YES PUBLICATIONS
22.7K subscribers
2.69K photos
9 videos
210 files
2.67K links
ALL COMPETATIVE ONLINE CLASSES
Download Telegram
దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ (Indias Longest Cable Stayed Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉదయం ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి ‘సుదర్శన్‌ సేతు’ (Sudarshan Setu) అని పేరు పెట్టారు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్‌ ద్వారక (Beyt Dwarka)తో అనుసంధానిస్తుంది.
ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్‌కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌లు కూడా ఉన్నాయి. సుదర్శన్‌ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జ్‌ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.