే పూజిస్తూ ఆయనను చేరవచ్చు. అలా కాక, తోటి మానవులకు సేవ చేస్తూ కూడా ఆయనను చేరవచ్చు. మార్గమేదైనా దానిలో ప్రేమ ఉండాలి. ఇది అంతస్సూత్రం. ఆయన ప్రేమను, ఆశీస్సులను పొందాలంటే మన ప్రేమను ఇతరులకి పంచాలి. అంతే. అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు. భగవంతుణ్ని ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి అక్కడకు వెళ్లి ప్రార్థిస్తుంటారు కొందరు. దైవమంటే వారికి పూర్తి విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు.
దైవబలం కారణంగానే ఇంతటితో ప్రమాదం తప్పిందంటారు. చేసే పరోపకారం, దానం, ధర్మం అన్నీ దైవాన్ని తలచుకునే చేస్తారు. విశ్వంలోని అణువణువులో దైవాన్ని దర్శిస్తారు.
సర్వాంతర్యామికి ఒక నిర్దేశిత స్థలమా? ఈ సకల చరాచర సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయన లేనిదెక్కడ? అని భావిస్తారు మరికొందరు. వీరు తోటివారిని ప్రేమిస్తూ, వారికి కావాల్సిన సేవలు చేస్తూ దేవుణ్నే సేవిస్తున్నట్టు భావిస్తారు. పేదలకు అన్నవస్త్రాలనిచ్చి కాపాడతారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుంటారు. పరోపకారమే ఊపిరిగా జీవిస్తారు. అందులోనే ఆనందాన్ని పొందుతారు.
భగవంతుడికి ఈ రెండూ ప్రియమైనవే. ఇద్దరూ ప్రీతిపాత్రులే. పండితులు, జ్ఞానులు, మతగ్రంథాలు చెప్పే ఈ ఉదాత్త భావననే పై కవిత ఇంకొకసారి చెబుతోంది. తన ఉనికిని ప్రశ్నించే ఇటువంటి వారినీ దైవం మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీరు సాటి మనిషికి సాయపడటం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని భావిస్తారు. మొదటిది భక్తి మార్గం. రెండవది సేవా మార్గం. రెండింటి లక్ష్యం ఒకటే... సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింప జేయటం.
అపార్థాలు ఆధ్యాత్మికోన్నతికి అవరోధాలు!
మాయావి అనే రాక్షసుడు వాలి పాలిస్తున్న కిష్కంధపై ఓసారి యుద్ధానికి బయల్దేరాడు. వాలి కూడా ఎదురుదాడికి దిగాడు. అన్నకు అండగా సుగ్రీవుడూ వెంటవెళ్లాడు. వాలి, సుగ్రీవులను చూసి మాయావి గుహలోకి ప్రవేశించాడు. తమ్ముణ్ణి గుహ ద్వారం దగ్గర ఉండమని చెప్పి, వాలి లోనికి వెళ్లాడు. రోజుల తరబడి గుహలో యుద్ధం కొనసాగింది. వాలి తిరిగి రావటం లేదు. ఒకరోజు గుహ నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చింది. రాక్షసుల గర్జనల ధ్వనులు, నిస్సహాయమైన వాలి ఆక్రందనలు సుగ్రీవుని చెవిన పడ్డాయి. రాక్షసులు అన్నను మట్టుపెట్టి ఉంటారని, గుహను మూసేసి కిష్కింధకు తిరుగు పయనమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యభారాన్ని చేపట్టాడు. కొన్నాళ్లకు వాలి మాయావిని చంపి కిష్కింధకు తిరిగొచ్చాడు. పట్టాభిషిక్తుడై ఉన్న సుగ్రీవుణ్ణి చూసి వాలి అపార్థం చేసుకున్నాడు.
రాజ్యకాంక్షతో తమ్ముడు తనను మట్టుపెట్టాలనే ఉద్దేశంతో గుహద్వారాన్ని మూసేశాడని అనుమానించాడు. అపార్థంతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అనర్థాన్ని కొనితెచ్చుకుని శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు. అలాగే చిత్ర కూటంలో రామలక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు, దూరంగా వస్తున్న భరతుణ్ణి, అతని సేనను చూసి సౌమిత్రి అపార్థం చేసుకున్నాడు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడనుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు 'శుభలక్షణ సంపన్నుడైన భరతుడు బాధతో, పినతల్లి కైకేయిని నిలదీసి ఉండవచ్చు. నాన్నను ప్రసన్నుని చేసుకుని, రాజ్యాన్ని నాకు అప్పగించాలనుకుని ఇక్కడికి వస్తున్నాడేమో! తమ్ముడు నాకు అపకారం చేయాలని ఎన్నటికీ తలచడు' అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అందుకే ఆయన లోకానికి ఆరాధ్యనీయుడయ్యాడు. అపార్థాలు మన అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకులని నిరూపించాడు.
మాయావి అనే రాక్షసుడు వాలి పాలిస్తున్న కిష్కంధపై ఓసారి యుద్ధానికి బయల్దేరాడు. వాలి కూడా ఎదురుదాడికి దిగాడు. అన్నకు అండగా సుగ్రీవుడూ వెంటవెళ్లాడు. వాలి, సుగ్రీవులను చూసి మాయావి గుహలోకి ప్రవేశించాడు. తమ్ముణ్ణి గుహ ద్వారం దగ్గర ఉండమని చెప్పి, వాలి లోనికి వెళ్లాడు. రోజుల తరబడి గుహలో యుద్ధం కొనసాగింది. వాలి తిరిగి రావటం లేదు. ఒకరోజు గుహ నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చింది. రాక్షసుల గర్జనల ధ్వనులు, నిస్సహాయమైన వాలి ఆక్రందనలు సుగ్రీవుని చెవిన పడ్డాయి. రాక్షసులు అన్నను మట్టుపెట్టి ఉంటారని, గుహను మూసేసి కిష్కింధకు తిరుగు పయనమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యభారాన్ని చేపట్టాడు. కొన్నాళ్లకు వాలి మాయావిని చంపి కిష్కింధకు తిరిగొచ్చాడు. పట్టాభిషిక్తుడై ఉన్న సుగ్రీవుణ్ణి చూసి వాలి అపార్థం చేసుకున్నాడు.
రాజ్యకాంక్షతో తమ్ముడు తనను మట్టుపెట్టాలనే ఉద్దేశంతో గుహద్వారాన్ని మూసేశాడని అనుమానించాడు. అపార్థంతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అనర్థాన్ని కొనితెచ్చుకుని శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు. అలాగే చిత్ర కూటంలో రామలక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు, దూరంగా వస్తున్న భరతుణ్ణి, అతని సేనను చూసి సౌమిత్రి అపార్థం చేసుకున్నాడు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడనుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు 'శుభలక్షణ సంపన్నుడైన భరతుడు బాధతో, పినతల్లి కైకేయిని నిలదీసి ఉండవచ్చు. నాన్నను ప్రసన్నుని చేసుకుని, రాజ్యాన్ని నాకు అప్పగించాలనుకుని ఇక్కడికి వస్తున్నాడేమో! తమ్ముడు నాకు అపకారం చేయాలని ఎన్నటికీ తలచడు' అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అందుకే ఆయన లోకానికి ఆరాధ్యనీయుడయ్యాడు. అపార్థాలు మన అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకులని నిరూపించాడు.
అందరిలో నారాయణుడు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు... అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదేపనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూంటారు. గురివింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి.
నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంతమాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూప భేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసులకు లేవు. ప్రతీ ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవినీ ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు.
అందుకే వృత్తి వల్లనో, రూపాన్నిబట్టో, బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.
ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్పవస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు.
తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి, తండ్రిని చెరనుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి
అణచివేశాడు.
అధికారం, ధనం, అందం వీటివల్ల మనిషికి కీర్తిప్రతిష్ఠలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తియ్యని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేపచెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అంధులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. రెండుపదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలాకాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్య్రం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం.
వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంక ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగినవాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమభావనతో అందరినీ ప్రేమించేవాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోకకల్యాణం కోసం పాటుపడతారు.
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు... అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదేపనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూంటారు. గురివింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి.
నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంతమాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూప భేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసులకు లేవు. ప్రతీ ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవినీ ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు.
అందుకే వృత్తి వల్లనో, రూపాన్నిబట్టో, బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.
ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్పవస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు.
తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి, తండ్రిని చెరనుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి
అణచివేశాడు.
అధికారం, ధనం, అందం వీటివల్ల మనిషికి కీర్తిప్రతిష్ఠలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తియ్యని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేపచెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అంధులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. రెండుపదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలాకాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్య్రం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం.
వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంక ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగినవాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమభావనతో అందరినీ ప్రేమించేవాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోకకల్యాణం కోసం పాటుపడతారు.