కారణం ఏమిటి?
ఈ లోకంలో ఆకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. బాల్యమంతా దానికి సంబంధించిన ఏ ఆలోచనా లేకుండా సాగిపోతుంది. కొంత వయసు వచ్చేవరకు తన ఎదుగుదలకు, శరీరభాగాల కదలికకు సైతం ఏదో ఒక శక్తి మూలమై ఉందనే ఊహ కలగదు. ఆ దివ్యశక్తినే అందరూ తలో రకంగా భావిస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ కలిగే రకరకాల అనుభవాల సారంతో కొంత వివేకం కలిగి, మానవజన్మ ఏదో ఒక విద్యుక్తధర్మ నిర్వహణ నిమిత్తం ప్రాప్తించిందనే స్పృహ ఏర్పడుతుంది. అంతవరకు తన గురించి తనకే తెలియని పసివాడిలాగే, యాంత్రికంగా జీవితం సాగిపోతుంటుంది.
అద్భుతమైన యంత్రంలా, వాహనంలా, బహుళార్ధక సాధక పరికరంలా ఉపకరించే మానవ శరీరం- పరమాత్మ ప్రసాదితం. ఆ దివ్యానుగ్రహంతోనే హృదయనుండే శ్వాసక్రియలతో కూడిన జీవవైతన్యం సాగుతుంటుంది. జీవరాశులన్నీ పరమాత్మ ప్రమేయంతో తమతమ కర్మలు చేస్తుంటాయి. శరీరాల పరిమాణంలోను, పరిణామంలోను అంతరం ఉన్నా అన్నింటిలోనూ పరమాత్మ అంశ మాత్రం ఒకటే అన్నీ ఆయన బందువర్గంలోనివే అన్నింట్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిణామం చెందినవాడు మానవుడు. మానవజన్మ ఏ నిమిత్తం ఎంత సామర్థ్యంతో ప్రాప్తించిందో అనే ఎరుక కూడా సాధించగల సమర్థుడు. ఆ ఎరుకతో తన ధర్మాచరణే ధ్యేయంగా జీవితం సాగించే మానవుడికి పరమాత్మ అనుగ్రహమైన ఆధ్యాత్మిక శక్తి బలంగా రూపొందుతుంది. జీవన యానానికి ఉపకరించే శారీరక, మానసిక శక్తులకు మూలం ఆధ్యాత్మిక శక్తి. జీవితం సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం. మానసికం, శారీరకం అనే మూడు విధాలైన శక్తులు కూడా అవసరమే. మూడింటి సహకారంతోనే జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోవచ్చు. వాటిమధ్య సమన్వయం సాధించలేని జీవితం కేవలం యాంత్రికంగా సాగుతున్నట్లు ఉంటుంది. యాంత్రికమైన జీవితంలో ఏదీ కూడా స్వయంకృషితో సాధించిన ఆత్మ తృప్తి కలగదు. ఆనందంగా జీవిస్తున్న అనుభూతి కలగదు. యాంత్రికంగా సాగుతున్నట్లు కనిపించే జీవితానికి వెనక ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది.
అంతర్యామి
విశ్వంలో భాగమైన ప్రతీ జీవికి ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. వేదవాక్కు. తన సృష్టిలో జీవులన్నీ వాటివాటి ప్రజ్ఞతో పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా ఉండాలని, లోకాస్సమస్తా సుఖినోభవంతు అని సృష్టికర్త ఆశించడం సహజం. ఆయన సంకల్ప మార్గంలో సాగడమే ఆధ్యాత్మిక పరమావధి. మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉన్నంత కాలం మనకు ఆయన దివ్యశక్తి తోడవుతుంది. ఆధ్యాత్మిక శక్తిప్రబాత ఎవరో తోడున్నారనే
విశ్వాసంతో ఏ పని చేపట్టినా విజయం పొందగల మనో ధైర్యం కలుగుతుంది. పరమాత్మ ప్రమేయం లేకుండా ఏ కార్యమూ జరగదు. తాము ఉన్నత స్థితికి చేరాలంటే కేవలం తమ ప్రజ్ఞ కాదు, పరమాత్మ్య దివ్యానుగ్రహం సైతం పొందాలని గ్రహించడమే వివేకం. అది సాధించడానికి తగిన కర్తవ్య నిర్వహణతో జీవించాలి. అప్పుడే మానవ జన్మ ప్రాప్తించిన నిమిత్త కారణానికి న్యాయం చేసినట్లు అవుతుంది.
ఏ సంకల్ప సాధనకై ఎంత కృషి చేయవచ్చు అనే వెసులుబాటు మన చేతిలోనూ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛ అద్భుతమైన వరం లాంటిది. ఆ స్వేచ్ఛ వినియోగంలో వరప్రదాత సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది విస్మరించకుండా చేసే కృషి వల్ల లభించిన వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ దివ్యానుగ్రహ సాధన ఫలితంగా పొందే ఆనందం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. మానవజన్మ సార్ధకం అవుతుంది.
ఈ లోకంలో ఆకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. బాల్యమంతా దానికి సంబంధించిన ఏ ఆలోచనా లేకుండా సాగిపోతుంది. కొంత వయసు వచ్చేవరకు తన ఎదుగుదలకు, శరీరభాగాల కదలికకు సైతం ఏదో ఒక శక్తి మూలమై ఉందనే ఊహ కలగదు. ఆ దివ్యశక్తినే అందరూ తలో రకంగా భావిస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ కలిగే రకరకాల అనుభవాల సారంతో కొంత వివేకం కలిగి, మానవజన్మ ఏదో ఒక విద్యుక్తధర్మ నిర్వహణ నిమిత్తం ప్రాప్తించిందనే స్పృహ ఏర్పడుతుంది. అంతవరకు తన గురించి తనకే తెలియని పసివాడిలాగే, యాంత్రికంగా జీవితం సాగిపోతుంటుంది.
అద్భుతమైన యంత్రంలా, వాహనంలా, బహుళార్ధక సాధక పరికరంలా ఉపకరించే మానవ శరీరం- పరమాత్మ ప్రసాదితం. ఆ దివ్యానుగ్రహంతోనే హృదయనుండే శ్వాసక్రియలతో కూడిన జీవవైతన్యం సాగుతుంటుంది. జీవరాశులన్నీ పరమాత్మ ప్రమేయంతో తమతమ కర్మలు చేస్తుంటాయి. శరీరాల పరిమాణంలోను, పరిణామంలోను అంతరం ఉన్నా అన్నింటిలోనూ పరమాత్మ అంశ మాత్రం ఒకటే అన్నీ ఆయన బందువర్గంలోనివే అన్నింట్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిణామం చెందినవాడు మానవుడు. మానవజన్మ ఏ నిమిత్తం ఎంత సామర్థ్యంతో ప్రాప్తించిందో అనే ఎరుక కూడా సాధించగల సమర్థుడు. ఆ ఎరుకతో తన ధర్మాచరణే ధ్యేయంగా జీవితం సాగించే మానవుడికి పరమాత్మ అనుగ్రహమైన ఆధ్యాత్మిక శక్తి బలంగా రూపొందుతుంది. జీవన యానానికి ఉపకరించే శారీరక, మానసిక శక్తులకు మూలం ఆధ్యాత్మిక శక్తి. జీవితం సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం. మానసికం, శారీరకం అనే మూడు విధాలైన శక్తులు కూడా అవసరమే. మూడింటి సహకారంతోనే జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోవచ్చు. వాటిమధ్య సమన్వయం సాధించలేని జీవితం కేవలం యాంత్రికంగా సాగుతున్నట్లు ఉంటుంది. యాంత్రికమైన జీవితంలో ఏదీ కూడా స్వయంకృషితో సాధించిన ఆత్మ తృప్తి కలగదు. ఆనందంగా జీవిస్తున్న అనుభూతి కలగదు. యాంత్రికంగా సాగుతున్నట్లు కనిపించే జీవితానికి వెనక ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది.
అంతర్యామి
విశ్వంలో భాగమైన ప్రతీ జీవికి ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. వేదవాక్కు. తన సృష్టిలో జీవులన్నీ వాటివాటి ప్రజ్ఞతో పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా ఉండాలని, లోకాస్సమస్తా సుఖినోభవంతు అని సృష్టికర్త ఆశించడం సహజం. ఆయన సంకల్ప మార్గంలో సాగడమే ఆధ్యాత్మిక పరమావధి. మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉన్నంత కాలం మనకు ఆయన దివ్యశక్తి తోడవుతుంది. ఆధ్యాత్మిక శక్తిప్రబాత ఎవరో తోడున్నారనే
విశ్వాసంతో ఏ పని చేపట్టినా విజయం పొందగల మనో ధైర్యం కలుగుతుంది. పరమాత్మ ప్రమేయం లేకుండా ఏ కార్యమూ జరగదు. తాము ఉన్నత స్థితికి చేరాలంటే కేవలం తమ ప్రజ్ఞ కాదు, పరమాత్మ్య దివ్యానుగ్రహం సైతం పొందాలని గ్రహించడమే వివేకం. అది సాధించడానికి తగిన కర్తవ్య నిర్వహణతో జీవించాలి. అప్పుడే మానవ జన్మ ప్రాప్తించిన నిమిత్త కారణానికి న్యాయం చేసినట్లు అవుతుంది.
ఏ సంకల్ప సాధనకై ఎంత కృషి చేయవచ్చు అనే వెసులుబాటు మన చేతిలోనూ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛ అద్భుతమైన వరం లాంటిది. ఆ స్వేచ్ఛ వినియోగంలో వరప్రదాత సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది విస్మరించకుండా చేసే కృషి వల్ల లభించిన వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ దివ్యానుగ్రహ సాధన ఫలితంగా పొందే ఆనందం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. మానవజన్మ సార్ధకం అవుతుంది.
స్వధర్మం
యుద్ధ విముఖుడైన అర్జును డికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేస్తూ... స్వధర్మం గురించి వివ రించాడు. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధానికి వెనుకాడకూడదని, ఎందుకంటే అది అతని స్వధర్మమ మనీ స్పష్టం చేశాడు. భగవద్గీతను ప్రారంభిస్తూ “అది' శాశ్వతమైనది, అవ్యక్తమైనది, అంతటా వ్యాపించి ఉన్నది" అని చెప్పాడు. 'అది' అనే మాటను 'ఆత్మ' అని చెప్పుకొంటే... అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. తరువాత ఆయన స్వధర్మం గురించి తెలిపాడు. అంతరాత్మ గురించిన జ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ మన ప్రస్తుత స్థితి, రెండోది స్వధర్మాన్ని గురించి తెలుసుకోవడం, అంతిమంగా... అంతరాత్మను చేరుకోవడం. వాస్తవంలో, 'మన ప్రస్తుత స్థితి' అనేది మన స్వధర్మం, అనుభవాలు, విజ్ఞానం, జ్ఞాపకాలు, చంచలమైన మనస్సు ద్వారా పోగు చేసుకొనే ఊహాగానాల సమ్మేళనం. మానసికమైన ఈ భారాలన్నిటి నుంచీ మనల్ని మనం విముక్తి చేసుకున్నప్పుడు... స్వధర్మం మెల్లగా వ్యక్తం కావడం ప్రారంభిస్తుంది. 'క్షత్రియ' అనే మాట 'క్షత్', 'త్రయతే' అనే పదాల సమ్మేళనం. 'క్షత్' అంటే హాని, 'త్రయతే' అంటే రక్షణ ఇవ్వడం. హాని నుంచి రక్షణ ఇచ్చేవారు క్షత్రియులు. మాతృమూర్తి దీనికి చక్కటి ఉదాహరణ. తల్లి తన బిడ్డలకు గర్భంలో రక్షణ కల్పిస్తుంది. వారు పుట్టాక... తమ కాళ్ళ మీద తాము నిలడేవరకూ కాపాడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే మొదటి క్షత్రియ ఆమె. బిడ్డల సంరక్షణలో ఆమెకు శిక్షణ లేకపోవచ్చు, అనుభవం లేక పోవచ్చు. కానీ అది ఆమెకు సహజంగానే వచ్చేస్తుంది. స్వధర్మం అనే లక్షణానికి ఇది సంగ్రహమైన అవలోకనం. ఒకసారి ఒక గులాబీ... గంభీరమైన తామర పువ్వు చేతిలో దెబ్బతింది. అప్పుడు తనుకూడా తామర పువ్వు కావాలనే కోరిక దానిలో మొదలైంది. కానీ ఒక గులాబీ... కమలంగా మారే అవకాశం లేదు. తన సామర్థ్యం కన్నా భిన్నంగా ఉండాలని గులాబీ కోరుకుంది. మనలో కూడా ఇటువంటి ధోరణులే ఉంటాయి. మనం ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దీని ఫలితంగా, అర్జునుడిలా నిరాశనూ, నిస్పృహను ఎదుర్కొంటూ ఉంటాం. గులాబీ తన రంగును, పరిమాణాన్నీ, ఆకృతినీ మార్చుకోగలదు. కానీ అది అప్పటికీ గులాబీగానే ఉంటుంది. అదే దాని
స్వధర్మం
యుద్ధ విముఖుడైన అర్జును డికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేస్తూ... స్వధర్మం గురించి వివ రించాడు. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధానికి వెనుకాడకూడదని, ఎందుకంటే అది అతని స్వధర్మమ మనీ స్పష్టం చేశాడు. భగవద్గీతను ప్రారంభిస్తూ “అది' శాశ్వతమైనది, అవ్యక్తమైనది, అంతటా వ్యాపించి ఉన్నది" అని చెప్పాడు. 'అది' అనే మాటను 'ఆత్మ' అని చెప్పుకొంటే... అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. తరువాత ఆయన స్వధర్మం గురించి తెలిపాడు. అంతరాత్మ గురించిన జ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ మన ప్రస్తుత స్థితి, రెండోది స్వధర్మాన్ని గురించి తెలుసుకోవడం, అంతిమంగా... అంతరాత్మను చేరుకోవడం. వాస్తవంలో, 'మన ప్రస్తుత స్థితి' అనేది మన స్వధర్మం, అనుభవాలు, విజ్ఞానం, జ్ఞాపకాలు, చంచలమైన మనస్సు ద్వారా పోగు చేసుకొనే ఊహాగానాల సమ్మేళనం. మానసికమైన ఈ భారాలన్నిటి నుంచీ మనల్ని మనం విముక్తి చేసుకున్నప్పుడు... స్వధర్మం మెల్లగా వ్యక్తం కావడం ప్రారంభిస్తుంది. 'క్షత్రియ' అనే మాట 'క్షత్', 'త్రయతే' అనే పదాల సమ్మేళనం. 'క్షత్' అంటే హాని, 'త్రయతే' అంటే రక్షణ ఇవ్వడం. హాని నుంచి రక్షణ ఇచ్చేవారు క్షత్రియులు. మాతృమూర్తి దీనికి చక్కటి ఉదాహరణ. తల్లి తన బిడ్డలకు గర్భంలో రక్షణ కల్పిస్తుంది. వారు పుట్టాక... తమ కాళ్ళ మీద తాము నిలడేవరకూ కాపాడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే మొదటి క్షత్రియ ఆమె. బిడ్డల సంరక్షణలో ఆమెకు శిక్షణ లేకపోవచ్చు, అనుభవం లేక పోవచ్చు. కానీ అది ఆమెకు సహజంగానే వచ్చేస్తుంది. స్వధర్మం అనే లక్షణానికి ఇది సంగ్రహమైన అవలోకనం. ఒకసారి ఒక గులాబీ... గంభీరమైన తామర పువ్వు చేతిలో దెబ్బతింది. అప్పుడు తనుకూడా తామర పువ్వు కావాలనే కోరిక దానిలో మొదలైంది. కానీ ఒక గులాబీ... కమలంగా మారే అవకాశం లేదు. తన సామర్థ్యం కన్నా భిన్నంగా ఉండాలని గులాబీ కోరుకుంది. మనలో కూడా ఇటువంటి ధోరణులే ఉంటాయి. మనం ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దీని ఫలితంగా, అర్జునుడిలా నిరాశనూ, నిస్పృహను ఎదుర్కొంటూ ఉంటాం. గులాబీ తన రంగును, పరిమాణాన్నీ, ఆకృతినీ మార్చుకోగలదు. కానీ అది అప్పటికీ గులాబీగానే ఉంటుంది. అదే దాని
స్వధర్మం
దృష్టి కోణం
కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే 'గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది' అంటారు తత్వజ్ఞులు సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు వాటిని తేలిగ్గా చూడటం, సులభంగా పొందడం, మామూలుగా దగ్గరకు చేరడం కుదరదు.
చెట్టు నుంచి కోసి తినే పండు కడుపు నింపుతుంది. దానితో ఒక్కరి ఆకలి మాత్రమే తీరవచ్చు. అంతకంటే మరే అనుభూతినీ ఇవ్వదు. అదే పండును దేవుడికి నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది. చిన్న ముక్కలుగా చేసి ఎందరికి పంచినా స్వీకరించే వారందరికీ 'భగవంతుడి అనుగ్రహం పొందగలిగాం' అనే అనుభూతికి లోనయేట్టు చేస్తుంది. ఆ తృప్తి జీవితాన ఉత్సాహాన్ని నింపుతుంది. ఏ ఆశయం లేకుండా గంగానదిలో స్నానం చేసినా, అది సాధారణ స్నాన జలమే అవుతుంది. మామూలు చోట స్నానం లాగానే అక్కడా స్నానం చేసేవారికి
అంతకంటే అందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. గంగ నుంచే కాకుండా ఏ ఇతర జల వనరు నుంచి తెచ్చిన నీటినైనా శంఖంలో పోస్తే అది తీర్థం అనిపించుకుంటుంది. పవిత్రమైనదనే భావనను కలిగిస్తుంది. చుక్కలుగా అరచేతిలో పడిన ఆ ఉద్ధరిణెడు బిందువులనే 'తీర్థప్రసాదం' అంటారు. అది స్వీకరించిన వారికి మనోబలాన్ని పెంచుతుంది సంతృప్తిని ఇస్తుంది. సాధారణ గరిక(గడ్డి)నే వినాయక చవితి నాడు ఆయనకు పూజాద్రవ్యంగా సమర్పిస్తే పవిత్రతను సంతరించుకుంటుంది. విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పత్రిగా ప్రసిద్ధి పొందింది. ఆ
రోజుల్లో సైతం ఒకే రోజు ఒకరికి స్మరణ దినం. మరొకరికి సంబరదినం, ఇంకొకరికి పర్వదినం కావచ్చు. ఆయా వ్యక్తుల అనుభవాలు, అనుభూతులే దాన్ని నిర్ధారిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. సాధారణంగా గడుపుతూ పోతే కాలమే గడిచి పోతుంది. కొన్నాళ్ళకు ఆయువూ తీరిపోతుంది.
అదే మనిషి ఏదైనా ఘనత సాధిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటే... మహనీయుడు, స్ఫూర్తిదాత, మార్గదర్శి ఆదర్శ పురుషుడు... ఇలా ఎన్నో అవుతాడు. పదవి, అధికారం లాంటివి వచ్చిన వారు నిన్నటి వరకు నీతో కలిసి మెలిసి తిరిగిన వారే కావచ్చు. కానీ ఒక రోజులోనే మీ మీ స్థానాల్లో చాలా తేడా వచ్చేస్తుంది.
'మరి అలాంటప్పుడు అందరికీ ప్రసాదం, తీర్థం దొరుకుతాయా... అందరూ పండుగ చేసుకోగలరా, అందరూ మహనీయులు కాగలరా?' అనే ఆలోచన రావచ్చు. అందుకోసమే నీటినంతటినీ తీర్థంగా, తీర్థంగా, పదార్థాలనన్నింటినీ భగవత్ప్రసాదంగా, ప్రతి రోజునూ పండుగలా చూడటం అలవాటు చేసుకోవాలి. అది మనోభావన మీదే ఆధారపడి ఉంటుంది అంటారు బోధకులు, సాధకులు.
అలా ప్రతి పదార్థాన్నీ ప్రసాదంగా భావించిన నాడు దుబారా, దుర్వినియోగం తగ్గుతాయి. ప్రతి నీటినీ తీర్థంగా భావించిన నాడు నీటిని కలుషితం చేయడానికి వెనకాడతారు. ప్రతి రోజునూ పండుగగా భావించిననాడు మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా అనుకూల భావనలతో జీవిస్తారు. తోటి వారందరినీ భగవత్స్వరూపులుగా భావించిన నాడు లోకంలో విద్వేషాలు, విభేదాలు లేకుండా 'వసుదైక కుటుంబం' అనిపించుకుంటుంది. అప్పుడు 'స్వర్గమంటే ఎక్కడో లేదు. ఆ లోకం ఇదే' అనిపిస్తుంది. 'దృష్టి కోణం మారితే, సృష్టి కోణం మారుతుంది' అనే మాటకు అర్థం ఇదే.
కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే 'గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది' అంటారు తత్వజ్ఞులు సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు వాటిని తేలిగ్గా చూడటం, సులభంగా పొందడం, మామూలుగా దగ్గరకు చేరడం కుదరదు.
చెట్టు నుంచి కోసి తినే పండు కడుపు నింపుతుంది. దానితో ఒక్కరి ఆకలి మాత్రమే తీరవచ్చు. అంతకంటే మరే అనుభూతినీ ఇవ్వదు. అదే పండును దేవుడికి నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది. చిన్న ముక్కలుగా చేసి ఎందరికి పంచినా స్వీకరించే వారందరికీ 'భగవంతుడి అనుగ్రహం పొందగలిగాం' అనే అనుభూతికి లోనయేట్టు చేస్తుంది. ఆ తృప్తి జీవితాన ఉత్సాహాన్ని నింపుతుంది. ఏ ఆశయం లేకుండా గంగానదిలో స్నానం చేసినా, అది సాధారణ స్నాన జలమే అవుతుంది. మామూలు చోట స్నానం లాగానే అక్కడా స్నానం చేసేవారికి
అంతకంటే అందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. గంగ నుంచే కాకుండా ఏ ఇతర జల వనరు నుంచి తెచ్చిన నీటినైనా శంఖంలో పోస్తే అది తీర్థం అనిపించుకుంటుంది. పవిత్రమైనదనే భావనను కలిగిస్తుంది. చుక్కలుగా అరచేతిలో పడిన ఆ ఉద్ధరిణెడు బిందువులనే 'తీర్థప్రసాదం' అంటారు. అది స్వీకరించిన వారికి మనోబలాన్ని పెంచుతుంది సంతృప్తిని ఇస్తుంది. సాధారణ గరిక(గడ్డి)నే వినాయక చవితి నాడు ఆయనకు పూజాద్రవ్యంగా సమర్పిస్తే పవిత్రతను సంతరించుకుంటుంది. విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పత్రిగా ప్రసిద్ధి పొందింది. ఆ
రోజుల్లో సైతం ఒకే రోజు ఒకరికి స్మరణ దినం. మరొకరికి సంబరదినం, ఇంకొకరికి పర్వదినం కావచ్చు. ఆయా వ్యక్తుల అనుభవాలు, అనుభూతులే దాన్ని నిర్ధారిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. సాధారణంగా గడుపుతూ పోతే కాలమే గడిచి పోతుంది. కొన్నాళ్ళకు ఆయువూ తీరిపోతుంది.
అదే మనిషి ఏదైనా ఘనత సాధిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటే... మహనీయుడు, స్ఫూర్తిదాత, మార్గదర్శి ఆదర్శ పురుషుడు... ఇలా ఎన్నో అవుతాడు. పదవి, అధికారం లాంటివి వచ్చిన వారు నిన్నటి వరకు నీతో కలిసి మెలిసి తిరిగిన వారే కావచ్చు. కానీ ఒక రోజులోనే మీ మీ స్థానాల్లో చాలా తేడా వచ్చేస్తుంది.
'మరి అలాంటప్పుడు అందరికీ ప్రసాదం, తీర్థం దొరుకుతాయా... అందరూ పండుగ చేసుకోగలరా, అందరూ మహనీయులు కాగలరా?' అనే ఆలోచన రావచ్చు. అందుకోసమే నీటినంతటినీ తీర్థంగా, తీర్థంగా, పదార్థాలనన్నింటినీ భగవత్ప్రసాదంగా, ప్రతి రోజునూ పండుగలా చూడటం అలవాటు చేసుకోవాలి. అది మనోభావన మీదే ఆధారపడి ఉంటుంది అంటారు బోధకులు, సాధకులు.
అలా ప్రతి పదార్థాన్నీ ప్రసాదంగా భావించిన నాడు దుబారా, దుర్వినియోగం తగ్గుతాయి. ప్రతి నీటినీ తీర్థంగా భావించిన నాడు నీటిని కలుషితం చేయడానికి వెనకాడతారు. ప్రతి రోజునూ పండుగగా భావించిననాడు మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా అనుకూల భావనలతో జీవిస్తారు. తోటి వారందరినీ భగవత్స్వరూపులుగా భావించిన నాడు లోకంలో విద్వేషాలు, విభేదాలు లేకుండా 'వసుదైక కుటుంబం' అనిపించుకుంటుంది. అప్పుడు 'స్వర్గమంటే ఎక్కడో లేదు. ఆ లోకం ఇదే' అనిపిస్తుంది. 'దృష్టి కోణం మారితే, సృష్టి కోణం మారుతుంది' అనే మాటకు అర్థం ఇదే.
దీనికి అహంకారం?
నిత్య వికాసమే జీవితం. అహంకారం, సంకుచితత్వమే మరణం. సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభం అహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనే స్థానం అన్నది ఉపనిషత్ వ్యాఖ్య. నేను, నాది నావారు, పెరవారు అనేభావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి. స్వార్థపరత్వమే అహంకారానికి ప్రాతిపదిక. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రపుటల్లో అహంకారంతో విర్రవీగినవారి గురించి చదువుకొని తెలుసుకున్నాం. అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుడో అర్థం అవుతుంది. రామాయణం చదివి, రావణుడిలా ప్రవర్తించే మానవులనెందరినో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయా ద్వేషాలతో ప్రవర్తించి అసువులు బాసిన శిశుపాలుడు అసూయా గర్వాలకు మరో పేరు. అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటివారు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు.
మంచి చెప్పేవారే మనవారు. మన మేలుకోరేవారు నిస్వార్థపరులు. మనం చెడిపోతే సంతోషించేవారు స్వార్థపరులు. ఇలాంటివారిలోనే అహంకారం నిండి ఉంటుంది. ఫల్గుణుడు, శ్రీకృష్ణుడు ఎంతోకాలం సన్నిహితులుగా మెలిగారు. రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్థసారథి తన చెలికాడే కదా... ఈయన చెప్పేది తానెందుకు వినాలని కౌంతేయుడు భావించి ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేదే కాదేమో! ధీరులు అంటే కండబలం ఉన్నవారు కానేకాదు. సమర్థులై, వివేకం కలిగినవారే ధీరులు. సమర్థత ఉంటే కార్యసాధకులవుతారు. అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చకితులం అవుతాం. కండ బలంకన్నా అతడి మస్తిష్కం గొప్పది. అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు. అతడి బలహీనత రాజ్యకాంక్ష. ఆలోచనలు మాత్రం గొప్పవి. జయాపజయాలు ఇహానికి సంబంధించినవని శాంతిలోనే ధర్మం ఉందని గ్రహించాడు. అందుకే కళింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం వివేకం మేలుకొని గౌతమ బుద్ధుడు చెప్పిన పథంలో నడిచాడు.
సమర్థులైన కార్య సాధకులను అదృష్టం వరిస్తుంది. దిగంతాలను తాకే ధైర్యోత్సాహాలతో భగీరథుడిలా సర్వుల మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. బలవంతుడ నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలుకాదు... ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.
చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.
మనం మంచిని సాధన చేస్తే మంచివాళ్లమే అవుతాం. అనవసరంగా అహంకరిస్తూ అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాం. మోహన్దాస్ కరంచంద్ గాంధీ బక్కపలచనివాడు. కానీ... మహా తేజోవంతుడు. ఆత్మబలాన్ని ఉదృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో శాంతియుద్ధం చేశాడు. చివరకు మువ్వన్నెల జెండా ఎగరనే ఎగిరింది. సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే ధీశక్తి.
అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషం లాంటి భయానక జ్వాలకు అదే కారణం. గుణాల్లో కెల్లా ఉత్తమమైంది ప్రేమ. అందరినీ ప్రేమించగలిగితే అహం అనేదే ఉండదని బుద్ధుడి బోధ. అహం అసహనానికి కారణం అయితే, ప్రేమ సుగుణాలకు మూలం. ప్రేమ అనే యశస్సు ముందు అహం అపకీర్తి పాలవుతుంది!
నిత్య వికాసమే జీవితం. అహంకారం, సంకుచితత్వమే మరణం. సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభం అహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనే స్థానం అన్నది ఉపనిషత్ వ్యాఖ్య. నేను, నాది నావారు, పెరవారు అనేభావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి. స్వార్థపరత్వమే అహంకారానికి ప్రాతిపదిక. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రపుటల్లో అహంకారంతో విర్రవీగినవారి గురించి చదువుకొని తెలుసుకున్నాం. అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుడో అర్థం అవుతుంది. రామాయణం చదివి, రావణుడిలా ప్రవర్తించే మానవులనెందరినో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయా ద్వేషాలతో ప్రవర్తించి అసువులు బాసిన శిశుపాలుడు అసూయా గర్వాలకు మరో పేరు. అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటివారు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు.
మంచి చెప్పేవారే మనవారు. మన మేలుకోరేవారు నిస్వార్థపరులు. మనం చెడిపోతే సంతోషించేవారు స్వార్థపరులు. ఇలాంటివారిలోనే అహంకారం నిండి ఉంటుంది. ఫల్గుణుడు, శ్రీకృష్ణుడు ఎంతోకాలం సన్నిహితులుగా మెలిగారు. రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్థసారథి తన చెలికాడే కదా... ఈయన చెప్పేది తానెందుకు వినాలని కౌంతేయుడు భావించి ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేదే కాదేమో! ధీరులు అంటే కండబలం ఉన్నవారు కానేకాదు. సమర్థులై, వివేకం కలిగినవారే ధీరులు. సమర్థత ఉంటే కార్యసాధకులవుతారు. అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చకితులం అవుతాం. కండ బలంకన్నా అతడి మస్తిష్కం గొప్పది. అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు. అతడి బలహీనత రాజ్యకాంక్ష. ఆలోచనలు మాత్రం గొప్పవి. జయాపజయాలు ఇహానికి సంబంధించినవని శాంతిలోనే ధర్మం ఉందని గ్రహించాడు. అందుకే కళింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం వివేకం మేలుకొని గౌతమ బుద్ధుడు చెప్పిన పథంలో నడిచాడు.
సమర్థులైన కార్య సాధకులను అదృష్టం వరిస్తుంది. దిగంతాలను తాకే ధైర్యోత్సాహాలతో భగీరథుడిలా సర్వుల మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. బలవంతుడ నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలుకాదు... ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.
చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.
మనం మంచిని సాధన చేస్తే మంచివాళ్లమే అవుతాం. అనవసరంగా అహంకరిస్తూ అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాం. మోహన్దాస్ కరంచంద్ గాంధీ బక్కపలచనివాడు. కానీ... మహా తేజోవంతుడు. ఆత్మబలాన్ని ఉదృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో శాంతియుద్ధం చేశాడు. చివరకు మువ్వన్నెల జెండా ఎగరనే ఎగిరింది. సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే ధీశక్తి.
అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషం లాంటి భయానక జ్వాలకు అదే కారణం. గుణాల్లో కెల్లా ఉత్తమమైంది ప్రేమ. అందరినీ ప్రేమించగలిగితే అహం అనేదే ఉండదని బుద్ధుడి బోధ. అహం అసహనానికి కారణం అయితే, ప్రేమ సుగుణాలకు మూలం. ప్రేమ అనే యశస్సు ముందు అహం అపకీర్తి పాలవుతుంది!
అవకాశమే ఆయుధం
మనిషిని బతికించే మధురసాయనం లాంటి మహాశక్తి- ఆశ. అది మరణశయ్యపై నుంచీ లేపి మళ్ళీ నడిపించగల మహామంత్రం. మనిషిని నిట్టనిలువునా చీల్చి మసి చేసే మారణాయుధం- నిరాశ. అది ఎంతటి శక్తిమంతుడినైనా దుర్బలుణ్ని చేసే
మహమ్మారి. ఏ రంగంలోనైనా జయాపజయాలు, కష్టసుఖాలు సహజం.
ఎదగాలనుకున్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. ఓరిమితో తట్టుకుని నిలబడాలి.
దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. తగిలిన ప్రతి గాయాన్ని ఓపికతో మాన్పుకొని మళ్ళీ ప్రయత్నం కొనసాగించాలి. మధుర పదార్థం మోతాదుకు మించి స్వీకరిస్తే వెగటు పుడుతుంది. విజయాలకే అలవడిన జీవితానికి ఓటమి బాధ తెలియదు. అందుకే ఎప్పుడైనా పరాజయం ఎదురైనా కుంగిపోకూడదు. కష్టాల్ని
అనుభవించాలి. రాటు తేలాలి. ఓటమి కాటుతోనే గెలవాలన్న కసి, పట్టుదల మొదలవుతాయి. పరాజయాన్ని డీ కొట్టి స్థిరంగా నిలిచినప్పుడు, కష్టాన్ని తట్టుకుని సుఖానికి ఎదురుచూసినప్పుడు- వాటి శక్తి తెలుస్తుంది. వీటికి తగిన ప్రణాళికల్ని సిద్ధంచేసుకోవాలి. అహరహం శ్రమించాలి. ఎత్తుకు వైయెత్తులు వెయ్యాలి. చాణక్యుడిలా గెలుపు సూత్రాన్ని సొంతం చేసుకోవాలి. విజయ కంకణధారుల ధాటికి తలవంచి ఓటమి పలాయనం చిత్త గిస్తుంది. చిమ్మచీకటిలో పొరుగూరికి బయలుదేరాడో వ్యక్తి దారిలో కుంభవృష్టి మొదలైంది. రక్షణ కోసం ఓ చెట్టునీడకు చేరాడు. ఆ పక్కనే ఓ దిగుడు బావి. జారి అందులో పడిపోయాడు. ప్రాణా లపై ఆశ కోల్పోయి చీకట్లో కాలం. గడిపాడు. తెల్లవారింది. వర్షం తగ్గింది. బయటపడే మార్గం కనపడలేదు. ఇంతలో ఈదురుగాలికి చెట్టుకొమ్మ బావిలోకి ఒరిగింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదా వ్యక్తి, మూడు, నాలుగు సార్లు ప్రయత్నించాక కొమ్మ పట్టుకుని పైకి వచ్చాడు. దైవానికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోయాడు. జీవితంలో యాదృచ్ఛికంగా లభించిన అవకాశాల్ని తెలివిగా దక్కించుకున్నవారే విజ్ఞులు, తగిన కృషి, పట్టుదల, విశ్వాసం, దైర్యం- ప్రయత్నానికి తోడవ్వాలి. అప్పుడు విజయం తలవంచి దాసోహమనక తప్పదు.
అవకాశాలు తమంత తాముగా మన చెంతకు చేరవు. మనం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. చేజిక్కించుకుని కార్యనిర్వాహణలో విజయం సాధించాలి. మనలోని ఆసక్తి, శ్రద్ధ గమనించిన వివేకులు కొందరు తమ చెయ్యి అందించి అవకాశాల బాటలు పరుస్తారు. ఆ చేతులను బలంగా పట్టుకుని ఎగబాకి ఆ బాటలో విజయ ధ్వజాన్ని నాటాలే గాని, జారిపోకూడదు. స్వశక్తితో ఇతరులను ఒప్పించి మెప్పించాలి. విజయపరంపరను ఖాతాలో జమచేసుకోవాలి. వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి. అనుభవాన్ని, తెలివిని, శక్తిని కలగలుపుకొని గడ్డిపోచలను బలిష్టమైన పలుపు తాడుగా మార్చుకోవాలి. చేతికందిన అవకాశాల్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా పరహితంగా ఉపయోగించాలి. వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపకరించిననాడు పరమార్థం నెరవేరినట్లే. పూలబాటలో తాము నడుస్తూ పదిమందినీ తమతో నడిపించాలి. దానం, ధర్మం, సమాజసేవ నిర్వహించే అవకాశం చేతికందినప్పుడు పరమాత్మ ఆదేశంగా స్వీకరించి ఇతరుల సంక్షేమానికి నడుంకట్టేవారు ధన్యజీవులు.
మనిషిని బతికించే మధురసాయనం లాంటి మహాశక్తి- ఆశ. అది మరణశయ్యపై నుంచీ లేపి మళ్ళీ నడిపించగల మహామంత్రం. మనిషిని నిట్టనిలువునా చీల్చి మసి చేసే మారణాయుధం- నిరాశ. అది ఎంతటి శక్తిమంతుడినైనా దుర్బలుణ్ని చేసే
మహమ్మారి. ఏ రంగంలోనైనా జయాపజయాలు, కష్టసుఖాలు సహజం.
ఎదగాలనుకున్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. ఓరిమితో తట్టుకుని నిలబడాలి.
దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. తగిలిన ప్రతి గాయాన్ని ఓపికతో మాన్పుకొని మళ్ళీ ప్రయత్నం కొనసాగించాలి. మధుర పదార్థం మోతాదుకు మించి స్వీకరిస్తే వెగటు పుడుతుంది. విజయాలకే అలవడిన జీవితానికి ఓటమి బాధ తెలియదు. అందుకే ఎప్పుడైనా పరాజయం ఎదురైనా కుంగిపోకూడదు. కష్టాల్ని
అనుభవించాలి. రాటు తేలాలి. ఓటమి కాటుతోనే గెలవాలన్న కసి, పట్టుదల మొదలవుతాయి. పరాజయాన్ని డీ కొట్టి స్థిరంగా నిలిచినప్పుడు, కష్టాన్ని తట్టుకుని సుఖానికి ఎదురుచూసినప్పుడు- వాటి శక్తి తెలుస్తుంది. వీటికి తగిన ప్రణాళికల్ని సిద్ధంచేసుకోవాలి. అహరహం శ్రమించాలి. ఎత్తుకు వైయెత్తులు వెయ్యాలి. చాణక్యుడిలా గెలుపు సూత్రాన్ని సొంతం చేసుకోవాలి. విజయ కంకణధారుల ధాటికి తలవంచి ఓటమి పలాయనం చిత్త గిస్తుంది. చిమ్మచీకటిలో పొరుగూరికి బయలుదేరాడో వ్యక్తి దారిలో కుంభవృష్టి మొదలైంది. రక్షణ కోసం ఓ చెట్టునీడకు చేరాడు. ఆ పక్కనే ఓ దిగుడు బావి. జారి అందులో పడిపోయాడు. ప్రాణా లపై ఆశ కోల్పోయి చీకట్లో కాలం. గడిపాడు. తెల్లవారింది. వర్షం తగ్గింది. బయటపడే మార్గం కనపడలేదు. ఇంతలో ఈదురుగాలికి చెట్టుకొమ్మ బావిలోకి ఒరిగింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదా వ్యక్తి, మూడు, నాలుగు సార్లు ప్రయత్నించాక కొమ్మ పట్టుకుని పైకి వచ్చాడు. దైవానికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోయాడు. జీవితంలో యాదృచ్ఛికంగా లభించిన అవకాశాల్ని తెలివిగా దక్కించుకున్నవారే విజ్ఞులు, తగిన కృషి, పట్టుదల, విశ్వాసం, దైర్యం- ప్రయత్నానికి తోడవ్వాలి. అప్పుడు విజయం తలవంచి దాసోహమనక తప్పదు.
అవకాశాలు తమంత తాముగా మన చెంతకు చేరవు. మనం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. చేజిక్కించుకుని కార్యనిర్వాహణలో విజయం సాధించాలి. మనలోని ఆసక్తి, శ్రద్ధ గమనించిన వివేకులు కొందరు తమ చెయ్యి అందించి అవకాశాల బాటలు పరుస్తారు. ఆ చేతులను బలంగా పట్టుకుని ఎగబాకి ఆ బాటలో విజయ ధ్వజాన్ని నాటాలే గాని, జారిపోకూడదు. స్వశక్తితో ఇతరులను ఒప్పించి మెప్పించాలి. విజయపరంపరను ఖాతాలో జమచేసుకోవాలి. వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి. అనుభవాన్ని, తెలివిని, శక్తిని కలగలుపుకొని గడ్డిపోచలను బలిష్టమైన పలుపు తాడుగా మార్చుకోవాలి. చేతికందిన అవకాశాల్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా పరహితంగా ఉపయోగించాలి. వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపకరించిననాడు పరమార్థం నెరవేరినట్లే. పూలబాటలో తాము నడుస్తూ పదిమందినీ తమతో నడిపించాలి. దానం, ధర్మం, సమాజసేవ నిర్వహించే అవకాశం చేతికందినప్పుడు పరమాత్మ ఆదేశంగా స్వీకరించి ఇతరుల సంక్షేమానికి నడుంకట్టేవారు ధన్యజీవులు.
ఆనందయోగ గణపతి
సమస్త ప్రకృతిలో చరాచరాత్మక సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారో ఆ పరమేశ్వర చైతన్యమే గణపతి. రూప జగత్తుకు, శబ్ద ప్రపంచానికి గణపతే అధిపతి అని వేదం ప్రకటించింది. ఏ రూపమూ లేని పరబ్రహ్మకు ఆకృతి లభిస్తే ఆ రూపం గణేశుడిగా తేజరిల్లుతుందని ఉపనిషత్తు వాక్కు. గణేశుడిని సూచించే 'గీకారమే మంత్ర బీజాక్షరం. సకల దేవతల చేత పూజలందుకొనే గణపతిని వేదం 'బ్రహ్మణ సృతి'గా ప్రస్తావించింది. 'గణం' అంటే సమూహం. అనేక గణాల మేలు కలయిక అయిన ఈ సృష్టిని నడిపే లోక నాయకుడు గణాధిపుడు: 'ఓం'కారంలో గణపతి రూపాన్ని దర్శించి, సృష్టి రచనాదక్షతను బ్రహ్మ పొందాడంటారు. అ, ఉ, మా- అనే మూడు అక్షరాల సమ్మిళితమైన ఓంకారాన్ని ఆశ్రయించి గణపతి వెలుగొందుతున్నాడని ముద్గల పురాణం విశ్లేషించింది. ఈ మూడు అక్షరాలు సృష్టి స్థితి, లయ అనే ప్రక్రియను- జాగృత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను సంకేతిస్తాయి. శక్తి, యుక్తి, ఐశ్వర్యం, ఆనందం అనే నాలుగు అంశాల పరిపూర్ణ గణపతి రూపం. గణేశుడి ఏనుగు ముఖం శక్తికి, సూచిక. ఆనందమే గణేశుడి రూపం అని శ్రీవిద్యార్థవ తంత్రం పేర్కొంది. మోదః అంటే ఆనందం. ఆనందకారకమైన మోద కాలను ఆహారంగా శివబాలుడు స్వీకరించి, వాటినే తన భక్తులకు అనుగ్రహ ఫలాలుగా అందిస్తాడు. ప్రకృతిపురుష భేదాత్మకు గణేశు అని గణేశ పురాణోకి ప్రకృతి అకృతే గణపతి. విశ్వమంతా రూపొందక ముందు, నిర్గుణ పరబ్రహ్మ ఉన్న అవ రూపమే- గణపతిగా ఆవిష్కృ తమైంది. ఒక్కటిగా ఉన్నప్పుడు అన్నీ ఆ స్వరూపంలో ఉన్నాయి. విడివడి ప్రపంచంగా రూపాంతరం చెందినప్పుడు అనేక దేవతా శక్తులుగా, గణాలుగా వ్యక్తమయ్యాయి. వేద సంప్రదాయం ప్రకారం మూడు ముఖ్య గణాలున్నాయి. అవి భూమి, అంతరిక్షం, దివి. ఈ మూడు గణాలు గణపతి అధీనంలోనే ఉంటాయి.
ఇంద్రియ ప్రాణాదుల రూపంలో ఈ గణాలు వ్యక్తుల భౌతిక శరీరంలోనూ సమ్మేళనమై ఉంటాయి. ఆ గణాల్ని జాగృతపరచే మహా చైతన్య స్ఫూర్తి గణపతి. అనేకంగా వ్యాపించి ఉన్న గణాల్ని ఏకోన్ముఖంగా ప్రాణశక్తిగా ఆత్మదీప్తిగా ఎవరు ప్రజ్వలింపజేస్తున్నారో ఆ దివ్య సమ్మోహన రూపమే మహాగణపతి. విష్ణు తేజస్సు బ్రహ్మ యశస్సు, ఈశ్వరుడి ఓజస్సు ఏకీకృతమై విలసిల్లే విరాట్ మంగళమూర్తిగా విశ్వగణపతి ప్రకటితమయ్యాడు.
భాద్రపద శుద్ధ చవితిని అభయ వరద చతుర్థి అంటారు. ఈశ్వర తత్వాన్ని విష్ణునాశక స్వరూపంగా వినాయక చవితినాడు ఆరాధిస్తారు. కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో, అన్ని అవరోధాల్ని అధిగమించడానికి గణేశ చతుర్థినాడు విఘ్నేశ్వరారాధన నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. వజ్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి గణేశ్వరుడు. అభ్యుదయంలో, పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. మాయగా అడ్డువచ్చే వజ్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు- వరసిద్ధి వినాయకుడు. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం- అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన. ఆయన నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి. ఆయన చతుర్భుజుడిగా బీజ, అండ, పిండ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే మహోత్కట గణపతి. చతుర్థినాడు ఉద్భవించిన చిన్మయ విదానందుడిగా, నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన 'చవితి దేవర'గా వినాయకుడు ప్రణతులు అందుకుంటున్నాడు. అందుకుంటున్నాడు. 'గజ వదనుడిగా 'జగదానంద తేజోమయ ఆనందరూపుడిగా జయకర, శుభకర వినాయకుడిగా చవితినాడు సాకారమవుతాడు. అనంత సౌభాగ్య సిరుల్ని అనుగ్రహించే ఆహ్లాదపూరితమైన గణేశారాధన పూర్ణత్వమైన ఆనంద యోగసాధన
సమస్త ప్రకృతిలో చరాచరాత్మక సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారో ఆ పరమేశ్వర చైతన్యమే గణపతి. రూప జగత్తుకు, శబ్ద ప్రపంచానికి గణపతే అధిపతి అని వేదం ప్రకటించింది. ఏ రూపమూ లేని పరబ్రహ్మకు ఆకృతి లభిస్తే ఆ రూపం గణేశుడిగా తేజరిల్లుతుందని ఉపనిషత్తు వాక్కు. గణేశుడిని సూచించే 'గీకారమే మంత్ర బీజాక్షరం. సకల దేవతల చేత పూజలందుకొనే గణపతిని వేదం 'బ్రహ్మణ సృతి'గా ప్రస్తావించింది. 'గణం' అంటే సమూహం. అనేక గణాల మేలు కలయిక అయిన ఈ సృష్టిని నడిపే లోక నాయకుడు గణాధిపుడు: 'ఓం'కారంలో గణపతి రూపాన్ని దర్శించి, సృష్టి రచనాదక్షతను బ్రహ్మ పొందాడంటారు. అ, ఉ, మా- అనే మూడు అక్షరాల సమ్మిళితమైన ఓంకారాన్ని ఆశ్రయించి గణపతి వెలుగొందుతున్నాడని ముద్గల పురాణం విశ్లేషించింది. ఈ మూడు అక్షరాలు సృష్టి స్థితి, లయ అనే ప్రక్రియను- జాగృత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను సంకేతిస్తాయి. శక్తి, యుక్తి, ఐశ్వర్యం, ఆనందం అనే నాలుగు అంశాల పరిపూర్ణ గణపతి రూపం. గణేశుడి ఏనుగు ముఖం శక్తికి, సూచిక. ఆనందమే గణేశుడి రూపం అని శ్రీవిద్యార్థవ తంత్రం పేర్కొంది. మోదః అంటే ఆనందం. ఆనందకారకమైన మోద కాలను ఆహారంగా శివబాలుడు స్వీకరించి, వాటినే తన భక్తులకు అనుగ్రహ ఫలాలుగా అందిస్తాడు. ప్రకృతిపురుష భేదాత్మకు గణేశు అని గణేశ పురాణోకి ప్రకృతి అకృతే గణపతి. విశ్వమంతా రూపొందక ముందు, నిర్గుణ పరబ్రహ్మ ఉన్న అవ రూపమే- గణపతిగా ఆవిష్కృ తమైంది. ఒక్కటిగా ఉన్నప్పుడు అన్నీ ఆ స్వరూపంలో ఉన్నాయి. విడివడి ప్రపంచంగా రూపాంతరం చెందినప్పుడు అనేక దేవతా శక్తులుగా, గణాలుగా వ్యక్తమయ్యాయి. వేద సంప్రదాయం ప్రకారం మూడు ముఖ్య గణాలున్నాయి. అవి భూమి, అంతరిక్షం, దివి. ఈ మూడు గణాలు గణపతి అధీనంలోనే ఉంటాయి.
ఇంద్రియ ప్రాణాదుల రూపంలో ఈ గణాలు వ్యక్తుల భౌతిక శరీరంలోనూ సమ్మేళనమై ఉంటాయి. ఆ గణాల్ని జాగృతపరచే మహా చైతన్య స్ఫూర్తి గణపతి. అనేకంగా వ్యాపించి ఉన్న గణాల్ని ఏకోన్ముఖంగా ప్రాణశక్తిగా ఆత్మదీప్తిగా ఎవరు ప్రజ్వలింపజేస్తున్నారో ఆ దివ్య సమ్మోహన రూపమే మహాగణపతి. విష్ణు తేజస్సు బ్రహ్మ యశస్సు, ఈశ్వరుడి ఓజస్సు ఏకీకృతమై విలసిల్లే విరాట్ మంగళమూర్తిగా విశ్వగణపతి ప్రకటితమయ్యాడు.
భాద్రపద శుద్ధ చవితిని అభయ వరద చతుర్థి అంటారు. ఈశ్వర తత్వాన్ని విష్ణునాశక స్వరూపంగా వినాయక చవితినాడు ఆరాధిస్తారు. కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో, అన్ని అవరోధాల్ని అధిగమించడానికి గణేశ చతుర్థినాడు విఘ్నేశ్వరారాధన నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. వజ్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి గణేశ్వరుడు. అభ్యుదయంలో, పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. మాయగా అడ్డువచ్చే వజ్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు- వరసిద్ధి వినాయకుడు. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం- అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన. ఆయన నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి. ఆయన చతుర్భుజుడిగా బీజ, అండ, పిండ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే మహోత్కట గణపతి. చతుర్థినాడు ఉద్భవించిన చిన్మయ విదానందుడిగా, నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన 'చవితి దేవర'గా వినాయకుడు ప్రణతులు అందుకుంటున్నాడు. అందుకుంటున్నాడు. 'గజ వదనుడిగా 'జగదానంద తేజోమయ ఆనందరూపుడిగా జయకర, శుభకర వినాయకుడిగా చవితినాడు సాకారమవుతాడు. అనంత సౌభాగ్య సిరుల్ని అనుగ్రహించే ఆహ్లాదపూరితమైన గణేశారాధన పూర్ణత్వమైన ఆనంద యోగసాధన
సౌభాగ్యమిచ్చే విఘ్నేశ్వరి!
చైనాయకి. విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని.. పొరపాటున అనడం లేదు! స్త్రీరూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపూర్, భువనేశ్వర్ లో స్త్రీలు సర్వసంపదలనిమ్మని చైనాయక వ్రతం చేస్తుంటారు..
పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు. తనకంటూ నాయకుడు లేని, తానే లోక నాయకుడైన వినాయకుడు సర్వ స్వతంత్రుడు. 106 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ 8 రూపాలతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి. వినాయకుడు తన అంశేనని, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనంది. ఆదిపరాశక్తి. అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మి గణపతి, గాయత్రీ గణపతిగా పూజిస్తున్నాం. ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలూ ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పార్వతీమాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు, హంపీలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..' తరహాలో తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి. లోకాన్ని అల్లకల్లోలం చేయమని..
తల్లి మాట మేరకు తండ్రినెదిరించి ప్రాణాలు
మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి. అంతే!
కోల్పోయాడు చిన్నిగణపతి. పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, బగళ, ఛిన్నమస్త, ధూమవతి, ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు. తట్టుకోలేక విష్ణ్వాది దేవుళ్లందరూ పార్వతిని స్తుతించి, ప్రసన్నం చేసుకుని, ఏనుగు తలను తెచ్చి, బాలునికి అతికించి, మళ్లీ బతికించారు. అదీ స్త్రీశక్తి, అదీ మాతృశక్తి, పురుషులంతా కలిసినా ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక దాసోహమన్నారు. ఆ
తల్లిని సంతోషపెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి, గణాధిపత్యాన్ని కట్టపెట్టాడు. తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుంది. అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి.. తల్లిదండ్రుల పదోదకము బోలంగ వే దాకాశ గంగా మహాజలంబు మాతా పితలతో సమానత గనజాల
రఖిల గీర్వాణ చూడాగ్రమణులు అంటూ వారి విలువను లోకానికి తెలియచేశాడు. 'అమ్మ కడ సౌభాగ్యమడిగి మాకీయవా దేవాదిదేవా' అని స్త్రీలు వినాయకుని వేడుకుంటున్నారు. పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్ని, సంపదని, విద్యను, మంత్రవిద్యను, జవసత్వాలను అందిస్తున్నాడు. గణపతి స్త్రీ పక్షపాతి. అందుకే స్త్రీ దేవతా మూర్తులతో కూడి స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు.
సంపదలిచ్చే వైనాయకి
వినాయకునిది పృద్వీ తత్త్వం. భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు. అందుకే గణపతిని మట్టిరూపంలో పూజించమని, పంట ఫలం, ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది. శాస్త్రం.
వినాయకుడు పంచముఖుడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, పంచ కోశాలు, పంచ తన్మాత్రలే ఆ పంచ ముఖాలు.
చైనాయకి. విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని.. పొరపాటున అనడం లేదు! స్త్రీరూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపూర్, భువనేశ్వర్ లో స్త్రీలు సర్వసంపదలనిమ్మని చైనాయక వ్రతం చేస్తుంటారు..
పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు. తనకంటూ నాయకుడు లేని, తానే లోక నాయకుడైన వినాయకుడు సర్వ స్వతంత్రుడు. 106 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ 8 రూపాలతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి. వినాయకుడు తన అంశేనని, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనంది. ఆదిపరాశక్తి. అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మి గణపతి, గాయత్రీ గణపతిగా పూజిస్తున్నాం. ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలూ ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పార్వతీమాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు, హంపీలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..' తరహాలో తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి. లోకాన్ని అల్లకల్లోలం చేయమని..
తల్లి మాట మేరకు తండ్రినెదిరించి ప్రాణాలు
మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి. అంతే!
కోల్పోయాడు చిన్నిగణపతి. పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, బగళ, ఛిన్నమస్త, ధూమవతి, ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు. తట్టుకోలేక విష్ణ్వాది దేవుళ్లందరూ పార్వతిని స్తుతించి, ప్రసన్నం చేసుకుని, ఏనుగు తలను తెచ్చి, బాలునికి అతికించి, మళ్లీ బతికించారు. అదీ స్త్రీశక్తి, అదీ మాతృశక్తి, పురుషులంతా కలిసినా ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక దాసోహమన్నారు. ఆ
తల్లిని సంతోషపెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి, గణాధిపత్యాన్ని కట్టపెట్టాడు. తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుంది. అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి.. తల్లిదండ్రుల పదోదకము బోలంగ వే దాకాశ గంగా మహాజలంబు మాతా పితలతో సమానత గనజాల
రఖిల గీర్వాణ చూడాగ్రమణులు అంటూ వారి విలువను లోకానికి తెలియచేశాడు. 'అమ్మ కడ సౌభాగ్యమడిగి మాకీయవా దేవాదిదేవా' అని స్త్రీలు వినాయకుని వేడుకుంటున్నారు. పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్ని, సంపదని, విద్యను, మంత్రవిద్యను, జవసత్వాలను అందిస్తున్నాడు. గణపతి స్త్రీ పక్షపాతి. అందుకే స్త్రీ దేవతా మూర్తులతో కూడి స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు.
సంపదలిచ్చే వైనాయకి
వినాయకునిది పృద్వీ తత్త్వం. భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు. అందుకే గణపతిని మట్టిరూపంలో పూజించమని, పంట ఫలం, ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది. శాస్త్రం.
వినాయకుడు పంచముఖుడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, పంచ కోశాలు, పంచ తన్మాత్రలే ఆ పంచ ముఖాలు.
వామనాయనమః
శ్రీమహావిష్ణువు స్థితికారకత్వ సంవిధానంలో అభివ్యక్తమైన అయిదో అవతారం వామనావతారం. ధర్మోద్ధరణ కోసం అవసరమైన సందర్భాల్లో తాను అవతరిస్తూనే ఉంటానని శ్రీహరి ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపులకు వరపుత్రుడిగా, వామనమూర్తిగా సాకారమయ్యాడు. వామనుడు ఆవిర్భవించిన ఈ ద్వాదశిని దివ్యద్వాదశి, విజయద్వాదశి, మహాద్వాదశి, బలిద్వాదశి, వామన ద్వాదశిగా వ్యవహరిస్తారు.
వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన, భవిష్య పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి ఇంద్రుణ్ని ఓడించి, బలిచక్రవర్తి స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసగణం దేవతల్ని హింసించసాగింది. దాంతో, దేవతల మాతృమూర్తి అదితి కలవరపడి శ్రీహరిని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడే దేవతల్ని రక్షించడానికి వామనుడిగా ఆవిష్కారమయ్యాడు. వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. బలిని వామనుడు ఆశీర్వదించాడు. ఆ బాలకుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడైన బలి, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘నాకు ఎలాంటి అత్యాశ లేదు. కేవలం మూడడుగుల భూమిని మాత్రం ఇవ్వు చాలు’ అన్నాడు వామనుడు. వామనుడి ఆకృతిలాగానే అతడి అభీష్టం చాలా కురచగా ఉందని బలి భావించాడు. భూదానానికి సమాయత్తమైన బలిని, అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. ఇది విష్ణుమాయా విలాసంగా హెచ్చరించాడు. అయినా బలి శుక్రుడి మాట పట్టించుకోకుండా వామనుడికి ఉదకపూర్వకంగా భూదానం చేశాడు. మహాత్రివిక్రముడిగా ‘ఇంతింతై వటుడింతై...’ వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ఓ పాదంతో భూమిని, మరో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి, మూడో పాదం బలి శిరస్సుపై ఉంచి అతణ్ని రాక్షసజాతి ఆవాస స్థలమైన రసాతలానికి అణగదొక్కాడు. అదే సందర్భంలో బలి దాన గుణ వైభవానికి ప్రసన్నుడైన వామనుడు, అతణ్ని సుతల లోక రాజ్యాధిపతిగా నియమించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాన్ని అప్పగించాడు.
మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదుగుతాడు. నేను మహా చక్రవర్తిని, నేను గొప్ప దాతను, నేను కర్తను, నేను భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులుగా మిగులుతారని, అలాంటివారికి ఎప్పటికైనా ప్రతికూల పరిస్థితులు తప్పవని భగవద్గీత పేర్కొంది. బలి చక్రవర్తి విషయంలో ఇదే జరిగింది.
విష్ణువు దాల్చిన వామనావతారం ఎన్నో సందేశాల సమాహారం! సృష్టిలోని జీవులన్నీ బీజప్రాయంగా ముందు అణువంత ఆకృతి దాల్చి క్రమంగా వికాసం చెంది సమగ్ర రూపాన్ని పొందుతాయి. జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి విరాట్ రూపం వరకు వైవిధ్యంగా ప్రకటితమవుతున్నాయి. ఈ వైవిధ్య, వైరుధ్యాలకు పరమాత్మ సృష్టి రచనే కారణం. ఆత్మ అనేది అణువుకన్నా సూక్ష్మమైనది. అయితే ఆ ఆత్మ దివ్య జ్ఞానంతో ప్రకాశిస్తే, బ్రహ్మాండమంత స్థూలంగా విశ్వరూపాన్ని ధరిస్తుంది. జీవుడు తనలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించి, ఆత్మోద్ధరణకు సర్వదా కృషిచేయాలి. తన ఆత్మను, పరమాత్మతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిన రీతిలో సూక్ష్మ స్థితి నుంచి సాధకులు క్రమంగా వృద్ధి పొందుతారు! ఇదే, త్రివిక్రమావతార సందేశం!
శ్రీమహావిష్ణువు స్థితికారకత్వ సంవిధానంలో అభివ్యక్తమైన అయిదో అవతారం వామనావతారం. ధర్మోద్ధరణ కోసం అవసరమైన సందర్భాల్లో తాను అవతరిస్తూనే ఉంటానని శ్రీహరి ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపులకు వరపుత్రుడిగా, వామనమూర్తిగా సాకారమయ్యాడు. వామనుడు ఆవిర్భవించిన ఈ ద్వాదశిని దివ్యద్వాదశి, విజయద్వాదశి, మహాద్వాదశి, బలిద్వాదశి, వామన ద్వాదశిగా వ్యవహరిస్తారు.
వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన, భవిష్య పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి ఇంద్రుణ్ని ఓడించి, బలిచక్రవర్తి స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసగణం దేవతల్ని హింసించసాగింది. దాంతో, దేవతల మాతృమూర్తి అదితి కలవరపడి శ్రీహరిని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడే దేవతల్ని రక్షించడానికి వామనుడిగా ఆవిష్కారమయ్యాడు. వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. బలిని వామనుడు ఆశీర్వదించాడు. ఆ బాలకుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడైన బలి, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘నాకు ఎలాంటి అత్యాశ లేదు. కేవలం మూడడుగుల భూమిని మాత్రం ఇవ్వు చాలు’ అన్నాడు వామనుడు. వామనుడి ఆకృతిలాగానే అతడి అభీష్టం చాలా కురచగా ఉందని బలి భావించాడు. భూదానానికి సమాయత్తమైన బలిని, అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. ఇది విష్ణుమాయా విలాసంగా హెచ్చరించాడు. అయినా బలి శుక్రుడి మాట పట్టించుకోకుండా వామనుడికి ఉదకపూర్వకంగా భూదానం చేశాడు. మహాత్రివిక్రముడిగా ‘ఇంతింతై వటుడింతై...’ వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ఓ పాదంతో భూమిని, మరో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి, మూడో పాదం బలి శిరస్సుపై ఉంచి అతణ్ని రాక్షసజాతి ఆవాస స్థలమైన రసాతలానికి అణగదొక్కాడు. అదే సందర్భంలో బలి దాన గుణ వైభవానికి ప్రసన్నుడైన వామనుడు, అతణ్ని సుతల లోక రాజ్యాధిపతిగా నియమించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాన్ని అప్పగించాడు.
మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదుగుతాడు. నేను మహా చక్రవర్తిని, నేను గొప్ప దాతను, నేను కర్తను, నేను భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులుగా మిగులుతారని, అలాంటివారికి ఎప్పటికైనా ప్రతికూల పరిస్థితులు తప్పవని భగవద్గీత పేర్కొంది. బలి చక్రవర్తి విషయంలో ఇదే జరిగింది.
విష్ణువు దాల్చిన వామనావతారం ఎన్నో సందేశాల సమాహారం! సృష్టిలోని జీవులన్నీ బీజప్రాయంగా ముందు అణువంత ఆకృతి దాల్చి క్రమంగా వికాసం చెంది సమగ్ర రూపాన్ని పొందుతాయి. జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి విరాట్ రూపం వరకు వైవిధ్యంగా ప్రకటితమవుతున్నాయి. ఈ వైవిధ్య, వైరుధ్యాలకు పరమాత్మ సృష్టి రచనే కారణం. ఆత్మ అనేది అణువుకన్నా సూక్ష్మమైనది. అయితే ఆ ఆత్మ దివ్య జ్ఞానంతో ప్రకాశిస్తే, బ్రహ్మాండమంత స్థూలంగా విశ్వరూపాన్ని ధరిస్తుంది. జీవుడు తనలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించి, ఆత్మోద్ధరణకు సర్వదా కృషిచేయాలి. తన ఆత్మను, పరమాత్మతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిన రీతిలో సూక్ష్మ స్థితి నుంచి సాధకులు క్రమంగా వృద్ధి పొందుతారు! ఇదే, త్రివిక్రమావతార సందేశం!
గంజాయి వనంలో...
మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది. దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉంటుంది. దానవుల్లోనూ ధర్మవర్తనులున్నారు. మానవుల్లోనూ ఆసురీ ప్రవృత్తిగలవారున్నారు. శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను అపహరించదలచిన రావణుడు మారీచుణ్ని బంగారు లేడి రూపం ధరించి, సీతను ఆకర్షించమని ఆదేశిస్తాడు. రామబాణ ప్రభావాన్ని లోగడ చవిచూసి గుణపాఠం నేర్చుకున్నవాడు కనుక రాముడి జోలికి వెళ్ళవద్దని, అతడు ధర్మ స్వరూపుడని మారీచుడు ఎంతగానో హితవు చెబుతాడు. తాను చెప్పింది చెయ్యకపోతే చంపుతానంటాడు రావణుడు. ఆ దుర్మార్గుడి చేతిలో చావడం కంటే ధర్మమూర్తి రాముడి చేతిలో చావడమే శ్రేయస్కరమనుకుని, విధిలేక మారీచుడు రావణుడి ఆనతికి తలొగ్గుతాడు. దానవ లక్షణం లేని మారీచుడు రామచంద్రమూర్తి ఆదర్శ వ్యక్తిత్వాన్ని గ్రహించిన ధార్మికుడు.
శ్రీరాముడి గురించి తెలిసిన విభీషణుడు అన్న రావణుడికి ఎంతగానో హితబోధ చేశాడు. విసిగి, రాముడి శరణు వేడుకున్నాడు. ధర్మమెటువైపు ఉంటే అక్కడే జయం లభిస్తుందని గ్రహించిన జ్ఞాని- విభీషణుడు.
ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పక్షాన ఉన్నా, ఏ వర్గాన ఉన్నా మంచిని మంచి అనే చెప్పుకొంటాం. చెడును చెడు అనే చెప్పుకొంటాం. విష్ణువును ద్వేషించడమే కాకుండా, దూషించడమే కాకుండా, శ్రీహరిని అహర్నిశలు స్మరించే ప్రహ్లాదుణ్ని, తన తనయుడని అయినా ఆలోచించక పుత్రవాత్సల్యాన్ని విస్మరించి, చిత్రహింసలకు గురిచేశాడు హిరణ్యకశిపుడు. రాముడి మీద అమితమైన వాత్సల్యమున్న కైకమ్మ మంధర దుర్బోధల వల్ల యుగయుగాల్లోనూ సర్వుల చేత దూషితురాలైపోయింది.
దానవ సాధ్వి మండోదరి భర్త రావణుడికి ఎంతగానో ధర్మబద్ధమైన సలహాలు ఇచ్చింది. అశోకవనంలో త్రిజట అనే రాక్షసి సీతకు ధైర్యం చెప్పి, తన స్వప్న వృత్తాంతం వెల్లడించి ఓదారుస్తుంది. కౌరవ సోదరుల్లో యుయుత్సుడు, వికర్ణుడు ధర్మ పరాయణులైన పాండవులనే సమర్థించారు. రాక్షసుడైనా బలిచక్రవర్తి తన దానశీలతతో కీర్తి గడించాడు. శల్యుడు కర్ణుడికి రథసారథిగా వ్యవహరించినా అర్జునుడి విజయానికే సహకరించాడు.
రాక్షస చక్రవర్తి బాణాసురుడి పుత్రిక ఉష శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుణ్ని ప్రేమించి, వివాహమాడింది. రాక్షస మహిళ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం నుంచే పోరాడి వీరమరణం పొందాడు. వీరంతా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వారు.
భారతావని తపోభూమిగా, పుణ్యభూమిగా, ఆర్య భూమిగా విశ్వవిఖ్యాతమైంది. మునులు, తపోధనులు, యోగులు, అవధూతలు, ప్రవచనకారులు, ఆచార్యులు, విద్వాంసులు, కళాకారులు, సమాజ సేవకులు, నాయకులు, సుపరిపాలకులు... అసంఖ్యాకంగా ఈ భూమి మీద ఆవిర్భవించారు. జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు, చేస్తున్నారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన జ్ఞాన వాకిలిగా విరాజిల్లుతోంది మన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల జ్ఞాన భాండాగారమంతా అందుబాటులో ఉంది. దీన్ని జాతి తన జీవన ప్రస్థానంలో సమన్వయ పరచుకోవాలి. సత్సాంగత్యం ప్రభావం అపారం. సత్కథాశ్రవణ ఫలితం అనంతం. సద్గ్రంథ పఠన అభ్యాసం ఆవశ్యకం.
మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది. దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉంటుంది. దానవుల్లోనూ ధర్మవర్తనులున్నారు. మానవుల్లోనూ ఆసురీ ప్రవృత్తిగలవారున్నారు. శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను అపహరించదలచిన రావణుడు మారీచుణ్ని బంగారు లేడి రూపం ధరించి, సీతను ఆకర్షించమని ఆదేశిస్తాడు. రామబాణ ప్రభావాన్ని లోగడ చవిచూసి గుణపాఠం నేర్చుకున్నవాడు కనుక రాముడి జోలికి వెళ్ళవద్దని, అతడు ధర్మ స్వరూపుడని మారీచుడు ఎంతగానో హితవు చెబుతాడు. తాను చెప్పింది చెయ్యకపోతే చంపుతానంటాడు రావణుడు. ఆ దుర్మార్గుడి చేతిలో చావడం కంటే ధర్మమూర్తి రాముడి చేతిలో చావడమే శ్రేయస్కరమనుకుని, విధిలేక మారీచుడు రావణుడి ఆనతికి తలొగ్గుతాడు. దానవ లక్షణం లేని మారీచుడు రామచంద్రమూర్తి ఆదర్శ వ్యక్తిత్వాన్ని గ్రహించిన ధార్మికుడు.
శ్రీరాముడి గురించి తెలిసిన విభీషణుడు అన్న రావణుడికి ఎంతగానో హితబోధ చేశాడు. విసిగి, రాముడి శరణు వేడుకున్నాడు. ధర్మమెటువైపు ఉంటే అక్కడే జయం లభిస్తుందని గ్రహించిన జ్ఞాని- విభీషణుడు.
ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పక్షాన ఉన్నా, ఏ వర్గాన ఉన్నా మంచిని మంచి అనే చెప్పుకొంటాం. చెడును చెడు అనే చెప్పుకొంటాం. విష్ణువును ద్వేషించడమే కాకుండా, దూషించడమే కాకుండా, శ్రీహరిని అహర్నిశలు స్మరించే ప్రహ్లాదుణ్ని, తన తనయుడని అయినా ఆలోచించక పుత్రవాత్సల్యాన్ని విస్మరించి, చిత్రహింసలకు గురిచేశాడు హిరణ్యకశిపుడు. రాముడి మీద అమితమైన వాత్సల్యమున్న కైకమ్మ మంధర దుర్బోధల వల్ల యుగయుగాల్లోనూ సర్వుల చేత దూషితురాలైపోయింది.
దానవ సాధ్వి మండోదరి భర్త రావణుడికి ఎంతగానో ధర్మబద్ధమైన సలహాలు ఇచ్చింది. అశోకవనంలో త్రిజట అనే రాక్షసి సీతకు ధైర్యం చెప్పి, తన స్వప్న వృత్తాంతం వెల్లడించి ఓదారుస్తుంది. కౌరవ సోదరుల్లో యుయుత్సుడు, వికర్ణుడు ధర్మ పరాయణులైన పాండవులనే సమర్థించారు. రాక్షసుడైనా బలిచక్రవర్తి తన దానశీలతతో కీర్తి గడించాడు. శల్యుడు కర్ణుడికి రథసారథిగా వ్యవహరించినా అర్జునుడి విజయానికే సహకరించాడు.
రాక్షస చక్రవర్తి బాణాసురుడి పుత్రిక ఉష శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుణ్ని ప్రేమించి, వివాహమాడింది. రాక్షస మహిళ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం నుంచే పోరాడి వీరమరణం పొందాడు. వీరంతా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వారు.
భారతావని తపోభూమిగా, పుణ్యభూమిగా, ఆర్య భూమిగా విశ్వవిఖ్యాతమైంది. మునులు, తపోధనులు, యోగులు, అవధూతలు, ప్రవచనకారులు, ఆచార్యులు, విద్వాంసులు, కళాకారులు, సమాజ సేవకులు, నాయకులు, సుపరిపాలకులు... అసంఖ్యాకంగా ఈ భూమి మీద ఆవిర్భవించారు. జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు, చేస్తున్నారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన జ్ఞాన వాకిలిగా విరాజిల్లుతోంది మన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల జ్ఞాన భాండాగారమంతా అందుబాటులో ఉంది. దీన్ని జాతి తన జీవన ప్రస్థానంలో సమన్వయ పరచుకోవాలి. సత్సాంగత్యం ప్రభావం అపారం. సత్కథాశ్రవణ ఫలితం అనంతం. సద్గ్రంథ పఠన అభ్యాసం ఆవశ్యకం.
మానవత్వ పరిమళం
రెండక్షరాల ప్రేమకు- ఇతరులకు సాయం చేసే చేతులు ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు పరుగులు తీసే పాదాలుంటాయి. ఆక్రందన వినగలిగే చెవులు ఉంటాయి. కష్టాల్ని ప్రత్యక్షంగా చూసే కళ్లుంటాయి. ఈ లక్షణాలున్న రెండక్షరాల ప్రేమను రెట్టింపు చేస్తే నాలుగక్షరాల మానవత్వం అవుతుంది. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. విలువలు, మర్యాదలు, సంస్కృతి, సంప్రదాయాలు, సుఖాలు, దుఃఖాలు... అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెద్దవారు అనుబంధాలకు పెద్దపీట వేసేవారు. కలుషితాలను సైతం కలుపుకొనిపోయే నదీప్రవాహంలా మానవత్వంతో సాగిపోయే సమాజం ఉండేది.
జీవితంలో సాధించడం, అనుభవించడం, సాఫల్యం పొందడం అనేవి ముక్కాలి పీటకు మూడుకాళ్ల వంటివి. ఇందులో మొదటి రెండింటితోనే చాలామంది జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవిత సాఫల్యం సులువుగా లభించదు. దీనికి కావలసిన ముడిసరకు- ప్రేమ. దీన్ని పంచడం, పెంచడం, తిరిగి పొందడంలో సమత్వం ఆచరించాలి.
రమణ మహర్షి పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, ఆదరణ చూపేవారు. జంతువులను, పక్షులను ప్రేమతో పలకరించి లాలించేవారు. తన చేతులతో తినిపించేవారు. అది చూసిన ఓ భక్తుడు 'భగవాన్! మేము మీ మాట కోసం, మీ చేతి ప్రసాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా, మా చూడరు. ఇది న్యాయమా?' అని దానికి రమణులు చిరు నవ్వుతో 'పశువులు, పక్షులు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తాయి. ఏ కోరికలు, ఏ ప్రశ్నలు వాటికి ఉండవు.
అందుచేత వాటిని నేను సహజంగా ప్రేమిస్తాను. వాటి పట్ల మానవత్వంతో ప్రవర్తించడం నాకు ఇష్టం అన్నారు.
సాఫల్యం సాధించడానికి మానవత్వంతో పాటు, దాన్ని ప్రదర్శించడానికి ఫలితాలకు అతీతమైన ధైర్యం కావాలి. మరణించాక కూడా గుర్తుండి పోవాలంటే, చరిత్ర పుటల్లో రాయదగిన పనులు చెయ్యాలి. రాముడికి ఉడత చేసిన సాయం చిన్నదే. కానీ అది నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. పరోపకారమే పుణ్యమని, పరపీడనం పాపమని అష్టాదశ పురాణాల సారాంశం.
సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్నారు గురజాడ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరెసా ఆచరించి చూపారు. ఇతరులకు చేసే మేలే నిజమైన సంపద అన్నది మహమ్మద్ ప్రవక్త ప్రబోధం. నువ్వు జీవించడమే కాదు, సాటి వారిని కూడా జీవింపజేయాలని జీసస్ బోధించాడు. వీటన్నింటి అంతరార్థం ఒక్కటే- ప్రేమపూరిత మానవత్వం.
నేటికీ కుబేరులే కాకుండా సగటు మనుషులు ఎందరో ఎన్నో రూపాల్లో మానవత్వం కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సమస్యలతో పాటు ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక రోగాల సమయాల్లోనూ చేయూత ఇస్తున్న ఎంతోమంది అదృశ్య దానకర్ణులు ఉన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు జీవకారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
అయినవారికి మనం సాయం చేయడం మంచితనం. అదే అందరూ మనవారే అనుకుని చేసే సహాయం- మానవత్వం. సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూడాలి. దానివల్ల ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలను సమభావంతో స్వీకరించినప్పుడే అనిర్వచనీయమైన మానవత్వం పరిమళాల్ని వెదజల్లుతుంది.
రెండక్షరాల ప్రేమకు- ఇతరులకు సాయం చేసే చేతులు ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు పరుగులు తీసే పాదాలుంటాయి. ఆక్రందన వినగలిగే చెవులు ఉంటాయి. కష్టాల్ని ప్రత్యక్షంగా చూసే కళ్లుంటాయి. ఈ లక్షణాలున్న రెండక్షరాల ప్రేమను రెట్టింపు చేస్తే నాలుగక్షరాల మానవత్వం అవుతుంది. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. విలువలు, మర్యాదలు, సంస్కృతి, సంప్రదాయాలు, సుఖాలు, దుఃఖాలు... అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెద్దవారు అనుబంధాలకు పెద్దపీట వేసేవారు. కలుషితాలను సైతం కలుపుకొనిపోయే నదీప్రవాహంలా మానవత్వంతో సాగిపోయే సమాజం ఉండేది.
జీవితంలో సాధించడం, అనుభవించడం, సాఫల్యం పొందడం అనేవి ముక్కాలి పీటకు మూడుకాళ్ల వంటివి. ఇందులో మొదటి రెండింటితోనే చాలామంది జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవిత సాఫల్యం సులువుగా లభించదు. దీనికి కావలసిన ముడిసరకు- ప్రేమ. దీన్ని పంచడం, పెంచడం, తిరిగి పొందడంలో సమత్వం ఆచరించాలి.
రమణ మహర్షి పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, ఆదరణ చూపేవారు. జంతువులను, పక్షులను ప్రేమతో పలకరించి లాలించేవారు. తన చేతులతో తినిపించేవారు. అది చూసిన ఓ భక్తుడు 'భగవాన్! మేము మీ మాట కోసం, మీ చేతి ప్రసాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా, మా చూడరు. ఇది న్యాయమా?' అని దానికి రమణులు చిరు నవ్వుతో 'పశువులు, పక్షులు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తాయి. ఏ కోరికలు, ఏ ప్రశ్నలు వాటికి ఉండవు.
అందుచేత వాటిని నేను సహజంగా ప్రేమిస్తాను. వాటి పట్ల మానవత్వంతో ప్రవర్తించడం నాకు ఇష్టం అన్నారు.
సాఫల్యం సాధించడానికి మానవత్వంతో పాటు, దాన్ని ప్రదర్శించడానికి ఫలితాలకు అతీతమైన ధైర్యం కావాలి. మరణించాక కూడా గుర్తుండి పోవాలంటే, చరిత్ర పుటల్లో రాయదగిన పనులు చెయ్యాలి. రాముడికి ఉడత చేసిన సాయం చిన్నదే. కానీ అది నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. పరోపకారమే పుణ్యమని, పరపీడనం పాపమని అష్టాదశ పురాణాల సారాంశం.
సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్నారు గురజాడ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరెసా ఆచరించి చూపారు. ఇతరులకు చేసే మేలే నిజమైన సంపద అన్నది మహమ్మద్ ప్రవక్త ప్రబోధం. నువ్వు జీవించడమే కాదు, సాటి వారిని కూడా జీవింపజేయాలని జీసస్ బోధించాడు. వీటన్నింటి అంతరార్థం ఒక్కటే- ప్రేమపూరిత మానవత్వం.
నేటికీ కుబేరులే కాకుండా సగటు మనుషులు ఎందరో ఎన్నో రూపాల్లో మానవత్వం కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సమస్యలతో పాటు ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక రోగాల సమయాల్లోనూ చేయూత ఇస్తున్న ఎంతోమంది అదృశ్య దానకర్ణులు ఉన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు జీవకారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
అయినవారికి మనం సాయం చేయడం మంచితనం. అదే అందరూ మనవారే అనుకుని చేసే సహాయం- మానవత్వం. సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూడాలి. దానివల్ల ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలను సమభావంతో స్వీకరించినప్పుడే అనిర్వచనీయమైన మానవత్వం పరిమళాల్ని వెదజల్లుతుంది.