మానవ బలహీనతలు
ఆత్మస్తుతి పరనింద మనసును ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అయినా ఆ సంతోషం చిరకాలం నిలవదు. స్వల్ప విజయాలను ఘనవిజయాలుగా ప్రచారం చేసుకుంటూ తమ సుగుణాలను తామే పొగుడుకునేవారు జీవితంలో రాణించలేరు. తనంతటివాడు లేడని మిడిసిపడుతూ తనకు తానే సాటి అని భావించేవాడు అజ్ఞాని. భూమిపై నివసించే లక్షల జీవరాసుల్లో తన పాత్ర అణువంత అని గ్రహించినవాడే ఉత్తముడు. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.
‘పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నారు. సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడని, అన్నింటికీ పరమేశ్వరుడే కర్త అని భావించేవారు బుద్ధిమంతులు. సమస్తం ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందనే దృఢ విశ్వాసం గల వ్యక్తి తాను ఈశ్వరుడి చేతిలో పరికరమని భావిస్తాడు’ అని రామకృష్ణ పరమహంస బోధించారు. ఆత్మస్తుతి చేసుకునేవారు ఇతరుల దోషాలు ఎంచడంలో ప్రవీణులవుతారు. పరనింద మనసును ఉద్వేగపరుస్తుంది. కానీ, వారికి తమ దోషాల గురించి తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తారని భారతం చెబుతుంది.
ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక చివరి రోజున భీష్ముడి సలహాపై శ్రీకృష్ణుణ్ని పూజించాలని అనుకున్నప్పుడు శిశు పాలుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణుణ్ని నిందించసాగాడు. శిశుపాలుడి తల్లి కిచ్చిన మాట ప్రకారం నూరు తప్పులవరకు సహించిన శ్రీకృష్ణుడు హద్దుదాటిన వదరుబోతు తల ఖండిస్తాడు. అకారణ ద్వేషం అనర్థ హేతువు. ఇతరుల దోషాలు ఎంచుతూ సమయం వృథా చేసు కునేవారు తమ జీవితంలో ఏమీ సాధించలేరు.
అసూయా ద్వేషాలు మనిషి తోబుట్టువులు. అవి మనసును కలుషితం చేసే ఉపద్రవాలు. ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం సంకుచిత మనస్తత్వం. అసూయ ద్వేషాన్ని రగిలిస్తుంది. పగను పెంచుతుంది. అసూయాపరుడు మానసిక వేదనకు గురవుతాడు. లోకంలో ఎవరికీ ద్వేషం కలిగించనివాడు, ఎవరివల్లా ఉద్వేగానికి గురికానివాడు, ఈర్ష్య, భయం, మనోవికారం లేనివాడు అయిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడి గీతోపదేశం. అసూయాపరుడు, ఇతరులను అసహ్యించుకునేవాడు, అసంతుష్టుడు, కోపి, నిత్య శంకితుడు, పరధనోపజీవి అనే ఆరుగురూ దుఃఖభాజనులని విదుర నీతి చెబుతోంది.
జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడానికి చదువు, జ్ఞానంతోపాటు మనసులో మానవత్వపు పరిమళాలు వీచాలి. తోటివారికి సహాయం చేయగల సహృదయులు ఇతరుల దోషాలు లెక్కించరు. సజ్జన సాంగత్యం దుష్ట ఆలోచనలను దూరం చేస్తుంది. అసూయాద్వేషాలను మనసుకు చేరనీయదు. నిత్యం భగవన్నామ స్మరణలో పునీతులైనవారు నిర్మల మనస్కులై తమ శక్తికి లోబడి కార్యాచరణకు పూనుకొని విజయం సాధిస్తారు. తమతోపాటు ఇతరుల అభ్యున్నతినీ కోరుకుంటారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తారు.
ఆత్మస్తుతి పరనింద మనసును ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అయినా ఆ సంతోషం చిరకాలం నిలవదు. స్వల్ప విజయాలను ఘనవిజయాలుగా ప్రచారం చేసుకుంటూ తమ సుగుణాలను తామే పొగుడుకునేవారు జీవితంలో రాణించలేరు. తనంతటివాడు లేడని మిడిసిపడుతూ తనకు తానే సాటి అని భావించేవాడు అజ్ఞాని. భూమిపై నివసించే లక్షల జీవరాసుల్లో తన పాత్ర అణువంత అని గ్రహించినవాడే ఉత్తముడు. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.
‘పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నారు. సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడని, అన్నింటికీ పరమేశ్వరుడే కర్త అని భావించేవారు బుద్ధిమంతులు. సమస్తం ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందనే దృఢ విశ్వాసం గల వ్యక్తి తాను ఈశ్వరుడి చేతిలో పరికరమని భావిస్తాడు’ అని రామకృష్ణ పరమహంస బోధించారు. ఆత్మస్తుతి చేసుకునేవారు ఇతరుల దోషాలు ఎంచడంలో ప్రవీణులవుతారు. పరనింద మనసును ఉద్వేగపరుస్తుంది. కానీ, వారికి తమ దోషాల గురించి తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తారని భారతం చెబుతుంది.
ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక చివరి రోజున భీష్ముడి సలహాపై శ్రీకృష్ణుణ్ని పూజించాలని అనుకున్నప్పుడు శిశు పాలుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణుణ్ని నిందించసాగాడు. శిశుపాలుడి తల్లి కిచ్చిన మాట ప్రకారం నూరు తప్పులవరకు సహించిన శ్రీకృష్ణుడు హద్దుదాటిన వదరుబోతు తల ఖండిస్తాడు. అకారణ ద్వేషం అనర్థ హేతువు. ఇతరుల దోషాలు ఎంచుతూ సమయం వృథా చేసు కునేవారు తమ జీవితంలో ఏమీ సాధించలేరు.
అసూయా ద్వేషాలు మనిషి తోబుట్టువులు. అవి మనసును కలుషితం చేసే ఉపద్రవాలు. ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం సంకుచిత మనస్తత్వం. అసూయ ద్వేషాన్ని రగిలిస్తుంది. పగను పెంచుతుంది. అసూయాపరుడు మానసిక వేదనకు గురవుతాడు. లోకంలో ఎవరికీ ద్వేషం కలిగించనివాడు, ఎవరివల్లా ఉద్వేగానికి గురికానివాడు, ఈర్ష్య, భయం, మనోవికారం లేనివాడు అయిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడి గీతోపదేశం. అసూయాపరుడు, ఇతరులను అసహ్యించుకునేవాడు, అసంతుష్టుడు, కోపి, నిత్య శంకితుడు, పరధనోపజీవి అనే ఆరుగురూ దుఃఖభాజనులని విదుర నీతి చెబుతోంది.
జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడానికి చదువు, జ్ఞానంతోపాటు మనసులో మానవత్వపు పరిమళాలు వీచాలి. తోటివారికి సహాయం చేయగల సహృదయులు ఇతరుల దోషాలు లెక్కించరు. సజ్జన సాంగత్యం దుష్ట ఆలోచనలను దూరం చేస్తుంది. అసూయాద్వేషాలను మనసుకు చేరనీయదు. నిత్యం భగవన్నామ స్మరణలో పునీతులైనవారు నిర్మల మనస్కులై తమ శక్తికి లోబడి కార్యాచరణకు పూనుకొని విజయం సాధిస్తారు. తమతోపాటు ఇతరుల అభ్యున్నతినీ కోరుకుంటారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తారు.
మనిషిలో అపార శక్తి
ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు దూరదర్శిని, సూక్ష్మదర్శిని, మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు
భగవంతుడు ప్రతి మనిషినీ ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు. రూపం, గాత్రం, చిత్రకళ, వాక్చాతుర్యం, రచన, క్రీడలు... ఇలా ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని మనిషి అంటూ ఉండడు. వాటిని గుర్తించి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేసేవారే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా పిన్న వయసులోనే అనుభవించి, తానెవరో తెలుసుకున్నారు రమణ మహర్షి. ప్రతి మనిషి ‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పారు.
సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు.
ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవితకాలమంతా మిగిలిపోతాం. అన్ని అంగాలూ ఉండి సోమరితనంతో యాచన చేస్తూ జీవిస్తున్న ఎంతోమందికి నిక్ వుజిసిక్ ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన కాళ్లు చేతులు లేకుండా పూర్తి అంగవైకల్యంతో పుట్టాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం ప్రోత్సాహాలతో ఎన్నో రంగాల్లో ప్రత్యేకంగా రాణించాడు.
మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది. ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నించారు. శ్రవణ మార్గాన్ని పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు. కీర్తన మార్గాన్ని వాల్మీకి, రామదాసులు ఎంచుకున్నారు. స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు, తులసీదాస్ పాటించారు. పాదసేవన మార్గాన్ని భరతుడు ఆచరించాడు. వందన మార్గాన్ని కృష్ణ పరమాత్మ బోధించాడు. దాస్య భక్తికి హనుమ అంకితమయ్యాడు. సఖ్య భక్తిలో అర్జునుడు, సుగ్రీవుడు తరించారు. ఆత్మ నివేదన భక్తిని ద్రౌపది పాటించింది. అర్చన భక్తిని ప్రస్తుతం మానవులు ఆచరిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి. అభిరుచిని బట్టి ప్రోత్సహిస్తే వారిలో మరో బుద్ధుడు, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటివారు సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రత్యేక వ్యక్తులుగా ఉద్భవిస్తారు.
ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు దూరదర్శిని, సూక్ష్మదర్శిని, మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు
భగవంతుడు ప్రతి మనిషినీ ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు. రూపం, గాత్రం, చిత్రకళ, వాక్చాతుర్యం, రచన, క్రీడలు... ఇలా ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని మనిషి అంటూ ఉండడు. వాటిని గుర్తించి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేసేవారే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా పిన్న వయసులోనే అనుభవించి, తానెవరో తెలుసుకున్నారు రమణ మహర్షి. ప్రతి మనిషి ‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పారు.
సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు.
ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవితకాలమంతా మిగిలిపోతాం. అన్ని అంగాలూ ఉండి సోమరితనంతో యాచన చేస్తూ జీవిస్తున్న ఎంతోమందికి నిక్ వుజిసిక్ ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన కాళ్లు చేతులు లేకుండా పూర్తి అంగవైకల్యంతో పుట్టాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం ప్రోత్సాహాలతో ఎన్నో రంగాల్లో ప్రత్యేకంగా రాణించాడు.
మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది. ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నించారు. శ్రవణ మార్గాన్ని పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు. కీర్తన మార్గాన్ని వాల్మీకి, రామదాసులు ఎంచుకున్నారు. స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు, తులసీదాస్ పాటించారు. పాదసేవన మార్గాన్ని భరతుడు ఆచరించాడు. వందన మార్గాన్ని కృష్ణ పరమాత్మ బోధించాడు. దాస్య భక్తికి హనుమ అంకితమయ్యాడు. సఖ్య భక్తిలో అర్జునుడు, సుగ్రీవుడు తరించారు. ఆత్మ నివేదన భక్తిని ద్రౌపది పాటించింది. అర్చన భక్తిని ప్రస్తుతం మానవులు ఆచరిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి. అభిరుచిని బట్టి ప్రోత్సహిస్తే వారిలో మరో బుద్ధుడు, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటివారు సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రత్యేక వ్యక్తులుగా ఉద్భవిస్తారు.
ప్రతిక్షణం జీవించాలి
మనిషి జీవితం అమూల్యం. అది ఉత్కృష్టమైంది, దుర్లభమైందని ఎన్నో పురాణాలు పేర్కొన్నాయి. జీవించిన కాలం ఎంత అనేదానికన్నా ఎలా జీవించారు అనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాల రోజువారీ కాల చక్రం గిర్రున తిరుగు తుంది. రోజులు గడిచే కొద్దీ ఆయువు తగ్గి మృత్యువు దాపురిస్తుందన్న ఆలోచన మనిషికి రాదు. కాలం ప్రవాహ వేగంతో ప్రయాణిస్తుంది. వేగాన్ని అదుపు చేయలేం. కాలాన్ని, దాని విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవచ్చుగడచిన కాలాన్ని తలచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనిషి ఎప్పుడూ గతంలోనూ, భవి ష్యత్తులోనూ బతుకుతున్నాడే కాని, వర్తమానంలో కాదు అంటారు శ్రీరమణులు. నిన్నటిరోజు తిరిగిరాదు. రేపు ఉందో లేదో తెలియదు. నేడు సత్యం. దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. విజయాలు సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి. సార్ధకత చేకూరాలి. కలలు కనండి, వాటిని నిజం చేసు కునేలా పరిశ్రమించాల్సింది నేడే. అందుకోసం బలమైన పునాదిని వెంటనే నిర్మించాలి. అదే భవిష్య త్తులో ఎత్తయిన భవనాన్ని భరి స్తుంది అంటారు అబ్దుల్ కలాం
చేతులు కాలాక ఆకులు పట్టు కుంటే ఏం లాభం? దేనికైనా ముందుగానే ప్రణాళిక, వివేకం, విచక్షణా జ్ఞానంతో సిద్ధం కావాలి. చికిత్సకన్నా నివారణ ముఖ్యం. జీవితం విలువ తెలిస్తే ఒక్కక్షణమైనా వృథా కాదు. కాలం గడపడం ముఖ్యం కాదు. సద్విని యోగం చేసుకోవడం ప్రధానం. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైంది. ఏదైనా సాధించే శక్తికలది మానవ జీవితం అంటారు పెద్దలు. జననం ముందు అజ్ఞానం, మరణం తరవాత అజ్ఞానం... మధ్యలో విలువైన జీవితకాలం సుసంపన్న జ్ఞానం. ప్రతి నీటిబొట్టును భద్రపరిస్తే నీటి కరవు ఉండదు. ప్రతి క్షణాన్ని వివేకంతో గడిపితే శాశ్వత కీర్తి సొంతమవుతుంది.
జీవితం విలువ, కాలం వేగం అంచనా వేస్తే ప్రతి క్షణం సద్వినియోగమే. త్వరగా ప్రారంభించునిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అనేది ఆంగ్ల సామెత. రేపటి పని ఈరోజే చెయ్యి. ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యి అనేది హిందీ సూక్తి. కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయకు ప్రతిపనీ నిర్మాణాత్మకంగా ప్రతిభతో ప్రగతి వైపుగా ఉండాలని హెచ్చరిస్తారు విజ్ఞులు.
కాలాన్ని తైలధారగా వర్ణించారు. అది నిరంతరం కొనసాగే ధార. జీవితం కూడా అంతటి వేగంగా సాగుతుంది. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం.... ఒకదాని వెంట ఒకటి పరుగు పెడతాయి. ఇలా చేయలేకపోయాను, చేసి ఉంటే ఎంతో సాధించేవాణ్ని అనే నిరాశ కలగకుండా ఉండాలంటే అప్రమత్తంగా విజయాన్ని ఒడిసిపట్టాలి. ప్రతి క్షణం జీవించాలి.
హనుమ లంకలో సీత జాడ కోసం ఒక రాత్రి మొత్తం క్షణం విరామం లేకుండా వెతికాడు. అందరి మధ్య సంచరించాడు. కొంత నిరాశ ఆవహించినా ధైర్యాన్ని వీడలేదు. నిరాటంకంగా, నిర్విఘ్నంగా ప్రయత్నం కొనసాగించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. విలువైన, అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంతో తీవ్ర నిరాశతో ముగించేవారు పిరికివారు, మూఢులు. భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం మానవ జీవితం. ఆస్వాదిస్తూ అనుభవించేవారే చరితార్థులు.
మనిషి జీవితం అమూల్యం. అది ఉత్కృష్టమైంది, దుర్లభమైందని ఎన్నో పురాణాలు పేర్కొన్నాయి. జీవించిన కాలం ఎంత అనేదానికన్నా ఎలా జీవించారు అనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాల రోజువారీ కాల చక్రం గిర్రున తిరుగు తుంది. రోజులు గడిచే కొద్దీ ఆయువు తగ్గి మృత్యువు దాపురిస్తుందన్న ఆలోచన మనిషికి రాదు. కాలం ప్రవాహ వేగంతో ప్రయాణిస్తుంది. వేగాన్ని అదుపు చేయలేం. కాలాన్ని, దాని విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవచ్చుగడచిన కాలాన్ని తలచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనిషి ఎప్పుడూ గతంలోనూ, భవి ష్యత్తులోనూ బతుకుతున్నాడే కాని, వర్తమానంలో కాదు అంటారు శ్రీరమణులు. నిన్నటిరోజు తిరిగిరాదు. రేపు ఉందో లేదో తెలియదు. నేడు సత్యం. దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. విజయాలు సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి. సార్ధకత చేకూరాలి. కలలు కనండి, వాటిని నిజం చేసు కునేలా పరిశ్రమించాల్సింది నేడే. అందుకోసం బలమైన పునాదిని వెంటనే నిర్మించాలి. అదే భవిష్య త్తులో ఎత్తయిన భవనాన్ని భరి స్తుంది అంటారు అబ్దుల్ కలాం
చేతులు కాలాక ఆకులు పట్టు కుంటే ఏం లాభం? దేనికైనా ముందుగానే ప్రణాళిక, వివేకం, విచక్షణా జ్ఞానంతో సిద్ధం కావాలి. చికిత్సకన్నా నివారణ ముఖ్యం. జీవితం విలువ తెలిస్తే ఒక్కక్షణమైనా వృథా కాదు. కాలం గడపడం ముఖ్యం కాదు. సద్విని యోగం చేసుకోవడం ప్రధానం. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైంది. ఏదైనా సాధించే శక్తికలది మానవ జీవితం అంటారు పెద్దలు. జననం ముందు అజ్ఞానం, మరణం తరవాత అజ్ఞానం... మధ్యలో విలువైన జీవితకాలం సుసంపన్న జ్ఞానం. ప్రతి నీటిబొట్టును భద్రపరిస్తే నీటి కరవు ఉండదు. ప్రతి క్షణాన్ని వివేకంతో గడిపితే శాశ్వత కీర్తి సొంతమవుతుంది.
జీవితం విలువ, కాలం వేగం అంచనా వేస్తే ప్రతి క్షణం సద్వినియోగమే. త్వరగా ప్రారంభించునిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అనేది ఆంగ్ల సామెత. రేపటి పని ఈరోజే చెయ్యి. ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యి అనేది హిందీ సూక్తి. కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయకు ప్రతిపనీ నిర్మాణాత్మకంగా ప్రతిభతో ప్రగతి వైపుగా ఉండాలని హెచ్చరిస్తారు విజ్ఞులు.
కాలాన్ని తైలధారగా వర్ణించారు. అది నిరంతరం కొనసాగే ధార. జీవితం కూడా అంతటి వేగంగా సాగుతుంది. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం.... ఒకదాని వెంట ఒకటి పరుగు పెడతాయి. ఇలా చేయలేకపోయాను, చేసి ఉంటే ఎంతో సాధించేవాణ్ని అనే నిరాశ కలగకుండా ఉండాలంటే అప్రమత్తంగా విజయాన్ని ఒడిసిపట్టాలి. ప్రతి క్షణం జీవించాలి.
హనుమ లంకలో సీత జాడ కోసం ఒక రాత్రి మొత్తం క్షణం విరామం లేకుండా వెతికాడు. అందరి మధ్య సంచరించాడు. కొంత నిరాశ ఆవహించినా ధైర్యాన్ని వీడలేదు. నిరాటంకంగా, నిర్విఘ్నంగా ప్రయత్నం కొనసాగించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. విలువైన, అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంతో తీవ్ర నిరాశతో ముగించేవారు పిరికివారు, మూఢులు. భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం మానవ జీవితం. ఆస్వాదిస్తూ అనుభవించేవారే చరితార్థులు.
జీవితం అపురూప వరం
జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు.
జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.
ప్రసన్నత, ప్రశాంతత, భగవత్ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.
జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు.
జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.
ప్రసన్నత, ప్రశాంతత, భగవత్ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.
జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
జీవితం అపురూప వరం
జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.
ప్రసన్నత, ప్రశాంతత, భగవత్ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.
జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.
ప్రసన్నత, ప్రశాంతత, భగవత్ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.
జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
ఆనంద సృష్టి
"పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం.
ఆనందం, మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి. బాధలు కిటికీ తెరలు. మహాద్వారం మన అంతులేని సంతోషమే. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి మురిసిపోవాలి. కూడా ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. హృదయంలో సంతోషం సంతకాలుండాలి. మనసులో మంచి
జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదుఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు. మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.
ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావంపుట్టుకతో బాధలు అందరికీ ఉండవుమధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి. బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి. బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!
'మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞానిఅతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుందిసంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.
"పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం.
ఆనందం, మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి. బాధలు కిటికీ తెరలు. మహాద్వారం మన అంతులేని సంతోషమే. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి మురిసిపోవాలి. కూడా ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. హృదయంలో సంతోషం సంతకాలుండాలి. మనసులో మంచి
జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదుఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు. మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.
ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావంపుట్టుకతో బాధలు అందరికీ ఉండవుమధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి. బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి. బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!
'మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞానిఅతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుందిసంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.
మాట తీరు
మానవుడి దైనందిన జీవితంలో నిత్యావసరాలకు విషయ ప్రసారానికి ముఖ్యమైన మాధ్యమం మాట. అది భావ వ్యక్తీకరణకు మార్గం. మాటే మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపంకొంతమంది ఆలోచించి మాట్లాడితే, కొంతమంది మాట్లాడిన తరువాత ఆలోచిస్తారు. దాన్ని సరి చేసుకునేందుకు నానా పాట్లు పడతారు. కాలు జారితే తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోలేం. పెదవి దాటితే పృద్వి దాటుతుందని నానుడి. అది అక్కడితో ఆగక చిలవలు పలవలై వ్యాప్తి చెందుతుంది. అందుకే ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. అసలు మాట్లాడవలసిన "అవసరం ఉందా అని ఆలోచించుకుని మాట్లాడాలంటారు సోక్రటీస్.
మాటల్లో ఆత్మవిశ్వాసంఆత్మీయత, నమ్మకం ఉట్టిపడాలి. విషయం సూటిగా స్పష్టంగా సందేహ రహితంగా ఉండాలి. లేకపోతే అపార్ధాలకు దారి తీసి సంబంధాలు దెబ్బతింటాయి. చిక్కుల్లో పడేస్తుందిమాటే చిక్కుల్లో నుంచి బయట పడేస్తుందిసత్య అయినా అహితాన్ని చెప్పకూడదు. హితం కదా అని అసత్యం చెప్పకూడదు. చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి. వ్యవహారాల్లో అన్నదమ్ములైనా కచ్చితంగా నిర్మొహమాటంగా మాట్లాడాలిమిత్రులు సమ వయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా. భార్య చతురోక్తులతో, మిత్రులతో
రసస్ఫోరకంగా, పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా, పిన్నలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా, నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి. అతి ఎప్పుడూ ' ఎక్కడా పనికిరాదు. మాటకు విలువ లేని చోట, మనోభావాన్ని అర్ధం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనం ఉత్తమం. మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయోమార్గం. నోటి దురుసుతనం, ఆధార రహిత అనాలోచిత నిందారోపణలు, అసూయాగ్రస్త అపవాదులు, సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. వివేచన లేని వాగ్వివాదాలు
నాయకులకు మాట శక్తిమంతమైన ఆయుధం. వంద తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు. మాట త్రికరణ శుద్ధిగా నిర్మల చిత్తంతో ఉన్నప్పుడు వాక్సుద్ధి కలుగుతుంది. ఆ మాట ఒక విలువశక్తి సంతరించుకుంటుందిమంచిగా, పద్దతిగా మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా తెలియాలి. మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునరావృతం అవుతుంది. వింటుంటే కొత్త విషయాలు, ఇతరులు అభిప్రాయాలు తెలుస్తాయి. ఏ విషయాన్నీ పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు. అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి. అంతే కాకుండా ఎదుటివారు ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే, మాట్లాడేవారి అంతరంగాన్ని చిత్తశుద్దిని కూడా గ్రహించగలగాలి. వినేటప్పుడు పెద్దల భావాలు గణనలోకి తీసుకోవాలి. | కటువుగా ఉన్నా హితుల మాటలు స్వీకరించాలి. వినే విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకుంటూ మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా, మృదువుగా, చిరునవ్వుతో వ్యక్తం చేస్తే సమాజంలో సంబంధాలు సాఫీగా సాగిపోతాయి.
శ్రీరాముడు పూర్వభాషి. స్మితభాషి, మృదుభాషి, మితభాషి. కనుక జనరంజకుడయ్యాడు. వాక్ వైభవంలో హనుమ ఆ శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు. అటువంటివారి మాటతీరు మనకు ఆదర్శం, అనుసరణీయం.
మానవుడి దైనందిన జీవితంలో నిత్యావసరాలకు విషయ ప్రసారానికి ముఖ్యమైన మాధ్యమం మాట. అది భావ వ్యక్తీకరణకు మార్గం. మాటే మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపంకొంతమంది ఆలోచించి మాట్లాడితే, కొంతమంది మాట్లాడిన తరువాత ఆలోచిస్తారు. దాన్ని సరి చేసుకునేందుకు నానా పాట్లు పడతారు. కాలు జారితే తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోలేం. పెదవి దాటితే పృద్వి దాటుతుందని నానుడి. అది అక్కడితో ఆగక చిలవలు పలవలై వ్యాప్తి చెందుతుంది. అందుకే ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. అసలు మాట్లాడవలసిన "అవసరం ఉందా అని ఆలోచించుకుని మాట్లాడాలంటారు సోక్రటీస్.
మాటల్లో ఆత్మవిశ్వాసంఆత్మీయత, నమ్మకం ఉట్టిపడాలి. విషయం సూటిగా స్పష్టంగా సందేహ రహితంగా ఉండాలి. లేకపోతే అపార్ధాలకు దారి తీసి సంబంధాలు దెబ్బతింటాయి. చిక్కుల్లో పడేస్తుందిమాటే చిక్కుల్లో నుంచి బయట పడేస్తుందిసత్య అయినా అహితాన్ని చెప్పకూడదు. హితం కదా అని అసత్యం చెప్పకూడదు. చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి. వ్యవహారాల్లో అన్నదమ్ములైనా కచ్చితంగా నిర్మొహమాటంగా మాట్లాడాలిమిత్రులు సమ వయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా. భార్య చతురోక్తులతో, మిత్రులతో
రసస్ఫోరకంగా, పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా, పిన్నలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా, నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి. అతి ఎప్పుడూ ' ఎక్కడా పనికిరాదు. మాటకు విలువ లేని చోట, మనోభావాన్ని అర్ధం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనం ఉత్తమం. మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయోమార్గం. నోటి దురుసుతనం, ఆధార రహిత అనాలోచిత నిందారోపణలు, అసూయాగ్రస్త అపవాదులు, సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. వివేచన లేని వాగ్వివాదాలు
నాయకులకు మాట శక్తిమంతమైన ఆయుధం. వంద తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు. మాట త్రికరణ శుద్ధిగా నిర్మల చిత్తంతో ఉన్నప్పుడు వాక్సుద్ధి కలుగుతుంది. ఆ మాట ఒక విలువశక్తి సంతరించుకుంటుందిమంచిగా, పద్దతిగా మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా తెలియాలి. మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునరావృతం అవుతుంది. వింటుంటే కొత్త విషయాలు, ఇతరులు అభిప్రాయాలు తెలుస్తాయి. ఏ విషయాన్నీ పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు. అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి. అంతే కాకుండా ఎదుటివారు ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే, మాట్లాడేవారి అంతరంగాన్ని చిత్తశుద్దిని కూడా గ్రహించగలగాలి. వినేటప్పుడు పెద్దల భావాలు గణనలోకి తీసుకోవాలి. | కటువుగా ఉన్నా హితుల మాటలు స్వీకరించాలి. వినే విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకుంటూ మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా, మృదువుగా, చిరునవ్వుతో వ్యక్తం చేస్తే సమాజంలో సంబంధాలు సాఫీగా సాగిపోతాయి.
శ్రీరాముడు పూర్వభాషి. స్మితభాషి, మృదుభాషి, మితభాషి. కనుక జనరంజకుడయ్యాడు. వాక్ వైభవంలో హనుమ ఆ శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు. అటువంటివారి మాటతీరు మనకు ఆదర్శం, అనుసరణీయం.
సంయమనం గొప్ప వరం
విద్యాధికుడిగా, జ్ఞానిగా, ప్రజోపకారిగా, బంధుమిత్ర ప్రియతముడిగా మన్ననలు పొందినా ఒకే ఒక అవలక్షణం వల్ల ఘనతను కోల్పోతున్నాడు మనిషి. రెండక్షరాల ప్రేమ మనిషిని మహనీయుణ్ని చేస్తుంటేమరో రెండక్షరాల క్రోధం అతణ్ని మతిభ్రష్టుడిగా మార్చేస్తోంది. ప్రథమకోపం, క్షణికావేశం మనిషిని పశువును చేస్తాయి. ముక్కోపానికి దాసులైన ముని పుంగవులు సైతం విజ్ఞతను దిగజార్చుకొని తపశ్శక్తిని కోల్పోయారు. నిలువెల్లా క్రోధం ఆవరించినప్పుడు చీకట్లు కమ్మి విచక్షణ నశిస్తుంది. ఆర్జించుకొన్న సద్గుణాలు, గౌరవాభిమానాలు మంటగలిసిపోతాయి. తొందరపాటు చర్య వల్ల అనర్థాలు దాపురిస్తాయి. ఇదొక మానసిక బలహీనత. పూర్వాపరాలు ఆలోచించక క్షణికావేశానికి లోనై మూర్ఖంగా విధ్వంసానికి సైతం వెనుదీయని వైఖరి మనిషి అల్పత్వాన్ని సూచిస్తుంది. ఆపై తొందరపాటు చర్యకు వగచినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఆకర్షణలకు మొగ్గుచూపి కుటుంబ బంధాలను తెంచుకొని బలవన్మరణాలకు పాల్పడే అనాలోచిత చర్యలు బాధాకరం. తమ అనైతిక ప్రవర్తనంతో మానవత్వానికి మచ్చతెచ్చి చరిత్రహీనులుగా మిగిలి పోయేవారు ఇంకొందరు.
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏవో కొన్ని సందర్భాల్లో మందలింపులు, అవమానాలు తప్పవుభవితను దిద్దుకొనేందుకు వాటిని ఉపకరణాలుగా ఉపయోగించుకోవాలే తప్ప కోపంతో రగిలిపోకూడదుకన్నవారు, గురువులు, మిత్రులు మన ఎదుగుదలకు ప్రధాన సూత్రధారులు. మెట్టు మెట్టునా మన ఉన్నతిని కాంక్షించేందుకు పడే తాపత్రయాన్ని గుర్తించాలి. గుండెనిండుగా వారిని గౌరవించాలే గాని ద్వేషం, పగతో శత్రుభావన పెంచుకోరాదు. యాగం జరుగు తున్న సమయంలో తన రాకను గౌరవించ లేదని అల్లుడైన శివుడిపై కోపించాడు. దక్షప్రజాపతి. అనరాని మాటలతో అవమా నించాడు. ఏ మాత్రం చలించలేదు శివుడు. దక్షుడి పట్ల కొంచెమైనా విరోధం లేకుండా కూడా స్తుతిగానే స్వీకరించాడుదక్షయజ్ఞ కూర్చున్నాడు. ధ్వంసానంతరం బ్రహ్మాది దేవతలు రుద్రుణ్ని శరణువేడారు. దుష్టుల నిందవల్ల మహాత్ముల శోభ మరింత పెరుగుతుందే కాని అపకీర్తి కలగదని, అజ్ఞాని విమర్శల్ని పొగడ్తలుగా చిరునవ్వుతో స్వీకరిస్తానన్నాడు శివుడు
ప్రశాంత జీవనాన్ని అశాంతికి గురిచేసే కోపాన్ని తక్షణం నియంత్రించాలిరగులుతున్న కోపాన్ని విజ్ఞతతో కట్టడిచేసి శాంతపడేవారే ధన్యులు. కోపాన్ని అదుపుచేసి కళ్లెలు బిగించేది మౌనం. సమస్య సరళతరం కావాలంటే అననుకూల వాతావరణం నుంచి మౌనంగా నిష్క్రమించాలి. ఆవేశపరులు రెచ్చిపోయినప్పుడు బుద్ధిమంతులు మౌనాన్ని ఆశ్రయించి వారిని చల్లబరుస్తారు. ఆవేశానికి అడ్డుకట్టవేసే శక్తి ఆలోచనది కూడా. ప్రశాంతంగా క్షణకాలం బుద్ధిని ప్రయోగించి ఆలోచిస్తే చేస్తున్నది తప్పో ఒప్పో అర్థమవుతుంది. ఈ శక్తిని సొంతం చేసుకొంటే అబలల పై ఆమ్లదాడులు, నడివీధిలో గొంతులు కోనే దారుణాల్లాంటివి సంభవించవు. ధ్యానం, యోగాభ్యాసంవల్ల ఈ శక్తి లభిస్తుంది. ప్రతి ప్రాణిలో భగవంతుడి చైతన్యాన్ని గుర్తించాలిఆవేశకావేషాలకు లోనైనప్పుడు, బుద్ధి వక్రమార్గం వైపు మరలినప్పుడూ స్థిరచిత్తంతో చేసే ఇష్టదేవతా స్మరణ, ప్రార్ధనలు ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించే మహోత్కృష్ట వరాలు.
విద్యాధికుడిగా, జ్ఞానిగా, ప్రజోపకారిగా, బంధుమిత్ర ప్రియతముడిగా మన్ననలు పొందినా ఒకే ఒక అవలక్షణం వల్ల ఘనతను కోల్పోతున్నాడు మనిషి. రెండక్షరాల ప్రేమ మనిషిని మహనీయుణ్ని చేస్తుంటేమరో రెండక్షరాల క్రోధం అతణ్ని మతిభ్రష్టుడిగా మార్చేస్తోంది. ప్రథమకోపం, క్షణికావేశం మనిషిని పశువును చేస్తాయి. ముక్కోపానికి దాసులైన ముని పుంగవులు సైతం విజ్ఞతను దిగజార్చుకొని తపశ్శక్తిని కోల్పోయారు. నిలువెల్లా క్రోధం ఆవరించినప్పుడు చీకట్లు కమ్మి విచక్షణ నశిస్తుంది. ఆర్జించుకొన్న సద్గుణాలు, గౌరవాభిమానాలు మంటగలిసిపోతాయి. తొందరపాటు చర్య వల్ల అనర్థాలు దాపురిస్తాయి. ఇదొక మానసిక బలహీనత. పూర్వాపరాలు ఆలోచించక క్షణికావేశానికి లోనై మూర్ఖంగా విధ్వంసానికి సైతం వెనుదీయని వైఖరి మనిషి అల్పత్వాన్ని సూచిస్తుంది. ఆపై తొందరపాటు చర్యకు వగచినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఆకర్షణలకు మొగ్గుచూపి కుటుంబ బంధాలను తెంచుకొని బలవన్మరణాలకు పాల్పడే అనాలోచిత చర్యలు బాధాకరం. తమ అనైతిక ప్రవర్తనంతో మానవత్వానికి మచ్చతెచ్చి చరిత్రహీనులుగా మిగిలి పోయేవారు ఇంకొందరు.
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏవో కొన్ని సందర్భాల్లో మందలింపులు, అవమానాలు తప్పవుభవితను దిద్దుకొనేందుకు వాటిని ఉపకరణాలుగా ఉపయోగించుకోవాలే తప్ప కోపంతో రగిలిపోకూడదుకన్నవారు, గురువులు, మిత్రులు మన ఎదుగుదలకు ప్రధాన సూత్రధారులు. మెట్టు మెట్టునా మన ఉన్నతిని కాంక్షించేందుకు పడే తాపత్రయాన్ని గుర్తించాలి. గుండెనిండుగా వారిని గౌరవించాలే గాని ద్వేషం, పగతో శత్రుభావన పెంచుకోరాదు. యాగం జరుగు తున్న సమయంలో తన రాకను గౌరవించ లేదని అల్లుడైన శివుడిపై కోపించాడు. దక్షప్రజాపతి. అనరాని మాటలతో అవమా నించాడు. ఏ మాత్రం చలించలేదు శివుడు. దక్షుడి పట్ల కొంచెమైనా విరోధం లేకుండా కూడా స్తుతిగానే స్వీకరించాడుదక్షయజ్ఞ కూర్చున్నాడు. ధ్వంసానంతరం బ్రహ్మాది దేవతలు రుద్రుణ్ని శరణువేడారు. దుష్టుల నిందవల్ల మహాత్ముల శోభ మరింత పెరుగుతుందే కాని అపకీర్తి కలగదని, అజ్ఞాని విమర్శల్ని పొగడ్తలుగా చిరునవ్వుతో స్వీకరిస్తానన్నాడు శివుడు
ప్రశాంత జీవనాన్ని అశాంతికి గురిచేసే కోపాన్ని తక్షణం నియంత్రించాలిరగులుతున్న కోపాన్ని విజ్ఞతతో కట్టడిచేసి శాంతపడేవారే ధన్యులు. కోపాన్ని అదుపుచేసి కళ్లెలు బిగించేది మౌనం. సమస్య సరళతరం కావాలంటే అననుకూల వాతావరణం నుంచి మౌనంగా నిష్క్రమించాలి. ఆవేశపరులు రెచ్చిపోయినప్పుడు బుద్ధిమంతులు మౌనాన్ని ఆశ్రయించి వారిని చల్లబరుస్తారు. ఆవేశానికి అడ్డుకట్టవేసే శక్తి ఆలోచనది కూడా. ప్రశాంతంగా క్షణకాలం బుద్ధిని ప్రయోగించి ఆలోచిస్తే చేస్తున్నది తప్పో ఒప్పో అర్థమవుతుంది. ఈ శక్తిని సొంతం చేసుకొంటే అబలల పై ఆమ్లదాడులు, నడివీధిలో గొంతులు కోనే దారుణాల్లాంటివి సంభవించవు. ధ్యానం, యోగాభ్యాసంవల్ల ఈ శక్తి లభిస్తుంది. ప్రతి ప్రాణిలో భగవంతుడి చైతన్యాన్ని గుర్తించాలిఆవేశకావేషాలకు లోనైనప్పుడు, బుద్ధి వక్రమార్గం వైపు మరలినప్పుడూ స్థిరచిత్తంతో చేసే ఇష్టదేవతా స్మరణ, ప్రార్ధనలు ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించే మహోత్కృష్ట వరాలు.
జనన మరణాల మధ్య..."
మహా బలవంతుడుమల్లయుద్ధ వీరుడైనా కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడుకాలం పరుగెడుతుంటే యౌవనంలో అందాల రాశి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుందిమహాజ్ఞాని సైతం వయసు మళ్ళాక జ్ఞాపకశక్తి తగ్గి చింతిస్తుంటాడు. జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే
గడిచిన క్షణం తిరిగిరాదుఈ నిజాన్ని జీర్ణించుకున్న విజ్ఞులు నేను నాది అనే జహంకారాన్ని తలకెక్కించుకోరు. స్వార్థాన్ని కట్టడి చేసుకుని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారుతమకు తెలియని ఏదో శక్తి తమను నడిపిస్తోందని విశ్వసిస్తారుఆ శక్తినే దైవంగా భావిస్తారుతను జీవితం అ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారుఈ జగతిని సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుడిని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారుపరమేశ్వరుడి సృష్టిలో అత్యంత కీలకమైనది మాటపుట్టిన వెంటనే మాట రాదుమరణ సమయంలో మాట పడిపోతుందిమధ్యకాలంలో సత్య సంభాషణం మనిషి విలువను వెంచుతుందికష్టసుఖాల్లో పాలుపంచుకునే బందుమిత్రులను ఆదరించినవారి జీవితం ఆనందమయమవుతుందిస్నేహబంధ వ్య పరిమళాలను నిరంతరం ఆస్వాదించాలి. జనన మరణాల మధ్య కాలంలో లోటి మోహాలనుమదమాత్సర్యాలను మనసునుంచి తరిమికొట్టి మంగళకరమైన ఆలోచనలతో మనసును పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది చెడుతలపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే. భూమి మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదుముసలితనంలో యమ భటులు వాకిట ముందుకొచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతున్ని తలచగలమో లేదోభజింపగలమో లేదో తెలియదుకనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ని ద్యానించి పూజించాలని బోధిస్తుంది దాశరథీ శతకపద్యంభూమి
జీవితంలో ప్రతిక్షణం విలువైనదని తెలుసుకోగలగాలిఅనుక్షణం అప్రమత్తంగా ఉండాలిసోమరితనంతో కాలాన్ని వృదా చేసుకునేవారు అజ్ఞానులు.
మనసులో రూపుదిద్దుకొన్న ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తముల లక్షణంతమతోనే నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారే విజ్ఞులు, నిర్దేశించుకున్న లక్ష్యాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారుకదలలేని స్థితిలో చేసిన తప్పులు తలచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదుచివరి క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడనుగ్రహించిన జీవితాన్ని సార్ధకం
చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుడి పిలుపునందుకోవాలి
మహా బలవంతుడుమల్లయుద్ధ వీరుడైనా కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడుకాలం పరుగెడుతుంటే యౌవనంలో అందాల రాశి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుందిమహాజ్ఞాని సైతం వయసు మళ్ళాక జ్ఞాపకశక్తి తగ్గి చింతిస్తుంటాడు. జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే
గడిచిన క్షణం తిరిగిరాదుఈ నిజాన్ని జీర్ణించుకున్న విజ్ఞులు నేను నాది అనే జహంకారాన్ని తలకెక్కించుకోరు. స్వార్థాన్ని కట్టడి చేసుకుని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారుతమకు తెలియని ఏదో శక్తి తమను నడిపిస్తోందని విశ్వసిస్తారుఆ శక్తినే దైవంగా భావిస్తారుతను జీవితం అ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారుఈ జగతిని సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుడిని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారుపరమేశ్వరుడి సృష్టిలో అత్యంత కీలకమైనది మాటపుట్టిన వెంటనే మాట రాదుమరణ సమయంలో మాట పడిపోతుందిమధ్యకాలంలో సత్య సంభాషణం మనిషి విలువను వెంచుతుందికష్టసుఖాల్లో పాలుపంచుకునే బందుమిత్రులను ఆదరించినవారి జీవితం ఆనందమయమవుతుందిస్నేహబంధ వ్య పరిమళాలను నిరంతరం ఆస్వాదించాలి. జనన మరణాల మధ్య కాలంలో లోటి మోహాలనుమదమాత్సర్యాలను మనసునుంచి తరిమికొట్టి మంగళకరమైన ఆలోచనలతో మనసును పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది చెడుతలపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే. భూమి మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదుముసలితనంలో యమ భటులు వాకిట ముందుకొచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతున్ని తలచగలమో లేదోభజింపగలమో లేదో తెలియదుకనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ని ద్యానించి పూజించాలని బోధిస్తుంది దాశరథీ శతకపద్యంభూమి
జీవితంలో ప్రతిక్షణం విలువైనదని తెలుసుకోగలగాలిఅనుక్షణం అప్రమత్తంగా ఉండాలిసోమరితనంతో కాలాన్ని వృదా చేసుకునేవారు అజ్ఞానులు.
మనసులో రూపుదిద్దుకొన్న ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తముల లక్షణంతమతోనే నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారే విజ్ఞులు, నిర్దేశించుకున్న లక్ష్యాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారుకదలలేని స్థితిలో చేసిన తప్పులు తలచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదుచివరి క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడనుగ్రహించిన జీవితాన్ని సార్ధకం
చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుడి పిలుపునందుకోవాలి
ఆధ్యాత్మికానందం
సంతృప్తిప్రశాంతత, మానసికానందం... ఇటువంటి గుణాలున్నవారి జీవితం పరిపూర్ణమవుతుందిఎవరికి వారే ఆధ్యాత్మికంగా ఎదిగితేనే అది సాధ్యపడుతుందిఆధ్యాత్మికత అనే పదానికి ఆత్మీయంగా దగ్గర కావడమని అర్థం. ఆ స్థితికి చేరాలంటే నిత్యజీవన సరళికి మానవీయ విలువలు జతపడాలిఆలోచనల్లో వైరాగ్యం చోటుచేసుకోవాలిఆచరణలో ఆదర్శం ఉండాలిఅలాగైతేనే ఇహంలో మానవుడికైనా, పరంలో మాధవుడికైనా దగ్గర కాగలుగుతారుఅలా కాకుండా ఎదుటివారు ఆపదలో ఉన్నాతమకేమీ పట్టనట్టు ప్రవచనాలు వింటూనో, స్తోత్రాలు చదువుకుంటూనో, జపమాల తిప్పుకొంటూ కూర్చోవడమో చేస్తే... అది ఆధ్యాత్మికత అనిపించుకోదు
బాధల్లో, కష్టాల్లో ఉన్నవాళ్లను తేరుకోలేని ఇబ్బందుల్లో ఉన్నవారిని చూస్తూ... అయ్యో పాపం అని జాలిపడటమో ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు... లాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి బదులు వాళ్లను ఆ స్థితి నుంచి తప్పించి స్వస్థత చేకూర్చడానికి పూనుకోవాలిరొట్టెను దొంగిలించి నవాడి నేరాన్ని చూసి నిందించడం, శిక్షించాలనుకోవడం సరైన పని కాదు. పని చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితుల్ని తెలుసుకుని సరిదిద్దగల గాలిఇది సామాజిక ఆధ్యాత్మికత అంటారు ప్రవక్తలు
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనదంటారుమాట్లాడగలగడం వల్లనే అలా అని ఉంటారు. కానీ తరచి చూస్తే పశుపక్ష్యాదుల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాటి ప్రాణికి సాయపడటం, ఆపదలో ఆదుకోవడంఅండగా నిలబడటం, ఆసరా కావడం లాంటివిపశుపక్ష్యాదుల్లో జన్మతః వచ్చే లక్షణాలుఒక కాకి మరణిస్తే ఎన్నో కాకులు చుట్టూ చేరతాయి. ఒక చీమ చనిపోతే మరో చీమ మోసుకుపోతుంది. ఒక పక్షి పెట్టిన గుడ్డును మరో పక్షి పొదిగి పిల్లల్ని చేస్తుంది. అలా చేసినందుకు అవి ఏ ప్రతిఫలాన్ని ఆశించవుకానీ బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడు అలాంటి సేవలు చెయ్యాలంటే ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి. లేదా ఇతరులెవరైనా ప్రేరణ కలిగించాలిఈ రెండూ కాకపోతే ఆ పని చెయ్యడం వల్ల కొంత ప్రతిఫలమైనా ఉండాలి. ఇది ఎంతవరకు సమంజసమో ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలిఉత్కృష్టమైంది అనిపించుకున్న మానవజన్మ కలిగినందుకు అందరికీ ఉపయుక్తమైన పనులు చెయ్యడానికి శ్రద్ధ చూపాలిదీన్ని బాధ్యతాయుత ఆధ్యాత్మికత అంటారు.
చెల్లాచెదురుగా ఉన్నవాటిని క్రమపద్ధతిలోకి తేవడాన్ని సంస్కరించడం అంటారు. దాని రూపమే సంస్కృతి. అది కలిగి ఉండటం సంస్కారం. ప్రవర్తన, నడవడిక, ఆలోచనచేసే పని తదితరాలన్నింటినీ క్రమబద్ధీకరించడమే సంస్కృతికి నిదర్శనం
భగవంతుడి నివేదన కోసం భక్ష్యాన్ని తీసుకుని వెళుతున్న వ్యక్తికిఆకలితో అలమటిస్తున్న ప్రాణి ఎదురైతే భక్ష్యాన్ని ఎలా వినియోగించాలో తేల్చుకోగలగడమే సంస్కారానికి ఉదాహరణ. దీన్ని స్థితప్రజ్ఞతో కూడిన ఆధ్యాత్మికత అంటారుఇలా... ఎవరికి వారు చేసే పనులు, వాటి స్థాయిని బట్టి మంచివారుగొప్పవారుమహానుభావులు, రుషుల యుగపురుషులుగా అలరారుతారుఎన్ని ఆటంకాలెదురైనా వారు స్థిరమైన మనసుతో పదిమందికీ పనికి వచ్చే పనులనే చేస్తారు. వారు పొందేది, వారు అందరికీ అందించేదీ ఆధ్యాత్మిక ఆనందం.
సంతృప్తిప్రశాంతత, మానసికానందం... ఇటువంటి గుణాలున్నవారి జీవితం పరిపూర్ణమవుతుందిఎవరికి వారే ఆధ్యాత్మికంగా ఎదిగితేనే అది సాధ్యపడుతుందిఆధ్యాత్మికత అనే పదానికి ఆత్మీయంగా దగ్గర కావడమని అర్థం. ఆ స్థితికి చేరాలంటే నిత్యజీవన సరళికి మానవీయ విలువలు జతపడాలిఆలోచనల్లో వైరాగ్యం చోటుచేసుకోవాలిఆచరణలో ఆదర్శం ఉండాలిఅలాగైతేనే ఇహంలో మానవుడికైనా, పరంలో మాధవుడికైనా దగ్గర కాగలుగుతారుఅలా కాకుండా ఎదుటివారు ఆపదలో ఉన్నాతమకేమీ పట్టనట్టు ప్రవచనాలు వింటూనో, స్తోత్రాలు చదువుకుంటూనో, జపమాల తిప్పుకొంటూ కూర్చోవడమో చేస్తే... అది ఆధ్యాత్మికత అనిపించుకోదు
బాధల్లో, కష్టాల్లో ఉన్నవాళ్లను తేరుకోలేని ఇబ్బందుల్లో ఉన్నవారిని చూస్తూ... అయ్యో పాపం అని జాలిపడటమో ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు... లాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి బదులు వాళ్లను ఆ స్థితి నుంచి తప్పించి స్వస్థత చేకూర్చడానికి పూనుకోవాలిరొట్టెను దొంగిలించి నవాడి నేరాన్ని చూసి నిందించడం, శిక్షించాలనుకోవడం సరైన పని కాదు. పని చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితుల్ని తెలుసుకుని సరిదిద్దగల గాలిఇది సామాజిక ఆధ్యాత్మికత అంటారు ప్రవక్తలు
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనదంటారుమాట్లాడగలగడం వల్లనే అలా అని ఉంటారు. కానీ తరచి చూస్తే పశుపక్ష్యాదుల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాటి ప్రాణికి సాయపడటం, ఆపదలో ఆదుకోవడంఅండగా నిలబడటం, ఆసరా కావడం లాంటివిపశుపక్ష్యాదుల్లో జన్మతః వచ్చే లక్షణాలుఒక కాకి మరణిస్తే ఎన్నో కాకులు చుట్టూ చేరతాయి. ఒక చీమ చనిపోతే మరో చీమ మోసుకుపోతుంది. ఒక పక్షి పెట్టిన గుడ్డును మరో పక్షి పొదిగి పిల్లల్ని చేస్తుంది. అలా చేసినందుకు అవి ఏ ప్రతిఫలాన్ని ఆశించవుకానీ బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడు అలాంటి సేవలు చెయ్యాలంటే ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి. లేదా ఇతరులెవరైనా ప్రేరణ కలిగించాలిఈ రెండూ కాకపోతే ఆ పని చెయ్యడం వల్ల కొంత ప్రతిఫలమైనా ఉండాలి. ఇది ఎంతవరకు సమంజసమో ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలిఉత్కృష్టమైంది అనిపించుకున్న మానవజన్మ కలిగినందుకు అందరికీ ఉపయుక్తమైన పనులు చెయ్యడానికి శ్రద్ధ చూపాలిదీన్ని బాధ్యతాయుత ఆధ్యాత్మికత అంటారు.
చెల్లాచెదురుగా ఉన్నవాటిని క్రమపద్ధతిలోకి తేవడాన్ని సంస్కరించడం అంటారు. దాని రూపమే సంస్కృతి. అది కలిగి ఉండటం సంస్కారం. ప్రవర్తన, నడవడిక, ఆలోచనచేసే పని తదితరాలన్నింటినీ క్రమబద్ధీకరించడమే సంస్కృతికి నిదర్శనం
భగవంతుడి నివేదన కోసం భక్ష్యాన్ని తీసుకుని వెళుతున్న వ్యక్తికిఆకలితో అలమటిస్తున్న ప్రాణి ఎదురైతే భక్ష్యాన్ని ఎలా వినియోగించాలో తేల్చుకోగలగడమే సంస్కారానికి ఉదాహరణ. దీన్ని స్థితప్రజ్ఞతో కూడిన ఆధ్యాత్మికత అంటారుఇలా... ఎవరికి వారు చేసే పనులు, వాటి స్థాయిని బట్టి మంచివారుగొప్పవారుమహానుభావులు, రుషుల యుగపురుషులుగా అలరారుతారుఎన్ని ఆటంకాలెదురైనా వారు స్థిరమైన మనసుతో పదిమందికీ పనికి వచ్చే పనులనే చేస్తారు. వారు పొందేది, వారు అందరికీ అందించేదీ ఆధ్యాత్మిక ఆనందం.
పొరపాట్లు
ఉద్యానవనంలో అనామకంగా పెరిగే పిచ్చి మొక్కలు లాంటివి మానవ జీవితంలో మనం అప్పుడప్పుడు చేసే పొరపాట్లు, మొక్కల్లోని ఔషధ తత్వాలను శాస్త్రజ్ఞులు వెలికి తీసినప్పుడు వాటి గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అందాకా అవి పిచ్చి మొక్కలుగానే మిగులుతాయి. సరిదిద్దుకున్న మన పొరపాట్లు సైతం కాలగతిన ఆప్తులకు మధురమైన అనుభూతుల్ని మిగులుస్తాయి.
మనిషి సంఘజీవి. సమాజంలోని వ్యక్తులతో అతడికి ఎన్నో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు! ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. తన మనసుకు సరిపడే వారితోనే స్నేహం కుదురుతుంది. అయినా వారిలో కొన్ని ప్రవర్తనాపరమైన తేడాలు ఉంటాయి. కాలగతిన మనసు తెచ్చే మార్పులు ఒక్కొక్కసారి వ్యధను కలిగిస్తాయి. మనిషి చేత పొరపాట్లు చేయిస్తాయి. పిచ్చి మొక్కలు ఔషధ మొక్కలుగా గుర్తింపు తెచ్చుకొని వెలుగొందినట్లు మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకుంటే స్నేహ సంబంధాలు వికసించి పరిమ శిస్తాయి. ఓ స్నేహితుడు ఓ విజయాన్ని సాధించాడు. వేరే కారణంగా స్థిమితమైన మనసుతో లేని అతడి మిత్రుడు దానిపై సాధారణంగా స్పందించాడు. మిత్రుడి నుంచి ఎక్కువ స్థాయిలో ప్రశంస ఆశించిన విజయుడైన స్నేహితుడికి అది అసంతృప్తిని కలిగించింది. మిత్రుడితో మాట్లాడటం మానేశాడు. మిత్రుడు, విజేత అయిన స్నేహితుడికి క్షమాపణ | తెలుపు కోవలసి వచ్చింది. ఆంగ్లభాషలో 'సారీ' అన్న పదం చాలా చిన్నది. అయినా ప్రభావవంతమైనది. చెప్పేవారి హుందాతనాన్ని ఏ మాత్రం తగ్గించని ఆ పదం నొచ్చుకున్న స్నేహితుడి అహాన్ని సంతృప్తిపరచి సాంత్వన చేకూర్చింది. వారి మధ్య స్నేహ పరిమళం సాధారణ రీతిలో మరల వెల్లివిరిసింది. ప్రవర్తనాపరంగా అప్పుడప్పుడు ఎగసిపడే పొరపాట్ల పట్ల మనిషి జాగ్రత్త వహించాలి. అవి నేరాలు కావు. అనైతికమైనవీ కావు. కేవలం స్వల్పమైన ప్రవర్తనా దోషాలు. అవి ఎదురైనప్పుడు కారకులైనవారు కొంచెం జాగ్రత్త వహించి తప్పు జరిగిందని భావిస్తే ఎదుటివారికి క్షమాపణ చెప్పినప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. మనిషన్న ప్రతివాడూ పొరపాట్లు చేస్తాడు! చేసిన పొరపాట్లు మరల మరల చేయకపోవడం విజ్ఞత ఆ విజ్ఞతను అందరూ అంది పుచ్చుకొంటే సమాజం పరిమళాలు వెదజల్లే పుష్పవనం అవుతుంది. మనిషి సాధారణంగా చేసే పొరపాట్లను శివపురాణం ప్రస్తావిస్తుంది. తన మాటలు, చేతలతో ఎవరికీ హాని చేయకపోయినా వాటిని మనసులో అనుభూతించడం సైతం పాపం. దుర్యోధనుడు అహంకారంతో చేసిన ఒక పొరపాటు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణభగవానుడి సమక్షంలో జరుగుతుంది. సార్వభౌమాధికార గర్వంతో స్వామి తలగడ వైపు ఆసీనుడయ్యాడు దుర్యోధనుడు. పాదాల వైపు కూర్చున్నాడు. అర్జునుడు. ముందుగా స్వామి దర్శనం, సహాయాన్ని కోరే అవకాశం, ఆ అదృష్టం అర్జునుడికే కలిగాయి. ఈ పొరపాట్లు చిన్నవైనా ఒక్కొక్కసారి అవి కలిగించే నష్టం ఘనంగా ఉండవచ్చు. అందుకే మనిషి తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. సదా అప్రమత్తుడై జీవించాలి.
ఉద్యానవనంలో అనామకంగా పెరిగే పిచ్చి మొక్కలు లాంటివి మానవ జీవితంలో మనం అప్పుడప్పుడు చేసే పొరపాట్లు, మొక్కల్లోని ఔషధ తత్వాలను శాస్త్రజ్ఞులు వెలికి తీసినప్పుడు వాటి గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అందాకా అవి పిచ్చి మొక్కలుగానే మిగులుతాయి. సరిదిద్దుకున్న మన పొరపాట్లు సైతం కాలగతిన ఆప్తులకు మధురమైన అనుభూతుల్ని మిగులుస్తాయి.
మనిషి సంఘజీవి. సమాజంలోని వ్యక్తులతో అతడికి ఎన్నో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు! ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. తన మనసుకు సరిపడే వారితోనే స్నేహం కుదురుతుంది. అయినా వారిలో కొన్ని ప్రవర్తనాపరమైన తేడాలు ఉంటాయి. కాలగతిన మనసు తెచ్చే మార్పులు ఒక్కొక్కసారి వ్యధను కలిగిస్తాయి. మనిషి చేత పొరపాట్లు చేయిస్తాయి. పిచ్చి మొక్కలు ఔషధ మొక్కలుగా గుర్తింపు తెచ్చుకొని వెలుగొందినట్లు మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకుంటే స్నేహ సంబంధాలు వికసించి పరిమ శిస్తాయి. ఓ స్నేహితుడు ఓ విజయాన్ని సాధించాడు. వేరే కారణంగా స్థిమితమైన మనసుతో లేని అతడి మిత్రుడు దానిపై సాధారణంగా స్పందించాడు. మిత్రుడి నుంచి ఎక్కువ స్థాయిలో ప్రశంస ఆశించిన విజయుడైన స్నేహితుడికి అది అసంతృప్తిని కలిగించింది. మిత్రుడితో మాట్లాడటం మానేశాడు. మిత్రుడు, విజేత అయిన స్నేహితుడికి క్షమాపణ | తెలుపు కోవలసి వచ్చింది. ఆంగ్లభాషలో 'సారీ' అన్న పదం చాలా చిన్నది. అయినా ప్రభావవంతమైనది. చెప్పేవారి హుందాతనాన్ని ఏ మాత్రం తగ్గించని ఆ పదం నొచ్చుకున్న స్నేహితుడి అహాన్ని సంతృప్తిపరచి సాంత్వన చేకూర్చింది. వారి మధ్య స్నేహ పరిమళం సాధారణ రీతిలో మరల వెల్లివిరిసింది. ప్రవర్తనాపరంగా అప్పుడప్పుడు ఎగసిపడే పొరపాట్ల పట్ల మనిషి జాగ్రత్త వహించాలి. అవి నేరాలు కావు. అనైతికమైనవీ కావు. కేవలం స్వల్పమైన ప్రవర్తనా దోషాలు. అవి ఎదురైనప్పుడు కారకులైనవారు కొంచెం జాగ్రత్త వహించి తప్పు జరిగిందని భావిస్తే ఎదుటివారికి క్షమాపణ చెప్పినప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. మనిషన్న ప్రతివాడూ పొరపాట్లు చేస్తాడు! చేసిన పొరపాట్లు మరల మరల చేయకపోవడం విజ్ఞత ఆ విజ్ఞతను అందరూ అంది పుచ్చుకొంటే సమాజం పరిమళాలు వెదజల్లే పుష్పవనం అవుతుంది. మనిషి సాధారణంగా చేసే పొరపాట్లను శివపురాణం ప్రస్తావిస్తుంది. తన మాటలు, చేతలతో ఎవరికీ హాని చేయకపోయినా వాటిని మనసులో అనుభూతించడం సైతం పాపం. దుర్యోధనుడు అహంకారంతో చేసిన ఒక పొరపాటు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణభగవానుడి సమక్షంలో జరుగుతుంది. సార్వభౌమాధికార గర్వంతో స్వామి తలగడ వైపు ఆసీనుడయ్యాడు దుర్యోధనుడు. పాదాల వైపు కూర్చున్నాడు. అర్జునుడు. ముందుగా స్వామి దర్శనం, సహాయాన్ని కోరే అవకాశం, ఆ అదృష్టం అర్జునుడికే కలిగాయి. ఈ పొరపాట్లు చిన్నవైనా ఒక్కొక్కసారి అవి కలిగించే నష్టం ఘనంగా ఉండవచ్చు. అందుకే మనిషి తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. సదా అప్రమత్తుడై జీవించాలి.
అందమైన బంధం
సగం దూరం వరకు వెళ్ళి, మనసు మార్చుకొని వెనక్కి వచ్చినవాళ్ళు ఉన్నారు. ఆశ్రమ జీవితం గడుపుతూ కూడా తమ ఊరివాళ్లెవరైనా కనిపిస్తే వాళ్లెలా ఉన్నారు. వీళ్లలా ఉన్నారని వాకబు చేసేవారూ ఎందరో! బంధాలు అందమైనవి. మాత్రమే కాదు... గొప్పవి, కఠినమైనవి కూడా. బంధమే మనల్ని ఈ భూమ్మీదకు తీసుకువచ్చింది. వచ్చిన తరవాత మరిన్ని బంధాలు కల్పించింది.
ఆవు తనకు కట్టిన పలుపుతాడు తెంచుకొని వెళ్ళిపోవాలనుకుని అటు, ఇటు చుట్టూ తిరుగుతుంది. చివరకు తన పరిధి తాను తెలుసుకుని చతికిలపడుతుంది. మన నిస్సహాయతను మనం తెలుసుకోవాలి. అదే సమయంలో మనల్ని ఇలా ఉంచినవాడి గొప్ప దనాన్నీ గ్రహించాలి. ఎవరిమీదో కోపం వస్తుంది. ఎందుకో కోపం వస్తుంది. పారిపోవాలని అనిపి స్తుంది. తాళ్లతో కట్టి బంధించ రెవరూ అయినా వెళ్ళలేం. ఎందుకు, ఎవరు మనల్ని ఆపుతు న్నారో తెలియదు.
చూసిన ముఖాలే చూస్తూ, ఆడిన మాటలే ఆడుతూ, అదే తిండి తింటూ, నిద్రపోతూ తెల్లవారి లేచి మరో కొత్త సూర్యుడి కోసం ఎదు రుచూస్తాం. ఇదే బంధంమౌలికంగా మనిషి బతకడంలోనే బంధం ఉంది. బంధాలు అందంగా ఉంటాయి. అవి ఇనుప గొలుసులైతేనేం, బంగారు గొలుసులైతేనేం- బంధాలు బయటకు కనిపించవు. తల్లి వెంట బిడ్డ, బిడ్డ వెంట తల్లి... ఆ బిడ్డ ఎదిగి తల్లి.... అలా అందరూ కలిసి కుటుంబం. ఈ కుటుంబాలన్నీ ఈశ్వరుడివే. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనసు వైరాగ్యానికి గురి అయినప్పుడు తట్టా బుట్టా సర్దుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ, అంతలోనే ఆగిపోవాలి అనిపిస్తుంది. కనపడకుండా ఆపేదెవరని ఆలోచిస్తే- మనవాళ్లే కాదు... మన మధ్యలో ఉండే బంధమే అనిపిస్తుంది.
బంధాలు, వాటి స్వరూప స్వభావాల గురించి జ్ఞానులకు బాగా తెలుసు. ఆ బంధాల మాయలో పడకుండా, నమ్మిన సత్యాన్ని విడవకుండా దర్మమార్గంలో నిమిత్తమాత్రుల్లా వారు కాలం గడిపారు. మోహపూరితమైనవి. మోసపూరితమై నవి దేవతలను కూడా ఆధోగతిపాలు చేసిన బంధాలు ఎన్నో. అందుకే మనుషులు జాగ్రత్తగా ఉండాలని మహానుభావులు ఎప్పుడో హెచ్చరించారు.
కోట బయట యుద్ధం, తోట లోపల యుద్ధం అంటూ శ్రీరామకృష్ణ పరమ హంస- బంధాలతో కలిసి ఉండటం, లేకుండా ఏ కొండలలోనో కోనలలోనో జీవించడం గురించి చెప్పారు. నాకు ఏ బంధాలూ లేవు... కొండమీద ప్రశాంతంగా, హాయిగా బతుకుతున్నాను' అని ధ్యానంలో అనుకున్న మనిషికైనా ఆకలి, నిద్ర తప్పవు. అతడి ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొద్దీ, అతడి చుట్టూ చేరే జనం పెరుగుతారు. లేనిపోని బంధాల్లోకి ఆయన్ను ఈడుస్తారు.
మనకు శరీరం ఉంది. పంచభూతాలతో దానికి బంధం ఉంది. మనసు, బుద్ధి, అహంకారంతో దానికి బంధం ఉంది. ఈ విశాల విశ్వంతో బంధం లేని జీవి ఎవరూ లేరు. అయినా- అన్ని బంధాలూ అశాశ్వతమైనవి. ఏదో ఒకరోజు తెగి పోతాయి. అన్నింటి కంటే గొప్పది, శాశ్వతమైనది- ఆత్మబంధం. ఒకరు, మరొకరి కోసం జీవిస్తే ఆ బంధం చరితార్థమవుతుంది. రక్తసంబంధాలను మించినవి. దైవసంబంధాలు. ఇది అందరూ తెలుసుకోవాలి!
సగం దూరం వరకు వెళ్ళి, మనసు మార్చుకొని వెనక్కి వచ్చినవాళ్ళు ఉన్నారు. ఆశ్రమ జీవితం గడుపుతూ కూడా తమ ఊరివాళ్లెవరైనా కనిపిస్తే వాళ్లెలా ఉన్నారు. వీళ్లలా ఉన్నారని వాకబు చేసేవారూ ఎందరో! బంధాలు అందమైనవి. మాత్రమే కాదు... గొప్పవి, కఠినమైనవి కూడా. బంధమే మనల్ని ఈ భూమ్మీదకు తీసుకువచ్చింది. వచ్చిన తరవాత మరిన్ని బంధాలు కల్పించింది.
ఆవు తనకు కట్టిన పలుపుతాడు తెంచుకొని వెళ్ళిపోవాలనుకుని అటు, ఇటు చుట్టూ తిరుగుతుంది. చివరకు తన పరిధి తాను తెలుసుకుని చతికిలపడుతుంది. మన నిస్సహాయతను మనం తెలుసుకోవాలి. అదే సమయంలో మనల్ని ఇలా ఉంచినవాడి గొప్ప దనాన్నీ గ్రహించాలి. ఎవరిమీదో కోపం వస్తుంది. ఎందుకో కోపం వస్తుంది. పారిపోవాలని అనిపి స్తుంది. తాళ్లతో కట్టి బంధించ రెవరూ అయినా వెళ్ళలేం. ఎందుకు, ఎవరు మనల్ని ఆపుతు న్నారో తెలియదు.
చూసిన ముఖాలే చూస్తూ, ఆడిన మాటలే ఆడుతూ, అదే తిండి తింటూ, నిద్రపోతూ తెల్లవారి లేచి మరో కొత్త సూర్యుడి కోసం ఎదు రుచూస్తాం. ఇదే బంధంమౌలికంగా మనిషి బతకడంలోనే బంధం ఉంది. బంధాలు అందంగా ఉంటాయి. అవి ఇనుప గొలుసులైతేనేం, బంగారు గొలుసులైతేనేం- బంధాలు బయటకు కనిపించవు. తల్లి వెంట బిడ్డ, బిడ్డ వెంట తల్లి... ఆ బిడ్డ ఎదిగి తల్లి.... అలా అందరూ కలిసి కుటుంబం. ఈ కుటుంబాలన్నీ ఈశ్వరుడివే. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనసు వైరాగ్యానికి గురి అయినప్పుడు తట్టా బుట్టా సర్దుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ, అంతలోనే ఆగిపోవాలి అనిపిస్తుంది. కనపడకుండా ఆపేదెవరని ఆలోచిస్తే- మనవాళ్లే కాదు... మన మధ్యలో ఉండే బంధమే అనిపిస్తుంది.
బంధాలు, వాటి స్వరూప స్వభావాల గురించి జ్ఞానులకు బాగా తెలుసు. ఆ బంధాల మాయలో పడకుండా, నమ్మిన సత్యాన్ని విడవకుండా దర్మమార్గంలో నిమిత్తమాత్రుల్లా వారు కాలం గడిపారు. మోహపూరితమైనవి. మోసపూరితమై నవి దేవతలను కూడా ఆధోగతిపాలు చేసిన బంధాలు ఎన్నో. అందుకే మనుషులు జాగ్రత్తగా ఉండాలని మహానుభావులు ఎప్పుడో హెచ్చరించారు.
కోట బయట యుద్ధం, తోట లోపల యుద్ధం అంటూ శ్రీరామకృష్ణ పరమ హంస- బంధాలతో కలిసి ఉండటం, లేకుండా ఏ కొండలలోనో కోనలలోనో జీవించడం గురించి చెప్పారు. నాకు ఏ బంధాలూ లేవు... కొండమీద ప్రశాంతంగా, హాయిగా బతుకుతున్నాను' అని ధ్యానంలో అనుకున్న మనిషికైనా ఆకలి, నిద్ర తప్పవు. అతడి ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొద్దీ, అతడి చుట్టూ చేరే జనం పెరుగుతారు. లేనిపోని బంధాల్లోకి ఆయన్ను ఈడుస్తారు.
మనకు శరీరం ఉంది. పంచభూతాలతో దానికి బంధం ఉంది. మనసు, బుద్ధి, అహంకారంతో దానికి బంధం ఉంది. ఈ విశాల విశ్వంతో బంధం లేని జీవి ఎవరూ లేరు. అయినా- అన్ని బంధాలూ అశాశ్వతమైనవి. ఏదో ఒకరోజు తెగి పోతాయి. అన్నింటి కంటే గొప్పది, శాశ్వతమైనది- ఆత్మబంధం. ఒకరు, మరొకరి కోసం జీవిస్తే ఆ బంధం చరితార్థమవుతుంది. రక్తసంబంధాలను మించినవి. దైవసంబంధాలు. ఇది అందరూ తెలుసుకోవాలి!
ఉన్నత వ్యక్తిత్వం
వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు.
వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు. అందుకే దేవతలను దైవ దూతలని, మానవులను మానవతా మూర్తులని, రాక్షసులను దుర్మార్గులని విభజించి చూపేవారు. నేటి కాలంలో ఒకే మనిషిలో పరిస్థితులను అనుసరించి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం తాండవిస్తున్నాయి. ఉదయం దేవుడిగా కనిపించే వ్యక్తే మధ్యాహ్నం మనిషిగా, రాత్రికి రాక్షసుడిగా ప్రవర్తించవచ్చు. ఆయా స్థితిగతులను బట్టి వ్యక్తిత్వ స్వభావాలు మారుతుంటాయి. పూర్వ యుగాల్లో దేవుడు భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసేవాడు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు, సంస్కరణ. అదే ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మనిషి దేవుడిగా మారకపోయినా నష్టం లేదు కానీ రాక్షసుడిగా మారకూడదు. జీవించినంత కాలం మానవత్వంతో మనిషిగా బతికితే చాలు. క్షణక్షణం మారే స్వభావం మనిషికి సహజంగానే ఉంటుంది. సృష్టిలోని ఇతర ప్రాణులు పుట్టినప్పటి నుంచి మరణించేవరకు తమ సహజ స్వభావాన్ని మార్చుకోవు. శాకాహార జంతువు మాంసాహారిగా మారదు. ఆకలితో చావునైనా కోరుతుంది కానీ అలవాటు మార్చుకోదు. మనుషులు బుద్ధిజీవులు. తమ సంకల్ప వికల్పాలతో అభీష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు.
మనిషికి మంచి ఆదర్శాన్ని అందించే నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. శ్రీరాముడిగా వ్యక్తిగత, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చాడు. కొడుకు, సోదరుడు, మిత్రుడు, ప్రభువు చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. ఇవి అవతారమూర్తులు నేర్పిన ఉత్తమ వ్యక్తిత్వ పాఠాలు.
మనిషి మనీషిగా, దేవుడిగా ఎలా మారవచ్చో అనేక పురాణాలు చెబుతున్నాయి. అన్ని పురాణాల్లో అత్యుత్తమమైందిగా నారదుడు కీర్తించిన భాగవతంలోని అన్ని కథలు, పద్యాలు- నైతిక, ధార్మిక, మానవతా విలువల గురించే బోధించాయి.
చేతులతో శివుడి పూజ(సమాజ సేవే శివ పూజ), నోరారా హరినామ సంకీర్తన, దయ, సత్యం మనసారా తలచుకోలేనివారు తల్లులకు కడుపు చేటు అని భాగవత పద్యం చెబుతుంది. భాగవతుల కథలన్నీ మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే ప్రక్రియలే.
మహాపురుషులు ప్రబోధించిన వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాలు వారు నమ్మి ఆచరించిన ఉన్నత విలువలు. దయ, సత్యంతో కూడిన బుద్ధుడి బోధనలు, నిలువెత్తు ప్రేమ స్వరూపం జీసస్, సహనానికి ప్రతీక మహమ్మద్ ప్రవక్త, అహింసే పరమ ధర్మంగా ఆచరించిన గాంధీ మహాత్ముడు... అందరూ అనుసరణీయులే.
కాలువ ప్రవాహంలో కొట్టుకొనిపోతూ ప్రాణ భయంతో ఉన్న తేలును అది కాటు వేస్తున్నా చేతితో తీసి రక్షించే సాధువు కథ ఆదర్శవంతం. తేలు సహజ గుణం కాటు వేయడం, మనిషి సహజ గుణం కాపాడటం. ఉపకారికి ప్రత్యుపకారం గొప్ప కాదు. తనకు అపకారం చేసినా తాను వారికి మేలు చేయడం దైవత్వ లక్షణం. మనిషిని దేవుడిగా పూజించే స్థాయికి చేరకున్నా కనీసం తాను మనిషిగా జీవిస్తే చాలు. అదే ఉన్నతమైన వ్యక్తిత్వ పరిపూర్ణ జీవితం. సమాజానికి వెలుగు నింపే ఉజ్జ్వల కాంతి కిరణం.
వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు.
వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు. అందుకే దేవతలను దైవ దూతలని, మానవులను మానవతా మూర్తులని, రాక్షసులను దుర్మార్గులని విభజించి చూపేవారు. నేటి కాలంలో ఒకే మనిషిలో పరిస్థితులను అనుసరించి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం తాండవిస్తున్నాయి. ఉదయం దేవుడిగా కనిపించే వ్యక్తే మధ్యాహ్నం మనిషిగా, రాత్రికి రాక్షసుడిగా ప్రవర్తించవచ్చు. ఆయా స్థితిగతులను బట్టి వ్యక్తిత్వ స్వభావాలు మారుతుంటాయి. పూర్వ యుగాల్లో దేవుడు భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసేవాడు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు, సంస్కరణ. అదే ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మనిషి దేవుడిగా మారకపోయినా నష్టం లేదు కానీ రాక్షసుడిగా మారకూడదు. జీవించినంత కాలం మానవత్వంతో మనిషిగా బతికితే చాలు. క్షణక్షణం మారే స్వభావం మనిషికి సహజంగానే ఉంటుంది. సృష్టిలోని ఇతర ప్రాణులు పుట్టినప్పటి నుంచి మరణించేవరకు తమ సహజ స్వభావాన్ని మార్చుకోవు. శాకాహార జంతువు మాంసాహారిగా మారదు. ఆకలితో చావునైనా కోరుతుంది కానీ అలవాటు మార్చుకోదు. మనుషులు బుద్ధిజీవులు. తమ సంకల్ప వికల్పాలతో అభీష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు.
మనిషికి మంచి ఆదర్శాన్ని అందించే నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. శ్రీరాముడిగా వ్యక్తిగత, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చాడు. కొడుకు, సోదరుడు, మిత్రుడు, ప్రభువు చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. ఇవి అవతారమూర్తులు నేర్పిన ఉత్తమ వ్యక్తిత్వ పాఠాలు.
మనిషి మనీషిగా, దేవుడిగా ఎలా మారవచ్చో అనేక పురాణాలు చెబుతున్నాయి. అన్ని పురాణాల్లో అత్యుత్తమమైందిగా నారదుడు కీర్తించిన భాగవతంలోని అన్ని కథలు, పద్యాలు- నైతిక, ధార్మిక, మానవతా విలువల గురించే బోధించాయి.
చేతులతో శివుడి పూజ(సమాజ సేవే శివ పూజ), నోరారా హరినామ సంకీర్తన, దయ, సత్యం మనసారా తలచుకోలేనివారు తల్లులకు కడుపు చేటు అని భాగవత పద్యం చెబుతుంది. భాగవతుల కథలన్నీ మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే ప్రక్రియలే.
మహాపురుషులు ప్రబోధించిన వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాలు వారు నమ్మి ఆచరించిన ఉన్నత విలువలు. దయ, సత్యంతో కూడిన బుద్ధుడి బోధనలు, నిలువెత్తు ప్రేమ స్వరూపం జీసస్, సహనానికి ప్రతీక మహమ్మద్ ప్రవక్త, అహింసే పరమ ధర్మంగా ఆచరించిన గాంధీ మహాత్ముడు... అందరూ అనుసరణీయులే.
కాలువ ప్రవాహంలో కొట్టుకొనిపోతూ ప్రాణ భయంతో ఉన్న తేలును అది కాటు వేస్తున్నా చేతితో తీసి రక్షించే సాధువు కథ ఆదర్శవంతం. తేలు సహజ గుణం కాటు వేయడం, మనిషి సహజ గుణం కాపాడటం. ఉపకారికి ప్రత్యుపకారం గొప్ప కాదు. తనకు అపకారం చేసినా తాను వారికి మేలు చేయడం దైవత్వ లక్షణం. మనిషిని దేవుడిగా పూజించే స్థాయికి చేరకున్నా కనీసం తాను మనిషిగా జీవిస్తే చాలు. అదే ఉన్నతమైన వ్యక్తిత్వ పరిపూర్ణ జీవితం. సమాజానికి వెలుగు నింపే ఉజ్జ్వల కాంతి కిరణం.
మనసు అమృతకలశం
మనిషి ఉన్నచోటనే ఉంటూ మనసుకు రెక్కలు తొడిగి సీతాకోక చిలుకలా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ వాలవచ్చు. మొలవబోతున్న రెక్కలను ముడిచి గొంగళిపురుగులా గూటిలో బందీ అయి తనదైన లోకంలో సుషుప్తావస్థలో ఉండవచ్చు
ములుకుల్లాంటి మాటలకు మనిషి మనసు కుంచించుకుపోతుంది. పొగడ్తలకు, ప్రశంసలకు సహస్రదళ వికసిత పుష్పమవుతుంది. కంటికి కనిపించని మనసు చేసే గారడి ఇంతా అంతా కాదు. జీవితకాల అనుభవాల సారాన్ని మెదడులో నిక్షిప్తం చేసి అవసరానికి అందించేది మనసు. నేల కేవలం సారవంతమైనదైతే సరిపోదు... అక్కడ మంచి విత్తనాలు చల్లాలి. మొలకెత్తాక ఎరువులేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలవుతాయి. ఎప్పటికప్పుడు కలుపుమొక్కల్ని తొలగిస్తే, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి కల్పవృక్షాలై సకల జీవుల అవసరాలు తీరుస్తాయి. అలాగే, మనం మనసును ప్రశాంత చిత్తంతో ప్రక్షాళించుకోవాలి. సవ్యమైన ఆలోచనల తేటబావిలా రూపొందించుకోవాలి. నిత్యం మంచిని చూడాలి, మాట్లాడాలి, వినాలి. మనసుకు మంచిని నూరి పోయాలి. పెద్దలం దించిన సూక్తులు, మహి తోక్తులను మనసుకు పట్టించాలి. కళ్లతో చదివిన, చెవులతో గ్రహించిన పురాణ ఇతిహాసాలతో మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసంటే నిర్మల ఆకాశంలా, నిశ్చల తటాకంలా, స్వచ్ఛమైన ముత్యంలా ఉండాలి. మనిషి ఉత్తముడిగా, ఉన్నతుడిగా సమాజంలో మనగలగడానికి లోపల దీపంలా వెలుగు వెదజల్లుతున్న మనసు కారణం. రాముడి ధర్మపరాయణత్వం, రావణుడి అధర్మవర్తనం, పాండవుల సౌశీల్యం, కౌరవుల కుటిలత్వం, హిరణ్యకశిపుడి రాక్షసత్వం, ప్రహ్లాదుడి నారాయణ భక్తి తత్వం వారి వారి మనసుల్లోని ఆలోచనలకు ప్రతిరూపం.
దానగుణానికి, సత్యసంధతకు, రుజువర్తనకు మూలకారణం మనసు. నీరు పల్లానికి ప్రవహించినట్లు, గాలి పీడనానికి లోనైనట్లు, నిప్పు గాలివాలును అనుసరించినట్లు, మనసు నిరంతరం పరి పరి విధాల పోతూనే ఉంటుంది. మనసును నియంత్రించడం అనుకున్నంత సులువు కాదు. పట్టులో ఉన్నట్టే ఉండి గుప్పిట్లో ఉన్న ఇసుకలా జారిపోతుంది. కనిపించే దృశ్యాలకు, వినిపించే మాటలకు, అనుభూతి చెందే స్పర్శకు మనసు త్వరితగతిన స్పందించకూడదు. విషయంపై సరైన అవగాహన కలిగి, ఆలోచనలు కొలిక్కి వచ్చాక అనుకున్నది అమలుపరచాలి.
ఆటలో ఓడిపోయినప్పుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు, అవమానం పాలైనప్పుడు, జీవితం విలువ కోల్పోయిందనిపిస్తుంది. మన జీవితంలో అదో దురదృష్టకర సన్నివేశం... అంతే. మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కుదుటపడిన మనసు మంచి ఆలోచనలకు నెలవవుతుంది. మనిషి సక్రమ మార్గంలో సంచరించేందుకు సహకరిస్తుంది. సముద్రంలో పడిన కెరటం తరవాత ఆకాశాన్నంటే కెరటం వచ్చి తీరుతుందన్నది ప్రకృతి పాఠం. ఇది మనసులో పెట్టుకుంటే అనాలోచిత నిర్ణయాలకు అవకాశం ఇవ్వరు. మనసు మర్మాన్ని తెలియజేసే మార్గాలను జ్ఞానులు చూపారు. స్వయంకృషితో మనసు గుట్టు తెలుసుకోలేకపోయినా, కనీసం పెద్దలు చూపిన మార్గంలో నడుస్తూ మనసును అమృతకలశం చేసుకోగలిగితే, మానవజన్మ అర్థవంతమవుతుంది.
మనిషి ఉన్నచోటనే ఉంటూ మనసుకు రెక్కలు తొడిగి సీతాకోక చిలుకలా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ వాలవచ్చు. మొలవబోతున్న రెక్కలను ముడిచి గొంగళిపురుగులా గూటిలో బందీ అయి తనదైన లోకంలో సుషుప్తావస్థలో ఉండవచ్చు
ములుకుల్లాంటి మాటలకు మనిషి మనసు కుంచించుకుపోతుంది. పొగడ్తలకు, ప్రశంసలకు సహస్రదళ వికసిత పుష్పమవుతుంది. కంటికి కనిపించని మనసు చేసే గారడి ఇంతా అంతా కాదు. జీవితకాల అనుభవాల సారాన్ని మెదడులో నిక్షిప్తం చేసి అవసరానికి అందించేది మనసు. నేల కేవలం సారవంతమైనదైతే సరిపోదు... అక్కడ మంచి విత్తనాలు చల్లాలి. మొలకెత్తాక ఎరువులేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలవుతాయి. ఎప్పటికప్పుడు కలుపుమొక్కల్ని తొలగిస్తే, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి కల్పవృక్షాలై సకల జీవుల అవసరాలు తీరుస్తాయి. అలాగే, మనం మనసును ప్రశాంత చిత్తంతో ప్రక్షాళించుకోవాలి. సవ్యమైన ఆలోచనల తేటబావిలా రూపొందించుకోవాలి. నిత్యం మంచిని చూడాలి, మాట్లాడాలి, వినాలి. మనసుకు మంచిని నూరి పోయాలి. పెద్దలం దించిన సూక్తులు, మహి తోక్తులను మనసుకు పట్టించాలి. కళ్లతో చదివిన, చెవులతో గ్రహించిన పురాణ ఇతిహాసాలతో మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసంటే నిర్మల ఆకాశంలా, నిశ్చల తటాకంలా, స్వచ్ఛమైన ముత్యంలా ఉండాలి. మనిషి ఉత్తముడిగా, ఉన్నతుడిగా సమాజంలో మనగలగడానికి లోపల దీపంలా వెలుగు వెదజల్లుతున్న మనసు కారణం. రాముడి ధర్మపరాయణత్వం, రావణుడి అధర్మవర్తనం, పాండవుల సౌశీల్యం, కౌరవుల కుటిలత్వం, హిరణ్యకశిపుడి రాక్షసత్వం, ప్రహ్లాదుడి నారాయణ భక్తి తత్వం వారి వారి మనసుల్లోని ఆలోచనలకు ప్రతిరూపం.
దానగుణానికి, సత్యసంధతకు, రుజువర్తనకు మూలకారణం మనసు. నీరు పల్లానికి ప్రవహించినట్లు, గాలి పీడనానికి లోనైనట్లు, నిప్పు గాలివాలును అనుసరించినట్లు, మనసు నిరంతరం పరి పరి విధాల పోతూనే ఉంటుంది. మనసును నియంత్రించడం అనుకున్నంత సులువు కాదు. పట్టులో ఉన్నట్టే ఉండి గుప్పిట్లో ఉన్న ఇసుకలా జారిపోతుంది. కనిపించే దృశ్యాలకు, వినిపించే మాటలకు, అనుభూతి చెందే స్పర్శకు మనసు త్వరితగతిన స్పందించకూడదు. విషయంపై సరైన అవగాహన కలిగి, ఆలోచనలు కొలిక్కి వచ్చాక అనుకున్నది అమలుపరచాలి.
ఆటలో ఓడిపోయినప్పుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు, అవమానం పాలైనప్పుడు, జీవితం విలువ కోల్పోయిందనిపిస్తుంది. మన జీవితంలో అదో దురదృష్టకర సన్నివేశం... అంతే. మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కుదుటపడిన మనసు మంచి ఆలోచనలకు నెలవవుతుంది. మనిషి సక్రమ మార్గంలో సంచరించేందుకు సహకరిస్తుంది. సముద్రంలో పడిన కెరటం తరవాత ఆకాశాన్నంటే కెరటం వచ్చి తీరుతుందన్నది ప్రకృతి పాఠం. ఇది మనసులో పెట్టుకుంటే అనాలోచిత నిర్ణయాలకు అవకాశం ఇవ్వరు. మనసు మర్మాన్ని తెలియజేసే మార్గాలను జ్ఞానులు చూపారు. స్వయంకృషితో మనసు గుట్టు తెలుసుకోలేకపోయినా, కనీసం పెద్దలు చూపిన మార్గంలో నడుస్తూ మనసును అమృతకలశం చేసుకోగలిగితే, మానవజన్మ అర్థవంతమవుతుంది.
ఓటమి-గెలుపు
జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ...
జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ తన చేతిలో ఉంచుకున్నాడు.
పని రెండురకాలు... ఒకటి కోరికతో మనకోసం చేసేపని. రెండోది అందరికీ మంచి కలిగించే విధంగా చేపట్టే పని. ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తాడు భగవంతుడు. చేయవలసిన రీతిలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి.
తాను కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, ఎలాంటి కోరిక కోరకపోయినా, భగవంతుడు ఈ జగత్ చక్రాన్ని క్షణం తీరిక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనను చూసి మనమూ పని చేయాలి. ఎంతో కొంత సేవ చేయాలి సమాజానికి. తోటి మనిషిని తప్పకుండా ఆదుకోవాలి.
బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు. గరీబు నవాబుగా మారతాడు. ఇవన్నీ కళ్లారాచూస్తూ, ఏ పని ముట్టుకుంటే ఏం కొంపలంటుకుంటాయోనన్న భయంతో- మనం చేయకపోతేనేం... ఎవరో ఒకరు చేసేస్తారు అన్న ధీమాతో ఒళ్లు దాచుకోవడం మహాపచారం. అది జీవ ధర్మానికి విరుద్ధం. మూలపడ్డ యంత్రం తుప్పుపట్టి తునాతునకలైనట్టు- మన శరీరాలు, ఇంద్రియాలు సోమరిపాటుకు గురికాక తప్పదు. పనికి దూరంగా ఉండటం సోమరి తనమే కాదు, ఆత్మవంచన కూడా. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఫలితం అనుకున్నట్టే రావాలి అనుకోవడం దురాశ. దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది. ఓడిపోయానన్న ఆవేదన అగ్నిగోళంగా మారి కోపావేశానికి కారణం అవుతుంది. కోపిష్టికి ఒళ్లు తెలియదు. మెదడు మొద్దుబారుతుంది. బుద్ధిజ్ఞానాలు నశించడం వల్ల తానూ నశిస్తాడు. పురాణాల్లోని దూర్వాసుడు కోపం వల్ల, విశ్వామిత్రుడు కామం వల్ల, భృగుడు అహంకారం వల్ల, విభాండకుడు మమకారం వల్ల భంగపడ్డారు. జ్ఞానికి భంగపాటు తప్పనప్పుడు అసలు కర్మ చేయడం దేనికని అడగవచ్చు. సాక్షాత్తు ఆ భగవంతుడే కర్మలు చేపట్టుతూ, ఈ జగత్ చక్రం తిప్పుతుండగా- మనం చేతులు ముడుచుకుని, కాళ్లు చాపుకొని కూర్చోవడం తగునా? కేవలం మన స్వార్థం కోసం పాటుపడకుండా నలుగురికీ పనికి వచ్చే మంచిపనులు చేపట్టాలి. అలా విశాల హృదయంతో పనులు చేస్తుంటే- ఫలితం పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గెలుపు ఓటముల నడుమనున్న అడ్డుగీత అంతర్థానమైపోతుంది.
అనుకున్నది అయితే మంచిది, అనుకోనిది జరిగినా అదీ మనమంచికేనని తెలుసుకోవడమే వైరాగ్యం. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ,
బొరుసు లాంటివి. సముద్రానికి ఆటూపోటూ, చంద్రుడికి ఎదుగుదల, తరుగుదల తప్పవు. కష్టసుఖాలు వెలుగునీడల్లా వెంటాడుతూనే ఉంటాయి. గెలుపుతో పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా సమతౌల్యం సాధించడమే జీవిత పరమార్థం.
జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ...
జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ తన చేతిలో ఉంచుకున్నాడు.
పని రెండురకాలు... ఒకటి కోరికతో మనకోసం చేసేపని. రెండోది అందరికీ మంచి కలిగించే విధంగా చేపట్టే పని. ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తాడు భగవంతుడు. చేయవలసిన రీతిలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి.
తాను కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, ఎలాంటి కోరిక కోరకపోయినా, భగవంతుడు ఈ జగత్ చక్రాన్ని క్షణం తీరిక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనను చూసి మనమూ పని చేయాలి. ఎంతో కొంత సేవ చేయాలి సమాజానికి. తోటి మనిషిని తప్పకుండా ఆదుకోవాలి.
బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు. గరీబు నవాబుగా మారతాడు. ఇవన్నీ కళ్లారాచూస్తూ, ఏ పని ముట్టుకుంటే ఏం కొంపలంటుకుంటాయోనన్న భయంతో- మనం చేయకపోతేనేం... ఎవరో ఒకరు చేసేస్తారు అన్న ధీమాతో ఒళ్లు దాచుకోవడం మహాపచారం. అది జీవ ధర్మానికి విరుద్ధం. మూలపడ్డ యంత్రం తుప్పుపట్టి తునాతునకలైనట్టు- మన శరీరాలు, ఇంద్రియాలు సోమరిపాటుకు గురికాక తప్పదు. పనికి దూరంగా ఉండటం సోమరి తనమే కాదు, ఆత్మవంచన కూడా. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఫలితం అనుకున్నట్టే రావాలి అనుకోవడం దురాశ. దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది. ఓడిపోయానన్న ఆవేదన అగ్నిగోళంగా మారి కోపావేశానికి కారణం అవుతుంది. కోపిష్టికి ఒళ్లు తెలియదు. మెదడు మొద్దుబారుతుంది. బుద్ధిజ్ఞానాలు నశించడం వల్ల తానూ నశిస్తాడు. పురాణాల్లోని దూర్వాసుడు కోపం వల్ల, విశ్వామిత్రుడు కామం వల్ల, భృగుడు అహంకారం వల్ల, విభాండకుడు మమకారం వల్ల భంగపడ్డారు. జ్ఞానికి భంగపాటు తప్పనప్పుడు అసలు కర్మ చేయడం దేనికని అడగవచ్చు. సాక్షాత్తు ఆ భగవంతుడే కర్మలు చేపట్టుతూ, ఈ జగత్ చక్రం తిప్పుతుండగా- మనం చేతులు ముడుచుకుని, కాళ్లు చాపుకొని కూర్చోవడం తగునా? కేవలం మన స్వార్థం కోసం పాటుపడకుండా నలుగురికీ పనికి వచ్చే మంచిపనులు చేపట్టాలి. అలా విశాల హృదయంతో పనులు చేస్తుంటే- ఫలితం పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గెలుపు ఓటముల నడుమనున్న అడ్డుగీత అంతర్థానమైపోతుంది.
అనుకున్నది అయితే మంచిది, అనుకోనిది జరిగినా అదీ మనమంచికేనని తెలుసుకోవడమే వైరాగ్యం. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ,
బొరుసు లాంటివి. సముద్రానికి ఆటూపోటూ, చంద్రుడికి ఎదుగుదల, తరుగుదల తప్పవు. కష్టసుఖాలు వెలుగునీడల్లా వెంటాడుతూనే ఉంటాయి. గెలుపుతో పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా సమతౌల్యం సాధించడమే జీవిత పరమార్థం.
సంస్కార సౌరభం
‘సూర్యచంద్రులవలె మానవులు సమున్నత మార్గంలో నడవాలి. గతి, నియతి తప్పకుండా సూర్యచంద్రులు సంచరిస్తున్నట్లే మనిషి సన్మార్గంలో ముందుకు కొనసాగాలి. సర్వప్రాణుల్లో అత్యంత శ్రేష్ఠమైన జీవి- మనిషి.
సత్సాంగత్యంతో, సద్బుద్ధితో, సాధుగణాలతో నీతిమంతంగా మనిషి జీవించాలి. ఈ సంస్కారాలన్నీ మానవ జీవితాన్ని మహోజ్జ్వలంగా తీర్చిదిద్దుతాయి’- అని అధర్వవేదం అభిలషించింది. తల్లిదండ్రులను, ఆచార్యుడిని త్రివిధ దేవతలుగా శాస్త్రాలు అభివర్ణించాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, సౌశీల్య సాధనకు సంస్కారం అత్యంత ఆవశ్యకం. ఒక జాతి సౌభాగ్యం, పురోగతి ఆ జాతి వారసుల సంస్కారాన్ని బట్టి ఉంటాయని స్వామి వివేకానంద పేర్కొన్నారు. సంపూర్ణ మానవులు అంటే సంస్కార ప్రపూర్ణులు. సమాజ పురోగతి, అభ్యున్నతి- రాశి పరంగా కాదు, వాసి పరంగా గణించాలి. వ్యక్తి సాంఘికంగా ఎదగడమంటే నైతికంగా ఉత్తమ స్థితికి చేరుకోవడం.
ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ నివారణ చెందుతాయన్నాడు శ్రీరాముడితో వసిష్ఠుడు యోగ వాసిష్ఠంలో! అరిషడ్వర్గాలు అనే అడ్డంకుల్ని అధిగమించిన తరవాత ఆధ్యాత్మిక వికాసం అలవడుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తుల్లో సంస్కార సౌరభాల్ని వెదజల్లు తుంది. ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రజల జీవన వ్యవహార ధర్మాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే జీవితంలో సత్ప్రవర్తన, సదాచారాల్ని మూలభూమికగా స్వీకరించాలి. సముచితమైన మానవ సంబంధాల వల్ల ఇతరులతో సానుకూల బాంధవ్యాలు ఏర్పడతాయి. అందరితో సౌజన్యయుతమైన, సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవడం అద్భుతమైన జీవన కళ! ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యం కేవలం జీవించడం మాత్రమే కాదు. ఆదర్శవంతంగా జీవించినవారే చరితార్థులవుతారు. ఇది ఎందరో మహనీయుల విషయంలో నిరూపితమైన సత్యం!
అంతరంగ శుద్ధి, అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ- ఈ మూడు అంశాలూ వ్యక్తుల సంస్కార స్థాయుల్ని నిర్ణయిస్తాయి. విశాల హృదయులను, అందర్నీ తమతో కలుపుకొనిపోయే వ్యక్తులకు మిత్రులు అధికంగా ఉంటారు. ఆ మిత్ర బృందానికి వారే ఆదర్శనీయులవుతారు. అలాగే, నిష్కల్మషమైన ప్రేమభావజాలం వ్యక్తుల్ని అభిమానించేలా చేస్తుంది. విచక్షణ, ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి. స్థితప్రజ్ఞ, సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి. లౌకిక జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సాధకుడికి, సంస్కారవంతుడికి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి గీటురాళ్లవంటివి. సాధకుల నిగ్రహాన్ని, ఓర్పును ఇవి నిగ్గుతేలుస్తాయి.
జీవితం అశాశ్వతం, యౌవనం, ధనం అస్థిరాలు. కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి, నశించనివి- వ్యక్తులు తమ సంస్కార వైభవంలో చేసిన ధర్మం, ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి! సంస్కార సుశోభితులైన వారే అసలైన కీర్తిశేషులు! సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు.
‘సూర్యచంద్రులవలె మానవులు సమున్నత మార్గంలో నడవాలి. గతి, నియతి తప్పకుండా సూర్యచంద్రులు సంచరిస్తున్నట్లే మనిషి సన్మార్గంలో ముందుకు కొనసాగాలి. సర్వప్రాణుల్లో అత్యంత శ్రేష్ఠమైన జీవి- మనిషి.
సత్సాంగత్యంతో, సద్బుద్ధితో, సాధుగణాలతో నీతిమంతంగా మనిషి జీవించాలి. ఈ సంస్కారాలన్నీ మానవ జీవితాన్ని మహోజ్జ్వలంగా తీర్చిదిద్దుతాయి’- అని అధర్వవేదం అభిలషించింది. తల్లిదండ్రులను, ఆచార్యుడిని త్రివిధ దేవతలుగా శాస్త్రాలు అభివర్ణించాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, సౌశీల్య సాధనకు సంస్కారం అత్యంత ఆవశ్యకం. ఒక జాతి సౌభాగ్యం, పురోగతి ఆ జాతి వారసుల సంస్కారాన్ని బట్టి ఉంటాయని స్వామి వివేకానంద పేర్కొన్నారు. సంపూర్ణ మానవులు అంటే సంస్కార ప్రపూర్ణులు. సమాజ పురోగతి, అభ్యున్నతి- రాశి పరంగా కాదు, వాసి పరంగా గణించాలి. వ్యక్తి సాంఘికంగా ఎదగడమంటే నైతికంగా ఉత్తమ స్థితికి చేరుకోవడం.
ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ నివారణ చెందుతాయన్నాడు శ్రీరాముడితో వసిష్ఠుడు యోగ వాసిష్ఠంలో! అరిషడ్వర్గాలు అనే అడ్డంకుల్ని అధిగమించిన తరవాత ఆధ్యాత్మిక వికాసం అలవడుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తుల్లో సంస్కార సౌరభాల్ని వెదజల్లు తుంది. ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రజల జీవన వ్యవహార ధర్మాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే జీవితంలో సత్ప్రవర్తన, సదాచారాల్ని మూలభూమికగా స్వీకరించాలి. సముచితమైన మానవ సంబంధాల వల్ల ఇతరులతో సానుకూల బాంధవ్యాలు ఏర్పడతాయి. అందరితో సౌజన్యయుతమైన, సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవడం అద్భుతమైన జీవన కళ! ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యం కేవలం జీవించడం మాత్రమే కాదు. ఆదర్శవంతంగా జీవించినవారే చరితార్థులవుతారు. ఇది ఎందరో మహనీయుల విషయంలో నిరూపితమైన సత్యం!
అంతరంగ శుద్ధి, అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ- ఈ మూడు అంశాలూ వ్యక్తుల సంస్కార స్థాయుల్ని నిర్ణయిస్తాయి. విశాల హృదయులను, అందర్నీ తమతో కలుపుకొనిపోయే వ్యక్తులకు మిత్రులు అధికంగా ఉంటారు. ఆ మిత్ర బృందానికి వారే ఆదర్శనీయులవుతారు. అలాగే, నిష్కల్మషమైన ప్రేమభావజాలం వ్యక్తుల్ని అభిమానించేలా చేస్తుంది. విచక్షణ, ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి. స్థితప్రజ్ఞ, సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి. లౌకిక జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సాధకుడికి, సంస్కారవంతుడికి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి గీటురాళ్లవంటివి. సాధకుల నిగ్రహాన్ని, ఓర్పును ఇవి నిగ్గుతేలుస్తాయి.
జీవితం అశాశ్వతం, యౌవనం, ధనం అస్థిరాలు. కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి, నశించనివి- వ్యక్తులు తమ సంస్కార వైభవంలో చేసిన ధర్మం, ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి! సంస్కార సుశోభితులైన వారే అసలైన కీర్తిశేషులు! సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు.
రుజువర్తన
మన స్వభావం మూడు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. అవి ఆలోచన, వాక్కు, కర్మ. ఆలోచనకు మూలం మనసు. అందుకే మనోవాక్కాయకర్మలంటారు. ఇవి త్రికరణాలు. కరణమంటే సాధనం, పనిముట్టు, కారణమనే అర్థాలున్నాయి. ఏ పని చెయ్యాలన్నా దానికి అనుగుణమైన ఆలోచన లేదా తలపు మనసులో కలగాలి. అప్పుడు దాని సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, మాటద్వారా వ్యక్తం చేస్తారు. ఆ పైన కర్మేంద్రియాలతో ఆచరిస్తాం. ఈ విధంగా మనసులో బయలుదేరిన ఆలోచనలన్నీ శరీరంలో పరిసమాప్తమవుతాయి. గౌతమబుద్ధుడు బోధించిన అష్టాంగమార్గంలో సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ అనే మూడూ ఉన్నాయి. అంటే మంచి ఆలోచన చెయ్యడం, మంచిగా మాట్లాడటం, మంచి పనులు చెయ్యడం అని అర్థం.
ఈ మూడూ మంచిగా ఉండటమే కాదు... వాటి మధ్య సమన్వయమూ కావాలి. మనసులో తాజా ఆలోచనకు, నోటితో మాట్లాడే మాటకు పొంతన ఉండదు కొందరికి. చెప్పే మాటలకూ చేసే పనులకూ సంబంధం ఉండదు మరికొందరి విషయంలో. చాలామందికి మూడూ మూడు దిక్కుల్లో పరుగెడుతుంటాయి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవాళ్లు చాలామంది కనిపిస్తారు.
మనసా, వాచా, కర్మణా ఒకటిగా ఉండటాన్ని ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే రుజుమార్గం, చక్కనైనది అని నిఘంటు అర్థాలు. రుజువంటే తిన్ననైనది. రుజు రేఖ అంటే సరళరేఖ. బాణం ఎలా సరళరేఖలా ఉంటుందో, మన ప్రవర్తన అలా నిటారుగా ఉండాలి. మనసు, వాక్కు, కర్మల్ని ఒకే తాటిపై నిలపగలగాలి. దీన్నే రుజువర్తనమంటారు. మనసు, వాక్కు, కర్మలు రుజువర్తనతో పనిచేసినప్పుడు అటువంటివారిని మహాత్ములంటాం.
చాలామందికి మాటలు కోటలు దాటతాయి కాని, కాలు గడపదాటదు. అంటే, ఆచరణ శూన్యమని అర్థం. ఇటువంటివారు వర్తమానంలో రాజకీయరంగంలో ఎక్కువగా తారసిల్లుతుంటారు. సాహిత్య రంగమూ దానికి భిన్నంగా ఉండటంలేదు. ఆదర్శాలను, సమానత్వాన్ని రచనల్లో ప్రబోధించేవాళ్లు చాలామంది తమ జీవితంలో దానికి భిన్నంగా నడవడం జగమెరిగినదే. సత్యవచనానికన్నా ఆర్జవం ఉన్నతమైనది. ఇందులో ఆలోచన, కర్మ కూడా ఉన్నాయి. శ్రీరాముడు ఆర్జవం వల్లనే పురుషోత్తముడయ్యాడు. ప్రతి మనిషికీ తన అంతరాత్మే సాక్షి. నా మనసులో ఏముందో ఎవరికి తెలుసు అని మనం అనుకోవచ్చు. మనం లోపల ఒకటి భావించి, బయట మరొకటి మాట్లాడితే మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తుంటుంది. అపరాధభావన మనల్ని కుంగదీస్తుంది. దానివల్ల మనసు సంఘర్షణకు లోనవుతుంది. ఒకటి చెప్పి, మరొకటి చేస్తే లోకం నిలదీస్తుంది. నలుగురిలో నగుబాటవుతాం.
మనోవాక్కాయకర్మల మధ్య సమన్వయం పాటించకపోతే కనబడని అంతరాత్మకు, కనిపించే లోకానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కర్మను, వాక్కును నడిపేది మనసైతే- ఆ మనసుకు పైన అంతరాత్మ ఉందని గుర్తు పెట్టుకోవాలి.
నువ్వు ఏ ఆలోచన నాటితే అది నీ మాట అవుతుంది. నువ్వు ఏ మాట మాట్లాడితే అది నీ చర్య అవుతుంది. నువ్వు ఏ చర్య చేస్తే, అది నీ నడవడి అవుతుంది అంటారు స్వామి దయానంద సరస్వతి. త్రికరణాల సరళరేఖను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలిగితే సమాజంలో ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. మనమూ మహాత్ములమవుతాం.
మన స్వభావం మూడు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. అవి ఆలోచన, వాక్కు, కర్మ. ఆలోచనకు మూలం మనసు. అందుకే మనోవాక్కాయకర్మలంటారు. ఇవి త్రికరణాలు. కరణమంటే సాధనం, పనిముట్టు, కారణమనే అర్థాలున్నాయి. ఏ పని చెయ్యాలన్నా దానికి అనుగుణమైన ఆలోచన లేదా తలపు మనసులో కలగాలి. అప్పుడు దాని సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, మాటద్వారా వ్యక్తం చేస్తారు. ఆ పైన కర్మేంద్రియాలతో ఆచరిస్తాం. ఈ విధంగా మనసులో బయలుదేరిన ఆలోచనలన్నీ శరీరంలో పరిసమాప్తమవుతాయి. గౌతమబుద్ధుడు బోధించిన అష్టాంగమార్గంలో సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ అనే మూడూ ఉన్నాయి. అంటే మంచి ఆలోచన చెయ్యడం, మంచిగా మాట్లాడటం, మంచి పనులు చెయ్యడం అని అర్థం.
ఈ మూడూ మంచిగా ఉండటమే కాదు... వాటి మధ్య సమన్వయమూ కావాలి. మనసులో తాజా ఆలోచనకు, నోటితో మాట్లాడే మాటకు పొంతన ఉండదు కొందరికి. చెప్పే మాటలకూ చేసే పనులకూ సంబంధం ఉండదు మరికొందరి విషయంలో. చాలామందికి మూడూ మూడు దిక్కుల్లో పరుగెడుతుంటాయి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవాళ్లు చాలామంది కనిపిస్తారు.
మనసా, వాచా, కర్మణా ఒకటిగా ఉండటాన్ని ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే రుజుమార్గం, చక్కనైనది అని నిఘంటు అర్థాలు. రుజువంటే తిన్ననైనది. రుజు రేఖ అంటే సరళరేఖ. బాణం ఎలా సరళరేఖలా ఉంటుందో, మన ప్రవర్తన అలా నిటారుగా ఉండాలి. మనసు, వాక్కు, కర్మల్ని ఒకే తాటిపై నిలపగలగాలి. దీన్నే రుజువర్తనమంటారు. మనసు, వాక్కు, కర్మలు రుజువర్తనతో పనిచేసినప్పుడు అటువంటివారిని మహాత్ములంటాం.
చాలామందికి మాటలు కోటలు దాటతాయి కాని, కాలు గడపదాటదు. అంటే, ఆచరణ శూన్యమని అర్థం. ఇటువంటివారు వర్తమానంలో రాజకీయరంగంలో ఎక్కువగా తారసిల్లుతుంటారు. సాహిత్య రంగమూ దానికి భిన్నంగా ఉండటంలేదు. ఆదర్శాలను, సమానత్వాన్ని రచనల్లో ప్రబోధించేవాళ్లు చాలామంది తమ జీవితంలో దానికి భిన్నంగా నడవడం జగమెరిగినదే. సత్యవచనానికన్నా ఆర్జవం ఉన్నతమైనది. ఇందులో ఆలోచన, కర్మ కూడా ఉన్నాయి. శ్రీరాముడు ఆర్జవం వల్లనే పురుషోత్తముడయ్యాడు. ప్రతి మనిషికీ తన అంతరాత్మే సాక్షి. నా మనసులో ఏముందో ఎవరికి తెలుసు అని మనం అనుకోవచ్చు. మనం లోపల ఒకటి భావించి, బయట మరొకటి మాట్లాడితే మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తుంటుంది. అపరాధభావన మనల్ని కుంగదీస్తుంది. దానివల్ల మనసు సంఘర్షణకు లోనవుతుంది. ఒకటి చెప్పి, మరొకటి చేస్తే లోకం నిలదీస్తుంది. నలుగురిలో నగుబాటవుతాం.
మనోవాక్కాయకర్మల మధ్య సమన్వయం పాటించకపోతే కనబడని అంతరాత్మకు, కనిపించే లోకానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కర్మను, వాక్కును నడిపేది మనసైతే- ఆ మనసుకు పైన అంతరాత్మ ఉందని గుర్తు పెట్టుకోవాలి.
నువ్వు ఏ ఆలోచన నాటితే అది నీ మాట అవుతుంది. నువ్వు ఏ మాట మాట్లాడితే అది నీ చర్య అవుతుంది. నువ్వు ఏ చర్య చేస్తే, అది నీ నడవడి అవుతుంది అంటారు స్వామి దయానంద సరస్వతి. త్రికరణాల సరళరేఖను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలిగితే సమాజంలో ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. మనమూ మహాత్ములమవుతాం.
ఎప్పుడు కోప్పడాలి?
కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. కంటికి దోషాలు మాత్రమే కనపడతాయి. మనసు యథార్థాన్ని చూడదు, చూసినా అంగీకరించదు. చేతలు అదుపులో ఉండవు. శక్తి వృథా అవుతుంది. మనసు అశాంతికి నెలవవుతుంది. మితిమీరిన కోపం ఆవహిస్తే మనిషి పశువవుతాడు.
కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, అణచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు. ఫలితంగా తనకోపమే తనకు శత్రువవుతుంది.
కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నయాన చెప్పినా గ్రహించనప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద, పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక, పద్ధతులు, మాటతీరు బాగాలేవని తెలియజెప్పేందుకు, భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం. అంతేగాని, కోపం తెచ్చుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతిన్నప్పుడు, తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగునపడి విధ్వంసానికి, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం. పెద్దలు గురువులు, సాధువుల పట్ల వినయ విధేయతలతో వారి అనుగ్రహం పొందేట్లు అప్రమత్తంగా నడచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైనవారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకుంటే ఘర్షణ ఉండదు.
చాలామంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా, బాగా ప్రేమించి అభిమానించేవారు తన భావాలను అర్థం చేసుకోక పోయినా, చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పనిచేయకపోయినా కోపమొస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు. అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకు, బయటి బంధాలకు చేటు.
తలనొప్పి రోగం కాదు, అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు. కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నతకు పర్యవసానం. సద్వివేచన, ఆత్మవిమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు.
వ్యక్తిత్వానికి, తనను నమ్ముకున్నవారికి, దేశానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే తప్పు.
కోపానికి ఎవరూ అతీతులు కారు. కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి. ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరిమీదా కోపాన్ని ప్రదర్శించకూడదు. అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు. విజ్ఞతతో ఆయుధంగా మలచుకోవాలి.
ఎప్పుడు కోప్పడాలి?
కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. కంటికి దోషాలు మాత్రమే కనపడతాయి. మనసు యథార్థాన్ని చూడదు, చూసినా అంగీకరించదు. చేతలు అదుపులో ఉండవు. శక్తి వృథా అవుతుంది. మనసు అశాంతికి నెలవవుతుంది. మితిమీరిన కోపం ఆవహిస్తే మనిషి పశువవుతాడు.
కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, అణచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు. ఫలితంగా తనకోపమే తనకు శత్రువవుతుంది.
కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నయాన చెప్పినా గ్రహించనప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద, పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక, పద్ధతులు, మాటతీరు బాగాలేవని తెలియజెప్పేందుకు, భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం. అంతేగాని, కోపం తెచ్చుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతిన్నప్పుడు, తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగునపడి విధ్వంసానికి, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం. పెద్దలు గురువులు, సాధువుల పట్ల వినయ విధేయతలతో వారి అనుగ్రహం పొందేట్లు అప్రమత్తంగా నడచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైనవారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకుంటే ఘర్షణ ఉండదు.
చాలామంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా, బాగా ప్రేమించి అభిమానించేవారు తన భావాలను అర్థం చేసుకోక పోయినా, చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పనిచేయకపోయినా కోపమొస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు. అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకు, బయటి బంధాలకు చేటు.
తలనొప్పి రోగం కాదు, అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు. కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నతకు పర్యవసానం. సద్వివేచన, ఆత్మవిమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు.
వ్యక్తిత్వానికి, తనను నమ్ముకున్నవారికి, దేశానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే తప్పు.
కోపానికి ఎవరూ అతీతులు కారు. కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి. ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరిమీదా కోపాన్ని ప్రదర్శించకూడదు. అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు. విజ్ఞతతో ఆయుధంగా మలచుకోవాలి.
లయాత్మక జీవనం
చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. కొండచరియలనుంచి అరుణకాంతులతో కూడిన ఉషోదయపు వెలుగుతో నెమ్మదిగా ఆవిర్భవిస్తాడు. ఆ తరవాత భానుడు లయాత్మకంగా కొండ అంచును దాటుతాడు. నేలపై సూర్యకిరణాలు విరాజమానమవుతూ కనువిందు చేస్తాయి. బింబ కదలికలు కనిపించవు గానీ మధ్యాహ్న సమయానికి ఆకాశం మధ్యలో ప్రకాశిస్తాడు భానుడు. ఆ తరవాత మెలమెల్లగా కిందికి వాలుతూ పడమర దిక్కున దిగంతంలో కలిసిపోతాడు. చందమామ గమనమూ అంతే. లయాత్మకమైనది. భూమిలో విత్తనాలు నాటుతాం. ఎండ, గాలి, చెమ్మ తగిలాక మూడో రోజుకు దళాలతో మొక్క ఊపిరి పోసుకుంటుంది. ఆకృతి దాల్చి మనోహరంగా కనిపిస్తుంది. అలా మొక్క లయాత్మకంగా ఎదుగుతూ పెద్దదవుతుంది. సుదూరం నుంచి అలలా సాగి గాలిలో వినిపించే ఓ పల్లెపదం వీనులవిందు చేస్తుంది. ఆ మనోహర గీతం వినబడే దిక్కుపై దృక్కులు సారిస్తాం. అలాగే నాట్యరవళి పరవశానికి గురిచేస్తుంది. సంగీత నాట్యకళలు లయ ప్రాధాన్యంగా సాగుతాయి. సాహిత్యంలోని ఛందస్సులో లయ ఉంటుంది.
ఓ ఆనకట్ట కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓ ఆకాశ హర్మ్యం నిర్మించాలన్నా అంతే. ఓ నిర్మాణాన్ని కూల్చడం గంటల్లో పని! విత్తనం, మొక్క, పువ్వు, పిందె, కాయ... ఇలా దశలు దాటు కుంటూ ఓ సమయానికి ఫలసాయం అందిస్తాయి వృక్షాలు. విధ్వంసక ఘటనలు ప్రకృతిలో మెరుపు వేగంతో జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, సుడిగాలులు, కార్చిచ్చులు... ఇలా మానవ వినాశానికి కారణమయ్యే ఉత్పాతాలు హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టిస్తాయి.
లయాత్మకంగా మానవుడు జీవించాలని, ఆ దిశగా జీవనశైలి అలవరచుకోవాలని ప్రకృతి ఆకాంక్ష కాబోలు అనిపిస్తుంది. అటువంటి లయలో క్రమశిక్షణ దాగుంటుంది. లయ తప్పినప్పుడు ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గుండె నిర్ణీత వేగంలో లయాత్మకంగా నడుస్తుంది. ఆ వేగం హెచ్చినా, తగ్గినా ముప్పే. అందుకే మనిషి లయాత్మక జీవనం సాగించాలని ప్రకృతి చెబుతుంది. గురువులు బోధిస్తారు. అది జీవనశైలిని ఏర్పరచుకోడానికి తోడ్పడుతుంది. యోగా, ధ్యానం వంటి అభ్యాసాలు సైతం లయాత్మకంగా చేయవలసి ఉంటుంది. వేగంగా సాగే నడక మంచిదంటారు. వేగంగా నడిచే నడకలోనూ ఓ లయ ఉంటుంది. అలా హృదయ కండరాలు బలపడతాయి. కొందరు హడావుడిపడుతూ వేగంగా పనులు చేయాలని చూస్తారు. కచ్చితత్వంతో వేగంగా పనిచేయగల సామర్థ్యం యంత్రాలకే పరిమితం. మానవుడు యంత్రంలా జీవించకూడదు. లయాత్మక జీవితం గడిపేవారు ఒత్తిడికి దూరంగా ఆరోగ్యంగా జీవిస్తారంటారు ఆరోగ్య నిపుణులు.
శిశువు జన్మించేముందు తొమ్మిది మాసాలు గర్భవాసం చేస్తుంది. ఒక పువ్వును భయపెట్టి, తొందరగా వికసింపజేయలేం. హృదయం ఆనంద మాధుర్యాన్ని ఆస్వాదించిన వేళ కళాకారుడిలో సృజన జాగృతమవుతుంది. భయభ్రాంతులకు గురైన వేళ అతడు కళాఖండాలను సృజించలేడు. ప్రాణుల సహజ ఆవిర్భావం, అంతర్ధానం సైతం లయను సంతరించుకునే జరుగుతాయి. లయతో అనుసంధానమై జీవయాత్ర చేసినప్పుడు మనుషులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారన్నది నిపుణుల మాట. మానవుల శారీరక, మానసిక వ్యవస్థలు లయాత్మక నడవడికి అనుగుణంగా నిర్మితమైనవే కాబట్టి అలా జీవిస్తే వారి జీవితాలు సార్థకమవుతాయి. ఆనందనందనాలవుతాయి.
చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. కొండచరియలనుంచి అరుణకాంతులతో కూడిన ఉషోదయపు వెలుగుతో నెమ్మదిగా ఆవిర్భవిస్తాడు. ఆ తరవాత భానుడు లయాత్మకంగా కొండ అంచును దాటుతాడు. నేలపై సూర్యకిరణాలు విరాజమానమవుతూ కనువిందు చేస్తాయి. బింబ కదలికలు కనిపించవు గానీ మధ్యాహ్న సమయానికి ఆకాశం మధ్యలో ప్రకాశిస్తాడు భానుడు. ఆ తరవాత మెలమెల్లగా కిందికి వాలుతూ పడమర దిక్కున దిగంతంలో కలిసిపోతాడు. చందమామ గమనమూ అంతే. లయాత్మకమైనది. భూమిలో విత్తనాలు నాటుతాం. ఎండ, గాలి, చెమ్మ తగిలాక మూడో రోజుకు దళాలతో మొక్క ఊపిరి పోసుకుంటుంది. ఆకృతి దాల్చి మనోహరంగా కనిపిస్తుంది. అలా మొక్క లయాత్మకంగా ఎదుగుతూ పెద్దదవుతుంది. సుదూరం నుంచి అలలా సాగి గాలిలో వినిపించే ఓ పల్లెపదం వీనులవిందు చేస్తుంది. ఆ మనోహర గీతం వినబడే దిక్కుపై దృక్కులు సారిస్తాం. అలాగే నాట్యరవళి పరవశానికి గురిచేస్తుంది. సంగీత నాట్యకళలు లయ ప్రాధాన్యంగా సాగుతాయి. సాహిత్యంలోని ఛందస్సులో లయ ఉంటుంది.
ఓ ఆనకట్ట కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓ ఆకాశ హర్మ్యం నిర్మించాలన్నా అంతే. ఓ నిర్మాణాన్ని కూల్చడం గంటల్లో పని! విత్తనం, మొక్క, పువ్వు, పిందె, కాయ... ఇలా దశలు దాటు కుంటూ ఓ సమయానికి ఫలసాయం అందిస్తాయి వృక్షాలు. విధ్వంసక ఘటనలు ప్రకృతిలో మెరుపు వేగంతో జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, సుడిగాలులు, కార్చిచ్చులు... ఇలా మానవ వినాశానికి కారణమయ్యే ఉత్పాతాలు హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టిస్తాయి.
లయాత్మకంగా మానవుడు జీవించాలని, ఆ దిశగా జీవనశైలి అలవరచుకోవాలని ప్రకృతి ఆకాంక్ష కాబోలు అనిపిస్తుంది. అటువంటి లయలో క్రమశిక్షణ దాగుంటుంది. లయ తప్పినప్పుడు ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గుండె నిర్ణీత వేగంలో లయాత్మకంగా నడుస్తుంది. ఆ వేగం హెచ్చినా, తగ్గినా ముప్పే. అందుకే మనిషి లయాత్మక జీవనం సాగించాలని ప్రకృతి చెబుతుంది. గురువులు బోధిస్తారు. అది జీవనశైలిని ఏర్పరచుకోడానికి తోడ్పడుతుంది. యోగా, ధ్యానం వంటి అభ్యాసాలు సైతం లయాత్మకంగా చేయవలసి ఉంటుంది. వేగంగా సాగే నడక మంచిదంటారు. వేగంగా నడిచే నడకలోనూ ఓ లయ ఉంటుంది. అలా హృదయ కండరాలు బలపడతాయి. కొందరు హడావుడిపడుతూ వేగంగా పనులు చేయాలని చూస్తారు. కచ్చితత్వంతో వేగంగా పనిచేయగల సామర్థ్యం యంత్రాలకే పరిమితం. మానవుడు యంత్రంలా జీవించకూడదు. లయాత్మక జీవితం గడిపేవారు ఒత్తిడికి దూరంగా ఆరోగ్యంగా జీవిస్తారంటారు ఆరోగ్య నిపుణులు.
శిశువు జన్మించేముందు తొమ్మిది మాసాలు గర్భవాసం చేస్తుంది. ఒక పువ్వును భయపెట్టి, తొందరగా వికసింపజేయలేం. హృదయం ఆనంద మాధుర్యాన్ని ఆస్వాదించిన వేళ కళాకారుడిలో సృజన జాగృతమవుతుంది. భయభ్రాంతులకు గురైన వేళ అతడు కళాఖండాలను సృజించలేడు. ప్రాణుల సహజ ఆవిర్భావం, అంతర్ధానం సైతం లయను సంతరించుకునే జరుగుతాయి. లయతో అనుసంధానమై జీవయాత్ర చేసినప్పుడు మనుషులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారన్నది నిపుణుల మాట. మానవుల శారీరక, మానసిక వ్యవస్థలు లయాత్మక నడవడికి అనుగుణంగా నిర్మితమైనవే కాబట్టి అలా జీవిస్తే వారి జీవితాలు సార్థకమవుతాయి. ఆనందనందనాలవుతాయి.
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది.
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. ఆ ఒక్క ఆలోచనను విడిచిపెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ మోహాన్ని విడిచిపెట్టించడానికి మార్గంగా ఆది శంకరాచార్యులు ‘భజగోవిందం’ అనే శ్లోకంతో ప్రారంభించి 31 శ్లోకాలలో విశదీకరించారు. అవి ‘మోహముద్గరం’ పేరుతో ప్రసిద్ధి చెందాయి.
మనిషి... స్థిరం, శాశ్వతం అనుకునే, పొందడానికి ఆత్రపడే విషయాల అసలు స్వరూపాన్ని, వాటిలోని ఇబ్బందులు, లోపాలు, కష్టాలు, బాధలను ఈ శ్లోకాల్లో అత్యంత సరళంగా విడమరచి చెప్పారాయన.
ఒక వ్యాకరణ పండితుణ్ని ఉద్దేశించి చెబుతున్నట్టు మొదలుపెట్టి, సామాన్య జనానికి అర్థమయ్యేటంత సరళంగా చెప్పారు. మానవుడు ఎంతవరకు ధనం సంపాదించగలడో అంతవరకే కుటుంబం, బంధువులు అతడిపట్ల ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణం పోయిన మృతదేహాన్ని భార్య సైతం అసహ్యించుకుంటుంది. నీవు సర్వస్వం అనుకునే ధనం వల్ల ఇసుమంతైనా సుఖం ఉండదు. కాబట్టి భార్య, బిడ్డలు నీవారు అనే భావం విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరూ ఎవరికీ ఏమీకారు అని చెబుతూ... వాటిని ఎలా విడిచి పెట్టాలో ఆ మార్గాన్నీ సూచించారు.
వస్తువులు, విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతాం అనుకోవడమే మోహం, భ్రమ. ఈ లోకంలో ఏ వస్తువు, ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనం దాన్నే ఇస్తాయన్న నమ్మకం లేదు. వస్తువు పోయినా, చెడిపోయినా అప్పుడు కలిగేది దుఃఖమే అంటూ అనేక ఉదాహరణలు, సంఘటనలు నిర్మొహమాటంగా చెప్పి మోహనాశాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.
నిజానికి పదమూడు శ్లోకాల వరకు శంకరాచార్యులవారు సున్నితంగా హితబోధ చేశారు. ఆయన సున్నితంగా చెప్పిన విషయాలతో జనంలో మార్పు రావడం కష్టమని, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలని ఆయన శిష్యులు భావించారు. ఆ ఆలోచనకు కార్యరూపమిస్తూ... వీరిలో పన్నెండు మంది ఒక్కొక్కటి చొప్పున, మరొక శిష్యుడు అయిదు, వెరసి పద్దెనిమిది శ్లోకాలను చెప్పారు. శంకరులు చెప్పినట్టే ప్రచారంలో ఉన్నా వాటికి, వీటికీ చెప్పే తీరులో చాలా తేడా ఉంటుంది.
‘పవిత్ర నదుల్లో స్నానం ఆచరించినప్పటికి, వ్రతాలు-దానాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే నూరు జన్మలెత్తినా మోక్షం రాదు’ అని నిక్కచ్చిగా చెప్పాడు సురేశ్వరాచార్యుడనే శిష్యుడు.
జగత్తు నశ్వరత్వాన్ని తెలుపుతూ అవసరం వచ్చినప్పుడు నువ్వు ‘నావి’ అని కౌగిలించుకొంటున్న ధనం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంట రావు. నిన్ను ఉద్ధరించవు’ అని మరో శిష్యుడైన సుమతాచార్యులు నిర్మొహమాటంగా చెప్పాడు.
ఇలా పదమూడు మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. అందుకే చివరి పద్దెనిమిది శ్లోకాలూ కాస్త కటువుగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, సూటిగానే ఉంటాయి. గురుశిష్యుల్లో ఎవరు చెప్పినా చివరకు ‘భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం. అందుచేత అతణ్నే భజించు’ అంటూ వివరిస్తూ మోహానికి అడ్డుకట్ట వేసి, జీవన్ముక్త స్థితిని పొందే మార్గం తెలియజేశారు.
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది.
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. ఆ ఒక్క ఆలోచనను విడిచిపెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ మోహాన్ని విడిచిపెట్టించడానికి మార్గంగా ఆది శంకరాచార్యులు ‘భజగోవిందం’ అనే శ్లోకంతో ప్రారంభించి 31 శ్లోకాలలో విశదీకరించారు. అవి ‘మోహముద్గరం’ పేరుతో ప్రసిద్ధి చెందాయి.
మనిషి... స్థిరం, శాశ్వతం అనుకునే, పొందడానికి ఆత్రపడే విషయాల అసలు స్వరూపాన్ని, వాటిలోని ఇబ్బందులు, లోపాలు, కష్టాలు, బాధలను ఈ శ్లోకాల్లో అత్యంత సరళంగా విడమరచి చెప్పారాయన.
ఒక వ్యాకరణ పండితుణ్ని ఉద్దేశించి చెబుతున్నట్టు మొదలుపెట్టి, సామాన్య జనానికి అర్థమయ్యేటంత సరళంగా చెప్పారు. మానవుడు ఎంతవరకు ధనం సంపాదించగలడో అంతవరకే కుటుంబం, బంధువులు అతడిపట్ల ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణం పోయిన మృతదేహాన్ని భార్య సైతం అసహ్యించుకుంటుంది. నీవు సర్వస్వం అనుకునే ధనం వల్ల ఇసుమంతైనా సుఖం ఉండదు. కాబట్టి భార్య, బిడ్డలు నీవారు అనే భావం విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరూ ఎవరికీ ఏమీకారు అని చెబుతూ... వాటిని ఎలా విడిచి పెట్టాలో ఆ మార్గాన్నీ సూచించారు.
వస్తువులు, విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతాం అనుకోవడమే మోహం, భ్రమ. ఈ లోకంలో ఏ వస్తువు, ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనం దాన్నే ఇస్తాయన్న నమ్మకం లేదు. వస్తువు పోయినా, చెడిపోయినా అప్పుడు కలిగేది దుఃఖమే అంటూ అనేక ఉదాహరణలు, సంఘటనలు నిర్మొహమాటంగా చెప్పి మోహనాశాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.
నిజానికి పదమూడు శ్లోకాల వరకు శంకరాచార్యులవారు సున్నితంగా హితబోధ చేశారు. ఆయన సున్నితంగా చెప్పిన విషయాలతో జనంలో మార్పు రావడం కష్టమని, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలని ఆయన శిష్యులు భావించారు. ఆ ఆలోచనకు కార్యరూపమిస్తూ... వీరిలో పన్నెండు మంది ఒక్కొక్కటి చొప్పున, మరొక శిష్యుడు అయిదు, వెరసి పద్దెనిమిది శ్లోకాలను చెప్పారు. శంకరులు చెప్పినట్టే ప్రచారంలో ఉన్నా వాటికి, వీటికీ చెప్పే తీరులో చాలా తేడా ఉంటుంది.
‘పవిత్ర నదుల్లో స్నానం ఆచరించినప్పటికి, వ్రతాలు-దానాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే నూరు జన్మలెత్తినా మోక్షం రాదు’ అని నిక్కచ్చిగా చెప్పాడు సురేశ్వరాచార్యుడనే శిష్యుడు.
జగత్తు నశ్వరత్వాన్ని తెలుపుతూ అవసరం వచ్చినప్పుడు నువ్వు ‘నావి’ అని కౌగిలించుకొంటున్న ధనం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంట రావు. నిన్ను ఉద్ధరించవు’ అని మరో శిష్యుడైన సుమతాచార్యులు నిర్మొహమాటంగా చెప్పాడు.
ఇలా పదమూడు మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. అందుకే చివరి పద్దెనిమిది శ్లోకాలూ కాస్త కటువుగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, సూటిగానే ఉంటాయి. గురుశిష్యుల్లో ఎవరు చెప్పినా చివరకు ‘భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం. అందుచేత అతణ్నే భజించు’ అంటూ వివరిస్తూ మోహానికి అడ్డుకట్ట వేసి, జీవన్ముక్త స్థితిని పొందే మార్గం తెలియజేశారు.