దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్ (Indias Longest Cable Stayed Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉదయం ప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకలో ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి ‘సుదర్శన్ సేతు’ (Sudarshan Setu) అని పేరు పెట్టారు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్ ద్వారక (Beyt Dwarka)తో అనుసంధానిస్తుంది.
ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్లు కూడా ఉన్నాయి. సుదర్శన్ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్తో నిర్మించారు. బ్రిడ్జ్ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.
ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్లు కూడా ఉన్నాయి. సుదర్శన్ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్తో నిర్మించారు. బ్రిడ్జ్ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.