Devotional Telugu
3.55K subscribers
105 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram

హితవచనాలు

పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని బోధిస్తాడు శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం.


పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని బోధిస్తాడు శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం. సంస్కారం కలవారు పెద్దలు ఎదురుపడగానే నమస్కరిస్తారు. మనిషి దేన్ని సాధించాలన్నా అనుభవజ్ఞులైనవారి సలహాలు, సూచనలు తప్పనిసరి. పెద్దలు చెప్పే సూక్తులు మనసులో నిక్షిప్తమై మనిషిని సరైన మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. మనిషి బతుకును తీర్చిదిద్దుతాయి.

రామాయణంలో ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు అయిన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞలను పాటించడమే ధర్మాచరణగా భావించాడు. ఎవరి మాటనైనా శ్రద్ధగా వినేవాడు. తనవారిని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. భారతంలో ధర్మరాజు చక్కని శ్రోత. కనిపించిన ప్రతి పెద్దమనిషినీ మంచిమాటలు చెప్పమనేవాడు. వారు చెప్పిన హితోక్తుల్ని తన ప్రవర్తనలో ఇముడ్చుకునేవాడు.

పుస్తక జ్ఞానంకన్నా అనుభవ జ్ఞానం గొప్పది. అనుభవం పాఠాలను నేర్పుతుంది. పెద్దలు తమతమ జీవితానుభవాలు రంగరించి పిన్నలకు సల హాలు, సూచనలు ఇస్తారు. వాటిని పాటించి వారు ధర్మమార్గంలో నడవాలి.

పూర్వం మహారాజులు, చక్రవర్తులు కూడా తమ పాలనను, ప్రవర్తనను సమీక్షించుకునేందుకు విధిగా కులగురువులు, మహర్షుల వద్దకు వెళ్ళేవారు. వారిని ఆశ్రయించి సూచనలను స్వీకరించేవారు. చివరకు సామాన్య ప్రజల అబి ప్రాయాలూ తెలుసుకుని తమ పాలనను విశ్లేషించు కుంటూ లోపాలను సరిదిద్దుకునేవారు. అందుకే ఎవరి దగ్గర గొప్ప ఆలోచనలు ఉన్నా స్వీకరించమని మనుస్మృతి చెప్పింది. ఆదర్శనీయమైన విలువల్ని ఆచరించమని బోధించింది.

మూర్ఖుడికి ఎలాంటి హితోక్తులు చెప్పినా వ్యర్థమే. అతడు తనకు తోచినట్లే వ్యవహరించి వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. సీతాపహరణకు పాల్పడిన రావణుడితో విభీషణుడు ‘అన్నా! అనవసరంగా పోరు తెచ్చుకొంటున్నావు. ఇందులో మన సోదరి శూర్పణఖదే తప్పు... ఆమె మాటల్ని నమ్మి నువ్వు సీతాదేవిని అపహరించుకు రావడం అధర్మం. రాముడితో యుద్ధం సామాన్యం కాదు. సీతను మళ్ళీ రాముడి వద్దకు చేర్చి ఆయనను శరణు వేడుకో’ అని హితవు పలుకుతాడు.

తమ్ముడి మాటలతో రావణుడిలో కోపం తారస్థాయికి చేరుకుంది. ‘నువ్వు శత్రుపక్షపాతివి’ అంటూ విభీషణుణ్ని నిందించి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. చివరకు తన వినాశనం తానే కొని తెచ్చుకున్నాడు. వినేవాడు వివేకవంతుడైతే తన తప్పు తెలుసుకుంటాడు. తనను తాను సరిదిద్దుకుంటాడు. బుద్ధిహీనుడు అపార్థం చేసుకుంటాడు అంటారు పెద్దలు.

‘నీ జీవితాన్ని శ్రేయో మార్గం వైపు నడిపే దేనినైనా ఎలాంటి భేషజం లేకుండా వెంటనే అంగీకరించు’ అంటారు స్వామి వివేకానంద. పెద్దల మాటలు అమృతంతో సమానం. అవి మన జీవితాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఆ హిత వచనాలను వివేకంతో అర్థం చేసుకుని వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటాం. దానికి కావలసినది శ్రద్ధ, అవగాహన!

ఒకరికి ఒకరై...


ప్రతి జీవి శరీరంలో జీవకణాలు ఉంటాయి. అవి సమయోజనీయతతో సమన్వయంతో కలిసి ఉండకపోతే ఘర్షణ ఏర్పడుతుంది. ఫలితంగా సమతుల్యత లోపించి అనారోగ్యం పాలవుతామని శాస్త్రీయంగా నిరూపణ అయింది. అవి సవ్య, అపసవ్య దిశలలో కలిసి శరీరం సంకేతాలకు అనుగుణంగా సాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. లేకపోతే వ్యాధులకు గురవుతాం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, పరోక్షంగా ఎవరికి వారు సహాయం చేసు కోవడమే. ఈ రహస్యం తెలియని వాళ్లు ప్రతిదానికీ గొడవ పడతారు. కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు లాంటి చెడ్డ భావాలతో మనసును కలుషితం చేసుకుని బతుకుతుంటారు. ఆత్మాభిమానం అనే పేరుతో భీష్మించుకుని ఉంటారు. మనకు ఇంకొకరితో పనే ముందని గిరి గీసుకుని బతుకు తుంటారు. ఇది ఎవరికి వారు చేసుకునే ఎనలేని నష్టం. దీనివల్ల వారు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిస్సహాయులుగా మిగిలిపోతారు. ప్రకృతితో, సృష్టితో క్రమక్రమంగా సంబంధాలు తెగిపోయి, ఒంటరివాళ్లయిపోతారు. ఇంకొందరు సహాయం చెయ్యకపోగా, ఇతరుల మనసులను పనిగట్టుకుని గాయపరుస్తుంటారు. ఇందులో లేశమాత్రమైనా సందేహం లేదు. వారు ప్రకృతికి, సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తున్నవాళ్లు. నిక్కచ్చిగా చెప్పాలంటే వారికి బతకడం రాదు. బతుకులో ఇమడలేరు. నిత్యం విమర్శలతో, నిందలతో, అననుకూల ఆలోచనలతో, పాలలాంటి బతుకులో విషం కలుపుకొంటూ ఉంటారు.

ఆత్మ అందరిలో ఉంది. అది ధరించే శరీరాలన్నింటితో కలిపి పరమాత్మ అయింది. ఆ పరమాత్మ, ఏకత్వ భావనతో అలరారుతోంది. ఏ జీవికి మనం సహాయ నిరాకరణ చేసినా, అది మనల్ని పరమాత్మతత్త్వానికి దూరం చేస్తుంది. సహాయం చెయ్యడంతోనే ఆధ్యాత్మికత మొదలవుతుంది. జీవుడు జీవుడికి సహాయం చెయ్యాలి. జీవుడు దేవుడికీ సహాయం చెయ్యాలి. దేవుడికి సాయమా అని అనుకోకూడదు. దైవం చేస్తున్న పనికి తనవంతు సాయం చెయ్యాలి... శ్రీరాముడికి ఉడుత చేసిన సాయంలా.

భౌతికమైన కంటికి, స్థావర జంగమాత్మక ప్రపంచం అంతా విడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి భిన్నత్వంలో ఏకత్వం ఉంది. చూసే చూపు మారితే రూపు మారుతుంది. మనసు మారుతుంది. మనుగడ తీరు మారుతుంది. ఎదుటివాడిని ఎందుకు ప్రేమించకుండా ఉండకూడదో, దాని వల్ల కలిగే హాని ఏమిటో అరటిపండు వలిచి పెట్టినట్లు అర్థమవుతుంది.

మనిషి భూమి మీదకు రావడం నుంచి, తనను తాను తెలుసుకొని, తనలోని దైవత్వాన్ని గుర్తించేవరకు ఎంతో సహాయం పొందుతాడు. ఇది అందరికీ తెలియదు. కాని... అది నిజం. ఈ దివ్యమైన ఆటలో పక్కవాడికి సహాయం చెయ్యడంలో గొప్పతనం, దివ్యత్వం ముందుగా ఎవరు గుర్తిస్తారో... వారే తమ ప్రయాణం చక్కగా సాగించి ధన్యులవుతారు!
భోజన నియమాలు
           
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు. 
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం. 

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు. 

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి. 

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. 

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.
   
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
  
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
 
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
  
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ  వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు)

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు. 
 
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం). 
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)   

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.) 

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము. 
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
                         
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.
కీర్తి సంపాదన


కుండలను పగలగొట్టి అయినాసరే, బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరచి అయినా సరే, ఏదో ఒకవిధంగా అందరి దృష్టినీ ఆకర్షించే మనుషులు లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు అన్నాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు. ఇది అతడి బలహీనత. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక, చెడుపనులను అయినా చేసి ఏదో విధంగా అందరి కళ్లలో పడితే, తమకు విస్తృత ప్రచారం లభిస్తుందనుకుంటారు కొందరు.

బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం కీర్తికండూతి అవుతుంది. కండూతి అంటే దురద. కీర్తి సంపాదన అనేది సహజసుందరంగా లభించేది అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది. బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు కాదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తికోసం తపించలేదు. తాము నమ్మిన మంచిపనులను చేసుకుంటూ పోయారు. అలాంటివారు ఏదీ ఆశించకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారికి కీర్తిపై ఆసక్తి లేదు.

మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే ఒకసారి కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక పరీక్ష వంటిది. వచ్చిన కీర్తిని నిలుపుకోవడం కోసం శ్రమించవలసి వస్తుంది. ఇదంతా ఒక లంపటం కనుక కీర్తి కాంక్ష లేకుంటేనే మంచిదని వారు ఆశిస్తారు. కీర్తి కాంక్ష ఒక వ్యసనమే అని పెద్దల మాట. వ్యసనం మంచిదైనా, చెడుదైనా మనిషిని వెంటాడుతుంది. నిత్యం అశాంతికి గురి చేస్తుంది.

పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంత రాజులదాకా ఎందరో కీర్తికోసం తపించేవారు. దానశీలురుగా ప్రఖ్యాతిని పొందాలనుకొన్నవారు కొందరైతే, వీరాధివీరులుగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు కొందరు.

నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడిపేవారు కొందరైతే, తాము ఇతరులను పొగిడి, ఇతరుల వల్ల పొగడ్తలను ఆశించేవారు కొందరు. ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారెందరో కనిపిస్తారు. ఇలాంటివారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు- ‘ఒంటెల పెళ్ళికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా! ఏమి మీ అందం? వర్ణనాతీతం’ అని పొగిడాయట. వెంటనే ఒంటెలు ఊరకుంటాయా? ‘ఓ మిత్రులారా! ఆహా! ఏమి మీ కంఠధ్వని... ఎంత మధురంగా ఉందో?’ అని ప్రశంసించాయట.

కీర్తికాంక్ష, కీర్తికండూతి... ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం ఒక్కటే! ఒక రూపాయి దానం చేసి, వేయి రూపాయల కీర్తిని కాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు కొందరు! వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బతకాలి. ఎన్నో చేసినా, చేసింది అణుమాత్రమే అనుకోవడం మంచిది. నిజం కూడా అదే. మనిషి కీర్తికాముకుడు కాకూడదు. సహజ కీర్తి కిరీటధారి కావాలి!

దీపారాధన

దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం.


దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం.

పండగలు, పర్వదినాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు... ఇలా అనేక శుభ సమయాల్లో దీపప్రకాశనం చేస్తారు. ప్రధానంగా దేవాలయాల్లో కార్తికమాసమంతా మహిళలు దీపాలు వెలిగిస్తారు. పర్వదినాల్లో నదుల్లో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. దీపదాన మహిమను పద్మపురాణం విస్తృతంగా వర్ణించింది. దీపదానం వల్లనే ‘గుణవతి’ త్రిమూర్తుల ఆశీస్సులందుకుని, మరుజన్మలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుణ్ని భర్తగా పొందిందని పురాణ కథనం. కార్తికమాసంలో వెలిగించే దీపాలు శీతల శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతనందజేసి, వ్యాధులను దూరం చేస్తాయంటారు. దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వులనూనె శ్రేష్ఠమైనవి.

దీపం నుంచి వెలువడే లేత ఎరుపు, నీలి, పసుపు రంగులను ముగురమ్మలకు ప్రతీకలుగా భావిస్తారు. దీపం ‘దేవతాస్వరూపిణి’ అని విశ్వసించడానికి గల తార్కాణం హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాదేవి ఆలయం. నూనె, వత్తులు లేకుండా వెలిగే అఖండ దీపం ఆ ఆలయంలో ఉంది. ‘తంత్ర చూడామణి’లో ఈ దేవి మహిమ వివరంగా ఉంది.

అమావాస్యనాడు సన్యసించిన స్వామి దయానంద సరస్వతి తిమిర జగతికి జ్ఞానకాంతిని అందించారు. చీకటిలో చేసే పనులన్నీ పాపాలుగాను, వెలుగులో చేసే పనులన్నీ సత్కార్యాలుగాను మహాత్ములు అభివర్ణిస్తారు. జాతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ఆవిష్కృతమవుతాయి.

మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిద అని, ప్రాణం ప్రకాశించే జ్యోతి అని, ఆధ్యాత్మిక సాధన ఆ ప్రమిదలో పోసే తైలమని అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని పౌరాణికులు చెబుతారు. భూమాత వేడిని భరించలేదనే ఉద్దేశంతో ఒక ప్రమిదలో మరో ప్రమిదను ఉంచి దీపం వెలిగిస్తారు. దీపకాంతి లోకానికి క్రాంతి, శాంతి ప్రసాదించి, భ్రాంతిని తొలగిస్తుందని హైందవ సంప్రదాయ విశ్వాసం. జ్యోతి ప్రకాశనం దివ్యలోక సాయుజ్యానికి దారి చూపుతుందంటారు. దీపం ఎప్పుడూ పై దిశవైపే చూస్తుంది. అలాగే మనిషి ఉన్నత స్థితికే వెళ్ళేందుకు ప్రయత్నించాలన్నది దీపం ఇస్తున్న సందేశం.

తులసి మొక్కను లక్ష్మీస్వరూపిణిగా భావించి, దానిముందు దీపం పెడతారు. దర్శనాల్లో దీపజ్యోతిని జ్ఞానసంకేతంగా ఉటంకించారు. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోక ఒక దీపం వెలిగిస్తే, అదే ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. రుగ్వేదం ‘అగ్ని’ అన్న పదంతోనే ఆరంభమైంది. అగ్ని అంటే జ్యోతి స్వరూపమే కదా! ముక్తిపథంలో ప్రయాణించడానికి జ్యోతి అనే సాధన ఒక్కటే సులువైనది కనుకనే దీపారాధనకంతటి వైశిష్ట్యం అని బుధులు చెబుతారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న సామెత మనిషి జీవన ప్రస్థానం ఎంతో అప్రమత్తతతో కొనసాగాలని హెచ్చరిస్తోంది.
అక్షర యజ్ఞం

అక్షరాలు వాక్కుగా మారి శబ్దరూపంలో ప్రయాణిస్తాయి. సచ్చిదానందరూపంగా అక్షరాన్ని మహర్షులు ఆరాధించారు. వాగ్దేవిగా కొలిచారు. సరస్వతిగా ఆరాధించారు. భాషలు వేరైనా భావప్రకటనకు అక్షరమే మూలాధారం. తెలుగులో యాభై ఆరు అక్షరాల వర్ణమాల తరతరాలుగా భాషాసంపదను అందించింది. పిల్లలకు అక్షరాభ్యాసం సనాతనమైన సంప్రదాయం. ఓం ప్రారంభించి, శ్రీకారాన్ని దిద్ది, నమశ్శివాయ అని అక్షరాలు దిద్దించే సంస్కారం కొందరిది. మరికొందరు ఓం శ్రీ, న, మ అని అభ్యాసం ప్రారంభిస్తారు. ఏ విధానమైనా అది అక్షర సుముహూర్తం.

ఒకే అక్షరంగా సృష్టికి మూలమై ఉద్భవించిన ప్రణవనాదం ఓంకారం. ఏకాక్షర బ్రహ్మగా వేదం వర్ణించింది. శూన్యంలో, సముద్రహోరులో, గాలి సవ్వడిలో, గుడిగంటలో ఏకాక్షర శబ్దం ఓంకారంగా వినిపిస్తుంది. అది పరమాత్మవాణి. అనేక ఇతర ఏకాక్షర శబ్దాలు ఉన్నా మోక్షసామ్రాజ్యానికి ఓంకారాన్నే ప్రామాణికంగా చెబుతారు. రెండు అక్షరాల మంత్రాలు అనేక స్తోత్రాల్లో కనిపిస్తాయి. అక్షరాలు ఎన్ని ఉన్నా మంత్రానికి ప్రాణం అక్షరంలోని బీజశక్తి. వాటినే బీజాక్షరాలు అంటారు. అన్ని ధాన్యపు గింజలూ మొలకెత్తవు. బీజశక్తి కలిగిన విత్తనాలే పునరుత్పత్తి చెందుతాయి. రామ, కృష్ణ, శివ, హరి, హర... లాంటి రెండక్షరాల మంత్రాలు బీజాక్షర సమాశ్రితాలు. ఓం నమః శివాయ పంచాక్షరి, ఓం నమోనారాయణాయ అష్టాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయలాంటి ద్వాదశాక్షరి... భగవన్నామస్మరణ కలిగించే తారక మంత్రాలు.

ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రి- ఆగమశాస్త్రం అంగీకరించిన వేదమంత్రం. వాల్మీకి మహర్షి తన రామాయణంలో గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని వరస క్రమంగా వేయి శ్లోకాలకు ఒకటిగా వేసి ఇరవైనాలుగు వేల శ్లోకాలతో రచించాడు. ఆదికావ్యంగా, మోక్షాన్ని, సామాజిక ధర్మాలను ప్రసాదించే ఇతిహాసంగా తరతరాలుగా నిలిచే శక్తిని తరించుకోవడానికి ఇదే కారణంగా చెబుతారు. విత్తనంలో శాఖోపశాఖలుగా విస్తరించే మహావృక్షం దాగినట్లు అక్షరంతో మహోన్నతమైన అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. అక్షరం మనిషిని వివేకవంతం, సంస్కారవంతం కావిస్తుంది. అక్షర విన్యాసాలు అనేకం. అవి అనంతమైన కళారూపాలు. అఖండ విజ్ఞానభాండాగారాలు. దైవీస్వరూపాలు.

శతకాలుగా దర్శనమిచ్చిన అక్షర సంపద తరతరాలుగా మనిషికి వివేకజ్ఞానాన్ని ప్రసాదించింది. వేమనశతకం, దాశరథీ శతకం, కాళహస్తీశ్వర శతకం... లాంటి అనేక శతక కావ్యాలు మనిషికి మంచి మార్గాన్ని చూపించాయి. ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి చేర్చే సాధనాలుగా నిలిచాయి. పద్యంలోని కవితాత్మక అక్షరరూపాలు గుండెల్లో మధురానుభూతిని, రసానుభూతిని అందించాయి. తెలుగువారి పద్యకృషీవలుడు బమ్మెరపోతన భాగవత పద్యాలు సరస్వతికి అక్షర సుమహారాలు. ఆనంద ప్రేరకాలు. చమత్కారంగా ఒక కవి ఇలా వర్ణించాడు. పద్యం ఒక బంగారు పళ్ళెం. అంతర్యామి దానిలో వర్ణన, ఛందస్సు, సొగసు, కథాగమనం, అతిశయం, ఆర్ద్రత- వడ్డించిన మధుర పదార్థాలు. వాటిని ఆస్వాదించి, అనుభవించి బంగారుపళ్ళెం లాంటి పద్యాన్ని భద్రంగా దాచుకోవాలి. ముందుతరాలకు మన సంపదగా అందించాలి.

గ్రాంథికమైనా, వ్యావహారికమైనా వ్యావహారికమైనా అక్షరం ఆలోచనా సులోచనం. వాడి, వేడిగల అక్షరాల పదునుతో శిల్పంలా చెక్కి, సత్యం, ప్రియంగా అందాలను దిద్ది, నిజాన్ని నిర్భయంగా మలచి తీర్చిదిద్దిన వ్యాస పరంపర మనిషిని తప్పక మంచి మార్గంలో నడిపిస్తుంది. మంచి వ్యాసంలోని ప్రతి అక్షరం మనిషిని నిలదీస్తుంది. విచక్షణతో ఆలోచింపజేస్తుంది.

ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు... వీటి రూపేణా మానవ సమాజానికి హితం చేకూర్చే సంస్కరణే అక్షరయజ్ఞం. అక్షరం సంస్కృతీ సౌధానికి మహాద్వారం!
మళ్ళీ మళ్ళీ నువ్వుదాం

సుదీర్ఘమైన జీవితం కేవలం సుఖాలతోనో, కేవలం కష్టాలతోనో, నడవదు, ముగియదు. ఒక విత్తనం మొలకెత్తి పెరిగి, ఫలించి, పండి పడిపోయేందుకు కేవలం పండ్లు కాసి ముగిసిపోతే చాలదు, వీలు కాదు. చిగుళ్లు, ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పూలు, పండ్లు... ఎంత పరిణామ క్రమం! మళ్ళీ లోపల విత్తు. అది అసలు ససిని నిలుపుకొంటూ పునర్జన్మను, పునరుత్పత్తిని మేలుకొల్పుకొంటూనే ఉంటుంది. అదే ప్రకృతి. అదే పరిణామం. పాత మీద విరక్తి కలగకుండా, అంతరించిపోకుండా భగవంతుడు ఏర్పాటు చేసిన నిత్య నూతన పరిణామ క్రమం. ఈ ప్రక్రియ చెట్లు, పక్షులు, జంతువులకే కాదు- మనిషికీ వర్తిస్తుంది. వెల్లవేసిన, రంగులు పూసిన భవంతిలా లోకం యావత్తూ ఎప్పుడూ నవనవలాడుతూ రంగులమయంగా విపత్తులు... ఇవీ భగవంతుడి సృష్టే. నడక నేర్చుకుంటూ పసివాడు కిందపడతాడు. సైకిల్ నేర్చుకుంటూ పిల్లవాడు గాయాలు తగిలించుకుంటాడు. దానికి భయపడి పిల్లలు తమ సరదా మానుకోరు. లేచి దులుపుకొని మళ్ళీ పరిగెడతారు. జీవితంలో ఒడుదొడుకులూ అంతే. కష్టాలు, కన్నీళ్లు కూడా అంతే. కేవలం సుఖమే ఆనందాన్నివ్వదు. దాన్ని సంపాదించే క్రమంలో దెబ్బలు తగలాలి. ఇబ్బందులు కలగాలి. అప్పుడే ఆ ఆనందానికి పూర్ణత్వం మనిషి ప్రకృతిని చూస్తే పరవశించి పోతాడు. అమృతం తాగిన అనుభూతితో ఆనందపడిపోతాడు. ప్రకృతి ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. మళ్ళీ వర్షాలతో, జలపాతాలతో, పూలతో, పచ్చదనాలతో, పక్షుల కలకూజితాలతో, పులకింతలతో పరవశించిపోతుంది. అవును. జీవితం అంటే అదే. మనిషికైనా అంతే. ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు, ప్రకృతి

అంతర్యామి

జీవితం దాని సహజత్వాన్ని అది అనుసరించనీ. అనుభవించనీ. కాలం దాని సహజ వేగంతో అది సాగనీ, మనం అతి తెలివితో దాన్ని ఆపవద్దు. ఆగవద్దు. సహజత్వాన్ని ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం. మామిడి... పిందెలో ఒక రుచి. కాయలో అదో రుచి. దోర మామిడిలో మరో రుచి. పండులో అసలైన రుచి. మార్పులోని అందాన్ని, ఆనందాన్ని నేర్పిస్తోంది ప్రకృతి.

నిజమే. కష్టం ఉంటుంది. నష్టమూ ఉంటుంది. దానిలోని చెడును, చేదును తీసివేసి అసలు మంచిని ఆస్వాదిద్దాం. అనాదిగా మన పూర్వులు చేసింది అదే. కష్టం కేవలం కష్టమే కాదు. అందులో ఇష్టం కూడా ఉంది. అందుకే నవ్వుదాం. నవ్వి నవ్వి కన్నీళ్లొస్తాయి. తుడుచుకోవాలి కదా? అందుకు కొంచెం సమయం కావాలి కదా? ఇవ్వాలి కదా? కష్టం అలాంటిది. కన్నీళ్లు అలాంటివి. కన్నీళ్లు తుడుచుకుందాం. మళ్ళీ నవ్వుదాం. మళ్ళీ మళ్ళీ నువ్వుదాం!
చీకటి వెలుగులు

చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం.

కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైనవారు కాలం కలిసిరాగానే చేరువవుతారు. విమర్శించినవారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణసంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు.

బాల్యంలో మనసు కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యౌవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు. స్నేహితుల ప్రభావం జీవనగమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పథమనే ప్రకాశవంతమైన క్రాంతిమార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం.

మనిషి తనను తాను తెలుసుకోవాలి. తన శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవనపథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తాడు.

భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విజ్ఞులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో, స్వయంకృషితో తేజోవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులీనుతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోనట్లు, కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవని భాగవతం చెబుతోంది.

‘మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారుచీకట్లతో కూడిన రాత్రివల్ల వృథా అవుతుంది. మిగిలిన సమయంలో కామక్రోధాదుల బంధంలో చిక్కుకుని బయటకు రాలేక సతమతమవుతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృపవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలతోపాటు మోక్షం సిద్ధిస్తుంది’ అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు.

భగవన్నామస్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారుచీకటిలోనూ కమలాక్షుడు అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు. శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్టే సుఖదుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటివెలుగుల ప్రభావం ఉండదు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం.
ఆత్మగౌరవం

ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే మీరు ఇతరులను గౌరవించగలుగుతారు. వ్యక్తిత్వం తాలూకు ఉన్నతత్వాన్ని వ్యక్తపరచేది ఆత్మగౌరవమే. వ్యక్తి బాహ్య చర్యలను శాసించేది, నిర్ధారించేది ఆత్మగౌరవమే. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఏర్పరచుకునే మానవ సంబంధాలు చీకటిలో దీపం పరచే వెలుగులా ప్రకాశిస్తాయి. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమతో తాము పరిచయం పెంచుకుంటారు. తాము ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటారు సోక్రటీస్. ఆత్మగౌరవం గలవారు విలువలకు కట్టుబడతారు. మంచిశ్రోతగా ఎదుటి వారు చెప్పేది వింటారు. తమ ప్రవర్తనతోనే ఎదుటివారిలో పరివర్తన తెస్తారు. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఓ ఆణిముత్యం. స్వచ్ఛమైన తామర పువ్వులా వికసించిన వ్యక్తిత్వం ఆయనది.

ఆత్మగౌరవంగల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా కలిసిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవ స్పృహ కలిగి చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి, దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే ఆపన్న హస్తం అందించడానికి ముందుకొస్తారు. నిస్వార్ధమైన సేవా తత్పరతతో తరతమ భేదాలకు అతీతంగా మానవ సంబంధా లకు పెద్దపీట వేస్తారు. తమలోని ప్రత్యేకతను గుర్తించి దాన్ని పదిమంది శ్రేయస్సుకు ఉపయోగించేవారు ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తులే.

ఆత్మగౌరవం గల వ్యక్తుల్లో ఆత్మ స్థైర్యం, నమ్మకం ఎక్కువగా ఉంటాయి. ఆ నమ్మకాన్ని అపజయాలకు, అన్యా యం, అక్రమాలకు బలి చేయరు. తమ నమ్మకాన్ని బతికించుకునే ప్రయత్నం చేస్తారు. అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమే అనుకుని ముందంజ వేస్తారు. ఓటమిని ఓడించి విజేతలయ్యేందుకే కృషి చేస్తుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు, సాధించిన విజయాలతో సంతృప్తి చెందరు. నిరంతరం ప్రయత్నిస్తూ, శ్రమిస్తూనే ఉంటారు. లక్ష్యం మారినా గమ్యాన్ని విస్మరించరు. ప్రేమించే హృదయం, స్పందించే మనసు, పని చేసే చేతులు ఆత్మగౌరవానికి ప్రతీకలు అంటారు స్వామి వివేకానంద.

ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారిస్తారు. దేనినైనా స్వీకరించినంత తొందరగా త్యజించనూ గలరు. గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటివారు ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని మనమధ్యే సంచరించిన యోగులు.

ఆత్మగౌరవం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. మరొకరిని చూసిన ప్రేరణతో లభించేది. కాదు. ఆత్మగౌరవం ద్వారా ఆత్మజ్ఞానం పొందిన యోగులు తరతమ భేదాలకు అతీతంగా సృష్టిలో ఏ ప్రాణితోనైనా బంధాలు ఏర్పరచుకుంటారు, సంభాషిస్తారు, ఆదరిస్తారు. ఆత్మగౌరవం ద్వారా ఆత్మజ్ఞానం తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం "సిద్ధిస్తాయని రామకృష్ణ పరమహంస బోధించారు.
చీకటి వెలుగులు

చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం.

కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైనవారు కాలం కలిసిరాగానే చేరువవుతారు. విమర్శించినవారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణసంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు.

బాల్యంలో మనసు కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యౌవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు. స్నేహితుల ప్రభావం జీవనగమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పథమనే ప్రకాశవంతమైన క్రాంతిమార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం.

మనిషి తనను తాను తెలుసుకోవాలి. తన శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవనపథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తాడు.

భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విజ్ఞులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో, స్వయంకృషితో తేజోవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులీనుతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోనట్లు, కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవని భాగవతం చెబుతోంది.

‘మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారుచీకట్లతో కూడిన రాత్రివల్ల వృథా అవుతుంది. మిగిలిన సమయంలో కామక్రోధాదుల బంధంలో చిక్కుకుని బయటకు రాలేక సతమతమవుతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృపవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలతోపాటు మోక్షం సిద్ధిస్తుంది’ అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు.

భగవన్నామస్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారుచీకటిలోనూ కమలాక్షుడు అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు. శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్టే సుఖదుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటివెలుగుల ప్రభావం ఉండదు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం.
చిగురించే కాలం

తం ఒక మధురస్మృతి. వర్తమానం ప్రత్యక్ష దృశ్యం. భవిష్యత్తు ఆశల పల్లకి. కాలం ఒకటే అయినా ఇన్నివిధాల విభజనలు ఉన్నాయి. మనిషి కాలపంజరంలో బందీ అయిన చిలక.
మనిషి పుట్టుక నుంచి వెంటపడే కాలం, అతడు గిట్టేదాకా వెంటాడుతూనే ఉంటుంది. అతణ్ని వయోగణనం అనే చట్రంలో బంధిస్తుంది. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలను అంటగడుతుంది. మనిషి ఈ లెక్కింపునకు లొంగిపోతాడు. చేసేదేమీ లేక నిశ్చేష్టుడిలా ఉండిపోతాడు. అయినా కాలం అతణ్ని వదలిపెట్టదు. నిద్రిస్తున్నా, మేల్కొని ఉన్నా అతడి ఆయుర్దాయాన్ని లెక్కిస్తూనే ఉంటుంది. కాలం చేసే లీలలో, కాలం ఆడే ఆటలో మనిషి నిమిషాలను పట్టించుకోడు. గంటలను వ్యర్థంగా గడిపేస్తుంటాడు. రోజులు మారుతున్నా కదలడు. సంవత్సరాలైనా తన జాడ్యాన్ని వదలడు. చివరికి అతడికి తెలియకుండానే కర్పూరంలా ఆయుష్యం హరించుకొని పోతుంది.
సమర్థుడైన మనిషికి కాలం ఎంతో విలువైంది. ఒక్క గడియ కూడా వ్యర్థంగా గడవరాదనుకుంటాడు. ఎప్పుడు ఏది చేయాలో, అప్పుడు దాన్ని పూర్తి చేస్తుంటాడు. అసమర్థుడైనవాడు కాలాన్ని పట్టించుకోడు. కాలం అనేది గడుస్తోందనే స్పృహ కూడా అతడికి ఉండదు. చివరికి కాలం కరకు కోరల్లో పడి నలిగిపోతాడు.

కాలం ఎంతో మనోహరమైంది. అది తనకు అండగా ఉందనే ధైర్యంతో కృషి చేసే మనిషికి కాలం తోడుగా ఉంటుంది. కాలం ఒడిలో కూర్చొని, ఓనమాలు నేర్చుకున్నవాళ్లు ఉజ్జ్వల తారలై ప్రకాశించారు. వారు గతించినా వారి దివ్య దీప్తి చిరకాలం వెలుగులను ప్రసాదిస్తోంది. కాలంతో నేర్చుకున్న పాఠాలే భవిష్యత్తులో జ్ఞానపీఠాలపై మనిషిని కూర్చోబెడుతున్నాయి.
కాలం ఎప్పుడూ ఆశాకిరణమే. ఎంత దూరం సాగినా కాలం వెలుగులు ఆరిపోవు. కాలం మిగిల్చిన స్మృతులు పారిపోవు. మనిషి గతాన్ని స్మరించుకొని మురిసిపోతాడు. భవిష్యత్తును భావించుకొంటూ సాగిపోతాడు. నిన్నటి విజయం అందించిన స్ఫూర్తితో, నేటి కర్తవ్యం ఉత్సాహాన్ని నింపుతుంది. మనసు ఉల్లాసంతో ఉరకలు వేస్తుంది. అభ్యుదయ శిఖరాలకు సాగిపొమ్మంటుంది. చేదు అనుభవాలను కాలం తుడిచిపెడుతుంది. తీయని ఆశలను రేకెత్తిస్తుంది. కోరిన కోరికలకు దారి చూపుతుంది. కాలం వసంతంలా చిగురువేస్తుంది. గ్రీష్మంలా జ్వలిస్తుంది. వర్షంలా జల్లులను కురిపిస్తుంది. శరత్తులా వెన్నెల కాస్తుంది. హేమంతంలా వణికిస్తుంది. శిశిరంలా అన్నింటినీ రాల్చివేస్తుంది.
మనసులోకి దూరే కాలం మధురిమలను పండిస్తుంది. మండుతున్న ఎండల్లోనూ సాంత్వనల చిరు జల్లులను కురిపిస్తుంది. మనసు అనే లోకంలో మాధుర్యాల పంటలను పండిస్తుంది.

బాల్యంలోని మాధుర్యాలను వృద్ధాప్యంలో గుర్తుచేస్తుంది కాలం. గడచిపోయింది అంతా కమనీయమైందే అనే నిశ్చయాన్ని కలిగిస్తుంది కాలం. మళ్ళీ ఒకసారి గతంలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కాలం!
సృష్టికి ఆదిలో, సృష్టికి అంతంలో ఒకేవిధంగా నిలిచే కాలం తనలో ఏ మార్పూ లేదని విశదం చేస్తుంది. మనిషి కూడా తనలాగే స్థిర భావనతో ఉండాలని సూచిస్తుంది. చిగురించే ఆశలతో బతకాలని చెబుతుంది. విజయం లభించేదాకా విరమించరాదని సంకేతం ఇస్తుంది. చెట్లులాగా ఫలోన్ముఖం అయ్యేదాకా నిలిచి ఉండాలని సందేశం ఇస్తుంది. కనిపించని కాలం కనబడే జగత్తును తనలో లీనం చేసుకోవడమే ఆశ్చర్యకరం.
తలలో నాలుకలా....


తెలుగు జాతీయాలలో ‘తలలో నాలుకలా’ అనే ప్రయోగం తరచుగా మనం వింటుంటాం. తలలో నాలుకలా ఉండటం ఏమంత సులభం కాదు. ఎవ్వరినీ శారీరకంగా, మానసికంగా నొప్పించకుండా, మంచి మాటలతో, సంస్కారవంతమైన ప్రవర్తనతో మెలగడమే దీని అంతరార్థం. నోటిలో మనకు ముప్ఫై రెండు పళ్లుంటాయి. ఆ కఠినమైన దంతాల మధ్య ఎంతో సున్నితంగా అటూ ఇటూ ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది నాలుక. దంతాల మధ్య ఎంత జాగ్రత్తగా మసలుతుందో నాలుక! చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఒద్దికగా, ఓర్పుతో, నేర్పుతో, ఒడుపుగా పళ్లదెబ్బ తగలకుండా ఉండే దాని నుంచి మనం నేర్చుకోవాలి, సమాజంలో ఎలా మెలగాలో! తినే పదార్థం రుచి దంతాలకు తెలియదు. నమిలే శక్తి నాలుకకు లేదు. పరస్పరం అవి సహకరించుకోవాల్సిందే! లేకపోతే తిన్న ఆహారం జీర్ణం కాదు. కొంత వయసు పెరిగాక క్రమంగా దంతాలు ఒక్కొక్కటే ఊడిపోతుంటాయి. నాలుక జీవితాంతం ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం అలా నాలుకలా ఉండాలి.
ఇలా శాశ్వతత్వం పొందాలంటే నాలుకను మంచిమాట మాట్లా డేందుకు ఉపయోగించాలి. శిష్టమైన భాషణం చేసేవాణ్ని ‘తలలో నాలు కలా ఉంటాడండీ’ అని మెచ్చు కుంటారు. అలాంటి మనిషి మనీషి అవుతాడు. మహామనీషి అవుతాడు. అతడి మాట వినమ్రతకు అద్దం పడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. తలపెట్టిన ప్రతికార్యంలోనూ సఫలీకృతుణ్ని చేస్తుంది. అజాతశత్రువును చేస్తుంది.

పాండవులు కేవలం ధర్మవర్తనులే కాదు, సున్నిత మనస్కులు. ఘోషయాత్రలో చేజిక్కిన దుర్యోధనుణ్ని విడిచిపెట్టారు. కృష్ణరాయభార ఘట్టంలో కృష్ణుడు పాండవుల మంచితనాన్ని, ధార్మికతను వ్యక్తం చేస్తూ ‘తలలోని నాల్కలు’ అని కీర్తిస్తాడు. పెద్దన్న అయిన ధర్మరాజును తమ్ముళ్లు నలుగురూ పల్లెత్తు మాట అనలేదు. ఎన్ని కష్టాలెదురైనా అన్నీ సహిస్తూ ఐకమత్యంగా ఉన్నారే తప్ప పరస్పరం కలహించుకోలేదు. ఎదుటివారిని తూలనాడనూలేదు. అంత అప్రమత్తతతో ప్రవర్తించడంవల్లనే అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకోగలిగారు. విరాట చక్రవర్తికి పలు సందర్భాల్లో తోడ్పడ్డారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఏడు అక్షౌహిణుల సేన వచ్చి పాండవుల పక్షాన నిలబడిందంటే- అది వారి సద్వర్తనమే అనుకోవాలి. అర్జునుడి మనసు ఎంత నవనీత సదృశమంటే కురుక్షేత్ర మైదానంలో విపక్షంలోని వారందరినీ చూసి ‘వారంతా నా బంధువర్గమే కదా! ఎలా సంహరించేది?’ అంటూ విలపిస్తాడు. కర్తవ్య బోధ, గీతాబోధతో పార్థుణ్ని యుద్ధ సన్నద్ధం చేస్తాడు వాసుదేవుడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో తెలిసిన రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణపరమాత్మ. తలలోని నాలుక కాకపోతే అష్టపత్నులను, పదహారు వేలమంది గోపికలను, బంధువర్గాన్ని, ప్రజలను అంతగా సంతోష పెట్టగలిగేవాడా యదునాథుడు!
రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అడుగుజాడల్లో నడిచి, మంచి తమ్ముళ్లు అన్న ప్రఖ్యాతి పొందిన లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని మరువలేము. వారి భార్యలు ముగ్గురత్తల దగ్గర ఎంత వినమ్రతతో, ఆత్మీయతతో నడుచుకున్నారు!

తల్లిదండ్రుల్ని, గురువుల్ని గౌరవిస్తూ వినయవిధేయతలతో విద్య నేర్చి, మంచి ఆలోచించి, మంచినే మాట్లాడుతూ మంచి పనులు చేసే సంస్కారవంతుడు, అందరిలోనూ ‘నూటికో కోటికో ఒక్కడు’ అనిపించుకోగలవాడే తలలో నాలుకలా ఉండగలడు. ఒదిగే మనిషే ఎదుగుతాడని, పదుగురి ప్రశంసలూ పొందగలడని పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏది, ఎంత నేర్చినా ఇంకా ఎంతో ఉన్నదన్న సత్యం తెలుసుకోగలవాడే సమాజానికి ఆదర్శప్రాయుడై నిలవగలడు. సాటి మనిషికి ప్రసన్నత, ప్రశాంతత ఇవ్వగలవాడే సార్థక జన్ముడు.
అనన్య భక్తి

భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ.

భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ. ఏదైనా ఒక దేవతను గురించి ఇష్టాపూర్వకంగా ధ్యానిస్తూ, నిరతిశయమైన భక్తిని కలిగి ఉండటాన్ని రాగాత్మక/రాగానుగ భక్తి అంటారు.

విధి అంటే తప్పక చేయదగింది.దీనికే చట్టం, నియమం, శాసనం అనే అర్థాలున్నాయి. వైధిభక్తి అనేది బాధ్యత అనే భావనమీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం పొందడానికి తనవంతు బాధ్యతగా వినడం, కీర్తించడం, స్మరించడం సహా తొమ్మిదిరకాల బాధ్యతల్ని నిర్వర్తించడమే వైధిభక్తిలోని ప్రధాన నియమం. వాటినే నవవిధ భక్తిమార్గాలని పురాణాలు చెబుతున్నాయి. అవి- శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఎవరి శక్త్యానుసారం వారు నియమపూర్వకంగా అవలంబించి తరించే భక్తి మార్గాన్ని చూపుతాయవి.
వీటన్నింటి కంటే అతీతమైనది అనన్య భక్తి. మనసులో ఇతర ఆలోచనలకు చోటు లేకుండా భగ వంతుడి పట్ల మాత్రమే దృష్టి కలిగి ఉండటం దీని లక్షణం. దీనికే శుద్ధ భక్తి, ఏకాగ్రతా భక్తి అనే నామాం తరాలూ ఉన్నాయి. జగత్తులో దైవం తప్ప మరొకటి ఏదీ లేదు అనే విశ్వాసం కలిగి ఉండటమే అనన్య భక్తి అని వేదాంతులు చెప్పిన మాట. ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని వైదిక మంత్రం చెబుతోంది. ఇదే భావాన్ని పోతన ‘నీవే తప్ప నితఃపరంబెరుగ’ అని చెప్పాడు. కాబట్టి ఈ విశ్వమంతా భగవత్స్వరూపమే అనే భావాన్ని కలిగి ఉండాలి. ఏది చూసినా దైవస్వరూపమే అనుకోవాలి. ఏది చేసినా దైవసేవే, ఎక్కడ నడిచినా దైవప్రదక్షిణమే... అనే భావంతో జీవితాన్ని గడపాలి. ఇదే అనన్యభక్తి ముఖ్య లక్షణం.

దేవుడి సర్వవ్యాపకత్వం ఒక్కసారి అనుభవంలోకి వస్తే ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది భక్తిలో మొదటి లక్షణం. ఆ స్థితికి చేరిననాడు అందరూ దైవస్వరూపులే. కాబట్టి ఎవరినీ ద్వేషించకూడదు. ఏ జీవికి సేవచేసినా దైవసేవ చేసినట్టే. ఏ జీవిని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్టే అని భావించగలగాలి. అదే అనన్య భక్తికి తొలిమెట్టు.

సర్వవ్యాపకత్వాన్ని అనుసరించడం చాలా కష్టం. అంతరాంతరాల్లో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అదేమిటంటే... ఎదురుగా నా బంధువులు, ఆప్తులు, నా వాళ్లందరూ ఉన్నారు. వారందరినీ కాదని దేవుడినే నమ్ముకున్నానని తెలిస్తే, వాళ్లు చేసే ఆ మాత్రం సాయం కూడా చేయరేమోననే భయం. వాళ్లు కనీసం కనిపిస్తున్నారు. భగవంతుడు అలా కనిపించడు. ఎలా ఆదుకుంటాడు? ఇది వారి లోలోపలి అనుమానం.

ఈ భావాలు, భయాలు, అనుమానాలు అన్నింటికీ భగవంతుడే స్వయంగా పరిష్కారం చెప్పాడు. వేరే ఆలోచనలు లేకుండా, నిత్యమూ తననే నమ్ముకుంటే వారి యోగక్షేమాలను తానే చూస్తానని. కాబట్టి మనసును సర్వాంతర్యామి మీద స్థిరంగా ఉంచి, తన సర్వస్వాన్నీ ఆయనకు అప్పగించగలిగితే... నిస్సందేహంగా ఆ అంతర్యామి పరిష్వంగంలో జీవించగలం.
రోజూ పండుగే!

‘కలిగినవాడికి ప్రతిరోజూ పండుగే’ అనేది నానుడి. ఆ మాట ఎలా ఉన్నా, చాంద్రమాన గణనను అనుసరించే వారికి మాత్రం ప్రతిరోజూ పండుగే అని చెప్పవచ్చు. మాసానికి శుక్ల, కృష్ణ అని రెండు పక్షాలు.


‘కలిగినవాడికి ప్రతిరోజూ పండుగే’ అనేది నానుడి. ఆ మాట ఎలా ఉన్నా, చాంద్రమాన గణనను అనుసరించే వారికి మాత్రం ప్రతిరోజూ పండుగే అని చెప్పవచ్చు. మాసానికి శుక్ల, కృష్ణ అని రెండు పక్షాలు. రెండు పక్షాల్లోనూ పాడ్యమి మొదలు చతుర్దశి వరకు తిథులు సమానమే. శుక్లపక్షపు చివరి రోజు పౌర్ణమి. కృష్ణ పక్షానికి, ఆ మాసానికి సైతం చివరి రోజు అమావాస్య. శుక్ల, కృష్ణ పక్షాల్లో ఏ పక్షంలోనైనా పాడ్యమి మొదలు అన్ని తిథులు, వాటితోపాటు వారాలు, నక్షత్రాల కలయికతో వివిధ మాసాల్లో సందర్భానుసారంగా పండుగలు రావడం చాంద్రమానంలోని ప్రత్యేకత. చైత్ర శుక్ల పాడ్యమి నాడు తెలుగు సంవత్సరాది ‘ఉగాది’.

ఆదివారం విదియ తిథి కలిసిన రోజు ఏ మాసం/పక్షంలోనైనా ‘భాను విదియ’ అని పిలిచి సూర్యారాధన చేస్తారు. కార్తిక శుద్ధ విదియ ‘భ్రాతృవిదియ’గా ప్రసిద్ధం. ఆ రోజు సోదరి చేతి వంటను సోదరులు తినాలని నియమం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. ఆ రోజు చేసే పూజ, దానం, వ్రతం ఏదైనా అక్షయమైన ఫలితాలను ఇస్తుందని ఈ పేరు పెట్టారు. భాద్రపద బహుళ తదియనాడు ఉండ్రాళ్ల తదియ/తద్దిగాను, ఆశ్వయుజ బహుళ తదియను అట్ల తదియగాను జరుపుతారు.

భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుతారు. ఏ మాసంలోనైనా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున సూర్యాస్తమయ సమయానికి చవితి ఉంటే సంకష్టహర / సంకటహర చతుర్థి అంటారు. ఆషాఢ శుద్ధ పంచమి సుబ్రహ్మణ్య ఆరాధనకు ఉద్దేశించిన స్కంద పంచమి. భాద్రపద శుద్ధ పంచమినాడు సప్తర్షులను పూజించే దినం రుషి పంచమిగా జరుపుతారు. మాఘ శుక్ల పంచమి సరస్వతీ దేవి జన్మదినోత్సవంగా జరిపే శ్రీ పంచమి లేదా వసంతపంచమి. ఆషాఢ శుద్ధ షష్ఠి కుమార షష్ఠిగా, మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఉద్దేశించిన పర్వదినాలు.
మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి. ఏ మాసం/పక్షంలోనైనా ఆదివారం సప్తమి కలిస్తే భానుసప్తమిగా వ్యవహ రిస్తారు. ఈ రోజుల్లో ప్రముఖంగా సూర్యారాధన చేస్తారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి. ఆశ్వయుజ శుక్ల అష్టమి మహాష్టమి. వీటిలో మొదటిది శ్రీకృష్ణ జన్మదినం. రెండోది శరన్నవరాత్రుల్లో దేవీ పూజకు ఉద్దేశించినది. వసంత నవరాత్రుల్లో చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా జరుపుతారు. శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా దేవీ పూజ చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు దసరాగా వ్యవహరించే విజయదశమి.

ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రసిద్ధం. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అనీ పిలుస్తారు. మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కార్తిక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి. తులసిని, విష్ణువును పూజిస్తారు. శనివారం త్రయోదశి కలిస్తే శనిత్రయోదశి, శని అనుగ్రహం కోసం తైలాభిషేకం చేస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి. పౌర్ణమి రోజును శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో పర్వదినాలుగా జరుపుతారు. ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్యగా, ఫాల్గుణ మాసపు అమావాస్యను ‘కొత్త అమావాస్య’(ఉగాది ముందురోజు)గా జరుపుకొంటారు.
భగవంతుడికి తెలుసు

సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరు. వయసు, సద్గుణాలు, పోషించే సమర్థత చూడకుండా కన్యాదానం చేయరు. నమ్మకం పొందని వ్యక్తికి రుణం ఇవ్వరు.పాత్రత లేకుండా మంత్రోపదేశం చేయరు. సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా పొందాలంటే పాత్రత ఉండాలి.

సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరు. వయసు, సద్గుణాలు, పోషించే సమర్థత చూడకుండా కన్యాదానం చేయరు. నమ్మకం పొందని వ్యక్తికి రుణం ఇవ్వరు.పాత్రత లేకుండా మంత్రోపదేశం చేయరు. సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా పొందాలంటే పాత్రత ఉండాలి. నిత్యజీవితంలో అందరి ఆదరాభిమానాలు పొందాలన్నా కూడా అర్హత సంపాదించాలి. దానికి ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇతరుల తప్పులను ఎంచడం మానాలి. నీ తప్పును తెలుసుకొని, ఇతరుల గొప్పను నిజాయతీగా ఒప్పుకోవాలి. సంకోచమే మరణం, వ్యాకోచమే జీవితం అంటారు. మానసిక పరిధిని విస్తృతపరచుకొని విశ్వ మానవుడు కావాలి. నిస్వార్థంగా ఇతరులకు ఏమి ఇవ్వగలమో అవి ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే పొందే అర్హత కలుగుతుంది.

భగవంతుడి అనుగ్రహం లభిం చాలన్నా అర్హత కావాలి. ఈర్ష్య అసూయ ద్వేషాలకు దూరంగా ఉండగలగాలి. ఆయన మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, మానసిక అనుబంధాన్ని పెంచుకోవాలి. చేసే ప్రతి పని తాలూకు ఫలితాన్ని ఆయనకు సమర్పణ భావంతో చేయగలగాలి. నిజానికి భగవంతుడి సన్నిధికి వెళ్ళాల్సింది భౌతిక విషయాలకు దూరంగా, కాసేపు ప్రశాంతమైన మనసుతో ఎవరికివారు స్వామితో మౌనంగా సంభాషించు కునేందుకు. ఆయన కరుణాకటాక్ష వీక్షణాలు తమపై ప్రసరింప చేస్తున్నందుకు, జీవితంలో సుఖ సంతోషాలను నింపుతూ ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి. కోర్కెల చిట్టా విప్పడానికి కాదు.
ఎవరికి ఏది కావాలో ఆయనకు తెలుసు. మాతృగర్భం నుంచి బయటకు వచ్చేసరికి ఆహారాన్ని మాతృస్తన్యంగా ఏర్పాటు చేసిన భగవంతుడు ఎవరికి ఏది ఏ సమయంలో ప్రసాదించాలో ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. పూజామందిరంలో దేవుడి ముందు అగరొత్తులు వెలిగించడంతో పాటు ప్రేమానురాగ కుసుమ పరిమళాలతో ఇంటిని పరిసరాలను నింపుకోవాలి. దీపం వెలిగించడంతోపాటు అజ్ఞానాంధకారాన్ని పారదోలాలి. భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని నలుగురితో పంచుకోవాలి. భగవంతుడి ముందు వినయంగా శిరస్సు వంచడంతోపాటు తోటివారిపట్ల నమ్రతతో నడుచుకోవాలి. హాని తలపెట్టిన వారినీ హృదయపూర్వకంగా క్షమించగలగాలి.

దేవుణ్ని ఏం కోరుకోవాలి? నీలోని బలహీనతలను విన్నవించి వాటిని అధిగమించే శక్తిని, కష్టాలను అధిగమించే మానసిక స్థైర్యాన్ని కలిగించమని అర్థించాలి. ఆ దైవం ప్రసాదించిన తెలివితేటలు, సంపద దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే బుద్ధి కలిగించమని కోరుకోవాలి. తల ఎత్తుకొని నిర్భయంగా స్వయంశక్తితో స్వతంత్రంగా ఆత్మగౌరవంతో నిజాయతీగా జీవించే లక్షణాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. లభించిన దానితో తృప్తిపడే మనసునిమ్మని కోరుకోవాలి. అంతకు మించిన ధనం లేదు.

అర్హతను చూసి ఎవరికి ఏమి కావాలో ఎంతవరకు ఇవ్వాలో అది ఏదో రకంగా భగవంతుడు కలగజేస్తాడు. అర్హత లేకుండా దైవాన్ని ప్రార్థించడం ఇతరులను అర్థించడం కేవలం అవివేకం, అత్యాశ.
స్ఫూర్తిమంతమైన పాఠం


ప్రపంచ ప్రసిద్ధ ఫోర్డు వాహన సంస్థ అధినేత హెన్రీఫోర్డ్‌కు ఇంజిన్ల తయారీ విషయంలో ఒక సరికొత్త ఆలోచన మనసులో మెరిసింది. సంస్థ ముఖ్య సాంకేతిక నిపుణులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. శక్తిమంతమైన కొత్త ఇంజిన్‌ గురించి తన ఆలోచనలను వివరించాడు. ఎవరికీ అది రుచించలేదు.
హెన్రీఫోర్డ్‌ వారి వాదనలన్నీ ఓపిగ్గా విన్నాడు. అందరినీ పరిశీలనగా చూశాడు. ‘ఈ తరహా ఇంజిన్‌ తయారీ కష్టసాధ్యమనే విషయం నాకూ తెలుసు. మీ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్నది నా ప్రయత్నం. ఎందుకు విఫలమవుతామన్న మీ ఆలోచనలను పక్కకు నెట్టి, ఎలా సాధించాలన్న విషయంపై దృష్టి సారించండి. సానుకూల దృక్పథంతో వెంటనే పని మొదలు పెట్టండి. విజయం సాధించి, మీ సత్తా నిరూపించుకోండి’ అని ఆదేశించాడు.
వారిలో పట్టుదల రగిలింది. అందరూ కసిగా రంగంలోకి దిగారు. ఆరు నెలలు తిరిగే సరికల్లా అమెరికా రహదారులపై వి-8 ఫార్ములా ఇంజిన్లతో శక్తిమంతమైన ఫోర్డుకార్లు పరుగులు తీశాయి. వాహనరంగంలో విజయవంతమైన వాటిలో వి-8 ప్రధాన వాహనంగా పేరు గడించింది.

సీతమ్మను అన్వేషిస్తూ వానరులు కొండాకోనా గాలించారు. చివరకు సాగరతీరానికి చేరారు. నూరు యోజనాల విస్తీర్ణంతో భీకరంగా గర్జిస్తున్న సముద్రాన్ని చూడగానే నీరుకారిపోయారు. నిరాశ ఆవరిం చింది. అందరూ దిగాలుగా కూర్చున్నారు. జాంబవంతుడు లేచాడు. హనుమంతుణ్ని సమీ పించాడు. గంభీరమైన కంఠంతో హనుమను ప్రేరేపించడం ఆరంభించాడు. ‘ఓ మహావీరా! నీవు సామాన్యుడివి కావు. బలంలో తేజస్సులో రామలక్ష్మణులకు సమానుడివి. అంతరిక్షంలో అనాయాసంగా విహరించే గరుత్మంతుడి రెక్కల్లోని అనంతమైన శక్తి నీ సొంతం. విషాద సాగరంలో మునిగిన ఈ వానర సమూహాన్ని ఉద్ధరించగల శక్తిశాలివి నీవు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడైనట్లు నీవు విజృంభించు... విక్రమించు. సముద్రాన్ని లంఘించు. సీతమ్మదర్శనం సాధించు. రామకార్యాన్ని పూర్తిచేసి, ఆ అవతార పురుషుడికి ఆనందాన్ని కలిగించు. లే... లంకకు పోయి విజయుడివై తిరిగిరా’ అంటూ పరిపరి విధాల ప్రబోధించాడు.

అంతే! జాంబవంతుడి పలుకుపలుకుతో గుండెల్లో ఉత్తేజం పొంగి ప్రవహించగా- హనుమ దేహం అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సందర్భంలో వాల్మీకిమహర్షి హనుమనోట అద్భుతమైన వాక్యాలు పలికించారు. ‘నా బుద్ధి, మనసు సీతమ్మవారిని దర్శించాలన్న ఉత్కంఠతో ఉవ్విళ్లూరుతున్నాయి. లంకను పెకలించి తెస్తాను. మీరంతా నిశ్చింతగా ఉండండి’ అన్నాడాయన. అంటే మానసికంగా అప్పటికే ఆయన సీతమ్మ సమక్షంలో ఉన్నాడు. విజయం ముంగిట్లో నిలిచాడు. ఇక భౌతికమైన ప్రయాణం ఒక్కటే మిగిలింది.

వ్యక్తిత్వ వికాస తరగతిగదుల్లో నేర్పించవలసిన గొప్ప పాఠమిది. నాయకుడు తన సహచరులను ఏ రకంగా ప్రేరేపించాలో... ఆ ప్రేరణ కళను విజేత ఏ విధంగా ఆకళించుకోవాలో... పని ఆరంభించే సమయంలోనే దాని విజయాన్ని మానసికంగా ఎలా అనుభూతి చెందాలో... మహోత్సాహంతో లక్ష్యాన్ని ఎలా సునాయాసంగా సాధించాలో... రామాయణం మనకు అలవోకగా బోధించింది.
మానవ బలహీనతలు


ఆత్మస్తుతి పరనింద మనసును ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అయినా ఆ సంతోషం చిరకాలం నిలవదు. స్వల్ప విజయాలను ఘనవిజయాలుగా ప్రచారం చేసుకుంటూ తమ సుగుణాలను తామే పొగుడుకునేవారు జీవితంలో రాణించలేరు. తనంతటివాడు లేడని మిడిసిపడుతూ తనకు తానే సాటి అని భావించేవాడు అజ్ఞాని. భూమిపై నివసించే లక్షల జీవరాసుల్లో తన పాత్ర అణువంత అని గ్రహించినవాడే ఉత్తముడు. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.

‘పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నారు. సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడని, అన్నింటికీ పరమేశ్వరుడే కర్త అని భావించేవారు బుద్ధిమంతులు. సమస్తం ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందనే దృఢ విశ్వాసం గల వ్యక్తి తాను ఈశ్వరుడి చేతిలో పరికరమని భావిస్తాడు’ అని రామకృష్ణ పరమహంస బోధించారు. ఆత్మస్తుతి చేసుకునేవారు ఇతరుల దోషాలు ఎంచడంలో ప్రవీణులవుతారు. పరనింద మనసును ఉద్వేగపరుస్తుంది. కానీ, వారికి తమ దోషాల గురించి తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తారని భారతం చెబుతుంది.

ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక చివరి రోజున భీష్ముడి సలహాపై శ్రీకృష్ణుణ్ని పూజించాలని అనుకున్నప్పుడు శిశు పాలుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణుణ్ని నిందించసాగాడు. శిశుపాలుడి తల్లి కిచ్చిన మాట ప్రకారం నూరు తప్పులవరకు సహించిన శ్రీకృష్ణుడు హద్దుదాటిన వదరుబోతు తల ఖండిస్తాడు. అకారణ ద్వేషం అనర్థ హేతువు. ఇతరుల దోషాలు ఎంచుతూ సమయం వృథా చేసు కునేవారు తమ జీవితంలో ఏమీ సాధించలేరు.

అసూయా ద్వేషాలు మనిషి తోబుట్టువులు. అవి మనసును కలుషితం చేసే ఉపద్రవాలు. ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం సంకుచిత మనస్తత్వం. అసూయ ద్వేషాన్ని రగిలిస్తుంది. పగను పెంచుతుంది. అసూయాపరుడు మానసిక వేదనకు గురవుతాడు. లోకంలో ఎవరికీ ద్వేషం కలిగించనివాడు, ఎవరివల్లా ఉద్వేగానికి గురికానివాడు, ఈర్ష్య, భయం, మనోవికారం లేనివాడు అయిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడి గీతోపదేశం. అసూయాపరుడు, ఇతరులను అసహ్యించుకునేవాడు, అసంతుష్టుడు, కోపి, నిత్య శంకితుడు, పరధనోపజీవి అనే ఆరుగురూ దుఃఖభాజనులని విదుర నీతి చెబుతోంది.

జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడానికి చదువు, జ్ఞానంతోపాటు మనసులో మానవత్వపు పరిమళాలు వీచాలి. తోటివారికి సహాయం చేయగల సహృదయులు ఇతరుల దోషాలు లెక్కించరు. సజ్జన సాంగత్యం దుష్ట ఆలోచనలను దూరం చేస్తుంది. అసూయాద్వేషాలను మనసుకు చేరనీయదు. నిత్యం భగవన్నామ స్మరణలో పునీతులైనవారు నిర్మల మనస్కులై తమ శక్తికి లోబడి కార్యాచరణకు పూనుకొని విజయం సాధిస్తారు. తమతోపాటు ఇతరుల అభ్యున్నతినీ కోరుకుంటారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తారు.
మనిషిలో అపార శక్తి

ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు దూరదర్శిని, సూక్ష్మదర్శిని, మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు

భగవంతుడు ప్రతి మనిషినీ ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు. రూపం, గాత్రం, చిత్రకళ, వాక్చాతుర్యం, రచన, క్రీడలు... ఇలా ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని మనిషి అంటూ ఉండడు. వాటిని గుర్తించి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేసేవారే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా పిన్న వయసులోనే అనుభవించి, తానెవరో తెలుసుకున్నారు రమణ మహర్షి. ప్రతి మనిషి ‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పారు.

సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు.

ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవితకాలమంతా మిగిలిపోతాం. అన్ని అంగాలూ ఉండి సోమరితనంతో యాచన చేస్తూ జీవిస్తున్న ఎంతోమందికి నిక్‌ వుజిసిక్‌ ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన కాళ్లు చేతులు లేకుండా పూర్తి అంగవైకల్యంతో పుట్టాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం ప్రోత్సాహాలతో ఎన్నో రంగాల్లో ప్రత్యేకంగా రాణించాడు.


మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది. ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నించారు. శ్రవణ మార్గాన్ని పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు. కీర్తన మార్గాన్ని వాల్మీకి, రామదాసులు ఎంచుకున్నారు. స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు, తులసీదాస్‌ పాటించారు. పాదసేవన మార్గాన్ని భరతుడు ఆచరించాడు. వందన మార్గాన్ని కృష్ణ పరమాత్మ బోధించాడు. దాస్య భక్తికి హనుమ అంకితమయ్యాడు. సఖ్య భక్తిలో అర్జునుడు, సుగ్రీవుడు తరించారు. ఆత్మ నివేదన భక్తిని ద్రౌపది పాటించింది. అర్చన భక్తిని ప్రస్తుతం మానవులు ఆచరిస్తున్నారు.

తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి. అభిరుచిని బట్టి ప్రోత్సహిస్తే వారిలో మరో బుద్ధుడు, వివేకానందుడు, అబ్దుల్‌ కలాం వంటివారు సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రత్యేక వ్యక్తులుగా ఉద్భవిస్తారు.
ప్రతిక్షణం జీవించాలి

మనిషి జీవితం అమూల్యం. అది ఉత్కృష్టమైంది, దుర్లభమైందని ఎన్నో పురాణాలు పేర్కొన్నాయి. జీవించిన కాలం ఎంత అనేదానికన్నా ఎలా జీవించారు అనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాల రోజువారీ కాల చక్రం గిర్రున తిరుగు తుంది. రోజులు గడిచే కొద్దీ ఆయువు తగ్గి మృత్యువు దాపురిస్తుందన్న ఆలోచన మనిషికి రాదు. కాలం ప్రవాహ వేగంతో ప్రయాణిస్తుంది. వేగాన్ని అదుపు చేయలేం. కాలాన్ని, దాని విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవచ్చుగడచిన కాలాన్ని తలచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనిషి ఎప్పుడూ గతంలోనూ, భవి ష్యత్తులోనూ బతుకుతున్నాడే కాని, వర్తమానంలో కాదు అంటారు శ్రీరమణులు. నిన్నటిరోజు తిరిగిరాదు. రేపు ఉందో లేదో తెలియదు. నేడు సత్యం. దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. విజయాలు సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి. సార్ధకత చేకూరాలి. కలలు కనండి, వాటిని నిజం చేసు కునేలా పరిశ్రమించాల్సింది నేడే. అందుకోసం బలమైన పునాదిని వెంటనే నిర్మించాలి. అదే భవిష్య త్తులో ఎత్తయిన భవనాన్ని భరి స్తుంది అంటారు అబ్దుల్ కలాం

చేతులు కాలాక ఆకులు పట్టు కుంటే ఏం లాభం? దేనికైనా ముందుగానే ప్రణాళిక, వివేకం, విచక్షణా జ్ఞానంతో సిద్ధం కావాలి. చికిత్సకన్నా నివారణ ముఖ్యం. జీవితం విలువ తెలిస్తే ఒక్కక్షణమైనా వృథా కాదు. కాలం గడపడం ముఖ్యం కాదు. సద్విని యోగం చేసుకోవడం ప్రధానం. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైంది. ఏదైనా సాధించే శక్తికలది మానవ జీవితం అంటారు పెద్దలు. జననం ముందు అజ్ఞానం, మరణం తరవాత అజ్ఞానం... మధ్యలో విలువైన జీవితకాలం సుసంపన్న జ్ఞానం. ప్రతి నీటిబొట్టును భద్రపరిస్తే నీటి కరవు ఉండదు. ప్రతి క్షణాన్ని వివేకంతో గడిపితే శాశ్వత కీర్తి సొంతమవుతుంది.

జీవితం విలువ, కాలం వేగం అంచనా వేస్తే ప్రతి క్షణం సద్వినియోగమే. త్వరగా ప్రారంభించునిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అనేది ఆంగ్ల సామెత. రేపటి పని ఈరోజే చెయ్యి. ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యి అనేది హిందీ సూక్తి. కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయకు ప్రతిపనీ నిర్మాణాత్మకంగా ప్రతిభతో ప్రగతి వైపుగా ఉండాలని హెచ్చరిస్తారు విజ్ఞులు.

కాలాన్ని తైలధారగా వర్ణించారు. అది నిరంతరం కొనసాగే ధార. జీవితం కూడా అంతటి వేగంగా సాగుతుంది. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం.... ఒకదాని వెంట ఒకటి పరుగు పెడతాయి. ఇలా చేయలేకపోయాను, చేసి ఉంటే ఎంతో సాధించేవాణ్ని అనే నిరాశ కలగకుండా ఉండాలంటే అప్రమత్తంగా విజయాన్ని ఒడిసిపట్టాలి. ప్రతి క్షణం జీవించాలి.

హనుమ లంకలో సీత జాడ కోసం ఒక రాత్రి మొత్తం క్షణం విరామం లేకుండా వెతికాడు. అందరి మధ్య సంచరించాడు. కొంత నిరాశ ఆవహించినా ధైర్యాన్ని వీడలేదు. నిరాటంకంగా, నిర్విఘ్నంగా ప్రయత్నం కొనసాగించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. విలువైన, అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంతో తీవ్ర నిరాశతో ముగించేవారు పిరికివారు, మూఢులు. భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం మానవ జీవితం. ఆస్వాదిస్తూ అనుభవించేవారే చరితార్థులు.
జీవితం అపురూప వరం

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు.

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.

ప్రసన్నత, ప్రశాంతత, భగవత్‌ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.

జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
జీవితం అపురూప వరం

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.

ప్రసన్నత, ప్రశాంతత, భగవత్‌ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.

జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!