This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాఖీ కట్టిన చెల్లికి… అన్నయ్య ఇచ్చే ప్రేమకు వెలకట్టలేం ❤️🙏
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రతి అన్నాచెల్లెళ్ల బంధంపై ఎల్లప్పుడూ ఉండాలి. 🪷✨
అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🙏
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రతి అన్నాచెల్లెళ్ల బంధంపై ఎల్లప్పుడూ ఉండాలి. 🪷✨
అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🙏
❤2
*తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు...*
సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువును కోరుకుంటారు.అయితే ఈ రాఖీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? తొలిసారి రాఖీ ఎవరు కట్టారు? దీనిపై పురాణాల్లో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
*బలిచక్రవర్తికి రాఖీ కట్టిన లక్ష్మీదేవి*
ప్రసిద్ధమైన ఒక కథ లక్ష్మీదేవి, బలి చక్రవర్తికి సంబంధించినది. బలి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి అతని వద్ద ఉండేందుకు అంగీకరించారని నమ్మకం. విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకపోవడంతో లక్ష్మీదేవి ఆందోళన చెందారు. అనంతరం ఆమె సాధారణ స్త్రీ రూపంలో బలి వద్దకు వెళ్లి, అతని మణికట్టుకు రక్షాసూత్రం (రాఖీ) కట్టి సోదరుడిగా చేసుకున్నారని కథనం. దీంతో బలి ఆమె కోరికను గౌరవించి విష్ణువును వైకుంఠానికి పంపించాడని చెబుతారు.
భవిష్య పురాణంలో రక్షాసూత్రం కేవలం సోదరసోదరీమణుల బంధానికే పరిమితం కాదని తెలుస్తుంది. దేవతలు, రాక్షసుల యుద్ధంలో ఇంద్రుడు బలహీనపడినప్పుడు, అతని భార్య శచీదేవి శ్రావణ పౌర్ణమి రోజున పవిత్ర రక్షాసూత్రాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టిందని కథనం. అనంతరం ఇంద్రుడు విజయం సాధించాడని పురాణ విశ్వాసం.
అలాగే యముడు, యమున కథ కూడా రక్షాబంధన్తో అనుసంధానమై ఉంది. యమున తన సోదరుడైన యముడికి రక్షాసూత్రం కట్టి ఆశీర్వదించగా, సంతోషించిన యముడు ఆమెకు వరం ఇచ్చాడని నమ్మకం. ఈ కారణంగానే రాఖీ కట్టించుకున్న సోదరుడికి దీర్ఘాయువు కలగాలని కోరుకునే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపది కథ కూడా రక్షణ, ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. కృష్ణుడి వేలికి గాయం కాగా, ద్రౌపది తన చీర కొంగులోని వస్త్రాన్ని చించి కట్టిందని.. దీంతో ఆమెకు కృష్ణుడు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భావించాడని ప్రసిద్ధ నమ్మకం.
సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువును కోరుకుంటారు.అయితే ఈ రాఖీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? తొలిసారి రాఖీ ఎవరు కట్టారు? దీనిపై పురాణాల్లో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
*బలిచక్రవర్తికి రాఖీ కట్టిన లక్ష్మీదేవి*
ప్రసిద్ధమైన ఒక కథ లక్ష్మీదేవి, బలి చక్రవర్తికి సంబంధించినది. బలి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి అతని వద్ద ఉండేందుకు అంగీకరించారని నమ్మకం. విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకపోవడంతో లక్ష్మీదేవి ఆందోళన చెందారు. అనంతరం ఆమె సాధారణ స్త్రీ రూపంలో బలి వద్దకు వెళ్లి, అతని మణికట్టుకు రక్షాసూత్రం (రాఖీ) కట్టి సోదరుడిగా చేసుకున్నారని కథనం. దీంతో బలి ఆమె కోరికను గౌరవించి విష్ణువును వైకుంఠానికి పంపించాడని చెబుతారు.
భవిష్య పురాణంలో రక్షాసూత్రం కేవలం సోదరసోదరీమణుల బంధానికే పరిమితం కాదని తెలుస్తుంది. దేవతలు, రాక్షసుల యుద్ధంలో ఇంద్రుడు బలహీనపడినప్పుడు, అతని భార్య శచీదేవి శ్రావణ పౌర్ణమి రోజున పవిత్ర రక్షాసూత్రాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టిందని కథనం. అనంతరం ఇంద్రుడు విజయం సాధించాడని పురాణ విశ్వాసం.
అలాగే యముడు, యమున కథ కూడా రక్షాబంధన్తో అనుసంధానమై ఉంది. యమున తన సోదరుడైన యముడికి రక్షాసూత్రం కట్టి ఆశీర్వదించగా, సంతోషించిన యముడు ఆమెకు వరం ఇచ్చాడని నమ్మకం. ఈ కారణంగానే రాఖీ కట్టించుకున్న సోదరుడికి దీర్ఘాయువు కలగాలని కోరుకునే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపది కథ కూడా రక్షణ, ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. కృష్ణుడి వేలికి గాయం కాగా, ద్రౌపది తన చీర కొంగులోని వస్త్రాన్ని చించి కట్టిందని.. దీంతో ఆమెకు కృష్ణుడు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భావించాడని ప్రసిద్ధ నమ్మకం.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు 🙏🏻
శ్రీరామస్వామి వారి దేవస్థానం. రామతీర్థం. విజయనగరం జిల్లా.
శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మి అమ్మ వారికి సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమం. జరిగింది.
శ్రీ రామచంద్ర స్వామి వారి కి ప్రాత:కాలార్చన బాలభోగం. అయిన తర్వాత శ్రావణ మాసంలో మూడో శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీమహాలక్ష్మి అమ్మ వారికి పంచామృతములు అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పళ్ళు రసాలతో అభిషేకం చేసి సామూహికముగా భక్తులు చే స్వయంగా శ్రీ రామచంద్ర స్వామి వారి కి పుస్పార్చన మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మ వారికి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమములో 300 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అందరికి ప్రసాదం అందచేశారు.. శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మి అమ్మ వారిని గాజులు తో విశేషంగా అలంకరణ చేసిరి. తర్వాత యాగశాలలో సుందరకాండ హావనం. శ్రీ రామచంద్ర స్వామి వారికి నిత్యకళ్యాణం చేసిరి.ఈరోజు శ్రావణ పౌర్ణమి విఖనస జయంతి సందర్బంగా విఖనస స్వామి వారికి అభిషేకం వైదిక సిబ్బంది చేసారి.
ఈ కార్యక్రమములో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహనాదికారి శ్రీ వై. శ్రీనివాసరావు గారు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.
శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మి అమ్మ వారికి సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమం. జరిగింది.
శ్రీ రామచంద్ర స్వామి వారి కి ప్రాత:కాలార్చన బాలభోగం. అయిన తర్వాత శ్రావణ మాసంలో మూడో శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీమహాలక్ష్మి అమ్మ వారికి పంచామృతములు అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పళ్ళు రసాలతో అభిషేకం చేసి సామూహికముగా భక్తులు చే స్వయంగా శ్రీ రామచంద్ర స్వామి వారి కి పుస్పార్చన మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మ వారికి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమములో 300 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అందరికి ప్రసాదం అందచేశారు.. శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మి అమ్మ వారిని గాజులు తో విశేషంగా అలంకరణ చేసిరి. తర్వాత యాగశాలలో సుందరకాండ హావనం. శ్రీ రామచంద్ర స్వామి వారికి నిత్యకళ్యాణం చేసిరి.ఈరోజు శ్రావణ పౌర్ణమి విఖనస జయంతి సందర్బంగా విఖనస స్వామి వారికి అభిషేకం వైదిక సిబ్బంది చేసారి.
ఈ కార్యక్రమములో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహనాదికారి శ్రీ వై. శ్రీనివాసరావు గారు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.
❤1